Jump to content

షర్మిలపై ప్రచారం మీద కెటిఆర్ సీరియస్


KXSH

Recommended Posts

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు వైయస్ షర్మిలపై సోషల్ మీడియాలో జరిగిన దుష్ప్రచారంపై తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు బుధవారం స్పందించారు. షర్మల గౌరవానికి భంగం కలిగేలా సోషల్ మీడియాలో రూమర్లు ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేటీఆర్ హెచ్చరించారు. 

సైబర్ నేరగాళ్లపై ఉక్కుపాదం మోపేందుకు అవసరమైతే చట్టాన్ని కూడా మారుస్తామన్నారు. షర్మిల నుంచి ఫిర్యాదు అందుకున్న వెంటనే కమిషనరేట్ ఆఫ్ పోలీస్ తో మాట్లాడి స్పందించాలని కోరామన్నారు. 

అలాగే ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విషయంలో కూడా చురుగ్గా స్పందించాలని కోరామన్నారు. సోషల్ మీడియాలో ప్రముఖుల వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతినేలా దుష్ప్రచారం చేస్తే వారిని చట్టానికి లోబడి శిక్షిస్తామన్నార�� �. సైబర్ నేరగాళ్ల ఆటలు కట్టించేందుకు గవర్నింగ్ కౌన్సిల్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

Link to comment
Share on other sites

×
×
  • Create New...