Jump to content

Recommended Posts

Posted

Narendra Modi: మల్లన్నకు రుద్రాభిషేకం చేసిన మోదీ... శ్రీశైలం నుంచి కర్నూలుకు తిరుగుపయనం

16-10-2025 Thu 13:29 | Andhra
Narendra Modi Performs Rudrabhishekam at Srisailam
 
  • శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించిన ప్రధాని నరేంద్ర మోదీ
  • మల్లికార్జున స్వామికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన
  • మోదీ వెంట సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ 
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. తన కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా ఆయన శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆలయానికి చేరుకున్న ప్రధాని మోదీకి అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన గర్భగుడిలో మల్లికార్జున స్వామికి పంచామృతాలతో రుద్రాభిషేకం జరిపించారు. ఆ తర్వాత భ్రమరాంబ అమ్మవారిని దర్శించుకుని ఖడ్గమాల, కుంకుమార్చన పూజల్లో పాల్గొన్నారు. వేద పండితులు ఆయనకు ఆశీర్వచనాలు పలికి, తీర్థ ప్రసాదాలను అందజేశారు.

స్వామి, అమ్మవార్ల దర్శనం పూర్తయ్యాక శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని ప్రధాని సందర్శించారు. అక్కడున్న శివాజీ దర్బార్‌ హాల్, ధ్యాన మందిరాలను పరిశీలించి, ఛత్రపతి శివాజీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.

ఈ పర్యటనలో ప్రధాని వెంట ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా ఉన్నారు. శ్రీశైలంలో దర్శనం ముగించుకున్న అనంతరం ముగ్గురు నేతలు కలిసి హెలికాప్టర్‌లో కర్నూలుకు తిరుగు ప్రయాణమయ్యారు.
Posted

Nara Lokesh: ఆయన ఏ కార్యక్రమం చేపట్టినా విజయమే: నారా లోకేశ్ 

16-10-2025 Thu 15:46 | Andhra
Nara Lokesh Praises Modi at Super GST Event
 
  • కర్నూలులో 'సూపర్ జీఎస్టీ' సభలో ప్రధాని మోదీపై మంత్రి లోకేశ్ ప్రశంసలు
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలది డబుల్ ఇంజిన్ కాదు, బుల్లెట్ ట్రైన్ సర్కార్ అని వ్యాఖ్య
  • నరేంద్ర మోదీ పేరుకు విజయం అన్నదే అర్థమని కితాబు
  • ప్రధాని సహకారంతోనే విశాఖ ఉక్కు, రైల్వే జోన్ సాధ్యమయ్యాయని వెల్లడి
  • సభకు హాజరైన ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలోని ప్రభుత్వాల కలయిక డబుల్ ఇంజిన్ సర్కార్ కాదని, ఇది డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ అని రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ అభివర్ణించారు. వీరిద్దరి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అత్యంత వేగంగా ముందుకు దూసుకెళుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

గురువారం కర్నూలు జిల్లా నన్నూరు వద్ద ఏర్పాటు చేసిన 'సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్' బహిరంగ సభలో మంత్రి లోకేశ్ ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. "నమో అంటే విక్టరీ. ఆయన ఏ కార్యక్రమం చేపట్టినా విజయమే" అని అన్నారు.

భారతదేశాన్ని ప్రధాని మోదీ తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దుతున్నారని లోకేశ్ కొనియాడారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానిగా మోదీ 25 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్నారని గుర్తుచేశారు. మొదటి ఏడాది నుంచి ఇప్పటివరకు అదే స్ఫూర్తితో పనిచేస్తూ దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారని తెలిపారు. "నమో అంటే దేశ ప్రజల నమ్మకం. ప్రజలకు ఆయనపై ఉన్న నమ్మకమే ఆయన బలం" అని పేర్కొన్నారు.

ప్రధాని మోదీ అందించిన సహకారం వల్లే విశాఖపట్నం ఉక్కు పరిశ్రమను కాపాడుకోగలిగామని, విశాఖ రైల్వే జోన్‌ను ఏర్పాటు చేసుకోగలిగామని లోకేశ్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఆంధ్రప్రదేశ్ శరవేగంగా అభివృద్ధి పథంలో పయనిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. జీఎస్టీ ప్రయోజనాలు, పెట్టుబడులు, పొదుపు పథకాలపై అవగాహన కల్పించేందుకు ఈ సభను ఏర్పాటు చేశారు.
Posted

Nara Lokesh: మీ నాన్నలా తయారవుతావు: నారా లోకేశ్‌తో మోదీ సరదా వ్యాఖ్యలు

16-10-2025 Thu 13:09 | Andhra
Nara Lokesh You Will Become Like Your Father Modis Fun Remarks
 
  • కర్నూలు జిల్లా పర్యటనకు విచ్చేసిన ప్రధాని నరేంద్ర మోదీ
  • ఓర్వకల్లు విమానాశ్రయంలో స్వాగతం పలికిన సీఎం, డిప్యూటీ సీఎం
  • మంత్రి నారా లోకేశ్‌తో ప్రధాని సరదా సంభాషణ
  • గతంలో కంటే చాలా బరువు తగ్గావంటూ వ్యాఖ్య
రాజకీయాల్లో నాయకుల మధ్య అధికారిక పర్యటనలు, సమావేశాలు సహజమే. కానీ, వాటి మధ్య అప్పుడప్పుడు చోటుచేసుకునే సరదా సంభాషణలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అలాంటి ఆసక్తికర ఘటనే గురువారం కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయంలో జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ల మధ్య జరిగిన సంభాషణ అక్కడున్న వారిలో నవ్వులు పూయించింది.

వివరాల్లోకి వెళితే, ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటన కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఉదయం ఓర్వకల్లు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. ప్రధానికి స్వాగతం పలికేందుకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో పాటు మంత్రి నారా లోకేశ్ కూడా హాజరయ్యారు.

ఈ సందర్భంగా అందరినీ పలకరిస్తున్న ప్రధాని మోదీ, మంత్రి నారా లోకేశ్‌ను చూసి ప్రత్యేకంగా మాట్లాడారు. "గతసారి చూసినప్పటికంటే ఇప్పుడు చాలా బరువు తగ్గావు" అంటూ లోకేశ్‌తో అన్నారు. ఆయన అంతటితో ఆగకుండా, "త్వరలోనే మీ నాన్నలా తయారవుతావు" అని సరదాగా వ్యాఖ్యానించారు. ప్రధాని చేసిన ఈ వ్యాఖ్యలతో అక్కడి వాతావరణం తేలికపడింది. ముఖ్యమంత్రితో పాటు అక్కడున్న ఇతర నేతలు కూడా చిరునవ్వులు చిందించారు.
Posted

PM Modi: కర్నూలు చేరుకున్న ప్రధాని.. స్వాగతం పలికిన చంద్రబాబు, పవన్ కల్యాణ్

16-10-2025 Thu 10:40 | Andhra
PM Modi Arrives in Kurnool Chandrababu Pawan Kalyan Welcome
 
  • కర్నూలు విమానాశ్ర‌యానికి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ
  • ఘనస్వాగతం పలికిన గ‌వ‌ర్న‌ర్‌, సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి లోకేశ్‌
  • శ్రీశైలంలో మల్లన్నకు ప్రత్యేక పూజలు
  • రూ.13,429 కోట్ల ప్రాజెక్టులకు వర్చువల్ శ్రీకారం
  • శివాజీ స్ఫూర్తి కేంద్రం సందర్శన, జీఎస్టీ సభలో ప్రసంగం
ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు విచ్చేశారు. ఈరోజు ఉదయం ఆయన ఢిల్లీ నుంచి ప్రత్యేక వాయుసేన విమానంలో కర్నూలు విమానాశ్రయానికి 9:55 గంటలకు చేరుకున్నారు. విమానాశ్రయంలో ప్రధానికి రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ సాదరంగా స్వాగతం పలికారు.

అనంతరం ప్రధాని మోదీ కర్నూలు నుంచి సైనిక హెలికాప్టర్‌లో శ్రీశైలానికి బయలుదేరి వెళ్లారు. అక్కడ ఆయన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆలయ సందర్శన తర్వాత, సమీపంలోని శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని కూడా సందర్శించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని రాష్ట్రానికి సంబంధించిన కీలకమైన అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ దశల్లో ఉన్న సుమారు రూ.13,429 కోట్ల విలువైన ప్రాజెక్టులకు వర్చువల్ విధానంలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.

శ్రీశైలం పర్యటన ముగించుకుని మధ్యాహ్నం 2:20 గంటలకు ప్రధాని తిరిగి కర్నూలు చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన జీఎస్టీ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. కార్యక్రమాలు ముగిసిన అనంతరం, సాయంత్రం 4:45 గంటలకు కర్నూలు విమానాశ్రయం నుంచి ఢిల్లీకి తిరుగుపయనమవుతారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.20251016fr68f08a4af2ce0.jpg20251016fr68f08a54975e2.jpg

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...