TampaChinnodu Posted March 7, 2018 Report Share Posted March 7, 2018 గన్నవరం విమానాశ్రయ అభివృద్ధి, రాజధాని నిర్మాణం, ఐటీ కేంద్రాల రాకతో ఇప్పటికే రాజధాని నగరం విజయవాడ చుట్టుపక్కల నిర్మాణ రంగం పరుగులు తీస్తోంది. దీనికి తోడు ఇటీవలి భాగస్వామ్య సదస్సులో కుదిరిన ఒప్పందాలతో విజయవాడ నగర రూపురేఖలు పూర్తిగా మారనున్నాయి. రానున్న రోజుల్లో ఈ నగరమొక ప్రముఖ ఉపాధి కేంద్రంగా మారనుంది. విశాఖపట్నంలో మూడు రోజులపాటు జరిగిన భాగస్వామ్య సదస్సులో భారీ పరిశ్రమలకు సంబంధించి రూ.1450 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి వివిధ సంస్థలు ముందుకు రాగా, ఐటీ రంగంలో రూ.517 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు నాలుగు సంస్థలు ముందుకు వచ్చాయి. ఛానల్ సాఫ్ట్ కంప్యూటర్ సర్వీసెస్ రూ.2కోట్ల పెట్టుబడులు పెట్టి, 300 మందికి ఉపాధి కల్పించనుంది. ఇప్పటికే గొల్లపూడి కాల్సెంటర్ను ప్రారంభించిన కార్వే మరో డేటా మేనేజ్మెంట్ సర్వీసెస్ను రూ.390కోట్లతో ప్రారంభించనుంది. దీనివల్ల పదివేల మంది ఉద్యోగవకాశాలు లభిస్తాయి. ఎస్పీ పైన్నెట్ సంస్థ రూ.75కోట్ల పెట్టుబడితో కార్యకలాపాలు మొదలుపెట్టనుంది. దీంతో వెయ్యి మందికి ఉపాధి లభిస్తుంది. రూ.50కోట్లతో హాడియా మాండ్స్టార్ సంస్థ 300 మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తుంది. మొత్తంగా అటు భారీ పరిశ్రమలు, ఇటు ఐటీ సంస్థలకు సంబంధించి రూ.1967 కోట్ల విలువైన ఒప్పందాలు భాగస్వామ్య సదస్సులో జరిగాయి. త్వరలోనే ఈ పరిశ్రమలన్నీ కార్యకలాపాలను ప్రారంభించనున్నాయి. Quote Link to comment Share on other sites More sharing options...
Equalirights Posted March 7, 2018 Report Share Posted March 7, 2018 late endhuku edupu gottu comment okkati pettu Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.