Jump to content

what happened to KCR health


Recommended Posts

Posted
2 hours ago, ramabeer said:

So many fukars 

He is on borrowed time since long time. Telangana formation time lo rumors unde that his health was bad and if passed away portray it as martyr. 

Anything happened recently? 

  • Confused 1
Posted

I heard he has huge drinking problem. Something about rhinophyma or enlarged nose due to over drinking. 

Rumor in 2000s was that if you bring expensive liquor bottle to his farmhouse, he will be more happy to grant you favours. 

I always thought drinking rumour was some slander due to negative stereotype of Telangana people as drunkards.

Posted

Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం కేసీఆర్ అర్థాంగి శోభ 

10-10-2023 Tue 09:57 | Telangana
  • సోమవారం తిరుమల వెళ్లిన కేసీఆర్ ఆర్ధాంగి కల్వకుంట్ల శోభ
  •  నేడు ఉదయం తోమాల, సుప్రభాత సేవలో పాల్గొన్న వైనం
  • ఆమె వెంట ఉండి దర్శనానికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే చెవిరెడ్డి
 
KCR wife shobha visits Thirumala for venkateshwara swamy darshan

తెలంగాణ సీఎం కేసీఆర్ అర్ధాంగి శోభ నేడు తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున ఆమె తోమాల సుప్రభాత సేవ, అనంతరం శ్రీవారి అర్చనలో పాల్గొని స్వామి ఆశీస్సులు పొందారు. వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి ఆమెను దగ్గరుండి దర్శనానికి తీసుకెళ్లారు. తెలంగాణలో ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో ఆమె శ్రీవారి దర్శనం చేసుకున్నారు.

Posted

KCR: తిరుమల వెంకన్నకు తలనీలాలు సమర్పించిన కేసీఆర్ భార్య శోభ 

10-10-2023 Tue 10:36 | Both States
  • నిన్ననే తిరుమలకు చేరుకున్న కేసీఆర్ భార్య శోభ
  • తెల్లవారుజామున సుప్రభాత సేవలో పాల్గొన్న కేసీఆర్ సతీమణి
  • శోభను ఆశీర్వదించి తీర్థప్రసాదాలను అందించిన అర్చకులు
 
KCR wife offers prayers to Tirumala Venkateswara swamy

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గత కొన్ని రోజులుగా వైరల్ ఫీవర్ తో ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. ఆయన ఆరోగ్య పరిస్థితిపై అధికారికంగా ఎలాంటి బులెటిన్ విడుదల కాకపోవడంతో పార్టీలకు అతీతంగా అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో ఆయన భార్య శోభ తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించారు. తన భర్త ఆరోగ్యం కోసం స్వామిని మొక్కుకుని, తలనీలాలను సమర్పించారు. 

నిన్ననే తిరుమలకు చేరుకున్న ఆమె... ఈ తెల్లవారుజామున సుప్రభాత సేవలో పాల్గొన్నారు. అనంతరం శ్రీవారి అర్చన సేవలో పాల్గొని స్వామివారి ఆశీస్సులను తీసుకున్నారు. శోభకు అర్చకులు, టీటీడీ అధికారులు స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు. ఆమెను అర్చకులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలను అందించారు. వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పక్కనే ఉండి ఆమె కు స్వామివారి దర్శనం చేయించారు.
20231010fr6524dd8308e3a.jpg

  • Haha 1
Posted

He had liver transplant in the past.. someone with liver transplant should not drink. He’s an alcoholic… 

health bagoledu ani farmhouse lo ne doctors taking care anta..

elections in a month…congress valu inka edavaru…

Posted
2 minutes ago, psycopk said:

KCR: తిరుమల వెంకన్నకు తలనీలాలు సమర్పించిన కేసీఆర్ భార్య శోభ 

10-10-2023 Tue 10:36 | Both States
  • నిన్ననే తిరుమలకు చేరుకున్న కేసీఆర్ భార్య శోభ
  • తెల్లవారుజామున సుప్రభాత సేవలో పాల్గొన్న కేసీఆర్ సతీమణి
  • శోభను ఆశీర్వదించి తీర్థప్రసాదాలను అందించిన అర్చకులు
 
KCR wife offers prayers to Tirumala Venkateswara swamy

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గత కొన్ని రోజులుగా వైరల్ ఫీవర్ తో ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. ఆయన ఆరోగ్య పరిస్థితిపై అధికారికంగా ఎలాంటి బులెటిన్ విడుదల కాకపోవడంతో పార్టీలకు అతీతంగా అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో ఆయన భార్య శోభ తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించారు. తన భర్త ఆరోగ్యం కోసం స్వామిని మొక్కుకుని, తలనీలాలను సమర్పించారు. 

నిన్ననే తిరుమలకు చేరుకున్న ఆమె... ఈ తెల్లవారుజామున సుప్రభాత సేవలో పాల్గొన్నారు. అనంతరం శ్రీవారి అర్చన సేవలో పాల్గొని స్వామివారి ఆశీస్సులను తీసుకున్నారు. శోభకు అర్చకులు, టీటీడీ అధికారులు స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు. ఆమెను అర్చకులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలను అందించారు. వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పక్కనే ఉండి ఆమె కు స్వామివారి దర్శనం చేయించారు.
20231010fr6524dd8308e3a.jpg

Mokku terchunnattu unnaru 

Posted

Bandi Sanjay: కేసీఆర్ కనిపించడం లేదు.. కేటీఆర్ పై అనుమానం కలుగుతోంది: బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు 

10-10-2023 Tue 16:11 | Telangana
  • కేసీఆర్ నుంచే తాను మాటలు నేర్చుకున్నానన్న బండి సంజయ్
  • కేసీఆర్ ను ప్రజలకు చూపించాలని డిమాండ్
  • కేసీఆర్ కనిపించకపోవడం బాధను కలిగిస్తోందని వ్యాఖ్య
 
Bandi Sanjay doubts KTR in KCR matter

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు గురువు అని... కేసీఆర్ ను చూసే తాను మాటలు నేర్చుకున్నానని బీజేపీ నేత బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ ఆరోగ్యం ఎలా ఉందో వివరాలను వెల్లడించాలని, ఆయనను ప్రజలకు చూపించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కనిపించకపోవడం తనకు చాలా బాధను కలిగిస్తోందని.. ఆయనకు భద్రతను కల్పించాలని కోరారు. కేసీఆర్ కనిపించకపోవడంపై... తనకు కేటీఆర్ పై అనుమానం కలుగుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. పదేళ్ల కాలంలో తెలంగాణకు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని విమర్శించారు. రూ. 5 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారని దుయ్యబట్టారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఈ అప్పుల బాధ పోతుందని అన్నారు. బీజేపీ పాలనలో బీసీలకు మంచి జరుగుతుందని చెప్పారు

Posted

Amit Shah: "చంద్రశేఖర్ రావూ జీ" అంటూ సీఎం కేసీఆర్ పై అమిత్ షా విమర్శనాస్త్రాలు 

10-10-2023 Tue 17:02 | Telangana
  • తెలంగాణలో రాజుకుంటున్న ఎన్నికల వేడి
  • నేడు ఆదిలాబాద్ లో బీజేపీ జనగర్జన సభ
  • హాజరైన కేంద్ర హోంమంత్రి అమిత్  షా
  • కేసీఆర్ పదేళ్లుగా తన కుటుంబం గురించే ఆలోచిస్తున్నారని విమర్శలు
  • తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారు వచ్చే సమయం ఆసన్నమైందని వెల్లడి
 
Amit Shah take a dig at CM KCR

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ హైకమాండ్ తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ రెండు పర్యాయాలు రాష్ట్రానికి వచ్చి సభల్లో పాల్గొన్నారు. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదిలాబాద్ లో నిర్వహించిన బీజేపీ జనగర్జన సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన సీఎం కేసీఆర్ పై ధ్వజమెత్తారు. "చంద్రశేఖర్ రావూ జీ" అని సంబోధిస్తూ విమర్శనాస్త్రాలు సంధించారు.

కేసీఆర్ గత పదేళ్లుగా తన కుటుంబం గురించే ఆలోచిస్తూ, రాష్ట్రంలోని దళితులు, గిరిజనులను పట్టించుకోలేదని ఆరోపించారు. తెలంగాణ పేదల సమస్యలు తీర్చడంలో విఫలమయ్యారని విమర్శించారు. 

"కేసీఆర్... గిరిజనుల కోసం అనేక హామీలు ఇచ్చారా? వాటిలో ఒక్కటైనా అమలు చేశారా? ఆదివాసీలకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామన్న హామీ ఏమైంది? దళితబంధును కొందరికి మాత్రమే ఇచ్చి గొప్పలు చెప్పుకుంటున్నారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామన్న హామీ ఏమైంది చంద్రశేఖర్ రావూ జీ?" అంటూ అమిత్ షా వ్యాఖ్యానించారు. 

తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా చేశానని కేసీఆర్ చెబుతుంటారని, కానీ రైతుల ఆత్మహత్యలు, అవినీతి విషయంలోనే తెలంగాణను నెంబర్ వన్ చేశారని అమిత్ షా ఎద్దేవా చేశారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారు వచ్చే సమయం ఆసన్నమైందని, డిసెంబరు 3న హైదరాబాదులో బీజేపీ జెండా రెపరెపలాడాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 

మోదీ నాయకత్వంలో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. దళితులు, గిరిజనుల కోసం ప్రధాని మోదీ తొమ్మిదేళ్లుగా అనేక కార్యక్రమాలు చేపట్టారని, ఒడిశాకు చెందిన నిరుపేద గిరిజన మహిళను రాష్ట్రపతిగా చేసిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందని అన్నారు. 

ఈ సందర్భంగా అమిత్ షా కాంగ్రెస్ పార్టీని కూడా లక్ష్యంగా చేసుకున్నారు. ఎన్నికలు వస్తే చాలు కాంగ్రెస్ వాళ్లు కొత్త బట్టలు వేసుకుని తయారవుతారని వ్యంగ్యం ప్రదర్శించారు. పేదల గురించి మాట్లాడే కాంగ్రెస్ గతంలో వారి కోసం ఏమైనా చేసిందా? అని ప్రశ్నించారు

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...