Jump to content

Recommended Posts

Posted

ప్రేమికుడే మోసగాడు 
యువతి నుంచి సొమ్ము కాజేసి జల్సా 
ఓ ఇంజినీరింగు విద్యార్థి మోసాలపై కేసు 
14ap-panel9a.jpg

విశాఖపట్న: వూహకందని విధంగా నాటకాలకు తెరతీసి ప్రేమికుడే యువతి నుంచి దఫదఫాలుగా డబ్బు గుంజాడు. మరొకరిపై ఫిర్యాదు ఇవ్వడానికి యువతితోపాటు పోలీస్‌స్టేషన్‌కు సైతం వెళ్లాడు. పోలీసుల దర్యాప్తులో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆరిలోవ పోలీస్‌స్టేషన్‌లో సోమవారం విలేకరుల సమావేశంలో ఏసీపీ దాసరి రవిబాబు తెలిపిన వివరాలివి. విశాఖ జిల్లా కోటపాడు మండలం పొడుగుపాలేనికి చెందిన సందీప్‌నాయుడు రాజస్థాన్‌లోని బిట్స్‌ పిలానీలో ఇంజినీరింగ్‌లో చేరాడు. ఏడాది తరువాత పాతమిత్రులు కలవడంతో తల్లిదండ్రులకు తెలియకుండా విశాఖ వచ్చేశాడు. తనకు అనారోగ్యంగా ఉందంటూ ఆసుపత్రిలో చేరిన ఫొటోలను తల్లిదండ్రులకు పంపుతూ డబ్బులు తీసుకునేవాడు. తాను దిల్లీ, చెన్నై నగరాలు, ఆస్ట్రేలియా, జర్మనీ దేశాల్లో ఉన్నానంటూ ఒక్కోసారి ఒక్కో పేరు చెప్పేవాడు. అనారోగ్యం ఉన్నప్పటికీ చదువుతున్నట్లు నమ్మించడంతో పలు దఫాలుగా రూ.50 లక్షల వరకూ తల్లిదండ్రులు పంపించారు. ఇవన్నీ జల్సాగా ఖర్చు చేసేవాడు. ఇతడికి తూము వినయ్‌చౌదరి అనే మిత్రుడు జతకలిశాడు. వినయ్‌ తాను చదువుతున్న ఇంజినీరింగ్‌ కళాశాలలో ఒక యువతిని సందీప్‌కు పరిచయం చేశాడు. పరిచయం పెరిగిన ఆమె మాటల మధ్యలో తన ఫొటోలను చిన్ననాటి మిత్రుడికి ఇచ్చానని చెప్పడంతో సందీప్‌ కొత్త పథకం వేశాడు. యువతి మిత్రుడి పేరుతో ఫేస్‌బుక్‌ ఖాతా తెరిచాడు. ునీ ఫొటోలు నా వద్ద ఉన్నాయి. డబ్బులు ఇవ్వకపోతే సోషల్‌మీడియాలో పెడతా’నంటూ బెదిరించాడు. భయపడిన యువతి కొంత సొమ్మును అతడు సూచించిన బ్యాంకు ఖాతాలో వేసింది. విషయాన్ని యువతి సందీప్‌తో చెప్పారు. ఆ సొమ్ము తనకే ఇస్తే అతడి బ్యాంకు ఖాతాలో వేస్తానంటూ ఆమె వద్ద సందీప్‌ సొమ్ము తీసుకునేవాడు. ఇలా రూ.80 వేల వరకూ యువతి నుంచి తీసుకున్నాడు.

మరోవైపు సందీప్‌ తన బంధువుల్లోని ఓ మహిళ పేరుతో ఫేస్‌బుక్‌ ఖాతా తెరిచాడు. మహిళను తన తల్లిగా పరిచయం చేసి యువతితో ఛాటింగ్‌ జరిపేవాడు. ఆమె వివాహం చేసుకోకపోతే తన కొడుకు బతకలేడంటూ సందేశాలు పెట్టేవాడు. చిన్ననాటి మిత్రుడి పేరిట బెదిరింపులు తీవ్రమవడంతో విషయం యువతి తల్లిదండ్రులకు చెప్పారు. వారు పోలీసులను ఆశ్రయించారు. తల్లిదండ్రులు, యువతితోపాటు ఫిర్యాదు చేయడానికి సందీప్‌ వెళ్లాడు. పోలీసులు తీగ లాగితే డొంక కదిలింది. ప్రేమికుడే బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నట్లు బయటపడింది. సందీప్‌ తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో వారు తమ కుమారుడు విశాఖలో ఉన్న విషయమే తెలియదనడం గమనార్హం. ఆసుపత్రిలో అనారోగ్యంతో ఉన్నట్లు అనేకసార్లు ఫొటోలు పంపించేవాడని, ఓసారి సందీప్‌ చనిపోయినట్లు మిత్రులు ఫోన్‌ చేయడంతో ముంబయి కూడా వెళ్లానని తండ్రి పేర్కొన్నారు. సందీప్‌ నాటకం వెనుక సాగర్‌నగర్‌కు చెందిన తూము వినయ్‌చౌదరి ఉన్నాడని, అతడిని అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు. సందీప్‌ను అరెస్టు చేసి, అతడి నుంచి నాలుగు సిమ్‌లు, క్రెడిట్‌ కార్డులు, రూ.నాలుగు వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. అతడి కాల్‌డేటాను విశ్లేషిస్తున్నారు.

Posted

endi bhayya rojukokati...prashantanga batakanivvara

 
209h6ba.jpg.gif
Posted

Veedidi vsp kaadhu.. vsp lo antha posh ppl untaru..veedidi vja ayyi untadi..lol barya..lol poshness..lol guntalman

Posted

Daya chesi...daya chesi...e story kii ma barya ankul kii link petakandi...asale innocent barya ankul frustration loo saccina eluka thoo rape chestadu Bemmilaughingonphone.gif

×
×
  • Create New...