Jump to content

Vemireddy Prabhakar Reddy: పార్లమెంటు ఎన్నికల వేళ వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు.. రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి గుడ్‌బై! 


psycopk

Recommended Posts

Vemireddy Prabhakar Reddy: పార్లమెంటు ఎన్నికల వేళ వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు.. రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి గుడ్‌బై! 

21-02-2024 Wed 12:03 | Andhra
  • ఇప్పటికే పార్టీని వీడిన ముగ్గురు ఎమ్మెల్యేలు
  • నెల్లూరు నగర సమన్వయకర్తగా ఎండీ ఖలీల్ నియామకం
  • తనకు కనీస సమాచారం లేదని మనస్తాపం
  • నేడో, రేపో పార్టీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా
 
YCP MP And Nellore Party Chief Vemireddy Prabhakar Reddy Ready To Quit

లోక్‌సభ ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్‌బై చెప్పగా, తాజాగా రాజ్యసభ సభ్యుడు, వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పార్టీ వీడేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల నెల్లూరు నగర సమన్వయకర్తగా ఎండీ ఖలీల్‌ను జగన్ నియమించారు. ఈ విషయంలో తనకు కనీస సమాచారం కూడా ఇవ్వకపోవడంతో వేమిరెడ్డి మనస్తాపానికి గురయ్యారు. అప్పటి నుంచి ఆయన వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. 

ఈ నేపథ్యంలో పార్టీని వీడాలని వేమిరెడ్డి నిర్ణయించుకున్నట్టు తెలిసింది. నేడో, రేపో వైసీపీ జిల్లా అధ్యక్ష పదవితోపాటు రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. అనంతరం భవిష్యత్తు రాజకీయ కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉందని ఆయన అనుచరులు తెలిపారు. కాగా, రానున్న ఎన్నికల్లో వైసీపీ తరపున నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీచేస్తానని గతంలో వేమిరెడ్డి ప్రకటించారు. అయితే, ఆ తర్వాత పరిణామాలు శరవేగంగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో తనకు టికెట్ దక్కే అవకాశం లేదని భావించి పార్టీ మార్పుకు సిద్ధమైనట్టు ఆయన సన్నిహిత వర్గాల సమాచారం. 

 

Link to comment
Share on other sites

Vemireddy Prabhakar Reddy: వైసీపీకి రాజీనామా చేసిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి 

21-02-2024 Wed 15:49 | Andhra
  • నెల్లూరు జిల్లాలో వైసీపీకి మరో వికెట్ డౌన్
  • వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన వేమిరెడ్డి
  • రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపిన వైనం
  • రాజ్యసభ సభ్యత్వానికి, వైసీపీ జిల్లా అధ్యక్ష పదవికి కూడా రాజీనామా 
 
MP Vemireddy Prabhakar Reddy resigns to YSRCP

వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీని వీడారు. రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న వేమిరెడ్డి నేడు వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు సీఎం జగన్ కు పంపించారు.

అంతేకాదు, నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్ష పదవికి కూడా వేమిరెడ్డి గుడ్ బై చెప్పేశారు. దాంతోపాటే, రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా తాను వదులుకుంటున్నానని వేమిరెడ్డి స్పష్టం చేశారు. వ్యక్తిగత కారణాలతో వైసీపీ నుంచి తప్పుకుంటున్నానని, తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని సీఎం జగన్ ను కోరారు. 

గత ఎన్నికల సమయంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసీపీ ఎంతో బలంగా ఉంది. అయితే, గత కొన్నాళ్లుగా జిల్లా వైసీపీలో అసంతృప్తి జ్వాలలు భగ్గుమంటున్నాయి. ఇప్పటికే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి వైసీపీని వదిలి, టీడీపీకి దగ్గరయ్యారు. ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా పార్టీ నుంచి తప్పుకోవడం నెల్లూరు జిల్లాలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బగానే భావించాలి. 

ఇటీవల నెల్లూరు సిటీ కోఆర్డినేటర్ మహ్మద్ ఖలీల్ ను నియమించే సమయంలో వేమిరెడ్డితో మాటమాత్రం చెప్పలేదని తెలుస్తోంది. అప్పటి నుంచి వైసీపీ కార్యకలాపాలకు వేమిరెడ్డి పెద్దగా హాజరు కావడంలేదు. 

వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ, అభ్యర్థుల నియోజకవర్గాల మార్పులు చేర్పుల అంశంలో ఆయన అభిప్రాయం తీసుకోకపోవడం మద్దతుదారుల్లోనూ అసంతృప్తిని రగిల్చిందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తన మద్దతుదారులతో చర్చించిన అనంతరం వేమిరెడ్డి రాజీనామా నిర్ణయం తీసుకున్నారు.

Link to comment
Share on other sites

Somireddy Chandra Mohan Reddy: వేమిరెడ్డి దంపతులను టీడీపీలోకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం: సోమిరెడ్డి 

21-02-2024 Wed 17:27 | Andhra
  • నెల్లూరు జిల్లా రాజకీయాల్లో నేడు కీలక పరిణామం
  • వైసీపీకి గుడ్ బై చెప్పిన రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
  • వీడియో సందేశం వెలువరించిన సోమిరెడ్డి
 
Somireddy welcomes Vemireddy into TDP

నెల్లూరు జిల్లా రాజకీయాల్లో నేడు కీలక పరిణామం చోటుచేసుకుంది. రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత కాసేపటికే టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఓ వీడియో సందేశం వెలువరించారు. వేమిరెడ్డి దంపతులకు టీడీపీ ఆహ్వానం పలుకుతోందని తెలిపారు. 

"రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు కొద్దిసేపటి కిందటే వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడం చూశాం. నాకు అర్థమైంది ఏంటంటే... వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పది రూపాయలు దానం చేసేవాడు, పది మందికీ సాయపడేవాడు. వీపీఆర్ కన్వెన్షన్ పక్కన పేద పిల్లల కోసం చక్కని స్కూలు కట్టించాడు. ఒక్క రూపాయి తీసుకోకుండా చదువుకునే అవకాశం కల్పిస్తున్నాడు. 

దేవాలయాలకు దానధర్మాలు, జిల్లా అంతటా మంచినీటి ప్లాంట్లతో విరివిగా సేవలు అందిస్తుంటారు. ఆయనేమీ కుట్రలు, కుతంత్రాలు తెలిసిన సగటు రాజకీయ నాయకుడు కాదు. అటువంటి వ్యక్తి వైసీపీలో ఇమడలేకపోయాయడంటే ఆ పార్టీ పోకడ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 

రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి ఎలా ఉన్నాడో, జిల్లాలో మంత్రులు కూడా అదే తీరున ఉన్నారు. అందుకే వేమిరెడ్డి పార్టీకి రాజీనామా చేశాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రాన్ని పునర్ నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉంది. 

రాష్ట్రంలో టీడీపీ-జనసేన కూటమి అధికారంలోకి వస్తుంది. ఈ నేపథ్యంలో, వేమిరెడ్డి దంపతులు ఇద్దరూ టీడీపీలోకి రావాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం" అంటూ సోమిరెడ్డి తన వీడియో సందేశంలో పేర్కొన్నారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...