psycopk Posted November 27, 2025 Report Posted November 27, 2025 Nara Lokesh: సొంత ఖర్చులతోనే లోకేశ్ విమాన ప్రయాణాలు: ఆరోపణలను ఖండించిన టీడీపీ 27-11-2025 Thu 10:43 | Andhra ప్రభుత్వ సొమ్ము వాడుతున్నారన్న ఆరోపణలు అవాస్తవమన్న టీడీపీ జగన్ పత్రికపై తీవ్రంగా స్పందించిన టీడీపీ నేతలు అధికారిక పర్యటనలకు కూడా జేబు నుంచే ఖర్చు చేస్తున్నారని వెల్లడి ఏపీ మంత్రి నారా లోకేశ్ విమాన ప్రయాణాలకు ప్రభుత్వ సొమ్మును వినియోగిస్తున్నారంటూ వస్తున్న ఆరోపణలపై టీడీపీ నేతలు స్పష్టతనిచ్చారు. ఆయన తన పర్యటనలన్నింటికీ సొంతంగానే ఖర్చు చేస్తున్నారని, ఈ ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని తేల్చి చెప్పారు. కావాలనే ఓ వర్గం మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని వారు మండిపడ్డారు. జగన్కు చెందిన పత్రికలో లోకేశ్ 77 సార్లు హైదరాబాద్కు విమానంలో వెళ్లారని, ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారని కథనం ప్రచురించడాన్ని టీడీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. పెట్టుబడుల సాధన కోసం వెళ్లే అధికారిక పర్యటనలకు సైతం లోకేశ్ తన సొంత డబ్బునే వాడుతున్నారని గుర్తు చేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా తెలంగాణ పార్టీ వ్యవహారాలు చూసే బాధ్యత కూడా ఆయనపై ఉందని, అందుకే తరచూ హైదరాబాద్ వెళ్లాల్సి వస్తోందని వివరించారు. గతంలో జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్కు 15 కిలోమీటర్ల దూరంలోని కార్యక్రమానికి ప్రభుత్వ ఖర్చుతో ప్రత్యేక విమానంలో వెళ్లారని, కానీ లోకేశ్ అలా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయలేదని విమర్శించారు. గతంలో ‘చినబాబు చిరుతిండి’ అంటూ తప్పుడు వార్తలు రాసినప్పుడే లోకేశ్ పరువు నష్టం దావా వేశారని, అయినా ఆ పత్రిక బుద్ధి మారలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. Quote
southyx Posted November 27, 2025 Report Posted November 27, 2025 ఉమ్...... 2019కి ముందు లాగా చిన్నబాబు చిరుతీళ్లుకి వందల కోట్లు వేలకోట్లు అని రాసే బాధ తప్పింది. అన్నిసార్లు అబద్ధ ప్రచారాలు చెయ్యలేం, ప్రజలు అలాంటి వారిని నమ్మడం తరువాత సంగతి అసహ్యించుకుంటారు నాకు తెలిసి ఈ "సహా చట్టం" ద్వారా ఈ విషయాన్ని బయటికి తెచ్చింది కూడా లోకేష్ గారి అభిమానులే అయి ఉంటారు.ప్రతిసారి బురద చల్లుతుంటే వాళ్ళు మాత్రం ఎంత వరకు కడుక్కుంటూ కూర్చుంటారు. ఉమ్...... ఆ వైపు సేనాని చూస్తే తేడా కామెంట్లకు కూడా మక్కెలిరగదిస్తాం అంటున్నాడు, ఈ వైపు చూస్తే ప్రతిదీ ఇలా ఫ్రూప్ లతో సహా బయటకి ఇస్తున్నారు. ఇక ఇలాంటి వాటి మీద బురద చల్లుతూ విషం కక్కడం కుదరదు. ఇలా ఎక్కడా మాకు అవకాశం లేకుండా మా ఇక్కడ కులాల మతాల మాటున ఉత్త బూతులు తిట్టుకుంటూ కూర్చోవాలి అంటే కష్టమే ఇక. Quote
southyx Posted November 27, 2025 Report Posted November 27, 2025 తుపుక్ పేపర్ ని ఎవరు చదివినా చదవకపోయినా... ముందు కూటమి పార్టీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రొద్దున్నే చదివి ఆ పేపర్ చేసే ఆరోపణలకు క్లారిఫికేషన్ ఇస్తే సగం దరిద్రం తగ్గుతుంది ! ఇప్పటివరకు వాళ్ళు చేసిన ఈ విమాన ప్రయాణ ఖర్చుల అబద్దపు ప్రచారాన్ని ఖండించడానికి... ఇన్నాళ్ళూ మన దగ్గర సరైన సమాచారం లేక సమాధానం చెప్పలేకపోయం !! ఇలా సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించుని సమాధానం చెప్పడానికి... అందరికీ వెసులుబాటు, తీరుబాటు ఉండకపోవచ్చు ! వాళ్ళు ఇప్పటికే చాప కింద నీరులా... చాలా విషప్రచారాలతో కొన్ని అబద్దాల్ని ప్రజల మైండ్ లోకి ఎక్కించడంలో విజయం సాధించారనే చెప్పొచ్చు !! ఒక అబద్దాన్ని కాదు వంద అబద్దాల్ని పదేపదే పదేపదే పదేపదే చెప్తూనే ఉన్నారు... నిన్న ఒకడు జగన్రెడ్డి పక్కన నుంచుని చంద్రబాబు వ్యవసాయం దండగ అన్నాడని చెబుతున్నట్టు !! నోటికొచ్చిన పిచ్ వాగుడు వాగేసి, చేతికొచ్చిన అడ్డమైన రాతల్ని రాసేసి... ఎదుటివాళ్ళు కేసులు పెడితే కక్షసాధింపులు అని, అధికారాన్ని అడ్డంగా ఉపయోగించుకుంటున్నారు అని ముండ్ ఏడ్పులు ఏడవడం ఇదే జగన్రెడ్డి & కో బ్యాచ్ నైజం ! Quote
southyx Posted November 27, 2025 Report Posted November 27, 2025 జగన్ మావయ్య లాగా జనం సొమ్ముతో ప్యాలెస్ లు, ఇంటి చుట్టూ ఫెన్సింగ్ లు, బాత్రూమ్ రిపేర్ లు, స్పెషల్ ఫ్లైట్ లో లండన్ టూర్ లు, ఎగ్ పఫ్ లు తినడం లాంటి చిల్లర బుద్ధులు మా లోకేష్ అన్నకి లేవు.. మా లోకేష్ అన్న హెలికాప్టర్ లో వెళ్ళినా, స్పెషల్ ఫ్లైట్ లో లేదా ప్యాసింజర్ ఫ్లైట్ లో వెళ్ళినా సొంత ఖర్చుతో వెళ్తున్నాడు.. ఈ ఇన్ఫర్మేషన్ సమాచార హక్కు చట్టం ద్వారా వచ్చింది.. విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 77 సార్లు ప్రత్యేక విమానంలో తిరుగుతూ, హైదరాబాదులో సేదతీరుతూ ఉన్నారని సాక్షిలో వేసినవి పచ్చి అబద్ధాలని సమాచార హక్కు చట్టం ద్వారా వెల్లడైంది. ఇందులో ఒక్కటి కూడా వ్యక్తిగత పర్యటన లేదు, అయినప్పటికీ ఈ పర్యటనలకు సొంత సొమ్మును మంత్రి నారా లోకేష్ వెచ్చిస్తున్నారు. ఈ పర్యటనల కోసం తాను నిర్వహించే మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల నుంచి ఒక్క రూపాయి కూడా మంత్రి నారా లోకేష్ తీసుకోలేదని సమాచార హక్కు ఉద్యమ కార్యకర్త వేసిన అర్జీ ద్వారా వెల్లడైంది. Quote
southyx Posted November 27, 2025 Report Posted November 27, 2025 డయానా శాంతి అనే పాపకు జగన్మోహం రెడ్డి 16 కోట్ల రూపాయల ఇంజక్షన్ చేయించాడు అని పేటీఎం బ్యాచ్ ఒకటే స్టోరీ తిప్పుతున్నారు. జీన్ థెరపీ కోసం 16 కోట్లు ఇస్తాం అని ప్రభుత్వం ప్రకటించినట్టు డెక్కన్ క్రోనికల్ పేపర్లో వచ్చిన ఒక గాలి వార్త దీనికి ఆధారం. డెక్కన్ క్రానికల్ మన కులపు పేపర్ అని తెలిసిందేగా.. సరే, ఈ 16 కోట్లకు సంబంధించి ప్రభుత్వం ఏమైనా జీవో ఇచ్చిందా అని ఎంత వెతికినా కనబడలేదు.. పబ్లిసిటీ చేసుకున్నారు గానీ పనైతే జరగలేదు. ఆరోగ్యశ్రీ ని జగన్ అద్భుతంగా చేశాడు అని డబ్బా కొడుతున్న పేటీఎం బ్యాచ్, జగన్ దిగిపోయే ముందు ఆసుపత్రులకు 3000 కోట్లు బకాయిలు ఎందుకు పెట్టాడో చెప్పాలి.. అసలు జగన్ రెడ్డి ఉన్నప్పుడు 2019-24 మధ్య సీఎం రిలీఫ్ ఫండ్ ని నీరుగార్చారు.. కేవలం 897 కోట్లు ఖర్చు చేశారు.. అంతకు ముందు 2014-19 కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఖర్చు చేసింది 1533 కోట్లు.... 2024 నుండి ఇప్పటి వరకూ చంద్రబాబు గారు ఇచ్చింది 400 కోట్లకు పైనే..దీనికి జగన్ ఏదో మానవతా మూర్తి అన్నట్టు ఆ తమ్మా రవికృష్ణా రెడ్డి బిల్డప్పు.. డబ్బా కొట్టుకోవడంలో పేటీఎం బ్యాచ్ ని మించినోళ్లు లేరు Quote
psycopk Posted November 27, 2025 Author Report Posted November 27, 2025 Anta nikrustudu jagan laga government sommu istam vachinatu puff laki 2km helicopter rides ki vadataru anukunthatu unnaru jaffas Quote
futureofandhra Posted November 27, 2025 Report Posted November 27, 2025 16 minutes ago, psycopk said: Anta nikrustudu jagan laga government sommu istam vachinatu puff laki 2km helicopter rides ki vadataru anukunthatu unnaru jaffas Maa jaggad em chesina mass antunna fans Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.