Somedude Posted July 10, 2021 Report Share Posted July 10, 2021 81.03 ఎకరాల కబ్జాకు ఆమోదముద్ర కొత్తగా కేటాయిస్తున్నట్లు ఆదేశాలు ఎకరం భూమికి రూ.25 లక్షల వెల వాగులు, దారులు కూడా ఆ సంస్థకే ప్రజలు వాడుకునేందుకూ అనుమతి రెవెన్యూ శాఖ ఉత్తర్వులు అమరావతి, జూలై 9 (ఆంధ్రజ్యోతి): ‘హెటెరో’ ఆక్రమణలో ఉన్న భూమిపై అధికార ఆమోద ముద్ర పడింది. విశాఖ జిల్లా నక్కపల్లి సెజ్లో కొన్నేళ్లుగా హెటెరో కబ్జాలో ఉన్న 81.03 ఎకరాల భూమిని... ఇప్పుడు అదే సంస్థకు ప్రభుత్వం ‘కొత్తగా’ కేటాయించింది. భూ కేటాయింపుపై రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి శుక్రవారం రాత్రి ఉత్తర్వులు (జీఓ 163) జారీ చేశారు. ఎకరా భూమికి రూ.25లక్షల చొప్పున... 81.03 ఎకరాలకు రూ.20,25,75,000 ప్రభుత్వానికి చెల్లించాలని అందులో తెలిపారు. విశాఖ జిల్లా కలెక్టర్ ప్రతిపాదనల మేరకు ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ మేనేజ్మెంట్ అథారిటీ (ఏపీఎల్ఎమ్ఏ)లో తీర్మానం చేసి ఈ భూ కేటాయింపును ఖరారు చేశారు. ఇటీవలే మంత్రివర్గ సమావేశంలో ఈ తీర్మానాన్ని ఆమోదించారు. దాని మేరకే రెవెన్యూశాఖ భూ కేటాయింపు ఉత్తర్వులు ఇచ్చింది. ప్రభుత్వం కేటాయించిన 81 ఎకరాలను మూడేళ్లలో నిర్దిష్ట అవసరాలకు ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. లేనిపక్షంలో... భూమిని వెనక్కి తీసుకునే అధికారం ఉంటుందని స్పష్టం చేశారు. హెటెరోకు కేటాయించిన భూమిలో చెరువులు, కాలువలు, రహదారులు, పశువులను మేపే బీళ్లు, కాలిబాటలు కూడా ఉన్నాయి. వాటిని ప్రజలు ఉపయోగించుకుంటారని, కంపెనీ అందుకు అడ్డంకులు సృష్టించరాదని జీవోలో స్పష్టం చేశారు. ఇక... హెటెరోకు ఇచ్చిన భూముల్లోని కాలువలు, నీటి వనరుల స్వరూపం, ప్రవాహాన్ని దెబ్బతీసేలా ఎలాంటి చర్యలు చేపట్టవద్దని రెవెన్యూశాఖ ఆదేశించింది. ఒకవేళ ఎక్కడైనా ఆ భూమిని కూడా వినియోగించుకోవాల్సి వస్తే, నీటి ప్రవాహం కొనసాగేలా తగిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. ఎగువ నుంచి వచ్చే నీరు చెరువు, లేదా వాగులోకి వెళ్లడాన్ని ఎట్టిపరిస్థితుల్లో అడ్డుకోవద్దని, దిగువ ప్రాంతాల్లోని భూములు ముంపునకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఎప్పటి నుంచో కబ్జాలో... నక్కపల్లిలో హెటెరో సెజ్ను 200 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. ఆ తర్వాత భారీగా విస్తరణ జరిగింది. ఈ క్రమంలో కంపెనీ చుట్టుపక్కల ఉన్న భూములను ఆక్రమించింది. అందులో వాగులు, కాలువలు, నీటి వనరులు, పశువులను మేపే బీళ్లు, కాలిబాటలు అనేకం ఉన్నాయి. ఉపమాక, చుక్కలవాని లక్ష్మీపురం, ఎన్. నరసాపురం తదితర గ్రామాల్లోని 108 ఎకరాల భూమిని తనకే కేటాయించాలని టీడీపీ ప్రభుత్వ హయాంలో కంపెనీ కోరింది. అయితే... ముందే కబ్జా చేసి, తర్వాత కేటాయించాల్సిందిగా కోరడంపై ఫిర్యాదు రావడంతో అప్పట్లో విచారణ చేపట్టారు. ఆ వినతిని పక్కనపెట్టారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిని మళ్లీ తెరమీదకు తీసుకొచ్చారు. హెటెరోకు అనుకూలంగా చకచకా అడుగులు పడ్డాయి. పంచాయతీలకు పాలకవర్గాలు లేకుండా... కార్యదర్శులే దిక్కుగా ఉన్నప్పుడు అనుకూల తీర్మానాలను తెప్పించుకున్నారు. హెటెరోకు భూముల కేటాయింపుపై ప్రజామోదం ఉందని తేల్చేశారు. ఆ కంపెనీకి భూములు కేటాయించాలని విశాఖ కలెక్టర్ ఓ ప్రతిపాదన పంపించారు. ఆ తర్వాత అమరావతి స్థాయిలో మిగిలిన ప్రక్రియ చకచకా పూర్తయింది. హెటెరో కాబట్టేనా? పేదలు, సామాన్యులు ఎవరైనా ప్రభుత్వ భూములను ఆక్రమించుకుంటే కేసులు పెడతారు. ‘ఆక్రమణ’లోని కట్టడాలను కూల్చివేస్తారు. ఇక... గిట్టని పార్టీలకు చెందిన వారి విషయంలో లోపాలను వెతికి వెతికి మరీ పట్టుకుంటారు. కానీ... నక్కపల్లిలో హెటెరో చేసిన ఆక్రమణపై ఎంచక్కా ఆమోద ముద్ర వేసేశారు. ఆ సంస్థపై భూ ఆక్రమణ చట్టం కింద కేసులుపెట్టాలని, వెంటనే భూమిని వెనక్కి తీసుకోవాలని అనేక మంది ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. బహిరంగ మార్కెట్లో అక్కడ ఎకరా రూ.50 లక్షలకు పై మాటే. కానీ, అందులో సగం ధరకే హెటెరోకు ఇచ్చేయడం గమనార్హం. Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.