Jump to content

ప్రపంచానికే ఆదర్శంగా నిలవనున్న వై ఎస్ జగన్


rajurocking50

Recommended Posts

నిన్నటి వరకు ఒక చరిత్ర …రేపటి నుంచి మరో చరిత్ర
 
ప్రపంచ రాజకీయాల్లో జగన్ సువర్ణాధ్యాయం లిఖించనున్నారు …ఏమిటి ఎలా అనుకుంటున్నారా అయితే ఈ ఆర్టికల్ పూర్తిగా చదవాల్సిందే .
 
తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని కొన్ని వేల కోట్లు అక్రమం గా సంపాదించారు అనే అభియోగాలు ఎదుర్కొని 16 నెలలు జైలు శిక్ష అనుభవించి షరతులతో కూడిన బెయిల్ పై బయటికి వచ్చి తదుపరి జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఓటమి చెంది నేడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లో ప్రధాన ప్రతిపక్ష నేత గా ఉన్న విషయం విదితమే.
 
అయితే ఆయన మీద ఉన్న కేసు లు ఒక కొలిక్కి రాలేదు …అయితే ఎన్ఫోర్స్మెంట్ డిపార్టుమెంటు ఇప్పటికే ఆయనకి సంబందించిన 1200 కోట్ల అవినీతి జరిగినట్లు నిర్దారించి 43 కోట్ల మేర ఆస్తుల్ని అటాచ్ కూడా చేసింది …అయితే తండ్రి అధికారం లో ఉన్నప్పుడు లక్ష కోట్లు జగన్ వెనకేసుకున్నారు అని ఇప్పటికీ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
 
అయితే ఇప్పుడు ఆయన తీసుకోబోయే నిర్ణయం అత్యంత సంచలనాత్మకం గా మారుతుంది అనటం లో ఎటువంటి అనుమానం లేదు … అది ఏంటి అంటే లక్ష కోట్లు సంపాదించినట్లు ఆయన పై వస్తున్న ఆరోపణలు నిజమే అని తెలియచేస్తూ ఈ డబ్బు సంపాదన వల్ల ఈ రోజు వరకు ఎప్పుడు సంతోషం గా లేను …దీని వల్ల ఎంత కష్టపడ్డా రాజకీయంగా ఎదగలేకపోతున్నాను అని , ప్రజలకి చేరువ అవలేకపోతున్నాను అని సన్నిహితుల వద్ద బాధ వ్యక్తం చేసినట్లు సమాచారం .
 
అయితే తన తప్పుని తాను ఒప్పుకొని తాను సంపాదించిన లక్ష కోట్లు ప్రజలకి పంచి పెట్టనున్నట్లు సమాచారం ….జిల్లాల వారీ గా ఇందుకోసం వై ఎస్ ఆర్ ఫౌండేషన్ పేరుతో ప్రత్యెక కమిటీ లు వేసి …ఆ కమిటీ ల ఆధ్వర్యం లో ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేకుండా ఆయా ప్రాంతాల్లో ఎప్పటినుంచో పరిష్కారం కాని సమస్య లకి శాశ్వత పరిష్కారం చూపించే దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం …ఇదే గనుక జరిగితే తన పేరు చరిత్ర లో సువర్ణాక్షరాలతో లిఖించ బడుతుంది , అంతే కాక రాజకీయంగా ఇక పై తనని ఆపే శక్తీ కనుచూపు మేరలో ఉండదు అని ఆలోచన చేస్తున్నారు.
 
ఈ ప్రక్రియ 2019 ఎలక్షన్స్ నాటికి మొదటి దశ పూర్తి చెయ్యాలని పట్టుదలతో ఉన్నారు …రాష్ట్రం లో ఉన్న ప్రతి నియోజకవర్గానికి అయిదు వందల కోట్ల చొప్పున నిధులు విడుదల చేసి ఒక్క రాజధాని నగరాన్నే కాక ప్రతీ నియోజకవర్గాన్ని ఒక సింగపూర్ చేస్తాను అని ప్రతిజ్ఞ చేయనున్నట్లు సమాచారం.
 
మొదట రాష్ట్రం ఏ నియోజకవర్గం లో కూడా పేద వాడు ఉండకూడదు అనే దాని పై ప్రతి ఒక్కరికి తక్కువ లో తక్కువ గా ౩ ఎకరాల భూమి ఉండేలా , మరియు సొంత నివాసం ఉండేలా ఏర్పాటు చేయాలని తపిస్తున్నట్లు తెలుస్తుంది …
 
తర్వాత ప్రతి మారుమూల గ్రామానికి అంతర్జాతీయ స్థాయి వైద్యం , ప్రతి నియోజకవర్గానికి కే జి టు పి జి వరకు అంతర్జాతీయ ప్రమాణాలు గల విద్యని ఉచితంగా అందించాలి అని నిర్ణయించుకున్నారు …ఇవన్ని చేస్తే 2019 తాను తప్పక ముఖ్యమంత్రి ని అవుతాను అని నమ్ముతున్న జగన్ , ప్రభుత్వం తన చేతిలో ఉంటే వీటి కొనసాగింపు అసలు సమస్యే కాదు అని లెక్కలు వేస్తున్నట్లు తెలుస్తుంది …దీని పై కొన్ని బృందాలు ఇప్పటికే క్షేత్ర స్థాయి లో పని చేస్తున్నట్లు సమాచారం.
 
మరి ఇలా చేసుకుంటూ పోతే ఆయన్ని ఆపే ధైర్యం ఎవరన్నా చేయగలరా …ఒక్క సారి ఆలోచించండి…
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
ఆలోచించింది చాలు కాని …మనం కొత్త సంవత్సరం లో కి అడుగుబెట్టటం తో బాటు కొత్త ఆర్ధిక సంవత్సరం లో కి అడుగుబెట్టాం … ఇవ్వాళ APRIL 1st అండి ….ఇది ఈ ఒక్క రోజే మాట్లాడగలం …
 
కాకపోతే ఇది నిజంగా నిజం అయితే మన రాష్ట్రం ఎక్కడ ఉంటుందో ఒక్క సారి ఊహించండి
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...