Jump to content

శబాష్ పాకిస్తానీ !-మానవత్వం మంటకలిసింది


yaman

Recommended Posts

మానవత్వం మంటకలిసింది
ఒడిలో కూతురితో వార్తలు చదివింది
04383211BRK122-PAK-CHILD-ANCHOR.JPG

ఇస్లామాబాద్‌: రోజువారీ వార్తలు చదివేందుకు వచ్చిన ఓ యాంకర్‌ తన వెంట కూతుర్ని కూడా తెచ్చుకుంది. ఆమెను తన ఒడిలో కూర్చోబెట్టుకుని వార్తలు చదివింది. అలా ఆమె చేయడానికి వెనుక ఓ హృదయ విదారకరమైన ఘటనే కారణం. అభం శుభం తెలియని ఏడేళ్ల చిన్నారి జైనాబ్‌ అన్సారీని అపహరించి అత్యంత దారుణంగా అత్యాచారం చేసి చంపేసిన ఘటన పాక్‌లోని కసూర్‌ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది. ఈ దారుణ ఘటనకు వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు పాకిస్థాన్‌కు చెందిన సమా టీవీ న్యూస్‌ ప్రజెంటర్‌ కిరణ్‌ నాజ్ ఇలా చేశారు.

‘నేను ఈరోజు మీ వ్యాఖ్యాత కిరణ్‌ నాజ్‌ను కాను. ఓ తల్లిని. అందుకే నా కూతురిని నా వెంట తెచ్చుకొని ఒడిలో కూర్చోబెట్టుకొని వార్తలు చదువుతున్నాను’ అని నాజ్‌ ఉద్వేగభరితులయ్యారు. ‘చనిపోయింది చిన్న పాపే కావచ్చు. కానీ, ఆ బాధ మాత్రం చాలా ఎక్కువ. కసూర్‌ వీధుల్లో పడి ఉన్న ఆ చిన్నారి మృతదేహం యావత్‌ దేశాన్నే కుదిపేసింది. మానవత్వం మంటగలిసిందనేందుకు ఇదే నిదర్శనం’ అని ఆమె గ‌ద్గ‌ద‌ స్వరంతో చెప్పారు. జైనాబ్‌పై ఈ అకృత్యానికి పాల్పడిన వారిని అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని ఆమె కోరారు.

కసూర్‌ ప్రాంతానికి చెందిన జైనాబ్‌ అన్సారీ గత వారం అదృశ్యమైంది. ఖురాన్‌ తరగతులకు వెళ్తున్న ఆ చిన్నారిని కొందరు దుండగులు అపహరించి దారుణంగా అత్యాచారం చేసి చంపేశారు. పాప మృతదేహాన్ని మంగళవారం కసూర్‌ ప్రాంతంలోని చెత్తలో పడేశారు. చిన్నారి ఘటన కసూర్‌ ప్రాంతంలో సంచలనం సృష్టించింది. ఈ ఘటనకు నిరసనగా స్థానికులందరూ అక్కడి పోలీస్‌స్టేషన్‌పై దాడి చేశారు. ఆందోళనకారులను నిలువరించేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. తమ బిడ్డను దారుణంగా హత్య చేసిన వారిని పట్టుకొని కఠినంగా శిక్షించాలని చిన్నారి తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నారు.

 

 

కాలిపోతుంటే కళ్లప్పగించారు 
పట్టపగలు..నడిరోడ్డుపై ఆత్మహత్యాయత్నం 
జూనియర్‌ కళాశాల విద్యార్థి తన చొక్కా విప్పి మంటలార్పాడు 
10ap-main7a.jpg

10ap-main7b.jpgపెందుర్తి, న్యూస్‌టుడే: పట్టపగలు నడిరోడ్డుపై పెట్రోల్‌ పోసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతన్ని కాపాడేందుకు పెద్దలెవరూ ముందుకు రాకపోగా..జూనియర్‌ కళాశాలలో చదువుతున్న ఓ విద్యార్థి తన చొక్కా విప్పి మంటలార్పాడు. ఈ ఘటన విశాఖ జిల్లా పెందుర్తి పోలీసుస్టేషన్‌ కూడలి వద్ద బుధవారం ఉదయం 9.50 గంటలకు చోటుచేసుకుంది. ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తిని పెందుర్తి  పాత ఊరుకు చెందిన మహాలక్ష్మినాయుడు(45)గా  గుర్తించారు. భార్య హత్య కేసులో జైలుకు వెళ్లి ఇటీవల బెయిలుపై బయటకు వచ్చాడు. అయితే అతని ఇద్దరు పిల్లలు తమకు తండ్రి నుంచి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలంటూ నాలుగు రోజులుగా పెందుర్తి పోలీసుస్టేషన్‌ వద్ద నిరసన తెలుపుతున్నారు. ఈ క్రమంలో మనస్థాపానికి గురైన మహాలక్ష్మినాయుడు పెట్రోలు క్యానుతో పెందుర్తి పోలీస్‌స్టేషన్‌ కూడలి వద్దకు చేరుకున్నాడు. హఠాత్తుగా పెట్రోలును ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. మంటలు చెలరేగడంతో రోడ్డుపై గిలగిలా కొట్టుకున్నాడు. మళ్లీ లేచి పక్కనే ఉన్న దుకాణాల వైపు పరుగులు తీశాడు. ఏమి జరుగుతుందో అర్థం కాక వాహనచోదకులు ఎక్కడికక్కడే నిలిచిపోయి కళ్లప్పగించి చూశారే తప్ప.. అతన్ని కాపాడేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఇంతలో పెందుర్తి జూనియర్‌ కళాశాల విద్యార్థి ఎం.రాకేష్‌ తన చొక్కాను విప్పేసి అతనికి కప్పి మంటలను ఆర్పాడు. అప్పటికే 70శాతం కాలిన గాయాలయ్యాయి. పోలీసులు క్షతగాత్రుడ్ని 108 అంబులెన్స్‌లో కేజీహెచ్‌కు తరలించారు. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...