Jump to content

వెండితెరపై తండ్రీకొడుకులు


Adhinayakudu

Recommended Posts

[color=#282828][size=4]
ఆమధ్య ప్రకాష్ రాజ్, త్రిష ప్రధాన పాత్రల్లో 'ఆకాశమంత', నాగార్జున ప్రధాన పాత్రలో 'గగనం' వంటి చిత్రాలను రూపొందించిన తమిళ దర్శకుడు రాధామోహన్ తన తదుపరి చిత్రానికి స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నారు. ఇందులో అక్కినేని నాగచైతన్య కథానాయకుడుగా నటిస్తాడు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందే ఈ చిత్రాన్ని వచ్చే నెలలో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనికి 'గౌరవం' అనే టైటిల్ కూడా రిజిస్టర్ చేశారు. కాగా, ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున ఓ స్పెషల్ క్యారెక్టర్ పోషిస్తారని తెలుస్తోంది. ఆ పాత్రను దర్శకుడు చాలా పవర్ ఫుల్ గా తీర్చిదిద్దాడట. అయితే, నిజజీవితంలో తండ్రీకొడుకులైన నాగ్, చైతన్య ఇందులో కూడా అవే పాత్రలు పోషిస్తారా? లేక అన్నదమ్ములుగానా? లేక ఈ పాత్రల మధ్య అసలు బందుత్వమే ఉండదా? అన్న విషయాలు తెలియాల్సి వుంది. [/size][/color]

Link to comment
Share on other sites

×
×
  • Create New...