Annayya_fan Posted April 24, 2017 Report Share Posted April 24, 2017 Quote Link to comment Share on other sites More sharing options...
Annayya_fan Posted April 24, 2017 Author Report Share Posted April 24, 2017 అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ లో సంచలనం కలిగించిన వీఆర్ చిట్ ఫండ్స్ కేసులో మోసపోయిన బాధితులకు ఇవాళ పరిహారాన్ని సీఎం చంద్రబాబు స్వయంగా పంపిణీ చేశారు. విశాఖ కేంద్రంగా పనిచేస్తూ, సుమారు పదేళ్ల క్రితం బోర్డు తిప్పేసిన సంస్థ 2,200 మంది డిపాజిటర్లను రూ.27 కోట్ల మేర మోసం చేసింది. బాధితుల్లో అత్యధికులు ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన వారే ఉన్నారు. కాగా, అప్పట్లో ప్రజల నుంచి సేకరించిన డబ్బుతో భారీ ఎత్తున భవనాలు కొని, ఆపై సంస్థ యాజమాన్యం ఐపీ పెట్టింది. కేసును నమోదు చేసిన సీఐడీ విభాగం, ఆయా ఆస్తులన్నీ సీజ్ చేసి కోర్టు ఆదేశాల మేరకు వేలం నిర్వహించింది. కేసు విచారణల అనంతరం కోర్టు ఆదేశాల మేరకు సంస్థ ఆస్తులను వేలం వేసే ప్రక్రియ పూర్తి కావడంతో, నేడు విజయవాడలో బాధితులకు వారు కట్టిన మొత్తానికి సంబంధించిన డబ్బు రూ.25 కోట్లను తిరిగి పంపిణీ చేశారు చంద్రబాబు. ఓ చిట్ ఫండ్ సంస్థ మోసం చేసిన కేసులో దాదాపు పూర్తి స్థాయిలో పరిహారం తిరిగి చెల్లించడం ఇండియాలోనే ఇదే తొలిసారి. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, వీఆర్ చిట్స్ పై ప్రతి కేబినెట్ సమావేశంలోనూ ఆరా తీశానని అన్నారు. వీఆర్ చిట్స్ బాధితులకు ఎంతో కొంత న్యాయం చేశామని, ప్రజలను వీఆర్ చిట్స్ బాధితులు చైతన్య పరచాలని సూచించారు. Quote Link to comment Share on other sites More sharing options...
sarvamangalam Posted April 24, 2017 Report Share Posted April 24, 2017 bukkinava leda Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.