Jump to content

130 కోట్ల ప్రజల భవిష్యత్తు తిరగరాసేది కేవలం ఇద్దరు వ్యక్తులా ?


walter18

Recommended Posts

ఎంతో ముందు‌చూపు ఆలోచనతో సుష్మాస్వరాజ్ చేత సోనియా తో మంతనాలు జరిపి రాష్ట్ర విభజనకు సహకరించి ,ఇక్కడ తెలుగుదేశం నాయకుడితో పొత్తు అంటూనే రాష్ట్రం లోని ప్యాక్షన్ ప్రతిపక్ష నాయకుడితో రాజకీయ వ్యభిచార సంబంధం పెట్డుకుని , పనికట్డుకుని‌ ఆంధ్రప్రదేశ్ ని నాశనం చేస్తున్న వాళ్ళు నాయకులా ? వినాయకులా ,వీళ్ళు రాముడు ,కృష్ణుడు వారసులా ? వాళ్ళ పేర్లు ఉచ్చరించి హిందుల పరువు తీస్తున్నారు . ఇతర మతాల వాళ్ళు నవ్వు తున్నారు వాళ్ళు ఇన్ని తప్పులు చేసినా ఏడి మీ రాముడు ? అని ,నిజానికి కలియుగంలో దేముడి చర్యలు ప్రత్యక్షంగా కనబడవు . కనబడితే వీళ్ళకి తగిన శాస్తి జరిగేదే . కాకపోతే అనుభవిస్తారు .తప్పనిసరిగా కాలమే నిర్ణయించాలి. దేశంలో అన్ని రాష్ట్రాలలో రాజకీయ అస్తిరత కలగజేసి ,రాజకీయంగా ,ఆర్దికంగా అన్ని రాష్ట్రాలను కుంగదీసి దేశ వ్వవస్థ ను పాడు చేస్తున్నారు .పోనీ రాజకీయంగా ధర్మయుధ్ధం చెస్తున్నారా ? అంటే అంతా అధర్మ యుద్దమే , అన్ని స్వతంత్ర వ్యవస్థ లను వారి చేతిలోకి తీసుకుని బెదిరించి పరిపాలించడం గొప్పతనమా ? ప్రేమా అభిమానం తో పరిపాలించడం గొప్పతనమా ? సరిగ్గా వారికి గెలుపు అవసరమైన ఎలక్షన్ వచ్చినప్పుడే " సర్జికల్ స్టైక్ " లాంటి‌ సంఘటనలు జరుగుతయ్ , తమిళనాడులో శశికళ శాసనసభ నేతగా ఎన్నికవగానే నెలరోజుల పాటు గవర్నర్ చేత పదవి ఇవ్వకుండా ఆపించారు ,వెంటనే సీల్డ్ కవరులో ఉన్న ఆమెతీర్పు బయటకు వస్తుంది .అంటే న్యాయ వ్యవస్థ ని కూడా వీరి చేతిలోకి తీసుకుంటారా ? అదే జగన్ విషయంలో ఎందుకు చేయడం లేదు ఆయనకు వీళ్ళకు ఉన్న తెరచాటు ఒప్పందాలు ఏమిటి‌? తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్లో 40 లక్షల ఓట్లు తీసేసి ఎలక్షన్ జరిపి, ఎలక్షన్ కమీషనర్ సారీ చెబితే అది ప్రజాస్వామ్యమా? ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్ని నియోజకవర్గాలలో ఓట్ల సంఖ్య సరిపోలింది ?వీళ్ళు నిష్పక్షపాతంగా ‌ఎలక్షన్ జరిపితే VV పాడ్లు లెఖ్ఖించమని అన్ని పార్టీలు అడిగినప్పుడు వీళ్ళు ఎందుకు సమర్దించలేదు ? సారస్వతిక ఎలక్షన్ల ముందు రాజస్థాన్ లో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో మంచి మెజారిటీతో గెలిచిన‌ కాంగ్రెస్ కి ,ఆరునెలల తరువాత జరిగిన సారస్వతిక ఎలక్షన్లో ఒక్క పార్లమెంటు సీటు కూడా రాక పోవడానికి ? కారణం ఏమిటి‌.? ఆ " ప్రశాంత్ కిషోర్ " లాంటి వాళ్ళ చేత దేశాన్ని కులాలు ,మతాలు ,గ్రూపులుగా చీల్చి చండాడి ,తరువాత దేశాన్ని ఏం చేద్దామనుకుంటున్నారు ? రాపెల్ విమానాల కేసులో సుప్రీంకోర్టు అడిగిన పేపర్లు ఎందుకు కనపడలేదు ? కేసు కొట్టేసిన తరువాత ఎందుకు కనపడినయ్ ? ప్రాన్స్ లోని ఇండియా కార్యాలయంలో రాపెల్ కాగితాలు ఎందుకు కాలిపోయినయ్ ,? ఒక్క వాహన కంపెనీ కూడాలేని అనీల్ అంబానికి ఏకంగా రాపెల్ విమానాల విడిభాగాల అర్డర్ ఎలా వచ్చింది ? నోట్లరద్దు చేస్తున్నాం లక్షల కోట్లు నల్ల ధనం బయటకు తీస్తున్నాం అని చెప్పి ఒక్క రూపాయి రాలేదని రిజర్వ్ బ్యాంక్ చెప్పింది ,ఏతా వాతా జరిగిందేంటంటే వందల మంది రిటైర్డ్ వృద్దులు ATM క్యూలో చనిపోయారు ,కనీసం వాళ్ళమీద జాలి చూపించి ఎక్స్గ్ గ్రేషియా అన్నా ఇవ్వలా ,ప్రాణాలు విలువ వాళ్ళకు అంత చులకన , అమరావతి లో ఇప్పటికి 50 మంది చనిపోయారు, రాముడు చేసిన అశ్వమేధం" అనిచెప్పి నమ్మిస్తూ " నరమేధం " చేసి అన్ని రాష్ట్రాలలో పెత్తనం చేయాలనుకుంటున్నారు .ఒక దురాలవాటు సమాజంలోకి చొప్పించడం తేలికే దాన్ని తీసివేయాలంటే విళ్ళవల్ల కాదు. ఎవరి వల్లా కాదు తండ్రి " బీరు " తాగితే కొడుకు " విస్కీ " తాగడని గారంటీ ఏమిటి ? తరువాత ఆ కుటుంబం పరిస్థితి ఏంటి ? ఇదేనా ఒక కుడుంబాన్ని అభివృద్ధి చేసేపద్దతి‌ .మీరు ఈ విషయాలలో డిగ్రీ చేస్తే తరువాత PG చేసిన వాడు వస్తే దేశ పరిస్థితి ఏంటి ? మీ పరిపాలనలో ఒక్క విషయంలో‌ పారద్శకత ఉందా ? మీలాగే ఇంతకుముందు‌పరిపాలించిన‌వాళ్ళు చేసి వుంటే మీరు ఎక్కడ ఉండే వాళ్ళు ? ముఖ్యంగా వీరి ఆదేశాలను పాటిస్తున్న స్వతంత్ర సంస్తల అధిపతులు ,వారు ఇలాంటి పాలకుల పాలనలోనే ఈ పదవిలోకి వచ్చారా ? తరువాత మీ పిల్లల పరిస్తితి ఏమిటి ? 130 కోట్ల ప్రజల భవిష్యత్తు తిరగరాసేది కేవలం ఇద్దరు వ్యక్తులా ? ఇంత విశాల భారతదేశంలో ఇంక ఎవరూ లేరా ?

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...