Jump to content

TDP - PPT - Become Best Panchayat win 50L - 1CR cash prize - Young Leader LOKESH


ARYA

Recommended Posts

Image may contain: 3 people, people smiling

 

గ్రామాల అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు రూపకల్పన చేసిన 7 స్టార్ కార్యక్రమాలను అత్యుత్తమంగా నిర్వహించిన మొదటి 100 గ్రామ పంచాయితీలకు 50 లక్షల నుండి కోటి రూపాయల వరకు నగదు ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందించనుందని పంచాయతీ రాజ్ మంత్రి నారా లోకేష్ తెలిపారు. 
గత ప్రభుత్వం 2006 నుండి 2014 వరకు 8 సంవత్సరాలలో కేవలం 18,000 కోట్ల రూపాయలు మాత్రమే ఉపాధి హామీ కింద ఖర్చు చేసింది. ఈ పథకం కింద రాష్ట్రానికి కేంద్రం కేటాయించిన నిధులను ఉపయోగించుకోలేని పాలకుల అలసత్వం, అసమర్థత, నిర్లక్ష్యం వల్ల రూ.4,500 కోట్లు తిరిగి కేంద్రం ఖాతాలోకి వెళ్లిపోయాయి. అదే 2014 తర్వాత చంద్రబాబు ప్రభుత్వంలో ఇప్పటివరకు రూ.20,000 కోట్ల ఉపాధి హామీ నిధులను ఉపయోగించుకుని గ్రామాలను అభివృద్ధి చేయడం జరిగింది. 
ఇదే విషయాన్ని చెబుతూ ఉపాధి హామీ పనులలో 75% కన్నా తక్కువ పురోగతి కనబడితే అలాంటి ఫీల్డ్ అసిస్టెంట్ లపై కఠిన చర్యలు తప్పవని లోకేష్ హెచ్చరించారు. 
ఉపాధి హామీ పథకం కింద గ్రామాలలో వర్మీ కంపోస్ట్ యూనిట్లు, ఘన వ్యర్థాల నిర్వహణ, వ్యవసాయ సంబంధిత పనులు చేపట్టి శ్రామికులకు పని కల్పించాలని అన్నారు. ఎస్సీ కాలనీల నుండి మొదలుపెట్టి గ్రామాలలో సిమెంట్ కాంక్రీట్ రోడ్లు, వీధి దీపాల ఏర్పాటు కార్యక్రమాలను చేపట్టాలని ఆదేశించారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...