Jump to content

Greater Guntur


SonyKongara

Recommended Posts

గ్రేటర్ గుంటూర్ ?
17-10-2017 08:28:09
 
636438256894190694.jpg
  •  కార్పొరేషన్‌ పరిధిలో 39 గ్రామాలు
  •  8 మండలాలు గుంటూరు పరిధిలోకి
  •  రద్దు అవనున్న రూరల్‌ మండలం
  •  గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన సీఎం చంద్రబాబు
  •  విజయవాడతో పాటు గుంటూరుపై దృష్టి
జంట నగరాలు
నవ్యాంధ్ర రాజధానిలో గుంటూరు - విజయవాడ జంట నగరాలుగా అభివృద్ధి చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. ఇప్పటికే స్మార్ట్‌ సిటీ పథకంలో ఈ రెండు నగరాలకు కేంద్రం రూ.2 వేల కోట్లు మంజూరు చేసింది. హైదరాబాద్‌కు దీటుగా జంట నగరాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. 
గుంటూరు గ్రామం.. మున్సిపాలిటీగా ఏర్పడి 150 ఏళ్లు అవుతుంది. ఉత్సవాలకు సిద్ధమవుతున్న తరుణంలో గ్రేటర్‌ గుం టూరుగా రూపాంతరం చెందనున్నది. ఈ మేరకు గుంటూరు కార్పొరేషన్‌లో ఎనిమిది మండలాల పరిధిలోని 39 గ్రామాలను విలీనం అవనున్నాయి. గుంటూరు రూరల్‌ మండలం పూర్తిగా కనుమరుగవనున్నది. ఈ మేరకు సీఎం చంద్రబాబు నుంచి మౌఖిక ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది. ఆయా పంచాయతీల్లో స్థానిక ప్రజాప్రతినిధుల పదవీ కాలం పూర్తి అయిన తర్వాత వాటిని నగరపాలక సంస్థలో కలుపుతారు. ఈ మేరకు అధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
 
ఆంధ్రజ్యోతి - గుంటూరు: గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో 8 మండలాల పరిధిలోని 39 గ్రామాలను విలీనం చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలో ఆకస్మిక పర్యటన నిర్వహించిన సమయంలో 45 పంచాయతీలను నగరపాలక సంస్థలో కలపాలని ఆదేశాలు ఇచ్చారు. గుంటూరు చుట్టుపక్కల ఉన్న 8 మండలాల్లోని 39 గ్రామాలను కార్పొరేషన్‌ పరిధిలో చేర్చాలనే ప్రతిపాదనలు వచ్చాయి. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు అధికారులు క్షేత్ర స్థా యిలో వివరాలు సేకరిస్తున్నారు. తాడికొండ, మేడికొండూరు, ఫిరంగిపురం, వట్టిచెరుకూరు, ప్రత్తిపాడు, చేబ్రోలు, పెదకాకాని, గుంటూరు మండలాల పరిధిలో 39 గ్రామాలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న గుంటూరు మండలాన్ని పరిగణలోకి తీసుకొని 8-12 కిలో మీటర్లలో అందు బాటులో ఉన్న గ్రామాలను గ్రేటర్‌ పరిధిలోకి తీసుకువచ్చేందుకు అధికారులు పరిశీలిస్తున్నా రు. ప్రధానంగా గుంటూరు - సత్తెనపల్లి వయా పేరేచర్ల, గుంటూరు - ఫిరంగిపురం, గుంటూరు - చిలకలూరిపేట, గుంటూరు - ప్రత్తిపాడు, గుంటూరు - పొన్నూరు, గుంటూరు - విజయవాడ వయా మంగళగిరి, గుంటూరు - తాడికొండ రహదారులను పరిగణలోకి తీసుకున్నా రు. గుంటూరు మండలంలోని గొర్లవారిపాలెం ను ప్రాతిపదికగా తీసుకొని అక్కడి నుంచి దా మరపల్లి, గరికపాడు, పొన్నెకల్లును విలీనం చేయాలని ప్రతిపాదించారు. గుంటూరు నుంచి రెడ్డిపాలెంను పరిగణలోకి తీసుకొని అక్కడి నుంచి పూర్వం కాలిబాటతో ఉన్న రైల్వే క్రాసింగ్‌ ఉన్న కంతేరును నగరపాలక సంస్థలో కలపాలని నిర్ణయించినట్లు తెలిసింది. నగరపాలక సంస్థ గ్రేటర్‌ గుంటూరుగా రూపాంతరం చెందితే రూరల్‌ మండలం రద్దు అవుతుంది. ఇప్పటికే గుంటూరు మండలంలోని సుమారు 10 గ్రామాల వరకు నగరపాలక సంస్థలో విలీనం అయ్యాయి. మిగిలిన అన్ని గ్రామాలను దీనిలో విలీనం చేయాలని ప్రతిపాదించారు.
 
జంట నగరాలుగా గుంటూరు - విజయవాడ
ముఖ్యమంత్రి నవ్యాంధ్ర రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలని భావిస్తున్నారు. దానికి అనుగుణంగా గుంటూ రు - విజయవాడ జంట నగరాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రాజధాని అమరావతితో విజయవాడ కేంద్రంగా అనేక రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు కొలువు తీరాయి. విజయవాడ పరిసర ప్రాంతాల్లోని 45 గ్రామాలు అక్కడ చేరబోతున్నాయి. విజయవాడకు ధీటుగా ఇటువైపు గుంటూరును అభివృద్ధి చేయాలని సీఎం నిర్ణయించారు. అటు విజయవాడ - ఇటు గుంటూరు అభివృద్ధి చెందితే మధ్యలో మంగళగిరి, తాడికొండ, తాడేపల్లి, పాత అమరావతి ప్రాంతాలు కలిసి పోనున్నాయి. ఈ ప్రాంతాల్లో ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఎయిమ్స్‌ వంటి సంస్థలు నిర్మాణంలో ఉన్నాయి. వీటితో పాటు ఇప్పటికే తాత్కాలిక రాజధాని, తాత్కాలిక అసెంబ్లీ కార్యకలాపాలు ప్రారంభం కావడంతో గుంటూరు - విజయవాడ ప్రాంతాల్లో రాకపోకలు పెరిగాయి. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని విజయవాడతో పాటు గుంటూరు కూడా అభివృద్థి చేయాలని ముఖ్య మంత్రి నిర్ణయించినట్లు తెలిసింది. ఈ మేరకు గుంటూరు, పరిసర ప్రాంతాల్లోని గ్రామాలపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.
 
పదవీ కాలం పూర్తి అయిన తరువాతనే....
ప్రస్తుతం గ్రామాల్లో ఉన్న సర్పంచ్‌లు, వార్డు సభ్యుల పదవి కాలం 2018 మే - ఆగస్టులో పూర్తి అవుతుంది. అదేవిధంగా ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీల పదవీ కాలం 2019 మేతో పూర్తి అవుతుంది. ఈ లోపు విజయవాడ - గుంటూరులో కలిసే పంచాయతీల పూర్తి వివరాల సర్వేను పూర్తి చేస్తారు. పదవీ కాలం పూర్తి అయిన ఆ పంచాయతీలను నగరపాలక సంస్థలో కలుపుతారు. ఈ మేరకు అధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నారు.
 
పంచాయతీ కార్యాలయాలే డివిజన్‌ కేంద్రాలు
కొత్తగా కలిసే గ్రామాలలో ప్రస్తుతం ఉన్న పంచాయతీ, మండల పరిషత్‌ కార్యాలయాలు ఇక నుంచి గ్రేటర్‌ గుంటూరు పరిధిలోని డివిజన్‌, నగరపాలక సంస్థ కార్యాలయాలుగా మారతాయి. నగరపాలక సంస్థలో ఇప్పటి వరకు గుంటూరు తూర్పు, పశ్చిమ, ప్రత్తిపాడు ఎమ్మెల్యే ఎక్స్‌ అఫిషియో మెంబర్లుగా ఉన్నారు. గ్రేటర్‌ గుంటూరుగా మారితే తాడికొండ, పొన్నూరు ఎమ్మెల్యేలు కూడా నగరపాలక సంస్థలో ఎక్స్‌ అఫిషియో మెంబర్లుగా చేరుతారు.
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...