psycopk Posted 12 hours ago Author Report Posted 12 hours ago Nara Lokesh: కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో లోకేశ్ భేటీ.. విశాఖకు ఎన్ఎస్టీఐ ప్రతిపాదన 15-12-2025 Mon 14:13 | Andhra ఢిల్లీ పర్యటనలో మంత్రి నారా లోకేశ్ కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి జయంత్ చౌదరితో భేటీ విశాఖలో జాతీయ నైపుణ్య శిక్షణ సంస్థ ఏర్పాటుకు వినతి అశ్వినీ వైష్ణవ్, ధర్మేంద్ర ప్రధాన్లతోనూ సమావేశం కానున్న లోకేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై కేంద్ర మంత్రులతో సమావేశమవుతున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి జయంత్ చౌదరితో భేటీ అయ్యారు. విశాఖపట్నంలో జాతీయ నైపుణ్య శిక్షణ సంస్థ (NSTI) ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా లోకేశ్ విజ్ఞప్తి చేశారు. విశాఖ జిల్లా పెదగంట్యాడలో 5 ఎకరాల స్థలాన్ని ఈ సంస్థ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గుర్తించిందని లోకేశ్ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సంస్థ ఏర్పాటుతో అధ్యాపకుల అభివృద్ధి, పరిశ్రమల అవసరాలకు తగిన నైపుణ్య శిక్షణ, గ్రీన్ స్కిల్స్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ వంటి అంశాల్లో ఇది ప్రాంతీయ కేంద్రంగా సేవలందిస్తుందని వివరించారు. అలాగే రాష్ట్రంలో ఎన్సీబీఈటీ అర్హతలను పెద్ద ఎత్తున స్వీకరించేందుకు ప్రత్యేక అనుమతి మంజూరు చేయాలని కోరారు. అంతకుముందు పార్లమెంట్ ప్రాంగణానికి చేరుకున్న లోకేశ్కు పలువురు ఎంపీలు, మంత్రులు స్వాగతం పలికారు. టీడీపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో ఎంపీలతో ఆయన సమావేశమయ్యారు. తన పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, ధర్మేంద్ర ప్రధాన్లతో కూడా లోకేశ్ భేటీ కానున్నారు. విద్య, ఐటీ శాఖలకు సంబంధించిన పలు అంశాలపై వారితో చర్చించనున్నారు. ఈ సమావేశంలో లోకేశ్ వెంట కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఇతర ఎంపీలు పాల్గొన్నారు. Quote
psycopk Posted 12 hours ago Author Report Posted 12 hours ago Nara Lokesh: "వైజాగ్కు వరల్డ్ ఛాంపియన్లు వస్తున్నారు"... మంత్రి నారా లోకేశ్ పోస్టుతో సర్వత్రా ఆసక్తి 15-12-2025 Mon 15:21 | Andhra మంత్రి నారా లోకేశ్ ఆసక్తికర సోషల్ మీడియా పోస్ట్ ఈ నెలలో వైజాగ్కు ప్రపంచ ఛాంపియన్లు వస్తున్నారంటూ వెల్లడి ఎవరో ఊహించగలరా అంటూ నెటిజన్లకు సవాల్ లోకేశ్ పోస్ట్తో సర్వత్రా ఉత్కంఠ, ఊహాగానాలు ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన, త్వరలో విశాఖపట్నానికి ప్రపంచ ఛాంపియన్లు రాబోతున్నారని వెల్లడించారు. ఈ ప్రకటనతో రాష్ట్రవ్యాప్తంగా, ముఖ్యంగా వైజాగ్ ప్రజల్లో తీవ్ర కుతూహలం నెలకొంది. "వైజాగ్... సిద్ధంగా ఉండు. ఈ నెలలోనే ప్రపంచ ఛాంపియన్లు వస్తున్నారు. వారెవరో ఎవరైనా ఊహించగలరా?" అంటూ లోకేశ్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ చిన్న పోస్ట్ ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. వస్తున్నది క్రీడా రంగానికి చెందినవారా, లేక టెక్నాలజీ లేదా వ్యాపార రంగంలోని దిగ్గజాలా అనే దానిపై ఊహాగానాలు మొదలయ్యాయి. సాధారణంగా ప్రభుత్వ కార్యక్రమాలు, అభివృద్ధి పనుల గురించి వెల్లడించే లోకేశ్, ఇలా సస్పెన్స్ క్రియేట్ చేస్తూ పోస్ట్ పెట్టడంతో అందరిలోనూ ఆసక్తి పెరిగింది. విశాఖను అంతర్జాతీయంగా మరింత ఉన్నత స్థాయిలో నిలబెట్టేందుకే ఈ కార్యక్రమం అని పలువురు భావిస్తున్నారు. ఆ ప్రపంచ ఛాంపియన్లు ఎవరు, వారు ఏ రంగంలో నిష్ణాతులు అనే వివరాలు తెలియాలంటే మంత్రి నుంచి రాబోయే అధికారిక ప్రకటన వరకు వేచి చూడాల్సిందే. Quote
psycopk Posted 12 hours ago Author Report Posted 12 hours ago Nara Lokesh: ఏపీ ప్రాజెక్టులకు కేంద్రం అండ... మంత్రి అశ్వినీ వైష్ణవ్తో లోకేశ్ కీలక భేటీ 15-12-2025 Mon 14:53 | Andhra కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్తో మంత్రి నారా లోకేశ్ భేటీ రాష్ట్రవ్యాప్త నైపుణ్య గణనకు సహకరించాలని విజ్ఞప్తి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్కు మద్దతు కోరిన లోకేశ్ ఏపీలో ఏఐ మిషన్ వేగవంతానికి సాయంపై కీలక చర్చ లోకేశ్ వినతులకు సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి రాష్ట్ర ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపారు. కేంద్ర రైల్వే, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్తో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రంలో చేపట్టనున్న పలు కీలక ఐటీ, నైపుణ్యాభివృద్ధి ప్రాజెక్టులకు కేంద్రం మద్దతు ఇవ్వాలని కోరారు. లోకేశ్ విజ్ఞప్తులపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. ఈ సమావేశంలో రాష్ట్రంలో చేపట్టనున్న నైపుణ్య గణన కోసం ఏఐ టెక్నాలజీతో రూపొందించిన 'నైపుణ్యం పోర్టల్' గురించి లోకేశ్ కేంద్ర మంత్రికి వివరించారు. ఇప్పటికే మంగళగిరిలో పైలట్ ప్రాజెక్ట్ నిర్వహించామని, ఎదురైన సవాళ్లను అధిగమించేందుకు ఏఐ ఆధారిత ఇంటర్వ్యూ విధానాన్ని ప్రవేశపెట్టామని తెలిపారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టబోయే ఈ బృహత్ కార్యక్రమానికి కేంద్రం సహాయం అందించాలని కోరారు. అలాగే రాష్ట్రంలోని యువ పారిశ్రామికవేత్తల కోసం ఏర్పాటు చేసిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్కు కేంద్రం అండగా నిలవాలని లోకేశ్ విజ్ఞప్తి చేశారు. కేంద్ర ఐటీ శాఖ పరిధిలోని 'MeitY స్టార్టప్ హబ్' ద్వారా మద్దతు అందించాలని కోరారు. ఇదే హబ్లో యానిమేషన్, ఏఆర్/వీఆర్ వంటి అత్యాధునిక టెక్నాలజీస్ కోసం ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు కూడా సహకరించాలని విన్నవించారు. ఇండియా ఏఐ మిషన్లో భాగంగా రాష్ట్రంలో కృత్రిమ మేధ (ఏఐ) విస్తరణను వేగవంతం చేసేందుకు మద్దతివ్వాలని కోరారు. ఈ భేటీలో లోకేశ్ వెంట కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఇతర ఎంపీలు కూడా ఉన్నారు. Quote
psycopk Posted 12 hours ago Author Report Posted 12 hours ago Nara Lokesh: భోగాపురంలో దేశంలోనే తొలి ఏవియేషన్ ఎడ్యుసిటీ.. రేపు ప్రాజెక్టుకు మంత్రి లోకేశ్ చేతుల మీదుగా శ్రీకారం 15-12-2025 Mon 15:12 | Andhra విమానయాన, రక్షణ రంగాల్లో నైపుణ్యాల కొరత తీర్చడమే లక్ష్యం 160 ఎకరాల్లో జీఎంఆర్ మాన్సాస్ ఆధ్వర్యంలో నిర్మాణం అంతర్జాతీయ వర్సిటీలతో విద్యా, ఆవిష్కరణల హబ్గా రూపకల్పన ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కీలక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. దేశంలోనే తొలి ఏవియేషన్, ఏరోస్పేస్, డిఫెన్స్ (AAD) ఎడ్యుకేషన్ సిటీని విజయనగరం జిల్లా భోగాపురంలో ఏర్పాటు చేయనుంది. 'జీఎంఆర్ మాన్సాస్ ఎడ్యుసిటీ' పేరుతో రానున్న ఈ ప్రాజెక్టును రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రేపు విశాఖపట్నంలోని రాడిసన్ బ్లూ రిసార్ట్లో లాంఛనంగా ప్రారంభించనున్నారు. దేశంలో విమానయానం, ఏరోస్పేస్, రక్షణ రంగాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఈ రంగాల మార్కెట్ విలువ 2034 నాటికి 57 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. అయితే, ఈ వేగానికి తగ్గట్టుగా నైపుణ్యం కలిగిన మానవ వనరులు అందుబాటులో లేవు. దేశం ప్రస్తుతం పైలట్లు (12-15%), ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్లు, భద్రతా నిపుణుల కొరతను తీవ్రంగా ఎదుర్కొంటోంది. ఏటా కేవలం 8 వేల మంది ఏరోస్పేస్ ఇంజనీర్లు మాత్రమే పట్టభద్రులవుతున్నారు. ఇది మొత్తం ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లలో 0.5 శాతమే కావడం గమనార్హం. ఈ నైపుణ్యాల కొరతను అధిగమించే లక్ష్యంతో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో 160 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఎడ్యుసిటీని నిర్మించనున్నారు. ఇది ఏవియేషన్, ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలకు అంకితమైన దేశంలోని మొట్టమొదటి సమీకృత విద్యా, ఆవిష్కరణల కేంద్రంగా (ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ అండ్ ఇన్నోవేషన్ హబ్) నిలవనుంది. ఇందులో ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీల బ్రాంచ్ క్యాంపస్లు, పరిశోధన కేంద్రాలు, స్టార్టప్ల కోసం ఇంక్యుబేషన్ సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు. మేకిన్ ఇండియా, జాతీయ విద్యా విధానం (NEP-2020) వంటి లక్ష్యాలకు అనుగుణంగా ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దనున్నారు. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్తో పాటు యావత్ భారతదేశాన్ని ఏవియేషన్, ఏరోస్పేస్ విద్య, ఆవిష్కరణలలో ప్రపంచస్థాయి లీడర్ గా నిలబెట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. Quote
Android_Halwa Posted 5 hours ago Report Posted 5 hours ago Aipaye….ppt lo kotha shakam modalu ayindi…lakhs of crores nundi ipudu crores of crores… PPT makes all over the world are getting shocked…ie sollu ni evadra nammedi ani Quote
Android_Halwa Posted 5 hours ago Report Posted 5 hours ago Mothaniki Amaravati ni biscuit chesindu abba koduku…okka company ledu, oka IT company ledu…minimum lo ISB or microsoft kuda raledu… Quote
Junior_ Posted 5 hours ago Report Posted 5 hours ago 11 minutes ago, Android_Halwa said: Mothaniki Amaravati ni biscuit chesindu abba koduku…okka company ledu, oka IT company ledu…minimum lo ISB or microsoft kuda raledu… Why will any company invest there? No infrastructure or facilities. No highly educated population to feed any companies. The business men from Vij/Guntur will do real estate max on hype. Nothing there to see. Even if 4 govt buildings come, it will not be sufficient. It cannot provide employment to people at any level for it to grow like other cities. Quote
Android_Halwa Posted 5 hours ago Report Posted 5 hours ago Already Babori lands allotments anni under the scanner… Salarpuria ki ichina lands ki first year ke they defaulted on their lease payments… Bare minimum lease oayments kuda cheyani companies ki land ivadam endi ra ayya ? al time classic…Ursa Clusters..manolladi aithe saal..adige dikku ledu. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.