Jump to content

మటన్ వినియోగంలో మనమే నం.1: namaste telangana


trent

Recommended Posts

-గొర్రెల సంఖ్యలోనూ దేశంలోతెలంగాణ ముందంజ
-రాష్ట్రంలో గొర్రెలసంఖ్య 2.24 కోట్లు 
-రాజస్థాన్‌ను వెనుకకు పడేసిన రాష్ట్రం 
-ఫలించిన గొర్రెల పంపిణీ పథకం
-రాష్ట్రంలో ఏడాదికి మాంసం సగటు వినియోగం 7.5 కిలోలు
-జాతీయ పశుగణన శాస్త్రీయ నివేదికలో వెల్లడి


హైదరాబాద్, నమస్తే తెలంగాణ: మాంసం వినియోగంలో దేశంలోనే తెలంగాణ నంబర్‌వన్‌గా నిలిచింది. గొర్రెల సంఖ్యలో కూడా ప్రథమస్థానం సాధించింది. ఇప్పటివరకు మొదటిస్థానంలో ఉన్న రాజస్థాన్‌ను వెనుకకు నెట్టింది. తర్వాతి స్థానాల్లో ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ఉన్నాయి. డిసెంబర్ 31తో ముగిసిన జాతీయ పశుగణన నివేదిక ఈ విషయాన్ని స్పష్టంచేసింది. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న గొర్రెల పంపిణీ పథకం సత్ఫలితాలనిస్తున్నది. గ్రామాల్లో గొల్ల, కుర్మ కుటుంబాలు ఆర్థికంగా బలోపేతమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం గొల్ల, కుర్మలకు గొర్రెల పంపిణీ పథకం అమలుచేసే (2017 జూన్ 20న) నాటికి రాష్ట్రంలో గొర్రెలసంఖ్య కోటి మాత్రమే. తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ ద్వారా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల నుంచి కొనుగోలుచేసి 74 లక్షల గొర్రెలను ప్రభుత్వం గొల్ల, కుర్మలకు పంపిణీ చేసింది. వీటికి 55 లక్షల పిల్లలు పుట్టాయి. దీంతో రాష్ట్రంలో కొత్తగా 1.28 కోట్ల గొర్రెలు తయారయ్యాయి. వీటివిలువ రూ.2,500 కోట్లు. గొర్రెల పంపిణీ పథకంతో రూ.2,500 కోట్ల అదనపు సంపద చేకూరింది. పశుగణన చేపట్టేనాటికి మొత్తం ఇతర ప్రాంతాలకు విక్రయించినవి, వివిధ కారణాలతో మృతి చెందినవి, మాంసానికి వినియోగించినవి మినహాయించగా.. రాష్ట్రంలో 2.24 కోట్ల గొర్రెలు ఉన్నట్టు జాతీయ పశుగణన శాస్త్రీయ నివేదిక స్పష్టంచేసింది. ఈ సంఖ్య దేశంలోనే అత్యధికం. దీంతో అత్యధిక గొర్రెలు ఉన్న రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సాధించింది. ఇప్పటివరకు దేశంలో అత్యధిక గొర్రెలు ఉన్న రాష్ట్రంగా రాజస్థాన్ గుర్తింపు పొందింది. ఆ రాష్ట్రంలో దాదాపు రెండుకోట్ల గొర్రెలు ఉన్నాయి. 
 

పథకం తీరుతెన్నులు

sheeps1
గొల్ల, కుర్మలకు గొర్రెల పంపిణీ పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.5,000 కోట్లు కేటాయించింది. ఈ నిధుల్లో రూ.3,000 కోట్లు (60 శాతం) నేషనల్ కోఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్సీడీసీ) నుంచి రుణంగా గొర్రెలు మేకల అభివృద్ధి సంస్థ తీసుకున్నది. మరో 20 శాతం నిధులను కేంద్రప్రభుత్వం సబ్సిడీగా అందించింది. రూ.1000 కోట్లు లబ్ధిదారులు తమ వాటాగా చెల్లించారు. ఒక్కొక్క యూనిట్ వ్యయం రూ.1,25,000 కాగా, ప్రభుత్వం 75 శాతం సబ్సిడీ అంటే రూ.93,750 అందించింది. లబ్ధిదారుడు 25 శాతం రూ.31,250 చెల్లించారు. ఈ పథకం అమలుకోసం మొత్తం రూ.3,299.98 కోట్లు మంజూరుచేయగా, రాష్ట్రంలో తొలివిడుతగా 3,67,020 మంది గొల్ల, కుర్మలకు 73,70,769 గొర్రెలను పంపిణీ చేశారు. వీటికి 55 లక్షలల గొర్రె పిల్లలు కొత్తగా పుట్టాయి. రెండోవిడుతలో దాదాపు 3.5 లక్షల కుటుంబాలకు గొర్రెలు పంపిణీ చేసేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. వరుస ఎన్నికల కారణంగా ఇప్పటివరకు సుమారు 18 వేల కుటుంబాలకు పంపిణీ చేసినట్టు అధికారులు తెలిపారు. మిగతా వారికి పంపిణీ చేసేందుకు కసరత్తు కొనసాగుతున్నది.
 

పెరిగిన మాంసం ఉత్పత్తి

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బృహత్తర పథకంతో రాష్ట్రంలో గొర్రెల సంఖ్యతోపాటు మాంసం ఉత్పత్తి కూడా గణనీయంగా పెరిగింది. ఏడాదికి సగటున రాష్ట్రంలో 26,839 టన్నుల మాంసం ఉత్పత్తి అవుతున్నది. మాంసం ఉత్పత్తిలో 15 శాతం వృద్ధి సాధించినట్టు అధికారులు తెలిపారు. 2017 జూన్‌కు ముందు రాష్ట్రానికి కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి దాదాపు రోజుకు 500 నుంచి 600 లారీల గొర్రెలు దిగుమతి అవుతుండేవి. ప్రస్తుతం ఈ సంఖ్య గణనీయంగా పడిపోయి 100 వచ్చింది. 
 

మాంసం వినియోగంలోనూ మనమే టాప్

మాంసం వినియోగంలోనూ దేశంలో తెలంగాణ టాప్‌లో నిలిచింది. సగటున ప్రతివ్యక్తి ఏడాదికి 7.5 కిలోల మాంసం వినియోగిస్తున్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. తెలంగాణలో 97 శాతం మంది మాంసాహారులే. జాతీయ పోషకాహార సంస్థ మార్గదర్శకాల ప్రకారం ఏడాదికి ఒక మనిషి 11 కిలోల మాంసం వినియోగించాలి. ఆ స్థాయిలో ఏ రాష్ట్రం కూడా మాంసం తినకపోయినా, తెలంగాణ 7.5 కిలోలతో మొదటిస్థానంలో ఉంది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ 7.2 కిలోలు, తమిళనాడు 6.5 కిలోలు, కర్ణాటక 6 కిలోలు, కేరళ 5.5 కేజీల చొప్పున వినియోగిస్తున్నాయి. మాంసం అత్యధికంగా వినియోగించే రాష్ట్రాల్లో మొదటి ఐదుస్థానాల్లో దక్షిణాది రాష్ట్రాలే ఉండటం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేసిన గొర్రెల పంపిణీ పథకం దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాలను ఆకర్షిస్తున్నది. కర్ణాటక మంత్రుల బృందం, రాజస్థాన్ ప్రభుత్వ ప్రతినిధులు రాష్ట్రంలో పర్యటించి పథకం అమలుతీరును తెలుసుకున్నారు. ఇక్కడి పథకాన్ని తమ రాష్ర్టాల్లో అమలుచేస్తామని పర్యటన సందర్భంగా పేర్కొన్నారు.
 

వేసవిలో పశుగ్రాసం, తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు

sheeps2
దేశంలోనే గొర్రెలసంఖ్యలో తెలంగాణ మొదటిస్థానంలో నిలువడం ఆనందంగా ఉంది. సీఎం కేసీఆర్ ఆలోచనలనుంచి పుట్టిన గొర్రెల పంపిణీ పథకంతో రాష్ట్రంలో రూ.2,500 అదనపు సంపద సృష్టించగలిగాం. గొల్ల, కుర్మల కుటుంబాలు ఆనందంగా ఉన్నాయి. వేసవిలో గొర్రెలకు పశుగ్రాసం, తాగునీటి ఎద్దడి లేకుండా ముందస్తు ఏర్పాట్లకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో నీటితొట్లు, ఎండనుంచి రక్షణకు షెడ్ల నిర్మాణం చేపడుతాం. ఫిబ్రవరి నుంచి మే వరకు జిల్లాకు 100 టన్నుల చొప్పున పశుగ్రాసం గింజలు పంపిణీ చేస్తాం. నీటితొట్ల నిర్మాణాలకు రూ.28వేలు, షెడ్ల నిర్మాణాలకు రూ.88,500 చొప్పున అందజేస్తాం.
- గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ ఎండీ వీ లక్ష్మారెడ్డి

Link to comment
Share on other sites

On 1/11/2019 at 10:01 PM, trent said:
-గొర్రెల సంఖ్యలోనూ దేశంలోతెలంగాణ ముందంజ
-రాష్ట్రంలో గొర్రెలసంఖ్య 2.24 కోట్లు 
-రాజస్థాన్‌ను వెనుకకు పడేసిన రాష్ట్రం 
-ఫలించిన గొర్రెల పంపిణీ పథకం
-రాష్ట్రంలో ఏడాదికి మాంసం సగటు వినియోగం 7.5 కిలోలు
-జాతీయ పశుగణన శాస్త్రీయ నివేదికలో వెల్లడి


హైదరాబాద్, నమస్తే తెలంగాణ: మాంసం వినియోగంలో దేశంలోనే తెలంగాణ నంబర్‌వన్‌గా నిలిచింది. గొర్రెల సంఖ్యలో కూడా ప్రథమస్థానం సాధించింది. ఇప్పటివరకు మొదటిస్థానంలో ఉన్న రాజస్థాన్‌ను వెనుకకు నెట్టింది. తర్వాతి స్థానాల్లో ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ఉన్నాయి. డిసెంబర్ 31తో ముగిసిన జాతీయ పశుగణన నివేదిక ఈ విషయాన్ని స్పష్టంచేసింది. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న గొర్రెల పంపిణీ పథకం సత్ఫలితాలనిస్తున్నది. గ్రామాల్లో గొల్ల, కుర్మ కుటుంబాలు ఆర్థికంగా బలోపేతమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం గొల్ల, కుర్మలకు గొర్రెల పంపిణీ పథకం అమలుచేసే (2017 జూన్ 20న) నాటికి రాష్ట్రంలో గొర్రెలసంఖ్య కోటి మాత్రమే. తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ ద్వారా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల నుంచి కొనుగోలుచేసి 74 లక్షల గొర్రెలను ప్రభుత్వం గొల్ల, కుర్మలకు పంపిణీ చేసింది. వీటికి 55 లక్షల పిల్లలు పుట్టాయి. దీంతో రాష్ట్రంలో కొత్తగా 1.28 కోట్ల గొర్రెలు తయారయ్యాయి. వీటివిలువ రూ.2,500 కోట్లు. గొర్రెల పంపిణీ పథకంతో రూ.2,500 కోట్ల అదనపు సంపద చేకూరింది. పశుగణన చేపట్టేనాటికి మొత్తం ఇతర ప్రాంతాలకు విక్రయించినవి, వివిధ కారణాలతో మృతి చెందినవి, మాంసానికి వినియోగించినవి మినహాయించగా.. రాష్ట్రంలో 2.24 కోట్ల గొర్రెలు ఉన్నట్టు జాతీయ పశుగణన శాస్త్రీయ నివేదిక స్పష్టంచేసింది. ఈ సంఖ్య దేశంలోనే అత్యధికం. దీంతో అత్యధిక గొర్రెలు ఉన్న రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సాధించింది. ఇప్పటివరకు దేశంలో అత్యధిక గొర్రెలు ఉన్న రాష్ట్రంగా రాజస్థాన్ గుర్తింపు పొందింది. ఆ రాష్ట్రంలో దాదాపు రెండుకోట్ల గొర్రెలు ఉన్నాయి. 
 

పథకం తీరుతెన్నులు

sheeps1
గొల్ల, కుర్మలకు గొర్రెల పంపిణీ పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.5,000 కోట్లు కేటాయించింది. ఈ నిధుల్లో రూ.3,000 కోట్లు (60 శాతం) నేషనల్ కోఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్సీడీసీ) నుంచి రుణంగా గొర్రెలు మేకల అభివృద్ధి సంస్థ తీసుకున్నది. మరో 20 శాతం నిధులను కేంద్రప్రభుత్వం సబ్సిడీగా అందించింది. రూ.1000 కోట్లు లబ్ధిదారులు తమ వాటాగా చెల్లించారు. ఒక్కొక్క యూనిట్ వ్యయం రూ.1,25,000 కాగా, ప్రభుత్వం 75 శాతం సబ్సిడీ అంటే రూ.93,750 అందించింది. లబ్ధిదారుడు 25 శాతం రూ.31,250 చెల్లించారు. ఈ పథకం అమలుకోసం మొత్తం రూ.3,299.98 కోట్లు మంజూరుచేయగా, రాష్ట్రంలో తొలివిడుతగా 3,67,020 మంది గొల్ల, కుర్మలకు 73,70,769 గొర్రెలను పంపిణీ చేశారు. వీటికి 55 లక్షలల గొర్రె పిల్లలు కొత్తగా పుట్టాయి. రెండోవిడుతలో దాదాపు 3.5 లక్షల కుటుంబాలకు గొర్రెలు పంపిణీ చేసేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. వరుస ఎన్నికల కారణంగా ఇప్పటివరకు సుమారు 18 వేల కుటుంబాలకు పంపిణీ చేసినట్టు అధికారులు తెలిపారు. మిగతా వారికి పంపిణీ చేసేందుకు కసరత్తు కొనసాగుతున్నది.
 

పెరిగిన మాంసం ఉత్పత్తి

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బృహత్తర పథకంతో రాష్ట్రంలో గొర్రెల సంఖ్యతోపాటు మాంసం ఉత్పత్తి కూడా గణనీయంగా పెరిగింది. ఏడాదికి సగటున రాష్ట్రంలో 26,839 టన్నుల మాంసం ఉత్పత్తి అవుతున్నది. మాంసం ఉత్పత్తిలో 15 శాతం వృద్ధి సాధించినట్టు అధికారులు తెలిపారు. 2017 జూన్‌కు ముందు రాష్ట్రానికి కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి దాదాపు రోజుకు 500 నుంచి 600 లారీల గొర్రెలు దిగుమతి అవుతుండేవి. ప్రస్తుతం ఈ సంఖ్య గణనీయంగా పడిపోయి 100 వచ్చింది. 
 

మాంసం వినియోగంలోనూ మనమే టాప్

మాంసం వినియోగంలోనూ దేశంలో తెలంగాణ టాప్‌లో నిలిచింది. సగటున ప్రతివ్యక్తి ఏడాదికి 7.5 కిలోల మాంసం వినియోగిస్తున్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. తెలంగాణలో 97 శాతం మంది మాంసాహారులే. జాతీయ పోషకాహార సంస్థ మార్గదర్శకాల ప్రకారం ఏడాదికి ఒక మనిషి 11 కిలోల మాంసం వినియోగించాలి. ఆ స్థాయిలో ఏ రాష్ట్రం కూడా మాంసం తినకపోయినా, తెలంగాణ 7.5 కిలోలతో మొదటిస్థానంలో ఉంది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ 7.2 కిలోలు, తమిళనాడు 6.5 కిలోలు, కర్ణాటక 6 కిలోలు, కేరళ 5.5 కేజీల చొప్పున వినియోగిస్తున్నాయి. మాంసం అత్యధికంగా వినియోగించే రాష్ట్రాల్లో మొదటి ఐదుస్థానాల్లో దక్షిణాది రాష్ట్రాలే ఉండటం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేసిన గొర్రెల పంపిణీ పథకం దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాలను ఆకర్షిస్తున్నది. కర్ణాటక మంత్రుల బృందం, రాజస్థాన్ ప్రభుత్వ ప్రతినిధులు రాష్ట్రంలో పర్యటించి పథకం అమలుతీరును తెలుసుకున్నారు. ఇక్కడి పథకాన్ని తమ రాష్ర్టాల్లో అమలుచేస్తామని పర్యటన సందర్భంగా పేర్కొన్నారు.
 

వేసవిలో పశుగ్రాసం, తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు

sheeps2
దేశంలోనే గొర్రెలసంఖ్యలో తెలంగాణ మొదటిస్థానంలో నిలువడం ఆనందంగా ఉంది. సీఎం కేసీఆర్ ఆలోచనలనుంచి పుట్టిన గొర్రెల పంపిణీ పథకంతో రాష్ట్రంలో రూ.2,500 అదనపు సంపద సృష్టించగలిగాం. గొల్ల, కుర్మల కుటుంబాలు ఆనందంగా ఉన్నాయి. వేసవిలో గొర్రెలకు పశుగ్రాసం, తాగునీటి ఎద్దడి లేకుండా ముందస్తు ఏర్పాట్లకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో నీటితొట్లు, ఎండనుంచి రక్షణకు షెడ్ల నిర్మాణం చేపడుతాం. ఫిబ్రవరి నుంచి మే వరకు జిల్లాకు 100 టన్నుల చొప్పున పశుగ్రాసం గింజలు పంపిణీ చేస్తాం. నీటితొట్ల నిర్మాణాలకు రూ.28వేలు, షెడ్ల నిర్మాణాలకు రూ.88,500 చొప్పున అందజేస్తాం.
- గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ ఎండీ వీ లక్ష్మారెడ్డి

Its #1 in exporter of beef too.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...