r2d2 Posted January 4, 2021 Report Share Posted January 4, 2021 తెలంగాణలో ఉద్యమకారులు కనుమరుగయ్యారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. సీఎం కేసీఆర్ పంచన చేరినవాళ్లు తెలంగాణ ద్రోహులేనని చెప్పారు. ప్రముఖ కళాకారుడు దరువు ఎల్లన్న భాజపాలో చేరిన సందర్భంగా సంజయ్ మాట్లాడారు. తెలంగాణ ఉద్యమకారులు అధికారంలో ఉండొద్దా?అని ఆయన ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్లోని ఆలయాల్లో విగ్రహాల ధ్వంసంపై సంజయ్ మండిపడ్డారు. ఏపీ ప్రజల సహనాన్ని పిరికితనంగా భావించొద్దని సీఎం జగన్ను ఉద్దేశించి అన్నారు. భాజపా కార్యకర్తలు రోడ్డెక్కితే ఆయన మూటాముల్లె సర్దుకోవాలని ధ్వజమెత్తారు. తెలంగాణ తరహాలోనే ఏపీలోనూ షాక్ ట్రీట్మెంట్ తప్పదని సంజయ్ హెచ్చరించారు. తిరుపతి ఉప ఎన్నికలో ఓటేసే ముందు ప్రజలు ఆలోచించాలన్నారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఫలితాలే తిరుపతిలోనూ వస్తాయని చెప్పారు. ఈ సందర్భంగా సంజయ్కు ‘ఉద్యమ చరిత్ర’ పుస్తకాన్ని ఎల్లన్న బహూకరించారు. యుద్ధంలో సంజయ్తోనే ఉండాలని భాజపాలో చేరినట్లు ఆయన చెప్పారు. Quote Link to comment Share on other sites More sharing options...
r2d2 Posted January 4, 2021 Author Report Share Posted January 4, 2021 Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.