Crazy_Robert Posted September 6, 2018 Report Share Posted September 6, 2018 చదువుకోవడానికి అక్క ఇంటికి వచ్చి.. బావతో సహజీవనం చేసింది ఆ యువతి. మంగళవారం రాత్రి జరిగిన ఓ గొడవతో ఆమె ఉరేసుకుని మృతి చెందింది. బంజారాహిల్స్ పోలీసుల కథనం ప్రకారం.. మహబూబ్నగర్ జిల్లా మక్తల్ మండలం గుడిగండ్లకు చెందిన నర్సింహులు ఫిలింనగర్లోని మహాత్మాగాంధీనగర్లో ఉంటున్నాడు. 16 ఏళ్ల క్రితం నర్సింహులు భార్య సోదరి సునీత(28) చదువుకోవడానికి అక్క వద్దకు వచ్చింది. ఇంటర్ పూర్తి చేసిన సునీతతో నరసింహులు కొద్ది కాలంగా సహజీవనం చేస్తున్నాడు. ఈ విషయం అందరికీ తెలియడంతో పెళ్లి చేసుకోవాలనీ అనుకున్నారు. మేస్త్రీ పని చేసే నర్సింహులు మంగళవారం సాయంత్రం మద్యం తాగి ఇంటికి వచ్చాడు. మత్తులో బజ్జీలు తేవాలంటూ సూచించాడు. ఎవరూ వెళ్లకపోవడంతో అతనే వెళ్లి తెచ్చుకున్నాడు. ‘ఇంటి అద్దె కట్టడానికి డబ్బులు లేవు.. మద్యం తాగి బజ్జీలు తెచ్చుకుంటావా’ అని సునీత గొడవపడింది. ఈ సమయంలో నర్సింహులు భార్య, కుమారుడు ఇంట్లోంచి బయటికి వెళ్లారు. గొడవతో మనస్తాపం చెందిన సునీత ఇంట్లోకి వెళ్లి కొక్కేనికి చీరతో ఉరేసుకుంది. ఇది గమనించిన నర్సింహులు కుమార్తె చుట్టుపక్కల వారికి విషయం చెప్పింది. చుట్టుపక్కల వారు వచ్చి కిటికీలోంచి లోపలికి ప్రవేశించి కాపాడే ప్రయత్నం చేయగా.. అప్పటికే సునీత ప్రాణాలు కోల్పోయింది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని నర్సిహులు కుమార్తె దేవమ్మ నుంచి ఫిర్యాదు తీసుకున్నారు. నరసింహులును అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. Quote Link to comment Share on other sites More sharing options...
AndhraneedSCS Posted September 6, 2018 Report Share Posted September 6, 2018 Title is more interesting than the story. Story lo aa adi(masala) aa idi(action) miss ayyindi Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.