Jump to content

Harish rao inputs lead to ktr interrogation ?


Recommended Posts

Posted
3 hours ago, psycopk said:

 

em manushulu saaru.. okappudu ide Congress govt mee rastram ni vidadeesindani edchindru. Ippudu matram vaalla sanke naakutunnaru saaru. Mundu rendu kalla sidhantham ani sollu pakkana petti, mee rastram gurinchi chusukondi saaru. Capital sangati em chesukunnaru saaru?

Posted

Joginapally Santosh Rao: ఐదు గంటల పాటు జోగినపల్లి సంతోష్ రావు విచారణ

27-01-2026 Tue 21:45 | Telangana
Joginapally Santosh Rao Questioned for Five Hours
 
  • ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎంపీని ప్రశ్నించిన సిట్
  • మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రశ్నించిన సిట్
  • ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ప్రభాకర్ రావు నియామకం నిర్ణయం ఎవరిదని ప్రశ్నించిన సిట్
బీఆర్ఎస్ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్ రావును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సుదీర్ఘంగా విచారించింది. సిట్ విచారణ కొద్దిసేపటి కిందట ముగిసింది. సాయంత్రం మూడు గంటలకు ప్రారంభమైన విచారణ ఐదు గంటల పాటు కొనసాగింది. సిట్ అధికారులు సంతోష్ రావు వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ప్రభాకర్ రావు నియామకం నిర్ణయం ఎవరిదని ప్రశ్నించినట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఆధారాలను ముందుంచి సిట్ ఆయనను ప్రశ్నించినట్టు తెలుస్తోంది.

ప్రభాకర్ రావుకు ఇంటెలిజెన్స్ చీఫ్, ఎస్ఐబీ చీఫ్‌ బాధ్యతలు అప్పగించడంలో నిర్ణయం, ఆదేశాలు ఎవరు ఇచ్చారనే అంశంపై సంతోష్ రావును సిట్ ప్రశ్నించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఇదివరకే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావును విచారించిన విషయం విదితమే.
Posted
7 minutes ago, psycopk said:

 

Joginapally Santosh Rao: ఐదు గంటల పాటు జోగినపల్లి సంతోష్ రావు విచారణ

27-01-2026 Tue 21:45 | Telangana
Joginapally Santosh Rao Questioned for Five Hours
 
  • ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎంపీని ప్రశ్నించిన సిట్
  • మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రశ్నించిన సిట్
  • ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ప్రభాకర్ రావు నియామకం నిర్ణయం ఎవరిదని ప్రశ్నించిన సిట్
బీఆర్ఎస్ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్ రావును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సుదీర్ఘంగా విచారించింది. సిట్ విచారణ కొద్దిసేపటి కిందట ముగిసింది. సాయంత్రం మూడు గంటలకు ప్రారంభమైన విచారణ ఐదు గంటల పాటు కొనసాగింది. సిట్ అధికారులు సంతోష్ రావు వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ప్రభాకర్ రావు నియామకం నిర్ణయం ఎవరిదని ప్రశ్నించినట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఆధారాలను ముందుంచి సిట్ ఆయనను ప్రశ్నించినట్టు తెలుస్తోంది.

ప్రభాకర్ రావుకు ఇంటెలిజెన్స్ చీఫ్, ఎస్ఐబీ చీఫ్‌ బాధ్యతలు అప్పగించడంలో నిర్ణయం, ఆదేశాలు ఎవరు ఇచ్చారనే అంశంపై సంతోష్ రావును సిట్ ప్రశ్నించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఇదివరకే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావును విచారించిన విషయం విదితమే.

deenipai mee spandana? 

https://www.instagram.com/reel/DTo4p51Egq0/

cc @Konebhar6 @akkum_bakkum @Thokkalee @vetri_psyconandamuri

Posted

KCR: ఇది విచారణ కాదు... ప్రతీకారం: కేసీఆర్‌కు సిట్ నోటీసులపై కేటీఆర్ ఫైర్ 

29-01-2026 Thu 16:26 | Telangana
KTR Fires on Congress Over SIT Notice to KCR Calling it Vendetta
 
  • కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడం కక్ష సాధింపేనన్న కేటీఆర్
  • ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టి మరల్చేందుకే ఈ చర్యలని ఆరోపణ
  • చావు నోట్లో తలపెట్టి కేసీఆర్ తెలంగాణ సాధించారని వ్యాఖ్య
  • బెదిరింపులతో తెలంగాణ చరిత్రను చెరపలేరని హెచ్చరిక
  • కాంగ్రెస్ అన్యాయ పాలనపై పోరాటం కొనసాగిస్తామని ప్రకటన
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు సిట్ నోటీసులు జారీ చేయడంపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇది విచారణ కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు చేస్తున్న రాజకీయ ప్రతీకార చర్య అని ఆయన అభివర్ణించారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన కాంగ్రెస్, పాలనా లోపాలను కప్పిపుచ్చుకునేందుకే ఇలాంటి కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని ఆయన మండిపడ్డారు. ఇది కేవలం న్యాయాన్ని అపహాస్యం చేయడమేనని, రాజకీయ దురుద్దేశంతోనే ఈ నోటీసులు ఇచ్చారని ఆయన స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా కేటీఆర్ స్పందిస్తూ.. "చావు నోట్లో తలపెట్టి, సచ్చుడో, తెలంగాణ వచ్చుడో అనే మొక్కవోని దీక్షతో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుడు కేసీఆర్. తన పదేళ్ల పాలనలో మిషన్ భగీరథ, రైతుబంధు, దళితబంధు వంటి పథకాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపారు. సబ్బండ వర్గాలను కడుపులో పెట్టుకుని చూసుకున్నారు. అలాంటి నాయకుడిపై అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు విచారణల పేరుతో వేధించడం దుర్మార్గం" అని ధ్వజమెత్తారు.

తమ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతున్నందుకే బీఆర్ఎస్ అధినేతపై కాంగ్రెస్ కక్ష కట్టిందని కేటీఆర్ ఆరోపించారు. కేసీఆర్ తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిన నాయకుడని, కేవలం నోటీసులు ఇచ్చి, బెదిరింపులకు పాల్పడి తెలంగాణ ఉద్యమ చరిత్రను, ఆయన కీర్తిని చెరిపేయలేరని హెచ్చరించారు.

తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానిస్తే సహించేది లేదని, ప్రజలే సరైన సమయంలో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెబుతారని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఈ కక్ష సాధింపు రాజకీయాలను తీవ్రంగా ఖండిస్తోందని, ప్రజల పక్షాన నిలబడి కాంగ్రెస్ అన్యాయ పాలనపై తమ పోరాటాన్ని కొనసాగిస్తామని కేటీఆర్ ఉద్ఘాటించారు. చరిత్రను విచారణలతో కాదని, ప్రజల తీర్పుతోనే రాస్తారని ఆయన వ్యాఖ్యానించారు.
Posted

KCR: కేసీఆర్ కు సిట్ నోటీసులు.. కేసు విచారణ సీరియస్ గా జరగడం లేదన్న కవిత

29-01-2026 Thu 16:53 | Telangana
KCR Receives SIT Notice Kavitha Alleges Non Serious Investigation
 
  • రేపు కేసీఆర్ ను విచారించనున్న సిట్ అధికారులు
  • ఎన్నికలు ఉన్నందునే కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారన్న కవిత
  • కేసును త్వరగా ముగించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్య
ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడం ఇరు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారణ ఉంటుందని నోటీసుల్లో సిట్ అధికారులు పేర్కొన్నారు. రేపు కేసీఆర్ విచారణ నేపథ్యంలో తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. 

సిట్ నోటీసుల నేపథ్యంలో కేసీఆర్ కూతురు, జాగృతి అధ్యక్షురాలు కవిత స్పందిస్తూ... కీలక వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ ఎన్నికలు ఉన్నందునే కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. సిట్ విచారణ నాన్-సీరియస్ గా జరుగుతోందని, ఎన్నికల నేపథ్యంలోనే కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారని అన్నారు. కేసును సీరియస్ గా తీసుకుని త్వరగా ముగించాల్సిన అవసరం ఉందని... అయితే, కేసును ముగించాలనే ఉద్దేశం ప్రభుత్వానికి ఉందా? లేదా? అనేది ఎవరికీ అర్థం కాని పరిస్థితి ఉందని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ జరగడం నిజంగానే చాలా బాధాకరమని... కానీ, దానికి తగినటువంటి పర్యవసానాలను నేరస్తులు ఎదుర్కొంటారా? లేదా? అనేది వేచిచూడాలని అన్నారు.
Posted
1 hour ago, psycopk said:

 

KCR: కేసీఆర్ కు సిట్ నోటీసులు.. కేసు విచారణ సీరియస్ గా జరగడం లేదన్న కవిత

29-01-2026 Thu 16:53 | Telangana
KCR Receives SIT Notice Kavitha Alleges Non Serious Investigation
 
  • రేపు కేసీఆర్ ను విచారించనున్న సిట్ అధికారులు
  • ఎన్నికలు ఉన్నందునే కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారన్న కవిత
  • కేసును త్వరగా ముగించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్య
ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడం ఇరు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారణ ఉంటుందని నోటీసుల్లో సిట్ అధికారులు పేర్కొన్నారు. రేపు కేసీఆర్ విచారణ నేపథ్యంలో తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. 

సిట్ నోటీసుల నేపథ్యంలో కేసీఆర్ కూతురు, జాగృతి అధ్యక్షురాలు కవిత స్పందిస్తూ... కీలక వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ ఎన్నికలు ఉన్నందునే కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. సిట్ విచారణ నాన్-సీరియస్ గా జరుగుతోందని, ఎన్నికల నేపథ్యంలోనే కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారని అన్నారు. కేసును సీరియస్ గా తీసుకుని త్వరగా ముగించాల్సిన అవసరం ఉందని... అయితే, కేసును ముగించాలనే ఉద్దేశం ప్రభుత్వానికి ఉందా? లేదా? అనేది ఎవరికీ అర్థం కాని పరిస్థితి ఉందని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ జరగడం నిజంగానే చాలా బాధాకరమని... కానీ, దానికి తగినటువంటి పర్యవసానాలను నేరస్తులు ఎదుర్కొంటారా? లేదా? అనేది వేచిచూడాలని అన్నారు.

Evaranna decode cheyandi ee strategy ento!! Kavitakka sharmilamma bayataki vachi nijamgane valla families meeda war chestunnara or idemaina political strategy aa to help their families.

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...