Jump to content

ముగ్గురు వ్యక్తులు ముసుగులో వచ్చి అరగంట సేపు కొట్టారు: జడ్జికి వివరించిన పట్టాభి


BattalaSathi

Recommended Posts

naakenduko eee scene gurthuku vachindhi vaa

 

 

 

తోట్లవల్లూరు పోలీస్‌ స్టేషన్‌లో ముగ్గురు వ్యక్తులు ముసుగులో వచ్చి తనను అరగంట సేపు కొట్టారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి పట్టాభిరామ్‌.. న్యాయవాది, న్యాయమూర్తికి వివరించారు.

Updated : 21 Feb 2023 20:40 IST

21pattabhi1a_1.jpg

గన్నవరం: తోట్లవల్లూరు పోలీస్‌ స్టేషన్‌కు ముగ్గురు వ్యక్తులు ముసుగులో వచ్చి తనను అరగంట సేపు కొట్టారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ న్యాయమూర్తి ఎదుట వెల్లడించారు. సీఐ కనకారావు ఫిర్యాదు మేరకు పట్టాభితో పాటు 13 మంది తెదేపా నేతలను అరెస్టు చేసిన పోలీసులు ఇవాళ గన్నవరం కోర్టులో హాజరుపర్చారు. ‘తోట్లవల్లూరు స్టేషన్‌కు వెళ్లే సరికి అంతా చీకటిగా ఉంది. ముగ్గురు వ్యక్తులు ముసుగులో వచ్చి అరగంట సేపు కొట్టారు. వేరే గదిలోకి ఈడ్చుకెళ్లి ముఖానికి టవల్‌ చుట్టి కొట్టారు. తోట్లవల్లూరు పోలీస్‌ స్టేషన్‌లో నాపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారు’’ అని కోర్టులో న్యాయవాది, న్యాయమూర్తికి పట్టాభి వివరించారు.

గన్నవరం సీఐ కనకారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టాభిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తెదేపా కార్యకర్తలు రెచ్చగొట్టడం ద్వారా తనకు పట్టాభి సహా ఇంకొందరు తెదేపా నేతలు ప్రాణహాని కలిగించే ప్రయత్నం చేశారని కనకారావు ఫిర్యాదు చేశారు. తనను కులం పేరుతో దూషించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏ-1గా పట్టాభి, ఏ-2గా చిన్నా సహా మొత్తం 13 మందిపై హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ మేరకు కోర్టుకు సమర్పించిన రిమాండ్‌ రిపోర్టులో గన్నవరం పోలీసులు పేర్కొన్నారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...