Jump to content

మేక్‌ ఇన్‌ ఏపీ


snoww

Recommended Posts

ప్రతిభను వెలికితీసే ‘మేక్‌ ఇన్‌ ఏపీ’ 
నేడు ప్రారంభించనున్న మంత్రి లోకేశ్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి: నవ్యావిష్కరణలకు దోహదపడేలా యువతలోని ప్రతిభను వెలికితీసే లక్ష్యంతో రూపొందించిన ‘మేక్‌ ఇన్‌ ఏపీ’ ప్రారంభానికి సిద్ధమైంది. ఐటీ  మంత్రి నారా లోకేశ్‌ ఉండవల్లిలోని ప్రజావేదికలో బుధవారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అంకుర పరిశ్రమలు, యువ ఆవిష్కర్తలను ప్రఖ్యాత కంపెనీలు, సాంకేతిక, పరిశ్రమ వర్గాలతో అనుసంధానించడం ఈ పథకం మరో లక్ష్యం. 
50 కార్పొరేట్‌ కంపెనీల భాగస్వామ్యం: నాస్కామ్‌, 10 వేల అంకుర పరిశ్రమలు, ఏపీ ఇన్నోవేషన్‌ వ్యాలీ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. నాలెడ్జ్‌ భాగస్వామిగా ఐడియా ల్యాబ్స్‌ వ్యవహరిస్తుంది. 100కు పైగా మెంటార్లు, 50 కార్పొరేట్‌ కంపెనీలు, 100 కళాశాలలు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కానున్నాయి.

అమలు ఇలా..: వ్యవసాయం, ఆరోగ్యం, రవాణా, వాతావరణం, ఆకర్షణీయ నగరాలు, సుపరిపాలనకు సంబంధించి సవాళ్లకు.. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పరిష్కార మార్గాలను కనుగొనే దిశగా యువతకు ప్రాజెక్టులు ఇస్తారు. ఇందులో ప్రతిభ చూపే సంస్థలు, బృందాలకు నాస్కామ్‌, ఐటీ ల్యాబ్స్‌ భాగస్వామ్యంతో నగదు బహుమతులు అందిస్తారు. ఇంక్యుబేషన్‌ అవకాశాలు కల్పిస్తారు. ప్రఖ్యాత కంపెనీలతో భాగస్వామ్యం అయ్యేందుకు కొత్త అంకుర పరిశ్రమలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఈ కార్యక్రమం దోహదపడనుంది.

Link to comment
Share on other sites

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలోని ఉండవల్లిలో ప్రజావేదిక వద్ద ఏపీ ఇన్నొవేషన్‌ వ్యాలీ ఆధ్వర్యంలో బుధవారం మేకిన్‌ ఏపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఐదేళ్ళల్లో రూ.8 వేల కోట్ల టర్నోవర్ ఉన్న పది సంస్థలను రాష్ట్రానికి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. రానున్న ఐదేళ్లలో 10 వేల స్టార్టప్‌లు రాష్ట్రంలో ఏర్పాటు చేయటమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. స్టార్టప్‌ ప్రమోషన్ కోసం ప్రతి జిల్లాకు రూ.10 కోట్లు చొప్పున కేటాయిస్తున్నామన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. యువత చేతుల్లోనే దేశ భవిష్యత్తు ఉందన్నారు. ఈ సందర్భంగా మేకిన్‌ ఏపీ కార్యక్రమంలో భాగంగా రెండు ఒప్పందాలు కదిరినట్లు ఆయన వెల్లడించారు.

Link to comment
Share on other sites

2 minutes ago, snoww said:

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలోని ఉండవల్లిలో ప్రజావేదిక వద్ద ఏపీ ఇన్నొవేషన్‌ వ్యాలీ ఆధ్వర్యంలో బుధవారం మేకిన్‌ ఏపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఐదేళ్ళల్లో రూ.8 వేల కోట్ల టర్నోవర్ ఉన్న పది సంస్థలను రాష్ట్రానికి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. రానున్న ఐదేళ్లలో 10 వేల స్టార్టప్‌లు రాష్ట్రంలో ఏర్పాటు చేయటమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. స్టార్టప్‌ ప్రమోషన్ కోసం ప్రతి జిల్లాకు రూ.10 కోట్లు చొప్పున కేటాయిస్తున్నామన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. యువత చేతుల్లోనే దేశ భవిష్యత్తు ఉందన్నారు. ఈ సందర్భంగా మేకిన్‌ ఏపీ కార్యక్రమంలో భాగంగా రెండు ఒప్పందాలు కదిరినట్లు ఆయన వెల్లడించారు.

Kotha 2000 Rupees note lanti Lokesh Babu vardillali. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...