Jump to content

మానవ రహిత కార్లకు హైదరాబాద్లో పరీక్షలు! 40 ఎకరాల్లో టెస్టింగ్ ట్రాక్, ఇతర సదుపాయాలు


kevinUsa

Recommended Posts

 
4business-news1a.jpg

ఈనాడు - హైదరాబాద్‌ : మానవ రహిత కార్లు, ఇతర వాహనాలు, వాటిలో వినియోగించే అనుసంధాన, ఇంటెలిజెంట్‌ సాంకేతిక పరిజ్ఞానాలు, వాహన ప్రయాణ తీరుతెన్నులు పరీక్షించడానికి హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయిలో టెస్టింగ్‌ ట్రాక్‌, ఇతర సమగ్ర సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. అన్నీ అనుకూలించి ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చితే ‘మొబిలిటీ వ్యవస్థ’కు హైదరాబాద్‌ కేంద్రం కావడమే కాక వందల కోట్ల రూపాయల పెట్టుబడులు, భారీ సంఖ్యలో ఇంజినీర్లకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి.

మొబిలిటీ వ్యవస్థతో సంబంధం ఉన్న బీమా, వాహన, ఒరిజినల్‌ ఎక్విప్‌మెంట్‌ తయారీదారులు (ఓఈఎం కంపెనీలు), టెలికాం కంపెనీలతో పాటు అంకుర సంస్థలు సహా ఇక్కడ తమ సాంకేతిక పరిజ్ఞానాలను పరీక్షించుకోవడానికి వీలుంటుంది. సెమీ ఆటోమేటెడ్‌, మానవ రహిత (అటానమస్‌) కార్లు, కార్ల అనుసంధాన వ్యవస్థలు, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని రహదారులను కృత్రిమంగా సృష్టించి, పరీక్షించడానికి ఇటువంటి టెస్టింగ్‌ ట్రాక్‌ను ఒక దాన్ని హైదరాబాద్‌లో అభివృద్ధి చేయాలన్న జర్మనీకి చెందిన జెడ్‌ఎఫ్‌ కంపెనీ ప్రతిపాదనకు తెలంగాణ ప్రభుత్వం చాలా సానుకూలంగా స్పందించినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు చేపట్టడానికి హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో 40 ఎకరాల స్థలాన్ని కేటాయించడానికి ప్రభుత్వం ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. సాధ్యాసాధ్యాలపై వాహన, టెలికాం, ఓఎంఈలతో చర్చించాక ఈ ప్రాజెక్టు అంశం ఒక కొలిక్కి వస్తుంది. ఒకటి, రెండు నెలల్లో ప్రాథమిక చర్చలు జరిగే వీలుంది.

ప్రతిపాదన ఇదీ
యాంకర్‌ కంపెనీగా జెడ్‌ఎఫ్‌ వ్యవహరించి తెలంగాణ ప్రభుత్వ సహకారంతో ఇతర వాహన, ఓఎంఈ, విడిభాగాల సరఫరా కంపెనీలు, టెలికాం కంపెనీలతో చర్చించి టెస్టింగ్‌ ట్రాక్‌ ఏర్పాటు చేస్తారు. కంపెనీలన్నీ పెట్టుబడి పెట్టి, ఈ సదుపాయాలను వినియోగించుకుంటాయి. తాము అభివృద్ధి చేసే ఉత్పత్తులు, వ్యవస్థలను ఇక్కడ పరీక్షించుకుంటాయి. ఇప్పటి వరకు ఇటువంటి టెస్టింగ్‌ ట్రాక్‌, మొబిలిటీ వ్యవస్థకు మద్దతుగా నిలిచే సదుపాయాలు భారత్‌లో లేవని, ఇదే దేశంలో అత్యాధునిక, సమగ్ర టెస్టింగ్‌ ట్రాక్‌ అవుతుందని జెడ్‌ఎఫ్‌ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ప్రమాద రహిత, పర్యావరణ అనుకూల వాహనాల తయారీకి ప్రపంచ వ్యాప్తంగా అనేక కంపెనీలు సాంకేతిక పరిజ్ఞానాలను అభివృద్ధి చేయడానికి ఆసక్తి చూపుతున్నాయి. మానవ రహిత కార్ల వల్ల వేల మంది ప్రాణాలు కాపాడవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందువల్లే అమెరికా, ఐరోపా దేశాల్లో భద్రత సాంకేతిక పరిజ్ఞానాలను తప్పనిసరి చేస్తున్నారు. వీటిని తప్పని సరి చేస్తే మొబిలిటీ వ్యవస్థలోని కంపెనీలు తమ వ్యూహాలను మార్చుకుంటాయని, సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ధి, టెస్టింగ్‌కు అపార అవకాశాలు లభిస్తాయని జెడ్‌ఎఫ్‌ ఉన్నతాధికారి తెలిపారు.

‘ఎంసిటీ’కి ప్రతిరూపం: అమెరికాలోని మిచిగన్‌ విశ్వవిద్యాలయం, కంపెనీలతో కలిసి ‘ఎంసిటీ’ పేరుతో 32 ఎకరాల్లో టెస్టింగ్‌ ట్రాక్‌లు, పరీక్షలకు అవసరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసింది. ఇందులోని మౌలిక సదుపాయాలన్నీ ‘స్మార్ట్‌’ సదుపాయాలే. 2015 జులైలో దీన్ని అధికారికంగా ప్రారంభించారు. హైదరాబాద్‌ను మొబిలిటీ వ్యవస్థకు కేంద్ర బిందువు చేయడానికి ఇటువంటి ప్రాజెక్టును హైదరాబాద్‌లో చేపట్టాలన్నది ఆలోచన. అనుసంధాన, ఆటోమేటెడ్‌ వాహన సాంకేతిక పరిజ్ఞానాలను పరీక్షించడానికి ఎంసిటీని ప్రత్యేకంగా రూపొందించారు. మానవ రహిత కార్ల అభివృద్ది,´ వాస్తవ పరిస్థితుల్లో వాహన ప్రమాదాలు తగ్గించడంపై ఇక్కడ ప్రయోగాలు జరుగుతున్నాయి. కొద్ది కాలంలోనే మానవ రహిత, కనెక్టెడ్‌ కార్ల పరీక్షకు ఎంసిటీ కేంద్ర బిందువైంది. మార్కెట్‌ పరిశోధనా సంస్థ గార్ట్‌నర్‌ ప్రకారం 2020 నాటికి రహదారులపై ఉండే దాదాపు 25 కోట్ల కార్లు వైర్‌లెస్‌ నెట్‌వర్క్‌ కనెక్టివిటీ కలిగి ఉంటాయి. ప్రస్తుతం ఎంసిటీలో దాదాపు 30 పరిశోధన ప్రాజెక్టులపై పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...