Jump to content

సీఎం చంద్రబాబుకు ఘోర అవమానం


SonyKongara

Recommended Posts

సీఎం చంద్రబాబుకు ఘోర అవమానం
 
 
636419535797862368.jpg
అమరావతి: ఏపీ సచివాలయ ఉద్యోగులు సీఎం చంద్రబాబును ఘోరంగా అవమానించారు. ప్రభుత్వాధినేత ఫోటో పట్ల ఉద్యోగులు వ్యవహరించిన తీరు విస్మయానికి గురిచేసింది. సచివాలయంలో ఫ్రేమ్ కట్టి ఉన్న సీఎం చంద్రబాబు ఫోటోను డస్ట్‌బిన్ లాగా వాడుకున్నారు. చిరుపదరార్థులు తిన్న ప్లేట్లను సీఎం ఫోటోపై పెట్టి వెళ్లారు. ఉద్దేశపూర్వకంగానే ఇలా చేసినట్లు సచివాలయ వర్గాలు భావిస్తున్నాయి. సోమవారం సచివాలయంలోని నాలుగో బ్లాక్‌లో ఉన్నత విద్యాశాఖ అధికారులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తినడానికి వారికి చిరుపదార్థాలు ఏర్పాటుచేశారు. అంతా అయిపోయాక. ఆ చెత్తను, ప్లేట్లను సీఎం చంద్రబాబు ఫోటోపై పెట్టి వెళ్లారు.
 
సచివాలయంలోని నాలుగో ఫ్లోర్‌లో గల సమావేశ మందిరంలో సీఎం చంద్రబాబు ఫోటోతో పాటు కొంతమంది దేవుళ్ల ఫోటోలు అక్కడ ఉన్నాయి. వాటిని గోడకు తగిలించలేదు. టేబుల్‌పైనే పెట్టారు. కాగా, సోమవారం సమావేశ మందిరంలో సమీక్ష జరిపిన విద్యాశాఖ అధికారులు చిరుతిళ్లు తెప్పించుకున్నారు. వాటిని పేపర్ ప్లేట్లలో వారికి పంపిణీ చేశారు. అయితే ప్లేట్లను సప్లయ్ చేయడానికి టీపాయ్‌ దొరకకపోవడంతో ఫ్రేమ్ కట్టి ఉన్న సీఎం ఫోటోని టీ పాయ్‌లాగా వాడుకున్నారు. తిన్న తరువాత ఆ ప్లేట్లను ఫోటోపైనే వదిలిపెట్టి వెళ్లిపోయారు. నిజానికి సచివాలయంలో ప్రతీ విభాగంలో ప్రభుత్వాధినేత ఫోటో ఉంటుంది. సమావేశ మందిరాల్లోనూ ఏర్పాటుచేస్తారు. అదేవిధంగా నాలుగో బ్లాక్‌లో ఉన్న సమావేశ మందిరంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటో పెట్టాలని అధికారులు తీసుకువచ్చారు. కానీ గోడకు తగిలించే విషయంలో నిర్లక్ష్యం చూపారు. దాంతో కొద్దిరోజులుగా సీఎం ఫోటో సమావేశ మందిరంలో టేబుల్‌పైనే ఉంది. ఇప్పుడు సచివాలయ అధికారులు ఈ ఫోటోను డస్ట్‌బిన్‌లా వాడుకొని అందరినీ విస్మయపరిచారు.
 
ప్రభుత్వాధినేతకు జరిగిన అవమానం.. ఏదో చిన్నచిన్న అధికారులు చేసిన తప్పిదం కాదు. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, మరో అధికారి పాండా దాస్, జేఎన్‌టీయూ అధికారలుతో జరిపిన సమావేశంలో ఈ ఘటన చోటుచేసుకుంది. చంద్రబాబు ఫోటోపై చిరుతిళ్లు తిన్న ప్లేట్లు పడేసిన విషయం సచివాలయంలో కలకలం రేపుతోంది. ప్రభుత్వాధినేతకు ఇసుమంత కూడా గౌరవమివ్వని అధికారులు వెళగపుడిలో పెత్తనం చేస్తున్నారని కొంతమంది ఉద్యోగులు మండిపడుతున్నారు.
Link to comment
Share on other sites

24 minutes ago, SonyKongara said:
సీఎం చంద్రబాబుకు ఘోర అవమానం
 
 
636419535797862368.jpg
అమరావతి: ఏపీ సచివాలయ ఉద్యోగులు సీఎం చంద్రబాబును ఘోరంగా అవమానించారు. ప్రభుత్వాధినేత ఫోటో పట్ల ఉద్యోగులు వ్యవహరించిన తీరు విస్మయానికి గురిచేసింది. సచివాలయంలో ఫ్రేమ్ కట్టి ఉన్న సీఎం చంద్రబాబు ఫోటోను డస్ట్‌బిన్ లాగా వాడుకున్నారు. చిరుపదరార్థులు తిన్న ప్లేట్లను సీఎం ఫోటోపై పెట్టి వెళ్లారు. ఉద్దేశపూర్వకంగానే ఇలా చేసినట్లు సచివాలయ వర్గాలు భావిస్తున్నాయి. సోమవారం సచివాలయంలోని నాలుగో బ్లాక్‌లో ఉన్నత విద్యాశాఖ అధికారులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తినడానికి వారికి చిరుపదార్థాలు ఏర్పాటుచేశారు. అంతా అయిపోయాక. ఆ చెత్తను, ప్లేట్లను సీఎం చంద్రబాబు ఫోటోపై పెట్టి వెళ్లారు.
 
సచివాలయంలోని నాలుగో ఫ్లోర్‌లో గల సమావేశ మందిరంలో సీఎం చంద్రబాబు ఫోటోతో పాటు కొంతమంది దేవుళ్ల ఫోటోలు అక్కడ ఉన్నాయి. వాటిని గోడకు తగిలించలేదు. టేబుల్‌పైనే పెట్టారు. కాగా, సోమవారం సమావేశ మందిరంలో సమీక్ష జరిపిన విద్యాశాఖ అధికారులు చిరుతిళ్లు తెప్పించుకున్నారు. వాటిని పేపర్ ప్లేట్లలో వారికి పంపిణీ చేశారు. అయితే ప్లేట్లను సప్లయ్ చేయడానికి టీపాయ్‌ దొరకకపోవడంతో ఫ్రేమ్ కట్టి ఉన్న సీఎం ఫోటోని టీ పాయ్‌లాగా వాడుకున్నారు. తిన్న తరువాత ఆ ప్లేట్లను ఫోటోపైనే వదిలిపెట్టి వెళ్లిపోయారు. నిజానికి సచివాలయంలో ప్రతీ విభాగంలో ప్రభుత్వాధినేత ఫోటో ఉంటుంది. సమావేశ మందిరాల్లోనూ ఏర్పాటుచేస్తారు. అదేవిధంగా నాలుగో బ్లాక్‌లో ఉన్న సమావేశ మందిరంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటో పెట్టాలని అధికారులు తీసుకువచ్చారు. కానీ గోడకు తగిలించే విషయంలో నిర్లక్ష్యం చూపారు. దాంతో కొద్దిరోజులుగా సీఎం ఫోటో సమావేశ మందిరంలో టేబుల్‌పైనే ఉంది. ఇప్పుడు సచివాలయ అధికారులు ఈ ఫోటోను డస్ట్‌బిన్‌లా వాడుకొని అందరినీ విస్మయపరిచారు.
 
ప్రభుత్వాధినేతకు జరిగిన అవమానం.. ఏదో చిన్నచిన్న అధికారులు చేసిన తప్పిదం కాదు. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, మరో అధికారి పాండా దాస్, జేఎన్‌టీయూ అధికారలుతో జరిపిన సమావేశంలో ఈ ఘటన చోటుచేసుకుంది. చంద్రబాబు ఫోటోపై చిరుతిళ్లు తిన్న ప్లేట్లు పడేసిన విషయం సచివాలయంలో కలకలం రేపుతోంది. ప్రభుత్వాధినేతకు ఇసుమంత కూడా గౌరవమివ్వని అధికారులు వెళగపుడిలో పెత్తనం చేస్తున్నారని కొంతమంది ఉద్యోగులు మండిపడుతున్నారు.

nijam bhayya.. monna inkokadu tissue paper ledhani Gruddha kadukkoni mana karapathram eenadu paper tho thudsukunnadu.. 

Link to comment
Share on other sites

చంద్రబాబు చిత్ర పటంపై చెత్త వేసిన ఘటనపై విచారణ ప్రారంభం

Tue, Sep 26, 2017, 09:42 PM
 

* ఈ సంఘటనను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం

* ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి ఆధ్వర్యంలో విచారణ

* అధికారులను, సిబ్బందిని ప్రశ్నించిన అధికారి

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చిత్రపటంపై చెత్త వేసిన ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. ఈ ఘటనపై ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి ఉదయలక్ష్మి విచారణ చేప్టటారు. ఈ సందర్భంగా నిన్న సమావేశం నిర్వహించిన అధికారులు సహా అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని ఉదయలక్ష్మి ప్రశ్నించారు. కాగా, ఉన్నత విద్యాశాఖకు సంబంధించి వెలగపూడి సచివాలయంలోని నాల్గో బ్లాక్ లోని సమావేశ మందిరంలో ఈ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమావేశానికి హాజరైన ఉన్నతాధికారులందరికీ అల్పాహారాన్నిపేపర్ ప్లేట్లలో అందజేశారు. అయితే, అక్కడే ఉన్న టేబుల్ పై చంద్రబాబు చిత్రపటం ఉంది. అల్పాహారం తిన్న తర్వాత ఆ ప్లేట్లను ఆ చిత్రపటంపై పడవేశారు. సమావేశం అనంతరం ఈ సంఘటన వెలుగు చూసింది. దీంతో, ఈ సంఘటనను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం, విచారణ చేపట్టాల్సిందిగా ఉదయలక్ష్మిని ఆదేశించడం జరిగింది. 
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...