Jump to content

Recommended Posts

Posted

స్లయిడ్ 21 యొక్క 1: ఆయన గానం స్వరరాగ గంగా ప్రవాహాం. ఆయన పాడుతుంటే.. దేవతలు సైతం తన్మయత్వంల పొందుతారు. హరివరసనం అంటూ ఆయన పాడే జోల పాటతోనే అయ్యప్ప స్వామి పవళింపు సేవ చేస్తారు. అంతలా తన గానంతో ఆ సేతు హిమాచలంలో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించిన గాయకుల్లో కేజే యేసుదాసు అగ్రగణ్యలు. నేడు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన స్వరరాగ ప్రస్థానంలో కొన్ని కీలక ఘట్టాలు. (Twitter/Photo)

ఆయన గానం స్వరరాగ గంగా ప్రవాహాం. ఆయన పాడుతుంటే.. దేవతలు సైతం తన్మయత్వంల పొందుతారు. హరివరసనం అంటూ ఆయన పాడే జోల పాటతోనే అయ్యప్ప స్వామి పవళింపు సేవ చేస్తారు. అంతలా తన గానంతో ఆ సేతు హిమాచలంలో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించిన గాయకుల్లో కేజే యేసుదాసు అగ్రగణ్యలు. నేడు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన స్వరరాగ ప్రస్థానంలో కొన్ని కీలక ఘట్టాలు.

Posted

1. యేసుదాసు ఐదు దశాబ్దాల సినీ కళా జీవితంలో వివిధ భారతీయ భాషలైన మలయాళం, తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, బెంగాలీ, ఒరియా భాషలతో పాటు అరబిక్, ఆంగ్లం, లాటిన్, రష్యన్ భాషలలో సుమారు 80వేల పాటలను పాడారు. అతనిని గాన గంధర్వన్ గా కూడా పిలుస్తారు. అంతేకాదు ఆల్ టైమ్ గ్రేటెస్ట్ ఇండియన్ సింగర్‌గా తన కంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నారు

 

2. పంజాబీ, అస్సామీ, కొంకణి, కాశ్మీరీ భాషల్లో మిగతా అన్ని భారతీయ భాషల వారికి తన గాన మాధుర్యాన్ని అందించారు. ఈయన 1940 జనవరి 10న కేరళోని కొచ్చిలోని కాథలిక్ క్రైస్తవ కుటుంబంలో జన్మించారు.

3.మొదట గాయకుడిగా ఆయన గొంతు పనికాదన్న వారే ఆయన గొంతులో పలికే రాగాల కోసం వెయిట్ చేసారు. యేసుదాసు తండ్రి మలయాళ శాస్త్రీయ సంగీత గాయకుడు. రంగస్థన నటుడు కూడా. ఐనా.. వారికి ఆర్టిక ఇబ్బందులు పడ్డారు. యేసుదాసు ఐదుగురు పిల్లలలో పెద్దవాడు, అతని తరువాత ముగ్గురు తమ్ముళ్ళు, ఒక చెల్లెలు ఉన్నారు. తండ్రి ప్రభావంతో ఏసుదాసు కూడా చిన్నప్పటి నుంచి పాటలు పాడేవాడు. పదిహేడేళ్ళ వయసులో కర్ణాటక గాత్ర సంగీతంలో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచాడు. కొడుకులోని ప్రతిభను సానబెట్టడం కోసం తండ్రి అతన్ని తిరుపుణిత్తుర లోని ఆర్.ఎల్.వి. సంగీత కళాశాలలో చేర్పించారు.

4. ఆ తర్వాత యేసుదాసు చెంబాయ్ వైద్యనాథ భాగవతార్ వద్ద కూడా విద్యనభ్యసించాడు.1961 నవంబరు 14 న కేరళ చిత్ర దర్శకుడు ఎ. కె. ఆంథోనీ ఆయనకు మొట్టమొదటిగా అవకాశం ఇచ్చాడు. యేసుదాసు పాటలలో మొదటి ప్రసిద్ధ పాట జాతి భేదం మత ద్వేషం 1961 నవంబరు 14న రికార్డు కాబడింది. అయినప్పటికీ అతని మొదటి పాట అటెన్షన్ పెన్నె అటెన్షన్ను మలయాళ సినిమాలో పాడారు. అతను తన సినిమా నేపథ్యగాయకునిగా మలయాళ చిత్రం కాలపదుకై (1962) తో ప్రారంభించి, తమిళ, తెలుగు, కన్నడ మొదలైన చిత్రాలలో తన సత్తా చూపెట్టారు. ఈ యేడాదితో సినీ రంగంలో యేసుదాసు 60 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్నారు.

5.తెలుగులో మొదట భద్రకాళి సినిమాలో పాడారు. ఆ తర్వాత తెలుగులో అంతులేని కథ, మేఘ సందేశం, స్వయంవరం సినిమాల్లో ఆయన పాడిన పాటలు శ్రోతలను అలరించాయి. ముఖ్యంగా మేఘ సందేశంలోని ఆకాశా దేశానా పాటకు ఉత్తమ గాయకుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు.

6.మోహన్ బాబుతో యేసుదాసుకు ప్రత్యేక అనుబంధం ఉంది. తెలుగులో ఈయన ఎక్కువగా మోహన్ బాబు సినిమాలకు పాడారు. మోహన్ బాబు సినిమా అంటే ఖచ్చితంగా ఓ పాట యేసుదాసుది ఉండాల్సిందే. మోహన్ బాబు పాటలకు యేసుదాసు గాత్రం అతికినట్టు సరిపోతుంది. ముఖ్యంగా అల్లుడు గారులో ‘కొండలలో నెలకొన్న, అసెంబ్లీ రౌడీలో ‘అందమైన వెన్నెలలోనా’ వంటి డ్యూయట్స్ మోహన్ బాబుకు పాడటం విశేషం.

7.దివంగత ఎస్పీ బాలసుబ్రమణ్యంతో యేసుదాసుకు ఆత్మీయనుబంధం ఉన్నది. ఈ సంగీత ద్వయం ‘దళపతి’లో పాడిన సింగారాల పైరుల్లోనా పాట అప్పటికీ ఎప్పటికీ ఎవర్ గ్రీన్.

8.కే.జే. యేసుదాసు పూర్తి పేరు కట్టసరి జోసెఫ్ యేసుదాసు. ఈయన తెలుగులో దాదాపు ఎన్టీఆర్,ఏఎన్నాఆర్, కృష్ణ,శోభన్ బాబు,కృష్ణంరాజు, మోహన్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ,వెంకటేష్, నాగార్జున, రాజశేఖర్ వంటి హీరోల సినిమాల్లో పాటలు పాడారు.

9.యేసుదాసు బాలీవుడ్‌లో సైతం సత్తా చాటారు. ముఖ్యంగా అమితాబ్,జితేంద్ర, అమోల్ పాలేకర్ వంటి హీరోల సినిమాల్లో పాటలు పాడారు. ముఖ్యంగా 1976లో వచ్చిన ‘చిచ్చోర్’ లో గోరి తేరా గావ్ బడా ప్యారా అనే పాటకు హిందీలో సైతం జాతీయ అవార్డును అందుకున్నారు.

10.సినీ ప్రస్థానంలో కే.జే.యేసుదాసు.. మొత్తంగా మలయాళ, తెలుగు, హిందీలో కలిపి 8 జాతీయ అవార్డులు అందుకొని రికార్డు నెలకొల్పారు.

11.ఈయన కేరళ రాష్ట్ర ప్రభుత్వం తరుపున 26 సార్లు ఉత్తమ గాయకుడి అవార్డు అందుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తరుపున బెస్ట్ సింగర్‌గా నాలుగు నందులు అందుకున్నారు. తమిళనాడు ప్రభుత్వం నుంచి ఉత్తమ గాయకుడిగా ఐదు పురస్కారాలు అందుకున్నారు.

12.1975లో కేంద్రం నుంచి పద్మశ్రీ పురస్కారం... 2002లో పద్మభూషణ్ పురస్కారం 2017లో పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్నారు.

13. 1986లో తమిళనాడు ప్రభుత్వం నుంచి ‘కలైమామణి’ అవార్డు పలు యూనివర్సిటీలు యేసుదాసును గౌరవ డాక్టరేట్‌తో సత్కరించాయి.

14.ముఖ్యంగా హిందూ, క్రిష్టియన్స్‌కు సంబంధించిన ఎన్నో పాటలను పాడారు.2017లో కర్ణాటక ప్రభుత్వం రాజోత్సవ్ అవార్డుతో గౌరవించింది.

15.దాదాపు ఆరు దశాబ్దాల సినీ ప్రస్థానంలో సంగీతంలో ఎన్నో ఉన్నత శిఖరాలను అందుకున్న గాన గంధర్వుడు యేసుదాసు.మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నుంచి పద్మవిభూషణ్ పురస్కారం స్వీకరించిన కే.జే.యేసుదాసు 

16.నేటితో 81 వసంతాలు పూర్తి చేసుకున్న గాన గంధర్వుడు కే.జే.యేసుదాసు

  • Upvote 1

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...