snoww Posted April 28, 2019 Author Report Posted April 28, 2019 విశాఖపట్నంలో ముగిసిన మూడవ భాగస్వామ్య సదస్సు ద్వారా నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని నగర నిర్మాణంలో పాలుపంచుకునేందుకు దేశ, విదేశాలకు చెందిన 37 కంపెనీలతో సీఆర్డీయే అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ ఒప్పందాల మొత్తం విలువ రూ.49,800 కోట్లు కాగా వీటి వల్ల రాజధానిలో 78,700 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. రాజధాని ప్రాంతంలో పెట్టుబడులు పెడుతున్న ప్రధాన సంస్థల విషయానికి వస్తే... ఎ.ఎన్.ఎ.ఎస్. ఇంటర్నేషనల్ ఎంటర్ప్రైజెస్ సంస్థ రూ.5,000 కోట్లను, షాపూర్జీ పల్లోంజీ సంస్థ రూ.2,400 కోట్లను మౌలిక వసతుల కల్పనారంగంలో పెట్టుబడులుగా పెట్టనున్నారు. మరికొన్ని సంస్థలలో ఎల్.ఇ.పి.ఎల్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ (మిడ్వ్యాలీ సిటీ), వింధ్యా టెలిలింక్స్ (ఎం.పి. బిర్లా కంపెనీ), టర్న్కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. శ్రీ రామచంద్ర ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఎల్.ఇ.హెచ్. కన్ఫ్లూయెన్షియల్ కార్పొరేషన్, సవీతా యూనివర్సిటీ (ఉన్నత విద్య), గోల్డ్ ఫిష్ ఎబోడ్ (గోల్ఫ్ కోర్స్)- రూ.2,000 కోట్లు, కుని ఉమి అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీ, కె.వి.ఎం. ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ తదితర సంస్థలు ఉన్నాయి. కాగా.. 2016, 2017లలో విశాఖపట్నంలోనే నిర్వహించిన రెండు భాగస్వామ్య సదస్సుల్లో కూడా ఏపీసీఆర్డీయే అమరావతి అభివృద్ధి కోసం మొత్తం 57 ఎంఓయూలు కుదుర్చుకుంది. వాటిల్లో 5 ఇప్పటికే కార్యరూపం దాల్చగా, మరో 21 ప్రాజెక్టులు త్వరలోనే కార్యకలాపాలు ప్రారంభించే దశలో ఉన్నాయి. ఈ 26 ప్రాజెక్టుల మొత్తం విలువ అవి పూర్తయ్యేసరికి రూ.66,200 కోట్లు. ఇది ఆ రెండేళ్లల్లో కుదిరిన పెట్టుబడుల ఒప్పందాల మొత్తంలో సుమారు 69 శాతానికి సమానం. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.