Telugumoviereviews Posted November 29, 2022 Report Posted November 29, 2022 కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన అద్భుతమైన సినిమాలలో 'ఖడ్గం' ఒకటి. దేశభక్తిని పెంపొందించేలా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమా ప్రసారమైతే ఇప్పటికీ ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోతారు. ప్రేక్షకుల హృదయాల్లో అంతలా స్థానం సంపాదించుకున్న ఈ చిత్రం విడుదలై నేటికి 20 ఏళ్ళు పూర్తయింది. దేశభక్తి, మత ఘర్షణలు వంటి సున్నిత అంశాలను కృష్ణవంశీ చక్కగా చూపించారు. కొన్ని కొన్ని సన్నివేశాలు కదిలించేలా, కంటతడి పెట్టించేలా ఉంటాయి. 'ఖడ్గం'లో ప్రతి పాత్ర పవర్ ఫుల్ గా గుర్తుండిపోయేలా ఉంటాయి. దేవిశ్రీప్రసాద్ స్వరపరిచిన ఈ చిత్రంలో 'నువ్వు నువ్వు', 'అహ అల్లరి', 'మేమే ఇండియన్స్', 'గోవిందా గోవిందా', 'ముసుగు వేయొద్దు', 'ఖడ్గం ఖడ్గం' ఇలా అన్నీ పాటలు విశేష ఆదరణ పొందాయి. కార్తికేయ మూవీస్ బ్యానర్ పై సుంకర మధుమురళి నిర్మించిన ఈ చిత్రం 2002 నవంబరు 29న విడుదలై ఘన విజయం సాధించింది. ఉత్తమ దర్శకులు(కృష్ణవంశీ)తో పాటు మొత్తం ఐదు విభాగాల్లో ఈ చిత్రం నంది అవార్డులు గెలుచుకుంది. For more information visit Teluguone.com official website Click here to get more details about 20 years for khadgam movie News Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.