teluguline Posted January 17, 2014 Report Posted January 17, 2014 News coverage మహారాష్ట్రలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ మహిళా టెక్కీ శవమై కనిపించింది. సెలవుల కోసమని వచ్చి తిరిగి వెళ్తుండగా షోలాపూర్లో ఉన్నప్పుడు చివరి కాల్ వచ్చింది. ఆ తర్వాత ఆమె అదృశ్యమయ్యారు. దాదాపు పది రోజుల క్రితం అదృశ్యమైన ఆమె విగతజీవిగా కనిపించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన 23 ఏళ్ల సాఫ్టువేర్ ఇంజనీర్ ఈస్తర్ అనూహ్య ముంబైలోని టిసిఎస్లో పని చేస్తున్నారు. సెలవుల కోసం వచ్చిన ఆమె తిరిగి ముంబై బయలుదేరింది. ఆ తర్వాత కనిపించకుండా పోయారు. గురువారం ముంబైలోని కంజుమార్గ్లో ఆమె మృతదేహం కాలిపోయి కనిపించింది. ఈ మృతదేహం అనూహ్యదని తండ్రి ప్రసాద్ గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఆమె చేతికి ఉన్న ఉంగరాన్ని బట్టి కుటుంబ సభ్యులు గుర్తించారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.