Jump to content

List of sitting MLAs MPs moving to YCP from TDP this week


Recommended Posts

Posted
9 hours ago, Smallpappu said:

@Android_Halwa uncle sabita sudheer trs loki eppudu jump avutaru ?

thondaraga jump kodite dora promise sesina 2 women minister posts lo okati vasthadi sabita ki. 

  • Replies 254
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • snoww

    76

  • Smallpappu

    37

  • JambaKrantu

    22

  • DaleSteyn1

    15

Posted
10 minutes ago, snoww said:

thondaraga jump kodite dora promise sesina 2 women minister posts lo okati vasthadi sabita ki. 

dora emanna jagananna lekka anukunnava maata meeda nilabadaneeki. @3$%

 

Posted

గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే, కృష్ణాజిల్లా విజయ డెయిరీ డైరెక్టర్‌ దాసరి వెంకట బాలవర్థన్‌ రావు శుక్రవారం తెలుగుదేశం పార్టీకి రాజీనామ చేశారు. వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో దాసరి బాలవర్థన్‌ రావు ఇవాళ ఉదయం వైఎస్సార్ సీపీలో చేరారు. వైఎస్ జగన్ ఈ సందర్భంగా బాలవర్థన్‌ రావుకు కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి, బాలవర్థన్‌ రావు సోదరుడు దాసరి జై రమేష్‌ పాల‍్గొన్నారు. కాగా ఇప్పటికే దాసరి జై రమేష్‌...వైఎస్సార్ సీపీలో చేరిన విషయం విదితమే. ఈ సందర్భంగా దాసరి బాలవర్ధన్‌ రావు మాట్లాడుతూ... గన్నవరం నియోజకవర్గ పరిధిలో ప్రస్తుతం భయానక వాతావరణం నెలకొందని అన్నారు. గన్నవరంలో ప్రజల కష్టసుఖాలు చెప్పుకునే పరిస్థితి టీడీపీలో లేదని అన్నారు. కార్యకర్తల భవిష్యత్‌ కోసం తాను వైఎస్సార్‌సీపీలో చేరినట్లు తెలిపారు. అయితే తాను ఎలాంటి హామీలు అడగలేదని దాసరి బాలవర్ధన్‌ రావు పేర్కొన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో పనిచేసేందుకు తాను సిద్ధమన్నారు.

Posted
Pocha Brahmananda Reddy Joins YSR Congress Party - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వెంట నడిచేందుకు అన్నివర్గాల వారు ముందుకు వస్తున్నారు. రాజన్న తనయుడి పోరాట పటిమకు, నాయకత్వ లక్షణాలకు ఆకర్షితులై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి వస్తున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. తాజాగా కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త పోచ బ్రహ్మానందరెడ్డి తన మద్దతుదారులతో కలిసి శుక్రవారం వైఎస్సార్‌సీపీలో చేరారు. పార్టీ కండువాలతో వీరిని జగన్‌ ఆహ్వానించారు.

ఈ సందర్భంగా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌ చేపట్టిన పాదయాత్ర, ఆయన ప్రకటించిన నవరత్నాలు పథకాలకు ఆకర్షితుడినై పార్టీలో చేరినట్టు చెప్పారు. పార్టీ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తానని అన్నారు. తన రాజకీయ ప్రస్థానం వైఎస్సార్‌తోనే మొదలైందని వెల్లడించారు. 2005లో యూనివర్సిటీ బోర్డ్‌ మెంబర్‌గా వైఎస్సార్‌ నియమించారని గుర్తు చేశారు. అప్పటి నుంచి ఆరేళ్ల పాటు యూనివర్సిటీ బోర్డ్‌ మెంబర్‌గా పనిచేశానని తెలిపారు.

Posted
636876763966505341.jpg
కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంకు చెందిన టీడీపీ కీలక నేత, మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నారు. శుక్రవారం సాయంత్రం నియోజకవర్గానికి చెందిన సీనియర్‌ నేతలతో బొడ్డు చర్చలు జరిపారు. టీడీపీ నుంచి టికెట్‌ దక్కకపోవడంతో పార్టీ మారేందుకు ఆయన ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. కాగా.. టికెట్ విషయమై ఈనెల 6 వరకు అధిష్ఠానం నిర్ణయం కోసం ఎదురుచూస్తానని ఇదివరకే ఆయన ప్రకటించారు. అధిష్ఠానం నుంచి సానుకూల వైఖరి రాకపోవడంతో ఆయన పార్టీని వీడాలని నిర్ణయించినట్లు సమాచారం.
 
 
అసలేం జరిగింది..!?
పెద్దాపురం అసెంబ్లీ సిటింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న హోంమంత్రి చినరాజప్పకు రాజమహేంద్రవరం రూరల్‌ సీటు ఇచ్చి.. బుచ్చయ్య చౌదరికి ఎంపీ టిక్కెట్టు ఇస్తే బాగుంటుందని బొడ్డు భాస్కరరామారావు టీడీపీ అధిష్ఠానానికి కొత్త ప్రతిపాదన చేశారు. అయితే ఆయన ప్రతిపాదనను చంద్రబాబు తిరస్కరించారు. దీంతో పెద్దాపురం నుంచి స్వతంత్రంగా బరిలోకి దిగాలా? లేదా జనసేన, వైసీపీల్లో ఏదో ఒక పార్టీ నుంచి టిక్కెట్టు తెచ్చుకుని పోటీ చేయాలా? అనేదానిపై తర్జనభర్జన జరుగుతోంది.
Posted
జనసేనలో చేరనున్న టీడీపీ కీలక నేత.. రేపల్లె నుంచి పోటీ.. 
08-03-2019 20:26:56
 
636876736157101585.jpg
గుంటూరు: ఎన్నికలు దగ్గరపడుతుండటంతో నేతల జంపింగ్‌లు షురూ అయ్యాయి. ఇప్పటికే అటు అధికార, ప్రతిపక్ష పార్టీల్లోకి నేతలు చేరిపోతుండటంతో ఆ రెండు పార్టీల్లో టికెట్ దక్కవని భావించిన నేతలు జనసేనలో చేరిపోతున్నారు. ఇప్పటికే ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు జనసేనలో చేరగా తాజాగా.. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ కీలక నేత దేవినేని మల్లిఖార్జున పార్టీలో చేరడానికి సిద్ధమయ్యారు. మరో రెండ్రోజుల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకోనున్నారు.
 
 
కాగా.. రేపల్లె జనసేన అభ్యర్థిగానే దేవినేని బరిలోకి దిగుతారని ఆయన అనుచరులు, కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. 2004 సార్వత్రిక ఎన్నికల్లో మల్లిఖార్జున కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలుపొందారు. రాష్ట్ర విభజన తర్వాత దేవినేని టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.
Posted

Modugula Venugopal Reddy....lastest to join YSRCP.

Guntur MP against Galla Jaydev anta

Posted
1 minute ago, Android_Halwa said:

Modugula Venugopal Reddy....lastest to join YSRCP.

Guntur MP against Galla Jaydev anta

Idendi new twist ?

Then n.peta nunchi evaru ?

 

Posted

నంద్యాల ఎంపీ టిక్కెట్‌పై ఎలాంటి హామీ లేకపోవడంతో ఎస్పీవై రెడ్డి కూడా టీడీపీని వీడాలని భావిస్తున్నట్టుగా సమాచారం. నంద్యాల ఎంపీ టిక్కెట్ తమకేనంటూ మాండ్ర శివారెడ్డి వర్గీయులు ప్రచారం చేస్తుండడంతో ఎస్పీవై రెడ్డి అసంతృప్తిలో ఉన్నారు. భవిష్యత్ కార్యాచరణపై అనుచరుల నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నారు. ఇక నంద్యాల ఎంపీ టిక్కెట్‌ను ఆశిస్తున్న గంగుల ప్రతాప్ రెడ్డి కూడా టీడీపీనీ వీడతారని సమాచారం. టీడీపీ అధిష్టానం నుంచి ఎలాంటి హామీ లేకపోవడంతో ఆయన అసంతృప్తిలో ఉన్నారు. కర్నూలు జిల్లా టీడీపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.

Posted
1 minute ago, JambaKrantu said:

Ali, SPY next in line..

SV Mohan reddy and TG lo evaro okaru kooda mostly gone 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...