Jump to content

యుద్ధం కోసం ఉరకలు వేయొద్దు.. భారత్కు చైనా హెచ్చరిక


JANASENA

Recommended Posts

29break180a.jpg

బీజింగ్‌ : భారత భూభాగంలోకి పలుసార్లు అతిక్రమణలకు పాల్పడిన చైనా ఆ తప్పంతా భారత్‌దేనని నెట్టివేసింది. సిక్కిం, భూటాన్‌, చైనా త్రిముఖ కూడలి వద్ద చైనా అక్రమంగా నిర్మిస్తున్న రహదారి నిర్మాణాన్ని భారత సైన్యం అడ్డుకోవడంపై ఆ దేశ సైన్యం ఆగ్రహం వ్యక్తంచేసింది. 1962 నాటి ఓటమినుంచి భారత్‌ ఇప్పటి వరకు ఎటువంటి పాఠాలు నేర్చుకోలేదని ప్రకటించింది. తమ సొంత భూభాగంలో తాము రహదారి నిర్మిస్తున్నామని ఇందులో భారత్‌కు, భూటాన్‌కు ఎటువంటి అభ్యంతరాలు అవసరం లేదని పేర్కొంది.

పాక్‌తో పాటు చైనా నుంచి వచ్చే సవాళ్లను ఏకకాలంలో ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని భారత సైన్యాధిపతి జనరల్‌ బిపిన్‌ రావత్‌ చేసిన వ్యాఖ్యలకు పీపుల్స్‌ లిబరేషన్‌ సైన్య అధికార ప్రతినిధి వు కియన్‌ స్పందించారు. ఇలాంటి వ్యాఖ్యలను చేసే ముందు గత చరిత్రను తెలుసుకోవాలన్నారు. చైనా భూభాగంలోకి భారత దళాలు చొరబాటుకు పాల్పడ్డాయని ఆరోపించారు. చైనా-భూటాన్‌ల మధ్య సుదీర్ఘకాలంగా దొంగ్లాంగ్‌ ప్రాంతంపై సరిహద్దు వివాదముంది. అయితే చైనా సైన్యం ఒప్పందాన్ని అతిక్రమించి వివాదాస్పద ప్రాంతంలో రహదారి నిర్మాణాన్ని ప్రారంభించడంతో భారత్‌ దళాలు అడ్డుకున్నాయి. భారత్‌-భూటాన్‌ల మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం భూటాన్‌ రక్షణ బాధ్యతలను భారత్‌ చూస్తుంది. దీంతో విధుల్లో భాగంగానే చైనా చొరబాటును అడ్డుకున్నారు.దీంతో ఆగ్రహించిన చైనా మానససరోవర్‌యాత్రకు భారత యాత్రికులను అనుమతించలేదు. మొదట భారత సైన్యం వెనక్కు తిరిగితేనే చర్చలు ప్రారంభిస్తామని చైనా స్పష్టం చేసింది.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...