Jump to content

***** TG elections on Dec-7******


Android_Halwa

Recommended Posts

Quote

మర్రి ఆదిత్యారెడ్డిలపై ఆ పార్టీ వేటు వేసింది. 

marri shashidar reddy son TJS lo enduku join ayyadu assalu silent_I1

Link to comment
Share on other sites

తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ హృదయ పూర్వక నమస్కారాలు.

తెలంగాణ రాష్ట్ర సమితి నాయకత్వంలో ప్రజలు చేసిన సుదీర్ఘ పోరాటం ఫలితంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. పద్నాలుగేళ్లు అనేక కష్టనష్టాలకోర్చి, నిర్భంధాలను తట్టుకుని నిలిచి, పదవీ త్యాగాలు చేసి, తెలంగాణ ప్రజలందరినీ ఒక్కతాటిపై నడిపించింది టిఆర్ఎస్ పార్టీ. ఉద్యమ నాయకుడిగా శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ప్రదర్శించిన నిబద్ధతను, పోరాట పటిమను, ప్రాణాలను సైతం పణంగా పెట్టిన త్యాగనిరతిని తెలంగాణ ప్రజలు ఉన్నతంగా గౌరవించారు. నూతన రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించే బాధ్యతను కేసీఆర్ భుజస్కంధాల మీద మోపుతూ 2014 సార్వత్రిక ఎన్నికల్లో టిఆర్ఎస్ కు ఘన విజయాన్ని అందించారు. మీ ఆశీస్సులతో ఏర్పడిన టిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు అద్దం పట్టే విధంగా పునర్నిర్మాణ యజ్ఞాన్ని ప్రారంభించింది. ఈ నాలుగున్నరేళ్ల ప్రస్థానంలో దేశం దృష్టిని ఆకర్షించే విధంగా అనితర సాధ్యమైన ప్రగతిని సాధించింది. సమైక్య రాష్ట్రంలో జరిగిన జీవన విధ్వంసం మిగిల్చిన అనేక సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ ప్రజలలో నూతన విశ్వాసం నింపింది.

విఫలరాష్ట్రంగా మార్చే కుట్రలు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుండా అడ్డుపడిన శక్తులే, నూతన రాష్ట్రం నిలదొక్కుకోకుండా కుట్రలు పన్నినాయి. బాలారిష్టాలు కూడా దాటకమునుపే ప్రభుత్వాన్ని కూలదోసే కుట్రలకు తెగబడ్డాయి. పునర్విభజన చట్టం నిర్దేశించిన విధంగా మన కరెంటు మనకు ఇవ్వలేదు. ప్రభుత్వ రంగ సంస్థల విభజన, హైకోర్టు విభజన జరగనివ్వలేదు. ఈ విషయం ఎన్నిసార్లు విన్నవించినా, కేంద్ర ప్రభుత్వం ఉదాసీన వైఖరిని ప్రదర్శించింది తప్ప సహకరించలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఒక విఫల ప్రయోగం అనే భావన కలిగించడానికి అనేక కుటిల యత్నాలకు పాల్పడ్డాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ చూపిన దార్శనికత, పాలనా సామర్థ్యం, వ్యూహ చతురతల వల్ల రాష్ట్రం అవరోధాలన్నింటినీ అధిగమిస్తూ ప్రగతిపథంలో పురోగమించింది. ఆదర్శవంతమైన రాష్ట్రంగా దేశం ముందు నిలిచింది.

అవరోధాలు అధిగమిస్తూ అభివృద్ధి దిశలో…
నేడున్న తెలంగాణ రాష్ట్రం గతంలో ఒక రాష్ట్రంగా ఉండి ఉండలేదు. అందువల్ల రాష్ట్ర ఆర్థిక ధోరణులపై సరైన ప్రాతిపదిక అందుబాటులో లేదు. ఈ సంక్లిష్టస్థితిలో టిఆర్ఎస్ ప్రభుత్వం తన వ్యూహ చతురతతో రాష్ట్రాన్ని ముందుకు నడిపించింది. మరోవైపు అధికారుల కేటాయింపులో విపరీతమైన జాప్యం జరిగింది. ఇన్ని ప్రతికూలతల నడుమ, ఇన్ని పరిమితుల నడుమ కేసీఆర్ తన పరిపాలనా పటిమతో, చాకచక్యంతో రాష్ట్రాన్ని ప్రగతి దిశగా నడిపించారు. ఒకవైపు ప్రజలకు కావాల్సిన తక్షణ ఉపశమన, సంక్షేమ చర్యలు చేపడుతూనే, మరోవైపు అన్ని రంగాలలో దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకుని ప్రభుత్వం ముందడుగు వేసింది.

ప్రభుత్వం అనుసరించిన వ్యూహం విజయవంతమైంది. అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రజలకు అందినాయి. తొలి అడుగులోనే తీవ్రమైన విద్యుత్ సంక్షోభం సవాల్ గా నిలిచింది. సమైక్య పాలనలో మోటార్లు కాలిపోవడం, ట్రాన్స్ ఫార్మర్లు పేలిపోవడం, అర్థరాత్రి మోటారు పెట్టడానికి పోయి రైతులు ప్రాణాలు కోల్పోవడం, పంట చేతికొచ్చే సమయానికి నీరందించేందుకు కరెంటు లేక పంట నష్టపోవడం వంటి పరిణామాలు వ్యవసాయ రంగాన్నిపూర్తిగా దిగజార్చినాయి. టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన అనతి కాలంలోనే విద్యుత్ సమస్యను విజయవంతంగా పరిష్కరించింది. రైతాంగంలో కొత్త ఆశలు చిగురింప చేసింది. నిరంతరాయ విద్యుత్ వల్ల పారిశ్రామిక రంగం పుంజుకుంది. కార్మికులకు చేతినిండా పనిదొరుకుతున్నది. నూతనంగా పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకునే వారికి భరోసా కలిగింది.

సంక్షేమంలో స్వర్ణయుగం
టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాసంక్షేమానికి పెద్ద పీట వేసింది. సంక్షేమంలో స్వర్ణయుగం సృష్టించింది. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, బోదకాలు బాధితులు వంటి 40 లక్షల మంది పేదలకు ఆసరా పింఛన్లతో జీవన భద్రత లభిస్తున్నది. ఆడపిల్ల పెండ్లి కారణంగా అప్పుల పాలై చితికి పోతున్న కుటుంబాలను ఆదుకునే సదుద్దేశ్యంతో ప్రారంభించిన కల్యాణలక్ష్మి/షాదీ ముబారక్ పథకం సత్ఫలితాలనిస్తున్నది. 18 సంవత్సరాలు నిండిన వారికే ఆర్థిక సహాయం చేయడం వల్ల బాల్య వివాహాల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడం ఈ పథకం సాధించిన మరో విజయం. ప్రజలందరికీ ఆహార భద్రత కల్పించడం కోసం ప్రభుత్వం రూపాయికి కిలో చొప్పున ఒక్కొక్కరికీ నెలకు ఆరు కిలోల బియ్యం అందిస్తున్నది. విద్యార్థులందరికీ సన్నబియ్యంతో వండిన అన్నం పెడుతున్నది. గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా గిరిజనుల జీవితాలలో కల్లోలం సృష్టిస్తున్న గుడుంబాను అరికట్టడంలో ప్రభుత్వం విజయం సాధించింది. వారి జీవితాల్లో శాంతి నెలకొన్నది.

పేద ప్రజలకు ఇళ్లు కట్టించడంలో గత ప్రభుత్వాలు సంకుచిత విధానాన్ని అవలంభించాయి. పేదలు ఆత్మగౌరవంతో జీవించే విధంగా ఇండ్లు ఉండాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్ ప్రభుత్వం రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణానికి పూనుకున్నది. రెండు తరాలకు ఉపయోగ పడే విధంగా వంద శాతం సబ్సీడీతో ఇండ్ల నిర్మాణం సాగిస్తున్నది. ఎస్సీ, ఎస్టీల జనాభా నిష్పత్తికి తగిన స్థాయిలో నిధుల కేటాయింపు జరగడం కోసం ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక నిధి చట్టం అమలులోకి తెచ్చింది. మైనారిటీల సంక్షేమం కోసం దేశంలో ఏ రాష్ట్రం కేటాయించని స్థాయిలో ఏడాదికి రెండు వేల కోట్లను కేటాయించింది.

కుదుటపడిన వ్యవసాయం
సమైక్య రాష్ట్రంలో కుప్పకూలిన వ్యవసాయ రంగాన్ని నిలబెట్టడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు మంచి ఫలితాలను ఇచ్చాయి. రైతాంగానికి గొప్ప ఊరటనిచ్చాయి. 24 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్తుతో పాటు, సకాలంలో ఎరువులు, విత్తనాలు అందిస్తున్నది. కల్తీ విత్తనాలు, ఎరువుల అమ్మకాలను నిరోధించడానికి కఠినమైన చర్యలు చేపట్టింది.

పంట కాలంలో పెట్టుబడి కోసం రైతాంగం అక్కడా ఇక్కడా అప్పులు చేయాల్సిన అగత్యం ఉండకూడదని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు పథకం ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు పొందింది. రైతులకు పెట్టుబడి కోసం ఎకరానికి 4వేల చొప్పున రెండు పంటలకు 8వేల రూపాయలు దక్కుతుండంతో రైతాంగం హర్షం వ్యక్తం చేస్తున్నది. ఈ పథకాన్ని ఐక్యరాజ్యసమితి ప్రశంసించడం మనందరికీ గర్వకారణం. వ్యవసాయ భూముల వివరాలలో స్పష్టత కోసం ప్రభుత్వం చేపట్టిన సమగ్ర భూ రికార్డుల ప్రక్షాళన దేశ చరిత్రలోనే గొప్ప సంస్కరణ. ఈ ప్రక్షాళనతో భూ యాజమాన్య హక్కుల మీద స్పష్టత వచ్చింది. రైతులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగే అవసరం లేకుండానే పట్టాదారు పాసు పుస్తకాలు వారి చేతికి అందినాయి.

దురదృష్టవశాత్తు ఏ రైతైనా మరణిస్తే అతని కుటుంబం వీధిన పడొద్దనే మానవీయమైన ఆలోచనతో ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా రైతు ఏ కారణాల వల్ల మరణించినా 5 లక్షల రూపాయలను కేవలం పది రోజుల వ్యవధిలో ప్రభుత్వం ఆ కుటుంబానికి అందిస్తున్నది. వ్యవసాయ శాఖను బలోపేతం చేసేందుకు ప్రతీ ఐదువేల ఎకరాలకు ఒకరు చొప్పున వ్యవసాయ విస్తరణాధికారులను ప్రభుత్వం నియమించింది. రైతులు పరస్పరం చర్చించుకోవడం కోసం రైతు వేదికలు నిర్మిస్తున్నది. ప్రభుత్వం రాష్ట్రాన్ని వివిధ క్రాప్ కాలనీలుగా విభజిస్తున్నది. ఆయా ప్రాంతాల భూ భౌతిక పరిస్థితులను అనుసరించి రైతులు పంటలు వేసే విధంగా అవగాహన కల్పిస్తున్నది. రాష్ట్రంలోని రైతులందరినీ సంఘటితం చేసేందుకు టిఆర్ఎస్ ప్రభుత్వం రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేసింది. దుక్కిదున్నింది మొదలు గిట్టుబాటు ధర దాకా అన్ని దశల్లో రైతుకు అండగా నిలవడమే లక్ష్యంగా రైతు సమన్వయ సమితులు పనిచేస్తున్నాయి. రైతులకు గిట్టుబాటు ధర లభించడం కోసం మరో నూతన విధానాన్ని రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం అమలులోకి తెస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పుతుంది. ఐకెపి ఉద్యోగులను పర్మినెంటు చేసి, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల నిర్వహణ బాధ్యతను మహిళా సంఘాలతో కలిపి ఐకెపి ఉద్యోగులకు అప్పగించడం జరుగుతుంది. ఈ యూనిట్లు తయారు చేసే కల్తీ లేని ఆహార పదార్థాలను ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందుబాటులోకి తెస్తుంది.

శరవేగంగా ప్రాజెక్టుల నిర్మాణం
కోటి ఎకరాలకు సాగు నీరు అందించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం పాలమూరు- రంగారెడ్డి, కాళేశ్వరం, సీతారామ, డిండి వంటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని యుద్ధప్రాతిపదికన సాగిస్తున్నది. మరోవైపు పెండింగ్ ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేసి 12లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగు నీరు అందిస్తున్నది. రాష్ట్రానికి శాశ్వత ప్రయోజనం చేకూరే విధంగా మిషన్ కాకతీయ ద్వారా వేలాది చెరువులను పునరుద్ధరించింది. ప్రజల త్రాగు నీటి అవసరాలు తీర్చడం కోసం మిషన్ భగీరథ అనే బృహత్తర పథకాన్ని చేపట్టింది. స్వచ్ఛమైన నదీ జలాలను ఇంటింటికీ నల్లాల ద్వారా అందించే ఈ పథకం దాదాపుగా పూర్తయ్యింది. మిషన్ భగీరథ పథకం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది.

గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పునరుత్తేజం
గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం కోసం వ్యవసాయ అనుబంధ వృత్తులకు పెద్దయెత్తున ప్రోత్సాహం అందిస్తున్నది. మాంసం ఉత్పత్తిలో రాష్ట్రం స్వయం సమృద్ధిని సాధించేందుకు, రాష్ట్ర వ్యాప్తంగా గొల్ల కుర్మలు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు పెద్దయెత్తున గొర్రెల పంపిణీ చేస్తున్నది. మత్సకారుల ఉపాధి పెరిగే విధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జలాశయాలలో ప్రభుత్వమే చేపలు పోసి వాటిని పట్టుకునే హక్కును మత్సకారులకు అందిస్తున్నది. చేనేత కార్మికులను ఆదుకోవడం కోసం వారికి పెద్దయెత్తున పని కల్పించడంతో పాటు నూలు, రసాయనాలపై 50 శాతం సబ్సిడీ ఇస్తున్నది.

హైదరాబాద్ లో కల్లు దుకాణాలను పునరుద్ధరించి గౌడ సోదరుల హక్కును కాపాడింది. చెట్ల పన్నును శాశ్వతంగా రద్దు చేసి గొప్ప ఊరట కలిగించింది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్దయెత్తున తాటి ఈత వనాల పెంపకం చేపట్టింది.

విశ్వకర్మలు, రజకులు, నాయీ బ్రాహ్మణులు తదితర వెనుకబడిన కుల వృత్తులకు ఆర్థిక ప్రేరణ ఇస్తున్నది. సంచార కులాల సంక్షేమం కోసం ఏటా వెయ్యి కోట్ల బడ్జెట్ తో ఎంబీసీ కార్పోరేష్ ఏర్పాటు చేసింది. బలహీన వర్గాలలోని యువతకు స్వయం ఉపాధి కల్పన కోసం బ్యాంకులతో సంబంధం లేకుండా నేరుగా రుణ సదుపాయం కల్పిస్తున్నది.

విద్యా విధానం
కేజీ టు పీజీ ఉచిత నిర్భంద విద్య ప్రణాళికలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా, ఉన్నత ప్రమాణాలతో కూడిన 663 కొత్త రెసిడెన్షియల్ పాఠశాలలను నెలకొల్పింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల కోసం ఏర్పాటు చేసిన ఈ విద్యాలయాలలో ప్రతీ విద్యార్థిపై ఏటా లక్షా ఇరవైఐదు వేల రూపాయలు ఖర్చు చేస్తున్నది. ఈ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు గొప్ప విజయాలను సాధిస్తున్నారు. పేద విద్యార్థులు విదేశాలలో చదువుకోవడం కోసం 20 లక్షల రూపాయల ఓవర్సీస్ స్కాలర్ షిప్ అందిస్తున్నది. వివిధ పోటీ పరీక్షలకు శిక్షణను ఇచ్చేందుకు స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేసింది.

ఆరోగ్య తెలంగాణ
టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా వైద్యాన్ని గణనీయంగా అభివృద్ధి చేసింది. ప్రభుత్వ ఆస్పత్రులలో వసతులను మెరుగుపరిచింది. రాష్ట్ర వ్యాప్తంగా డయాలసిస్ సెంటర్లను, డయాగ్నస్టిక్ సెంటర్లను, క్యాన్సర్ పరీక్షా కేంద్రాలను పెద్దసంఖ్యలో ఏర్పాటు చేసింది. నగరంలోని పేదల కోసం బస్తీ దవాఖానాలను నిర్వహిస్తున్నది. సురక్షిత ప్రసవాలను ప్రోత్సహించేందుకు కేసీఆర్ కిట్స్ పథకం ప్రవేశపెట్టింది. ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవించిన మహిళలకు రూ.12వేల ఆర్థిక సహాయం అందిస్తున్నది. ఆడపిల్లపుడితే మరో వెయ్యి రూపాయలు అదనంగా అందిస్తున్నది. తల్లీ బిడ్డలకు ఉపయోగపడే విధంగా 16 రకాల వస్తువులతో కూడిన హెల్త్ కిట్ ను అందిస్తున్నది. దృష్టిలోపంతో బాధపడే వారికి కంటి వైద్యాన్ని చేరువలోకి తీసుకురావడం కోసం కంటి వెలుగు పథకం ప్రవేశ పెట్టింది. ఉచితంగా పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి మందులు,అద్దాలు అందిస్తున్నది. శస్త్ర చికిత్సలు జరిపిస్తున్నది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మరణించిన వారి మృతదేహాలను ఉచితంగా ఇంటికి చేర్చడానికి పరమపద వాహనాలను ఏర్పాటు చేసింది.

ఉద్యోగుల సంక్షేమం
టిఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగుల వేతనాలను 43 శాతం పెంచింది. తెలంగాణ ఇంక్రిమెంటు అందించింది. హెల్త్ కార్డుల ద్వారా ఉద్యోగుల వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది. ఉద్యోగాల నియామకాల్లో స్థానికుల హక్కులను కాపాడుతూ ప్రభుత్వం కొత్త జోనల్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఈ విధానం ద్వారా కొత్త ఉద్యోగాల నియామకం కోసం కసరత్తు ప్రారంభించింది. అంగన్ వాడీ, ఆశా వర్కర్లు, హోంగార్డులు, ఐకెపి ఉద్యోగులు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, ఉపాధి హామీ పథకం ఉద్యోగులు, విఏవోలు, విఆర్వోలు, పారిశుధ్య కార్మికులు తదితర అల్పాదాయ ఉద్యోగుల వేతనాలను టిఆర్ఎస్ ప్రభుత్వం భారీగా పెంచింది.

భారీ పరిపాలనా సంస్కరణలు
ప్రజలకు పరిపాలనను చేరువ చేయడం కోసం ప్రభుత్వం సాహసోపేతంగా భారీ పరిపాలనా సంస్కరణలు చేపట్టింది. 21 కొత్త జిల్లాలు, 26 కొత్త డివిజన్లు, 125 కొత్త మండలాలు, 71 కొత్త మున్సిపాలిటీలు, 4,383 కొత్త గ్రామ పంచాయితీలను ఏర్పాటు చేసింది. తండాలు, గూడెంలను గ్రామ పంచాయితీలుగా గుర్తించాలనే ఎస్టీ ప్రజల చిరకాల వాంఛను ప్రభుత్వం నెరవేర్చింది. దీనివల్ల రాష్ట్రంలో 3,042 గ్రామ పంచాయితీల్లో ఎస్టీ సోదరులే సర్పంచులు అయ్యే అవకాశం కలిగింది. పోలీస్ శాఖలో కూడా పరిపాలనా సంస్కరణలు అమలు చేసింది. 7 కొత్త పోలీస్ కమీషనరేట్లను, 24 కొత్త సబ్ డివిజన్లను, 29 కొత్త సర్కిళ్లను, 102 కొత్త పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసింది.

పారిశ్రామికాభివృద్ధి
రిశ్రామికాభివృద్ధి కోసం టిఎస్ ఐపాస్ అనే నూతన చట్టాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఈ చట్టం వల్ల పరిశ్రమల స్థాపనలో ఎటువంటి ఆటంకాలు లేకుండా కేవలం 15 రోజుల్లోనే అనుమతులు లభిస్తున్నాయి. ఈ సంస్కరణ వల్ల జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు తెలంగాణకు తరలి వస్తున్నాయి. ఇప్పటి వరకు 8,220 పరిశ్రమలకు అనుమతులు లభించాయి. 1.32 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. 2.50 లక్షల మందికి ఉద్యోగాలు లభించాయి. ఐటి హబ్ గా హైదరాబాద్ ఎదగడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున సౌకర్యాలు కల్పిస్తున్నది. అంకుర పరిశ్రమలను ప్రోత్సహించేందుకు నెలకొల్పిన టిహబ్ ఇతర రాష్ట్రాలకు మోడల్ గా నిలిచింది.

శాంతి భద్రతలు
రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం ప్రదర్శిస్తున్న సమర్థత ప్రశంసలు పొందుతున్నది. షిటీమ్స్ వల్ల మహిళలకు భద్రత కల్పించడంలో సమర్థవంతమైన పాత్ర నిర్వహిస్తున్నాయి.

భాషా సాంస్కృతిక రంగాలు
తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్నది. బతుకమ్మ, బోనాల పండుగలను అధికారికంగా నిర్వహిస్తున్నది. మత సామరస్యానికి సంకేతంగా రంజాన్, క్రిస్మస్, బతుకమ్మ పండుగల సందర్భంగా ప్రజలకు కొత్త బట్టలు పంపిణీ చేస్తున్నది. తెలంగాణ భాషా,సాహిత్యాల కీర్తిని విశ్వవ్యాప్తం చేసే విధంగా ప్రపంచ తెలుగు మహాసభలను హైదరాబాద్ వేదికగా అంగరంగవైభవంగా నిర్వహించింది. సాహిత్య అకాడమీ, సంగీత నాటక అకాడమీలను ఏర్పాటు చేసింది. తెలుగు భాషా పరిరక్షణ కోసం పదో తరగతి వరకు తెలుగు భాషా బోధనను తప్పనిసరి చేసింది.

ఐక్యరాజ్యసమితి నుంచి నీతి ఆయోగ్ వరకు సర్వత్రా ప్రశంసలు
రైతుల సంక్షేమం కోసం అమలవుతున్న 20 వినూత్న పథకాలతో ఐక్యరాజ్యసమితి రూపొందిచిన జాబితాలో రైతుబంధు, రైతుబీమా పథకాలకు చోటుదక్కడం తెలంగాణ రాష్ట్రానికి లభించిన అరుదైన ప్రపంచ గుర్తింపు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలను ఇతర రాష్ట్రాల్లోనూ అమలు చేయాలని నీతి ఆయోగ్ సిఫారసు చేయడం తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి దిక్సూచిగా నిలిపింది.ప్రధాన మంత్రి, కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉన్నతాధికారుల బృందాలు తెలంగాణలో పర్యటించి, మన పథకాలను అధ్యయనం చేసి, వాళ్ల రాష్ట్రాలలో అమలుచేసేందుకు పూనుకోవడం తెలంగాణ బిడ్డలుగా మనందరికీ గర్వకారణం. వ్యవసాయ నిపుణుడైన స్వామినాథన్, నోబుల్ బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి, వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్రసింగ్ లాంటి వారు తెలంగాణ ప్రభుత్వ పథకాలను ప్రశంసించడం మనకు దక్కిన గుర్తింపు. 200కు పైగా జాతీయ, అంతర్జాతీయ అవార్డులు రావడం మన పనితీరుకులభించిన ఫలితం.

మేనిఫెస్టోలో చెప్పని హామీలు కూడా అమలు
2014 ఎన్నికల సందర్భంగా ప్రకటించిన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడంతో పాటు, మేనిఫెస్టోలో ప్రకటించకున్నా సరే, ప్రజలకు అవసరమని భావించిన ప్రభుత్వం అనేక కొత్త పథకాలను ప్రవేశ పెట్టింది. రైతు బంధు, రైతుబీమా, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, మిషన్ భగీరథ, కల్యాణలక్ష్మి/షాదీ ముబారక్, కేసీఆర్ కిట్స్, కంటి వెలుగు లాంటి 76 కొత్త పథకాలను టిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్నది.

దేశంలో మరెక్కడా లేని పథకాలు
దేశంలో మరెక్కడా లేని పథకాలు అమలు చేస్తూ తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలబడింది. రైతులకు ప్రభుత్వమే పెట్టుబడి ఇవ్వడం, రైతులకు ప్రభుత్వ ఖర్చుతో బీమా కల్పించడం, వ్యవసాయానికి 24 గంటలు ఉచితంగా కరెంటు ఇవ్వడం, పేదింటి అమ్మాయిల పెళ్లికి ప్రభుత్వమే ఖర్చులు భరించడం, పూర్తి ప్రభుత్వ ఖర్చుతో పేదలకు ఇండ్లు కట్టించడం, ప్రజలందరికీ ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించడం లాంటి 64 కార్యక్రమాలు తెలంగాణలో తప్ప దేశంలో మరెక్కడా అమలు కావడం లేదు.

అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణ
కొత్తగా ఏర్పడిన రాష్ట్రమైనప్పటికీ, తెలంగాణ రాష్ట్రం నేడు దేశంలో అనేక విషయాల్లో అగ్రగామిగా నిలబడింది. ఆదాయాభివృద్ధి వృద్ధిరేటులో, తలసరి విద్యుత్ వినియోగం వృద్ధిరేటులో, వ్యవసాయానికి ఎక్కువ విద్యుత్ ఇచ్చే విషయంలో, సంక్షేమ పథకాల అమలులో, నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో, విద్య, వైద్య రంగాలకు ఎక్కువ నిధులు ఖర్చు పెట్టడంలో, మొక్కల పెంపకంలో, ప్రతీ ఇంటికి సురక్షిత మంచినీరు ఇచ్చే విషయంతో పాటు 20అంశాల్లో తెలంగాణ ఇవాళ దేశంలోనే మొదటి స్థానం ఆక్రమించింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, సోలార్ విద్యుదుత్పత్తి లాంటి విషయాల్లో అగ్రరాష్ట్రాలలో ఒకటిగా నిలబడింది.

ప్రస్తుత పథకాలన్నీ కొనసాగింపు
తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు సత్ఫలితాలనిచ్చాయి. ప్రజలకు నేరుగా మేలు చేకూరుస్తున్నాయి. ప్రభుత్వం అమలు చేసిన ప్రతీ పథకం ప్రజల అనుభవంలో ఉంది. ఆ పథకాలన్నీ ప్రజల ఆశీర్వాదం పొందాయి.

ప్రజల్లో మనోధైర్యాన్ని కలిగస్తూ, నిరంతర ప్రగతిశీల రాష్ట్రంగా నేడు తెలంగాణ యావత్ ప్రపంచం ముందు సగర్వంగా నిలబడింది. 2018 ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా తిరిగి అధికారంలోకి వచ్చే టిఆర్ఎస్ పార్టీ, ప్రస్తుత పథకాలన్నింటినీ మరింత విస్తృత పరుస్తూ, కొనసాగిస్తుంది.

సంపద పెంచుతున్నాం – ప్రజలకు పంచుతున్నాం
రాష్ట్రంలో స్థిరమైన పరిపాలన అందిస్తూ రాజకీయ అవినీతిని తుద ముట్టించడం ద్వారా టిఆర్ఎస్ ప్రభుత్వం ఆదాయ వృద్ధిరేటును గణనీయంగా పెంచింది. కేసీఆర్ దార్శనికతతో పాటు, అవినీతికి ఆస్కారం ఇవ్వని అచంచలమైన నిబద్ధత వల్ల సంపద పెరిగింది. మొదటి నాలుగేళ్లలో రాష్ట్రం 17.17 శాతం సగటు వార్షిక ఆదాయ వృద్ధిరేటు సాధించింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో కూడా ఇప్పటి వరకు 19.83 వృద్ధిరేటు సాధించింది. పెరిగిన సంపదను పేదలకు పంచడమే లక్ష్యంగా ప్రభుత్వం పథకాలను రూపొందించింది. ఆదాయ వృద్ధిరేటు ఇలాగే కొనసాగాలంటే రాజకీయ స్థిరత్వాన్ని అందించే టిఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావల్సిన ఆవశ్యకత ఉంది.

భవిష్యత్ ప్రణాళిక
టిఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రాగానే తీసుకోదల్చిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లోని కొన్ని ప్రముఖ అంశాలను ఈ మేనిఫెస్టోలో పొందు పరచడం జరిగింది. టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకులు గౌరవ శ్రీ కె.కేశవరావు గారి నాయకత్వంలోని మేనిఫెస్టో కమిటీ వివిధ వర్గాల నుంచి తమకు అందిన వందలాది విజ్ఞాపనలు కూలంకశంగా పరిశీలించింది. తెలంగాణ సమగ్రాభివృద్ధి దిశగా టిఆర్ఎస్ దృక్పథాన్ని ప్రతిబింబించే విధంగా ప్రతిపాదనలు చేసింది. వాటిలోంచి కొన్ని ప్రముఖ అంశాలను మేనిఫెస్టోలో ప్రస్తావిస్తున్నాం. సాధ్యాసాధ్యాలను పూర్తి స్థాయిలో పరిశీలించి, మిగతా ప్రతిపాదనలను అధికారంలోకి రాగానే అమలు చేయడం జరగుతుంది.

గడిచిన నాలుగున్నరేళ్లలో 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని హామీలను టిఆర్ఎస్ ప్రభుత్వం నెరవేర్చింది. వీటితో పాటు మేనిఫెస్టోలో పేర్కొనకపోయినా ప్రజల అవసరాల ప్రాతిపదికగా 76 కొత్త పథకాలను అమలు చేసింది. అదే విధంగా రాబోయే రోజుల్లో కూడా ప్రస్తుతం ప్రకటిస్తున్న హామీల అమలుకు మాత్రమే పరిమితం కాకుండా ప్రజల అవసరాలు, ఆకాంక్షలు, వివిధ వర్గాల డిమాండ్లు ఎప్పటికప్పుడు పరిగణలోకి తీసుకుంటూ నూతన పథకాలను అమల్లోకి తెస్తాం. టిఆర్ఎస్ భవిష్యత్ కార్యాచరణ కేవలం ఈ హామీలు నెరవేర్చడంతో ముగిసిపోయేది కాదని, కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ప్రజా ప్రయోజనాలే పరమావధిగా నిత్యనూతనంగా, నిరంతరంగా కొనసాగుతుందని వినమ్రంగా తెలియ చేస్తున్నాము.

2018 మేనిఫెస్టో – ముఖ్యమైన హామీలు
1. అన్నిరకాల ఆసరా పెన్షన్లు రూ.1,000 నుంచి రూ.2,016 వరకు పెంచడం జరుగుతుంది. వికలాంగుల పెన్షన్లను రూ.1500 నుంచి రూ.3,016 వరకు పెంచడం బీడి కార్మికుల‌ పీఎఫ్‌ క‌టాఫ్‌ డేట్ ను 2018 వరకు పొడిగించడం జరుగుతుంది.
2. వృద్దాప్య పెన్షన్ అర్హత వయసును 65 ఏండ్ల నుంచి 57 ఏండ్లకు తగ్గించడం జరుగుతుంది.
3. నిరుద్యోగ సోదరులకు నెలకు రూ.3016 భృతి అందించడం జరుగుతుంది.
4. ప్రస్తుత పద్ధతిలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం కొనసాగిస్తూనే, సొంతస్థలం ఉన్నఅర్హులైన పేదలకు డబుల్ బెడ్రూం ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు అందించడం జరుగుతుంది.
5. రైతుబంధు కింద ఏడాదికి ఎకరాకు అందిస్తున్న సాయాన్ని 8వేల నుంచి 10వేల రూపాయలకు పెంచడం జరుగుతుంది.
6. రైతులకు రూ. 1 లక్ష వరకున్న పంట రుణాలను మాఫీ చేయడం జరుగుతుంది.
7. రైతు స‌మ‌న్వ‌య స‌మితి స‌భ్యుల‌కు గౌర‌వ భృతి అందించడం జరుగుతుంది.
8. ఎస్సీ, ఎస్టీ వర్గాల సమగ్ర అభివృద్ధి కోసం ప్రత్యేక పథకాలు రూపొందించేందుకు నియమించిన కమిటీ ఇచ్చే నివేదికను ప్రభుత్వం అమలు చేస్తుంది.
9. చట్టసభల్లో బిసిలకు 33 శాతం, మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు కోసం ప్రభుత్వం పోరాడుతుంది.
10. ఎస్టీలకు 12 శాతం, మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది. ఈ రిజర్వేషన్లు అమలు చేయడం కోసం కేంద్రంతో రాజీలేని పోరాటం చేస్తుంది.
11. ఎస్సీ వర్గీకరణ కోసం అసెంబ్లీ తీర్మానం చేసి, కేంద్రానికి పంపడం జరిగింది. కేంద్రం నుంచి ఆమోదం రావడం కోసం టిఆర్ఎస్ పోరాటం చేస్తుంది.
12. వివిధ కులాల కేటగిరీ మార్పు కోసం వచ్చిన విజ్ఞాపనలను సానుభూతితో పరిశీలిస్తుంది.
13. రెడ్డి కార్పొరేషన్, వైశ్య కార్పొరేషన్ తో పాటు ఆర్థికంగా వెనుకబడిన ఇతర వర్గాల సంక్షేమం కోసం కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది.
14. వివిధ సామాజిక వర్గాల నుంచి కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని వచ్చిన డిమాండ్లను రాబోయే టిఆర్ఎస్ ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తుంది.
15. అగ్ర కులాల్లోని పేదల అభ్యున్నతి కోసం ప్రత్యేక పథకాలు ప్రవేశ పెట్టడం జరుగుతుంది.
16. రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పుతుంది. ఐకెపి ఉద్యోగులను పర్మినెంటు చేసి, ఈ యూనిట్ల నిర్వహణ బాధ్యతను మహిళా సంఘాలతో కలిపి ఐకెపి ఉద్యోగులకు అప్పగించడం జరుగుతుంది. ఈ యూనిట్లు తయారు చేసే కల్తీ లేని ఆహార పదార్థాలను ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందుబాటులోకి తెస్తుంది.
17. కంటి వెలుగు పథకం తరహాలోనే ప్రజలందరికీ ఇతర ఆరోగ్య పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తుంది. ప్రతీ వ్యక్తి హెల్త్ ప్రొఫైల్ రికార్డు చేసి, తెలంగాణ రాష్ట్ర హెల్త్ ప్రొఫైల్ రూపొందిస్తుంది.
18. ప్రభుత్వ ఉద్యోగుల‌కు సబబైన, సముచితమైన రీతిలో వేతన సవరణ చేస్తుంది.
19. ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వ‌య‌సును 58 నుంచి 61 సంవత్సరాలకు పెంచడం జరుగుతుంది. దీనికి సమాంతరంగా నిరుద్యోగులకు ఎక్కువ అవకాశాలు కల్పించడం కోసం ఉద్యోగాల నియామక వయో పరిమితిని మూడేళ్లు పెంచడం జరుగుతుంది.
20. పెన్ష‌న‌ర్ల‌ కోసం ప్ర‌త్యేక డైరెక్ట‌రేట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది.
21. అటవీ ప్రాంతాల్లోని గిరిజన, గిరిజనేతర రైతుల భూ వివాదాలను పరిష్కరించి యాజమాన్య హక్కులు కల్పిస్తుంది. పోడు భూముల విషయంలో నెలకొన్న వివాదాలను త్వరితగతిన పరిష్కరిస్తుంది. వారికి ఇతర రైతులకు అందిస్తున్న ప్రయోజనాలను వర్తింపచేస్తుంది.
22. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ స్థాపించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
23. సింగరేణి భూముల్లో ఇండ్లు కట్టుకున్న వారికి పట్టాలు ఇస్తుంది.
24. హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. వీటిని మరింత ముమ్మరం చేయడం జరుగుతుంది.

టిఆర్ఎస్ ను ఆశీర్వదించండి – అభివృద్ధి యజ్ఞానికి అండగా నిలవండి
ఉద్యమ కార్యాచరణలో, ప్రభుత్వ నిర్వహణలో టిఆర్ఎస్ ప్రదర్శించిన చిత్తశుద్ధి ప్రజల మన్ననలు పొందింది. నిన్నటి దాకా అస్తిత్వానికే నోచుకోని తెలంగాణ నేడొక ఆదర్శ రాష్ట్రంగా ప్రశంసలు పొందుతున్నది. ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు అడుగడుగునా అవరోధాలు కల్పించాయి. తమ అల్పమైన రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజా ప్రయోజనాలకు విఘాతం కలిగించాయి. అబద్ధపు ప్రచారాలతో, నిరాధారమైన విమర్శలతో అధికార యంత్రాంగంలో ఆత్మస్థైర్యం దెబ్బతీసేందుకు ప్రయత్నించాయి. కోర్టుల్లో కేసులు వేసి, ప్రాజెక్టుల నిర్మాణాన్ని అడ్డుకోవడానికి కుట్రలు చేశాయి. ప్రగతి నిరోధకుల ఆగడాలకు అడ్డుకట్ట వేయడం కోసం వారిని ప్రజా న్యాయస్థానంలో నెలబెట్టాలని టిఆర్ఎస్ నిర్ణయించింది. ఎన్నికల సమరంలో దూకింది. ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు. మీ తీర్పే శిరోధార్యం.

తెలంగాణ ప్రజలే అధిష్టానంగా ఎవరికీ తలవంచకుండా, ఏ వత్తిడిలకు లొంగకుండా తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాజీలేని వైఖరి అవలంభించే ఒకే ఒక పార్టీ టిఆర్ఎస్ మాత్రమే. చిత్తశుద్ధితో కేసీఆర్ తలపెట్టిన అభివృద్ధి యజ్ఞం కొనసాగేందుకు మరోసారి మద్దతుగా నిలవాలని తెలంగాణ ప్రజలను సవినయంగా కోరుతున్నాం. రాష్ట్రంలోని అన్ని వర్గాలకు, అన్ని ప్రాంతాల ప్రజలకు సమాన న్యాయం, సమాన అభివృద్ధి లభించడం కోసం, తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడం కోసం ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్ ను గెలిపించమని విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రజల బతుకులు పండించే బంగారు తెలంగాణ నిర్మాణం కోసం సాగుతున్న మహోన్నత కృషికి అండదండలు ఇవ్వవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తున్నాము.

జై తెలంగాణ !! జైజై తెలంగాణ !!

తెలంగాణ రాష్ట్ర సమితి

http://trspartyonline.org/manifesto

Link to comment
Share on other sites

2018 మేనిఫెస్టో – ముఖ్యమైన హామీలు
1. అన్నిరకాల ఆసరా పెన్షన్లు రూ.1,000 నుంచి రూ.2,016 వరకు పెంచడం జరుగుతుంది. వికలాంగుల పెన్షన్లను రూ.1500 నుంచి రూ.3,016 వరకు పెంచడం బీడి కార్మికుల‌ పీఎఫ్‌ క‌టాఫ్‌ డేట్ ను 2018 వరకు పొడిగించడం జరుగుతుంది.
2. వృద్దాప్య పెన్షన్ అర్హత వయసును 65 ఏండ్ల నుంచి 57 ఏండ్లకు తగ్గించడం జరుగుతుంది.
3. నిరుద్యోగ సోదరులకు నెలకు రూ.3016 భృతి అందించడం జరుగుతుంది.
4. ప్రస్తుత పద్ధతిలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం కొనసాగిస్తూనే, సొంతస్థలం ఉన్నఅర్హులైన పేదలకు డబుల్ బెడ్రూం ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు అందించడం జరుగుతుంది.
5. రైతుబంధు కింద ఏడాదికి ఎకరాకు అందిస్తున్న సాయాన్ని 8వేల నుంచి 10వేల రూపాయలకు పెంచడం జరుగుతుంది.
6. రైతులకు రూ. 1 లక్ష వరకున్న పంట రుణాలను మాఫీ చేయడం జరుగుతుంది.
7. రైతు స‌మ‌న్వ‌య స‌మితి స‌భ్యుల‌కు గౌర‌వ భృతి అందించడం జరుగుతుంది.
8. ఎస్సీ, ఎస్టీ వర్గాల సమగ్ర అభివృద్ధి కోసం ప్రత్యేక పథకాలు రూపొందించేందుకు నియమించిన కమిటీ ఇచ్చే నివేదికను ప్రభుత్వం అమలు చేస్తుంది.
9. చట్టసభల్లో బిసిలకు 33 శాతం, మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు కోసం ప్రభుత్వం పోరాడుతుంది.
10. ఎస్టీలకు 12 శాతం, మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది. ఈ రిజర్వేషన్లు అమలు చేయడం కోసం కేంద్రంతో రాజీలేని పోరాటం చేస్తుంది.
11. ఎస్సీ వర్గీకరణ కోసం అసెంబ్లీ తీర్మానం చేసి, కేంద్రానికి పంపడం జరిగింది. కేంద్రం నుంచి ఆమోదం రావడం కోసం టిఆర్ఎస్ పోరాటం చేస్తుంది.
12. వివిధ కులాల కేటగిరీ మార్పు కోసం వచ్చిన విజ్ఞాపనలను సానుభూతితో పరిశీలిస్తుంది.
13. రెడ్డి కార్పొరేషన్, వైశ్య కార్పొరేషన్ తో పాటు ఆర్థికంగా వెనుకబడిన ఇతర వర్గాల సంక్షేమం కోసం కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది.
14. వివిధ సామాజిక వర్గాల నుంచి కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని వచ్చిన డిమాండ్లను రాబోయే టిఆర్ఎస్ ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తుంది.
15. అగ్ర కులాల్లోని పేదల అభ్యున్నతి కోసం ప్రత్యేక పథకాలు ప్రవేశ పెట్టడం జరుగుతుంది.
16. రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పుతుంది. ఐకెపి ఉద్యోగులను పర్మినెంటు చేసి, ఈ యూనిట్ల నిర్వహణ బాధ్యతను మహిళా సంఘాలతో కలిపి ఐకెపి ఉద్యోగులకు అప్పగించడం జరుగుతుంది. ఈ యూనిట్లు తయారు చేసే కల్తీ లేని ఆహార పదార్థాలను ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందుబాటులోకి తెస్తుంది.
17. కంటి వెలుగు పథకం తరహాలోనే ప్రజలందరికీ ఇతర ఆరోగ్య పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తుంది. ప్రతీ వ్యక్తి హెల్త్ ప్రొఫైల్ రికార్డు చేసి, తెలంగాణ రాష్ట్ర హెల్త్ ప్రొఫైల్ రూపొందిస్తుంది.
18. ప్రభుత్వ ఉద్యోగుల‌కు సబబైన, సముచితమైన రీతిలో వేతన సవరణ చేస్తుంది.
19. ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వ‌య‌సును 58 నుంచి 61 సంవత్సరాలకు పెంచడం జరుగుతుంది. దీనికి సమాంతరంగా నిరుద్యోగులకు ఎక్కువ అవకాశాలు కల్పించడం కోసం ఉద్యోగాల నియామక వయో పరిమితిని మూడేళ్లు పెంచడం జరుగుతుంది.
20. పెన్ష‌న‌ర్ల‌ కోసం ప్ర‌త్యేక డైరెక్ట‌రేట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది.
21. అటవీ ప్రాంతాల్లోని గిరిజన, గిరిజనేతర రైతుల భూ వివాదాలను పరిష్కరించి యాజమాన్య హక్కులు కల్పిస్తుంది. పోడు భూముల విషయంలో నెలకొన్న వివాదాలను త్వరితగతిన పరిష్కరిస్తుంది. వారికి ఇతర రైతులకు అందిస్తున్న ప్రయోజనాలను వర్తింపచేస్తుంది.
22. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ స్థాపించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
23. సింగరేణి భూముల్లో ఇండ్లు కట్టుకున్న వారికి పట్టాలు ఇస్తుంది.
24. హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. వీటిని మరింత ముమ్మరం చేయడం జరుగుతుంది.

  • Upvote 1
Link to comment
Share on other sites

10 minutes ago, timmy said:

2018 మేనిఫెస్టో – ముఖ్యమైన హామీలు
1. అన్నిరకాల ఆసరా పెన్షన్లు రూ.1,000 నుంచి రూ.2,016 వరకు పెంచడం జరుగుతుంది. వికలాంగుల పెన్షన్లను రూ.1500 నుంచి రూ.3,016 వరకు పెంచడం బీడి కార్మికుల‌ పీఎఫ్‌ క‌టాఫ్‌ డేట్ ను 2018 వరకు పొడిగించడం జరుగుతుంది.
2. వృద్దాప్య పెన్షన్ అర్హత వయసును 65 ఏండ్ల నుంచి 57 ఏండ్లకు తగ్గించడం జరుగుతుంది.
3. నిరుద్యోగ సోదరులకు నెలకు రూ.3016 భృతి అందించడం జరుగుతుంది.
4. ప్రస్తుత పద్ధతిలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం కొనసాగిస్తూనే, సొంతస్థలం ఉన్నఅర్హులైన పేదలకు డబుల్ బెడ్రూం ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు అందించడం జరుగుతుంది.
5. రైతుబంధు కింద ఏడాదికి ఎకరాకు అందిస్తున్న సాయాన్ని 8వేల నుంచి 10వేల రూపాయలకు పెంచడం జరుగుతుంది.
6. రైతులకు రూ. 1 లక్ష వరకున్న పంట రుణాలను మాఫీ చేయడం జరుగుతుంది.
7. రైతు స‌మ‌న్వ‌య స‌మితి స‌భ్యుల‌కు గౌర‌వ భృతి అందించడం జరుగుతుంది.
8. ఎస్సీ, ఎస్టీ వర్గాల సమగ్ర అభివృద్ధి కోసం ప్రత్యేక పథకాలు రూపొందించేందుకు నియమించిన కమిటీ ఇచ్చే నివేదికను ప్రభుత్వం అమలు చేస్తుంది.
9. చట్టసభల్లో బిసిలకు 33 శాతం, మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు కోసం ప్రభుత్వం పోరాడుతుంది.
10. ఎస్టీలకు 12 శాతం, మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది. ఈ రిజర్వేషన్లు అమలు చేయడం కోసం కేంద్రంతో రాజీలేని పోరాటం చేస్తుంది.
11. ఎస్సీ వర్గీకరణ కోసం అసెంబ్లీ తీర్మానం చేసి, కేంద్రానికి పంపడం జరిగింది. కేంద్రం నుంచి ఆమోదం రావడం కోసం టిఆర్ఎస్ పోరాటం చేస్తుంది.
12. వివిధ కులాల కేటగిరీ మార్పు కోసం వచ్చిన విజ్ఞాపనలను సానుభూతితో పరిశీలిస్తుంది.
13. రెడ్డి కార్పొరేషన్, వైశ్య కార్పొరేషన్ తో పాటు ఆర్థికంగా వెనుకబడిన ఇతర వర్గాల సంక్షేమం కోసం కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది.
14. వివిధ సామాజిక వర్గాల నుంచి కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని వచ్చిన డిమాండ్లను రాబోయే టిఆర్ఎస్ ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తుంది.
15. అగ్ర కులాల్లోని పేదల అభ్యున్నతి కోసం ప్రత్యేక పథకాలు ప్రవేశ పెట్టడం జరుగుతుంది.
16. రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పుతుంది. ఐకెపి ఉద్యోగులను పర్మినెంటు చేసి, ఈ యూనిట్ల నిర్వహణ బాధ్యతను మహిళా సంఘాలతో కలిపి ఐకెపి ఉద్యోగులకు అప్పగించడం జరుగుతుంది. ఈ యూనిట్లు తయారు చేసే కల్తీ లేని ఆహార పదార్థాలను ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందుబాటులోకి తెస్తుంది.
17. కంటి వెలుగు పథకం తరహాలోనే ప్రజలందరికీ ఇతర ఆరోగ్య పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తుంది. ప్రతీ వ్యక్తి హెల్త్ ప్రొఫైల్ రికార్డు చేసి, తెలంగాణ రాష్ట్ర హెల్త్ ప్రొఫైల్ రూపొందిస్తుంది.
18. ప్రభుత్వ ఉద్యోగుల‌కు సబబైన, సముచితమైన రీతిలో వేతన సవరణ చేస్తుంది.
19. ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వ‌య‌సును 58 నుంచి 61 సంవత్సరాలకు పెంచడం జరుగుతుంది. దీనికి సమాంతరంగా నిరుద్యోగులకు ఎక్కువ అవకాశాలు కల్పించడం కోసం ఉద్యోగాల నియామక వయో పరిమితిని మూడేళ్లు పెంచడం జరుగుతుంది.
20. పెన్ష‌న‌ర్ల‌ కోసం ప్ర‌త్యేక డైరెక్ట‌రేట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది.
21. అటవీ ప్రాంతాల్లోని గిరిజన, గిరిజనేతర రైతుల భూ వివాదాలను పరిష్కరించి యాజమాన్య హక్కులు కల్పిస్తుంది. పోడు భూముల విషయంలో నెలకొన్న వివాదాలను త్వరితగతిన పరిష్కరిస్తుంది. వారికి ఇతర రైతులకు అందిస్తున్న ప్రయోజనాలను వర్తింపచేస్తుంది.
22. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ స్థాపించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
23. సింగరేణి భూముల్లో ఇండ్లు కట్టుకున్న వారికి పట్టాలు ఇస్తుంది.
24. హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. వీటిని మరింత ముమ్మరం చేయడం జరుగుతుంది.

CBN kasta padi rasina Congress manifesto ni copy paste chesillu ganthy kadha???

Link to comment
Share on other sites

4 minutes ago, ZuniorVentiyar said:

timmy bro ... eee sari TRS kastame antaa kadha ... DB lo talk negative gaa undi TRS ki , India nundi ground reality cheppu kodigaaa

Most of my family and friends in TG are voting for TRS.

Link to comment
Share on other sites

4 minutes ago, snoww said:

Most of my family and friends in TG are voting for TRS.

TG lo mee family and friends ee kakundaa inka chala mandi unnaru kadha bro .... so what is the majority peoples choice

Link to comment
Share on other sites

9 minutes ago, ZuniorVentiyar said:

timmy bro ... eee sari TRS kastame antaa kadha ... DB lo talk negative gaa undi TRS ki , India nundi ground reality cheppu kodigaaa

DB and yellow channels chusthey alaaney untundhi, trs easy peasy ya win avuthundhi

Link to comment
Share on other sites

11 minutes ago, ZuniorVentiyar said:

timmy bro ... eee sari TRS kastame antaa kadha ... DB lo talk negative gaa undi TRS ki , India nundi ground reality cheppu kodigaaa

Db amo kani pulkas mari over confidence tho trs ki 30 to 40 antunaru 

Link to comment
Share on other sites

Just now, ZuniorVentiyar said:

TG lo mee family and friends ee kakundaa inka chala mandi unnaru kadha bro .... so what is the majority peoples choice

Who will know bro. Only results can tell. Even though sample size is small . I just told what my friends and family doing. 

Link to comment
Share on other sites

1 minute ago, tom bhayya said:

Tdp ni join chesukodam pedha minus for Congress. 

I don’t know about minus or plus but nakka succeeded in implementing poll management successfully should learn it 

first thing congress lacks media support but now they got it with tdp support 

2 months back it is straightforward with trs around 80!to 90

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...