SonyKongara Posted September 12, 2018 Report Share Posted September 12, 2018 మంత్రి లోకేష్కు అరుదైన ఆహ్వానం 12-09-2018 17:04:48 అమరావతి: మంత్రి నారా లోకేష్కు అరుదైన ఆహ్వానం అందింది. చైనాలో సెప్టెంబర్ 18 నుండి 20 వరకు జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం న్యూ ఛాంపియన్స్ వార్షిక సమావేశాలకు హాజరు కావాలని మంత్రి లోకేష్ను ఫోరం ప్రతినిధులు ఆహ్వానించారు. సమావేశాల్లో ప్రసంగించాల్సిందిగా కోరారు. ఈ ఆహ్వానం మేరకు మంత్రి లోకేష్ సెప్టెంబర్ 17 నుంచి 22 వరకు చైనాలో పర్యటించనున్నారు. ఈ సమావేశాల్లో భాగంగా జరిగే 11 ఆర్థికపరమైన సమావేశాల్లో లోకేష్ ప్రసంగించనున్నారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను వివరించనున్నారు. ఈ ఐదురోజుల చైనా పర్యటనలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల్లో పాల్గొనడంతో పాటు.. పలు ఎలక్ట్రానిక్ కంపెనీల ప్రతినిధులను కలవనున్నారు. ఆయా తయారీ కంపెనీలతో ఒప్పందాలు చేసుకోనున్నారు. Quote Link to comment Share on other sites More sharing options...
ranku_mogudu Posted September 12, 2018 Report Share Posted September 12, 2018 China investment paaye Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.