psycopk Posted November 7, 2023 Report Posted November 7, 2023 Nara Lokesh: వైసీపీ ఖాతాలోకి ఆ రూ.150 కోట్లు ఎలా వచ్చాయి?: నారా లోకేశ్ 07-11-2023 Tue 15:21 | Andhra గవర్నర్ ను కలిసిన టీడీపీ నేతలు ఏపీలో అరాచక పాలనకు అడ్డుకట్ట వేయాలని విజ్ఞప్తి 8 పేజీల సుదీర్ఘ లేఖ అందజేత చంద్రబాబును ఎలా జైలుకు పంపారో గవర్నర్ కు వివరించామన్న లోకేశ్ టీడీపీ నేతలు ఇవాళ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ను కలిసి రాష్ట్రంలో పరిస్థితులపై లేఖ సమర్పించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర, పీతల సుజాత, ఎమ్మెల్సీ అశోక్ బాబు, పార్టీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర విజయవాడలో రాజ్ భవన్ కు తరలి వెళ్లారు. గవర్నర్ కు 8 పేజీల లేఖను అందించి, రాష్ట్రంలో అరాచకాలకు అడ్డుకట్ట వేయాలని కోరారు. అనంతరం లోకేశ్ మీడియాతో మాట్లాడారు. మూడుసార్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబుపై ఆధారాల్లేక పోయినా, 17ఏ అనుమతి లేకపోయినా దొంగ కేసులు పెట్టి ఎలా సతాయించారో, జ్యుడీషియల్ రిమాండ్ కు ఎలా పంపారో గవర్నర్ కు వివరించినట్టు తెలిపారు ఇప్పుడు రూ.27 కోట్లు అంటున్నారు! స్కిల్ కేసులో తొలుత రూ.3 వేల కోట్లు అవినీతి అన్నారు, తర్వాత రూ.370 కోట్లు అన్నారు, ఇప్పుడు రూ.27 కోట్లు అంటున్నారు. అది కూడా పార్టీ అకౌంట్ లో పడ్డాయని చెప్పి ఎలా ఇబ్బంది పెట్టారో చూశాం. సామాన్య ప్రజలకు ముఖ్యమంత్రి సైకో అని అర్థమైంది, ఏ తప్పుచేయని చంద్రబాబుపై చివరకు రూ.27 కోట్లు పార్టీ అకౌంట్ కు వచ్చిందని ఆరోపణలు చేస్తున్నారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిపై రూ.27 కోట్లు అవినీతి జరిగిందని ఆరోపణలు చేస్తారు, అది కూడా ఎలక్టోరల్ బాండ్లు గురించి, ఎవరైనా వింటే నవ్విపోరా? 2014 నుంచి వైసీపీ ఖాతాలోకి రూ.150 కోట్లు ఎలా వచ్చాయి, వారికి ఎలాంటి ఖర్చులు లేవా? తప్పుడు కేసులపై న్యాయపోరాటం చేస్తాం! 17ఏ చట్టానికి 2018లో సవరణ వచ్చింది, చంద్రబాబుపై కేసు విషయంలో పర్మిషన్ తీసుకోవాల్సి ఉండగా తీసుకోలేదని గవర్నర్ కు చెప్పాం... వివరాలన్నీ తెప్పించుకుంటామని ఆయన చెప్పారు. చంద్రబాబు మధ్యంతర బెయిల్ పై ఉన్నారు, 10వ తేదీనుంచి రెగ్యులర్ బెయిల్ పై విచారణ ఉంది. తీర్పులను బట్టి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం. ఈ ప్రభుత్వంలో దొంగ కేసులు పెట్టడం ఆనవాయతీగా మారింది. రాష్టస్థాయి నుంచి గ్రామ కార్యకర్త వరకు కేసులు పెడుతున్నారు, న్యాయపోరాటం చేస్తాం. టీడీపీ కార్యకర్తలకు న్యాయసహాయం అందిస్తున్నాం, కార్యకర్తలను కాపాడాల్సిన బాధ్యత మాపై ఉంది, కాపాడుకుంటాం. ఈ వ్యవహారాలను నేను, అచ్చెన్నాయుడు వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నాం. రేపు ఎన్నికల కమిషన్ ను కలుస్తాం! రాష్ట్రంలో ఓటర్ల జాబితా అవతకతవకలపై రేపు టీడీపీ బృందం ఎన్నికల కమిషన్ ను కలుస్తుంది. ఈసీకి 6 లేఖలు ఇస్తాం, తప్పుల తడక ఓటరు లిస్టుపై ఫిర్యాదు చేస్తాం దొంగ ఓట్లపై మేం పోరాడతాం, ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళతాం. డిల్లీకి కూడా వెళ్లి పోరాటం కొనసాగిస్తాం. ముఖ్యమంత్రి ఫోటోతో కూడా దొంగ ఓటు ఉంది. రాష్ట్రంలో 2019 నుంచి రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోంది. నాయకులంతా ప్రజల్లోనే ఉన్నాం! ఎన్ని అడ్డంకులు సృష్టించినా నాయకులందరం ప్రజల్లో ఉన్నాం, బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీపై ఇంటింటికీ తిరుగుతున్నాం, ప్రతిపక్ష నేతలపై దాడులను కూడా ప్రజలకు తెలియజేస్తున్నాం. టీడీపీ-జనసేన అధికారంలోకి వచ్చాక ఏం చేస్తామో చెబుతున్నాం. జేఏసీ మీటింగ్ లో కూడా టీడీపీ సూపర్ సిక్స్ పథకాలను జనసేనకు వివరించాం... చాలా బాగున్నాయని అన్నారు, పవన్ కొన్ని అదనంగా సూచించారు. వాటిపై జేఏసీ మీటింగ్ లో చర్చిస్తాం. రాష్ట్రంలో కరవు తీవ్రంగా ఉంది, రైతాంగం తీవ్రంగా నష్టపోతోంది, పశ్చిమ ప్రాంతంలో తాగునీటికి కటకటలాడుతున్నారు, దీనిపై ఉద్యమం చేయాలని నిర్ణయించుకున్నాం అని లోకేశ్ తెలిపారు. Quote
psycopk Posted November 7, 2023 Author Report Posted November 7, 2023 Nara Lokesh: దొంగోడి నుంచి మంచి పరిపాలన ఎలా వస్తుంది సామీ!: నారా లోకేశ్ 07-11-2023 Tue 14:31 | Andhra లోకేశ్ ఆధ్వర్యంలో గవర్నర్ ను కలిసిన టీడీపీ బృందం గవర్నర్ కు 8 పేజీల లేఖ అందజేత గవర్నర్ తో దాదాపు గంటకు పైగా భేటీ రాష్ట్రంలో పరిస్థితులను గవర్నర్ కు వివరించిన లోకేశ్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిశారు. పార్టీ నేతలతో కలిసి విజయవాడలోని రాజ్ భవన్ కు వెళ్లిన నారా లోకేశ్ గవర్నర్ కు 8 పేజీల లేఖను అందించారు. అందులో చంద్రబాబు సహా ఇతర టీడీపీ నేతలపై ఇప్పటివరకు నమోదు చేసిన కేసుల వివరాలు కూడా ఉన్నాయి. ఏపీలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని లోకేశ్ గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. గవర్నర్ తో దాదాపు గంటకు పైగా సమావేశమైన లోకేశ్ రాష్ట్రంలోని పరిస్థితులను సమగ్రంగా వివరించారు. వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని, ప్రజల పక్షాన గొంతుక వినిపిస్తున్న టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతూ, జైళ్లకు పంపుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు పెట్టిన ఏ ఒక్క కేసులోనూ ఆధారాలు లేవని, ఆయనను ఎన్నికల్లో పాల్గొనకుండా అడ్డుకోవాలన్నదే వారి కుట్ర అని లోకేశ్ గవర్నర్ కు వివరించారు. రాష్ట్రంలో రాజ్యాంగ విరుద్ధ పాలన జరుగుతోందని వెల్లడించారు. గవర్నర్ ను కలిసిన అనంతరం లోకేశ్ మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబును ఏ ఆధారాలు లేకపోయినా అన్యాయంగా 53 రోజులు జైల్లో ఉంచిన వైనాన్ని గవర్నర్ కు వివరించామని తెలిపారు. అంతేకాదు, చంద్రబాబు అరెస్ట్ వేళ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ను రాష్ట్రానికి రానివ్వకుండా అడ్డుకున్న వైనాన్ని కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. రాష్ట్రంలో దళితులపై దాడి ఘటనలను కూడా గవర్నర్ కు వివరించామని అన్నారు. కక్ష సాధింపు రాజకీయాలకు అడ్డుకట్ట వేసేలా రాజ్యాంగంలోని ఆర్టికల్ 355 అనుసరించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరామని లోకేశ్ వెల్లడించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పైనా లోకేశ్ విమర్శనాస్త్రాలు సంధించారు. ఓ మహిళ పేరుతో సీఎం ఫొటోతో ఓటు ఉన్న విషయాన్ని లోకేశ్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఆయన ఫొటోలపైనే దొంగ ఓట్లు ఉన్నాయంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. 38 కేసుల్లో బెయిల్ పై తిరుగుతున్న దొంగోడు దొంగ పనులు కాక ఇంకేం చేస్తాడని ఎద్దేవా చేశారు. దొంగోడి నుంచి మంచి పరిపాలన ఆశిస్తున్నారా... భలేవాడివి సామీ అంటూ ఓ విలేకరిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సొంత బాబాయ్ ని లేపేసిన వ్యక్తి జగన్... అందులో ఎలాంటి సందేహం లేదని అన్నారు. అవినాశ్ రెడ్డిని కాపాడేందుకు సీబీఐని రాష్ట్రానికి రాకుండా చేశారని లోకేశ్ ఆరోపించారు. కాగా, లోకేశ్ తో పాటు గవర్నర్ ను కలిసిన వారిలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రులు పీతల సుజాత, కొల్లు రవీంద్ర, పార్టీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర, ఎమ్మెల్సీ అశోక్ బాబు ఉన్నారు. Quote
psycopk Posted November 7, 2023 Author Report Posted November 7, 2023 Kanna Lakshminarayana: ఈసారి గెలిస్తే రాష్ట్రాన్ని అమ్మేయాలని చూస్తున్నారు: జగన్ పై కన్నా ఫైర్ 07-11-2023 Tue 16:42 | Andhra జగన్ వల్ల ఇప్పటికే ఆస్తులు పోయాయన్న కన్నా 2019లో మోసం చేసి గెలిచారని విమర్శ ఓటర్ల జాబితాలో అవకతవకలు చేసి గెలవాలనుకుంటున్నారని వ్యాఖ్య ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ వల్ల ఇప్పటికే హైదరాబాద్ లో మన ఆస్తులు పోయాయని మండిపడ్డారు. ఈ సారి ఎన్నికల్లో గెలిస్తే ఏపీని కేసీఆర్ కు అమ్మేద్దామని జగన్ చూస్తున్నారని విమర్శించారు. 2019 ఎన్నికల్లో ప్రజలను మోసం చేసి జగన్ గెలిచారని చెప్పారు. తమనే కాకుండా ఎన్నికల్లో గెలిచిన తర్వాత రాష్ట్రాన్ని కూడా జగన్ మోసం చేశారనే విషయాన్ని ప్రజలు గమనించారనే... ఓటర్ల జాబితాలో అవకతవకలు చేసి గెలవాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. నాగార్జునసాగర్ ఎడమ కాలువ ద్వారా 40 రోజులుగా తెలంగాణకు నీరు వెళ్తోందని... అయినా జగన్ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఎన్జీ రంగా 123వ జయంతి సందర్భంగా గుంటూరు బృందావన్ గార్డెన్స్ లో ఆయన విగ్రహం వద్ద టీడీపీ నేతలు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కన్నా పైవ్యాఖ్యలు చేశారు. Quote
reality Posted November 7, 2023 Report Posted November 7, 2023 13 minutes ago, ARYA said: visionary bayatiki ragane simham joolu vidulusthundhi gaa 🦁 Quote
Guest Posted November 7, 2023 Report Posted November 7, 2023 30 minutes ago, psycopk said: Nara Lokesh: వైసీపీ ఖాతాలోకి ఆ రూ.150 కోట్లు ఎలా వచ్చాయి?: నారా లోకేశ్ 07-11-2023 Tue 15:21 | Andhra గవర్నర్ ను కలిసిన టీడీపీ నేతలు ఏపీలో అరాచక పాలనకు అడ్డుకట్ట వేయాలని విజ్ఞప్తి 8 పేజీల సుదీర్ఘ లేఖ అందజేత చంద్రబాబును ఎలా జైలుకు పంపారో గవర్నర్ కు వివరించామన్న లోకేశ్ టీడీపీ నేతలు ఇవాళ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ను కలిసి రాష్ట్రంలో పరిస్థితులపై లేఖ సమర్పించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర, పీతల సుజాత, ఎమ్మెల్సీ అశోక్ బాబు, పార్టీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర విజయవాడలో రాజ్ భవన్ కు తరలి వెళ్లారు. గవర్నర్ కు 8 పేజీల లేఖను అందించి, రాష్ట్రంలో అరాచకాలకు అడ్డుకట్ట వేయాలని కోరారు. అనంతరం లోకేశ్ మీడియాతో మాట్లాడారు. మూడుసార్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబుపై ఆధారాల్లేక పోయినా, 17ఏ అనుమతి లేకపోయినా దొంగ కేసులు పెట్టి ఎలా సతాయించారో, జ్యుడీషియల్ రిమాండ్ కు ఎలా పంపారో గవర్నర్ కు వివరించినట్టు తెలిపారు ఇప్పుడు రూ.27 కోట్లు అంటున్నారు! స్కిల్ కేసులో తొలుత రూ.3 వేల కోట్లు అవినీతి అన్నారు, తర్వాత రూ.370 కోట్లు అన్నారు, ఇప్పుడు రూ.27 కోట్లు అంటున్నారు. అది కూడా పార్టీ అకౌంట్ లో పడ్డాయని చెప్పి ఎలా ఇబ్బంది పెట్టారో చూశాం. సామాన్య ప్రజలకు ముఖ్యమంత్రి సైకో అని అర్థమైంది, ఏ తప్పుచేయని చంద్రబాబుపై చివరకు రూ.27 కోట్లు పార్టీ అకౌంట్ కు వచ్చిందని ఆరోపణలు చేస్తున్నారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిపై రూ.27 కోట్లు అవినీతి జరిగిందని ఆరోపణలు చేస్తారు, అది కూడా ఎలక్టోరల్ బాండ్లు గురించి, ఎవరైనా వింటే నవ్విపోరా? 2014 నుంచి వైసీపీ ఖాతాలోకి రూ.150 కోట్లు ఎలా వచ్చాయి, వారికి ఎలాంటి ఖర్చులు లేవా? తప్పుడు కేసులపై న్యాయపోరాటం చేస్తాం! 17ఏ చట్టానికి 2018లో సవరణ వచ్చింది, చంద్రబాబుపై కేసు విషయంలో పర్మిషన్ తీసుకోవాల్సి ఉండగా తీసుకోలేదని గవర్నర్ కు చెప్పాం... వివరాలన్నీ తెప్పించుకుంటామని ఆయన చెప్పారు. చంద్రబాబు మధ్యంతర బెయిల్ పై ఉన్నారు, 10వ తేదీనుంచి రెగ్యులర్ బెయిల్ పై విచారణ ఉంది. తీర్పులను బట్టి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం. ఈ ప్రభుత్వంలో దొంగ కేసులు పెట్టడం ఆనవాయతీగా మారింది. రాష్టస్థాయి నుంచి గ్రామ కార్యకర్త వరకు కేసులు పెడుతున్నారు, న్యాయపోరాటం చేస్తాం. టీడీపీ కార్యకర్తలకు న్యాయసహాయం అందిస్తున్నాం, కార్యకర్తలను కాపాడాల్సిన బాధ్యత మాపై ఉంది, కాపాడుకుంటాం. ఈ వ్యవహారాలను నేను, అచ్చెన్నాయుడు వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నాం. రేపు ఎన్నికల కమిషన్ ను కలుస్తాం! రాష్ట్రంలో ఓటర్ల జాబితా అవతకతవకలపై రేపు టీడీపీ బృందం ఎన్నికల కమిషన్ ను కలుస్తుంది. ఈసీకి 6 లేఖలు ఇస్తాం, తప్పుల తడక ఓటరు లిస్టుపై ఫిర్యాదు చేస్తాం దొంగ ఓట్లపై మేం పోరాడతాం, ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళతాం. డిల్లీకి కూడా వెళ్లి పోరాటం కొనసాగిస్తాం. ముఖ్యమంత్రి ఫోటోతో కూడా దొంగ ఓటు ఉంది. రాష్ట్రంలో 2019 నుంచి రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోంది. నాయకులంతా ప్రజల్లోనే ఉన్నాం! ఎన్ని అడ్డంకులు సృష్టించినా నాయకులందరం ప్రజల్లో ఉన్నాం, బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీపై ఇంటింటికీ తిరుగుతున్నాం, ప్రతిపక్ష నేతలపై దాడులను కూడా ప్రజలకు తెలియజేస్తున్నాం. టీడీపీ-జనసేన అధికారంలోకి వచ్చాక ఏం చేస్తామో చెబుతున్నాం. జేఏసీ మీటింగ్ లో కూడా టీడీపీ సూపర్ సిక్స్ పథకాలను జనసేనకు వివరించాం... చాలా బాగున్నాయని అన్నారు, పవన్ కొన్ని అదనంగా సూచించారు. వాటిపై జేఏసీ మీటింగ్ లో చర్చిస్తాం. రాష్ట్రంలో కరవు తీవ్రంగా ఉంది, రైతాంగం తీవ్రంగా నష్టపోతోంది, పశ్చిమ ప్రాంతంలో తాగునీటికి కటకటలాడుతున్నారు, దీనిపై ఉద్యమం చేయాలని నిర్ణయించుకున్నాం అని లోకేశ్ తెలిపారు. Ekkada kuda assalu Scam e jaragaledu....Maku nishpakshpathamga vicharana jarapaali...kendraprabhutwa samsthalaki case badalayinchandi ani maatram anaru...! Enthasepatiki Governor permission teesukoledu, ChaBaNa ki Charma Vyaadhi....Kudi Kannu ki Cataract vacchindi....edam kannu meeda eega valindi ani cheppi health grounds meeda bail tecchukunnaru...Inthaki BJP loki eppudu merging? Quote
jaathiratnalu2 Posted November 7, 2023 Report Posted November 7, 2023 Anna weekend ippudu chestunnavu ,, Payment late ayete work cheya Anu cheppu bro @psycopk Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.