JANASENA Posted April 20, 2017 Report Share Posted April 20, 2017 న్యూదిల్లీ: ప్రస్తుతం యావత్ సినీ ప్రపంచం ‘బాహుబలి’ మేనియాలో ఉంది. మరో వారంలో రోజుల్లో ‘బాహుబలి: ది కన్క్లూజన్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే చిత్ర బృందం ప్రచారాన్ని ముమ్మరం చేయగా, ‘బాహుబలి’ సీజన్ను వ్యాపారవేత్తలు కూడా తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. అహ్మదాబాద్కు చెందిన ఓ రెస్టారెంట్కు మరో అడుగు ముందుకేసి.. ఏకంగా తమ భోజనంలో ‘బాహుబలిని’ చేర్చేసింది. బాహుబలి చిత్రాన్ని స్వాగతిస్తూ ‘బాహు-థాలి’ పేరుతో ఓ మెనూని సిద్ధం చేసింది. దర్శకుడు రాజమౌళి బాహుబలి చిత్రాన్ని వెండితెరపై ఏ విధంగానైతే భారీ స్థాయిలో చూపిస్తున్నారో అదే స్థాయిలో ఈ మెనూలో వంటకాలు ఉండటం విశేషం. మామూలుగా థాలిలో వివిధ వంటకాలను ఎంచుకునేందుకు అవకాశం ఉండదు. అయితే ఈ రెస్టారెంట్ మాత్రం రాజస్థానీ, గుజరాతీ వంటకాలను రుచి చూపిస్తుందట. అయితే ‘బాహు-థాలి’లోని వంటకాలకు బాహుబలి చిత్రంలోని పేర్లను పెట్టలేదు కానీ.. మహిష్మతి సామ్రాజ్యంలో ఉండి విందు భోజనాన్ని ఆరగించిన అనుభూతిని ఇస్తుంది. ‘ఈ వంటకాలను రాజువాడు రెస్టారెంట్ వద్ద అందిస్తున్నాం. బాహుబలి రెండో భాగం విజయవంతం కావాలని కోరుకుంటున్నాం. బాహుబలి బృందం రాజువాడులో ఆతిథ్యం స్వీకరిస్తుందని ఎదురుచూస్తుంటాం’ అని రెస్టారెంట్ యజమానులు తెలిపారు. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా కీలక పాత్రలు పోషించిన ‘బాహుబలి: ది కన్క్లూజన్’ ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. Quote Link to comment Share on other sites More sharing options...
Prabhas_Fan Posted April 20, 2017 Report Share Posted April 20, 2017 Quote Link to comment Share on other sites More sharing options...
4Vikram Posted April 20, 2017 Report Share Posted April 20, 2017 Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.