TampaChinnodu Posted June 25, 2017 Report Share Posted June 25, 2017 రక్తానికీ ‘కల్తీ’ మకిలి రాజధానిలో కలకలం సెలైన్ నీళ్లు కలిపి విక్రయిస్తున్న వీనస్ ఆసుపత్రి వైద్యుడు చక్రవర్తి సహా ముగ్గురి అరెస్టు ఒక్కో యూనిట్ రూ. 3 వేలకు అమ్మకం ఈనాడు, హైదరాబాద్: రాజధానిలో రక్తాన్ని కల్తీ చేస్తున్న మాఫియా గుట్టురట్టయ్యింది. అత్యంత రహస్యంగా రక్తంలో సెలైన్ కలిపి విక్రయిస్తున్న ముగ్గురు అక్రమార్కులు డాక్టర్ చక్రవర్తి, శ్రవణ్, కుమార్లను శనివారం రాత్రి అరెస్టు చేసినట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. ఈ ముగ్గురూ మలక్పేటలోని వీనస్ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. డాక్టర్ చక్రవర్తి వీనస్ ఆసుపత్రి రక్తనిధి కేంద్రంలో అనస్థీషియా వైద్యుడిగా, కుమార్ సాంకేతిక నిపుణుడిగా వ్యవహరిస్తున్నారని, శ్రవణ్ రక్తనిధి కేంద్రం మేనేజర్గా ఉన్నారని వివరించారు. రక్తనిధి కేంద్రంలో రక్తం యూనిట్లను నిల్వ ఉంచి అవసరమైన వారికి వైద్యుల అనుమతితో ఒక యూనిట్ను రూ.3 వేల చొప్పున విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. రక్తంలో కల్తీ ఉందని తమకు ఫిర్యాదు అందడంతో ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ రవికుమార్ బృందం వెళ్లి పరిశీలించగా.. రక్తాన్ని కల్తీ చేసే పరికరాలు, యంత్రాలను గమనించారు. రక్తనిధి కేంద్రంలో ఐదు యూనిట్ల తెల్లరక్త కణాల యూనిట్లు, ఏడు సెలైన్ బాటిళ్లు, రక్తనిధి కేంద్రంలో రికార్డులు స్వాధీనం చేసుకున్నామన్నారు. వీరిపై ఐపీసీ 420,308,272,273 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని, తదుపరి చర్యల నిమిత్తం ఎల్బీనగర్ పోలీసులకు కేసు అప్పగించామని తెలిపారు. పరీక్షిస్తే కల్తీ బయటపడింది..: బాలాపూర్లో నివసించే నర్సింహారెడ్డి శనివారం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. కుటుంబ సభ్యులు అతన్ని భైౖరామల్గూడలోని అవేర్ గ్లోబల్ ఆస్పత్రిలో చేర్పించారు. తీవ్ర రక్తస్రావం కావడంతో వైద్యులు అత్యవసరంగా రక్తం ఎక్కించాలని తెలిపారు. నర్సింహారెడ్డి సోదరుడు మలక్పేటలోని వీనస్ ఆసుపత్రి రక్తనిధి కేంద్రంలో రక్తాన్ని తీసుకొచ్చారు. చికిత్స అందిస్తున్న వైద్యులు ఆ రక్తం నమూనాను పరీక్షించి, సెలైన్ నీళ్లు కలిసినట్లు నిర్ధరించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రాచకొండ ఎస్వోటీ పోలీసులు వీనస్ ఆసుపత్రి రక్తనిధి కేంద్రంలో కుమార్ను అదుపులోకి తీసుకుని విచారించగా.. రక్తం కల్తీ చేస్తున్నట్లు అంగీకరించారు. వైద్యులు గుర్తించకుండా ఒక్కోసారి సెలైన్ నీళ్లను సూదిమందు రూపంలో రక్తంలోకి ఎక్కిస్తున్నామని పోలీసులకు కుమార్ వివరించారు. అనంతరం నర్సింహారెడ్డి కుటుంబ సభ్యుల నుంచి ఫిర్యాదు స్వీకరించి ఆసుపత్రి నుంచే డాక్టర్ చక్రవర్తి, శ్రవణ్లను అదుపులోకి తీసుకుని ఠాణాకు తరలించారు. రోగుల అవసరాలే ఆసరాగా దోపిడీ: రోగుల అవసరాలే ఆసరాగా కొన్ని ముఠాలు హైదరాబాద్లో కల్తీ రక్తం దందాకు తెరతీస్తున్నాయి. తాజా ఘటనతో మరోసారి ఈ దందా సంచలనం సృష్టించింది. గతంలో సుల్తాన్బజార్ ప్రసూతి ఆసుపత్రి రక్త నిధి కేంద్రంలో ఈ తరహా దందా బయట పడటంతో అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ ఒప్పంద ఉద్యోగి పాత్రనూ బయటపెట్టారు. నగరంలోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద ముఠాలు తిష్టవేసి.. సిబ్బందితో సంబంధాలు పెట్టుకొని కమీషన్ ముట్టచెబుతూ దందా సాగిస్తున్నారు. రక్తం అవసరమయ్యే వారిని ఆసుపత్రి సిబ్బందే నేరుగా దళారుల వద్దకు పంపుతున్నారు. అవసరాన్నిబట్టి నిర్ణీత ధరల కన్నా 30-50 శాతం అధికంగా పిండుకుంటున్నారు. నగరంలో ఏటా 3.6 లక్షల యూనిట్ల వరకు రక్తం అవసరం ఉండగా.. 2.5 లక్షల యూనిట్లే లభ్యమవుతోంది. ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల్లో కొన్నిసార్లు రక్తం దొరకడం కష్టంగా మారింది. బయట కేంద్రాలెక్కడ ఉన్నాయో కూడా రోగుల బంధువులకు తెలియకపోవడంతో దళారులకు మంచి వ్యాపారంగా మారింది. ఏబీ నెగెటివ్, ఓ నెగెటివ్, బి నెగెటివ్ లాంటి అరుదైన గ్రూపులు అవసరమైనప్పుడు పరిస్థితిని దళారులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. నకిలీ రక్తపు ప్యాకెట్లు సైతం చేతిలో పెడుతున్నారు. నేరుగా బ్లడ్ బ్యాంకుల నుంచే వస్తున్నాయనే ఉద్దేశంతో పరిశీలించకుండానే రోగులకు ఎక్కిస్తుండటంతో కొన్నిసార్లు రోగుల ప్రాణాల మీదికొస్తోంది. చాలా కేంద్రాలు నిబంధనలకు విరుద్ధంగా, కనీస జాగ్రత్తలు తీసుకోకుండా వ్యాపారం సాగిస్తున్నాయనే ఆరోపణలున్నాయి. Quote Link to comment Share on other sites More sharing options...
TampaChinnodu Posted June 25, 2017 Author Report Share Posted June 25, 2017 last ki blood ni kooda not leaving. etu pothundi man assalu mana desham. Quote Link to comment Share on other sites More sharing options...
ICANWIN Posted June 25, 2017 Report Share Posted June 25, 2017 Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.