Jump to content

Interesting: కరెన్సీ కింగ్‌ను రక్షించేందుకే మసూద్‌ అజార్‌ విడుదల?


trent

Recommended Posts

  • ఉదంతంలో కొత్త కోణం.. బందీల్లో వ్యాపారవేత్త రాబర్టో జియోరీ
  • అతడిని కాపాడాలని స్విస్‌ తీవ్ర ఒత్తిడి
  • ఉగ్రవాదులతో దౌత్యం నెరపింది దోభాలే
  • నోట్ల రద్దుతో కరెన్సీ కింగ్‌కు మంచి రోజులు
న్యూఢిల్లీ, మార్చి 13: ఇరవయ్యేళ్ల క్రితం... 1999 డిసెంబరు 24... భారత విమానం ఐసీ-814 హైజాక్‌కు గురైన రోజు. కఠ్మాండూలోని త్రిభువన్‌ విమానాశ్రయం నుంచి బయల్దేరిన ఆ విమానాన్ని టెర్రరిస్టులు కాందహార్‌కు మళ్లించారు. 176 మంది ప్రయాణికుల్లో 27 మందిని దుబాయ్‌లో దింపి, ఒకరిని చంపి, అనేక మందిని గాయపర్చారు! ఆనాడు వారి లక్ష్యం: భారత్‌ చెరలో ఉన్న తమ ముగ్గురు అగ్రనేతల విడుదల. వారిలో ఒకరు జైషే మొహమ్మద్‌ సంస్థ వ్యవస్థాపకుడు మౌలానా మసూద్‌ అజార్‌. నాటి కాందహార్‌ ఉదంతంలో ఆసక్తికర ఘట్టం ఒకటి ఇటీవల బయటపడింది. నాడు ఉగ్రవాదుల బందీలుగా పట్టుకున్న 150 మందిలో ఒక అంతర్జాతీయ ప్రముఖుడు ఉన్నారు. పేరు... రాబర్టో జియోరీ.
 
 
27
 
636881534020919205.jpg
ఆయన కోసం ప్రభుత్వాలు కదిలాయి
రాబర్టో 1999లో భారత్‌ వచ్చాడు. తన ప్రియురాలు క్రిస్టియానా కాలబ్రెసీతో కలిసి కొన్నాళ్లు ఢిల్లీలో ఉండి ఆ తరువాత కఠ్మాండూ వెళ్లాడు. భారత-నేపాల్‌ సరిహద్దుల్లోనే అతని నకిలీ కరెన్సీ వ్యవస్థ అంతా ఉంది. ఆ తరువాత ఆయన తిరిగి న్యూఢిల్లీ రావడానికి 1999 డిసెంబరు 24న ఐసీ-814 విమానం ఎక్కాడు. ఆ విమానాన్నే ఉగ్రవాదులు హైజాక్‌ చేశారు. ఆనాడు విమానంలో ఉన్న అతని గురించి హైజాకర్లకు తెలియదు. స్విట్జర్లాండ్‌ ప్రభుత్వానికి తెలుసు. అందుకే హైజాక్‌ మరునాడే స్విస్‌ ప్రభుత్వం పరుగులు పెట్టింది. విదేశాంగ మంత్రి జోసెఫ్‌ డీస్‌ భారత విదేశాంగ మంత్రి జస్వంత్‌సింగ్‌తో 90 నిమిషాల సేపు మాట్లాడారు.
 
‘బందీలుగా ఉన్న ప్రయాణికులకు(అంటే రాబర్టోకు) ఎలాంటి హానీ జరగడానికి వీల్లేదు. ఇది మాకు అత్యవసరం’’ అని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి రాజధాని బెర్న్‌లో ఓ ప్రత్యేక సెల్‌ను ఏర్పరిచారు. హన్స్‌ స్టాల్‌డర్‌ అనే దూతను ప్రత్యేకంగా కాందహార్‌కు కూడా స్విస్‌ ప్రభుత్వం పంపింది. ప్రయాణికులు విడుదలయ్యాక రాబర్టోను క్షేమంగా ఓ ప్రత్యేక విమానంలో బెర్న్‌కు తీసుకొచ్చి రహస్య ప్రదేశానికి తరలించేసింది. నాడు అతని గురించి టెర్రరిస్టులకు తెలిసి ఉండుంటే పరిస్థితి మరోలా ఉండేదని, సమస్య మరింత జటిలమయ్యేదని దౌత్య వర్గాలు తెలిపాయి. ఆనాడు బందీల విడుదలకు జస్వంత్‌ సారథ్యంలో వెళ్లిన బృందంలో ఇంటెలిజెన్స్‌ ఉన్నతాధికారి, ప్రస్తుత జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ధోభాల్‌ కూడా ఉన్నారు. రాబర్టో గురించి ఆనాడే దోభాల్‌కు తెలుసననీ, క్షేమంగా ఆయనను, మిగిలిన బందీలను విడిపంచడంలో దోభాల్‌ కీలకపాత్ర పోషించారనీ తాజాగా వార్తా కథనాలు వెలువడుతున్నాయి.
 
నోట్ల రద్దుతో మళ్లీ జోరు
రాబర్టో కంపెనీపై అనేక ఆరోపణలు రావడంతో భారత్‌ ఆ కంపెనీని 2010లో బ్లాక్‌లి్‌స్టలో పెట్టింది. నోట్ల ముద్రణను రిజర్వ్‌బ్యాంకు ఔట్‌సోర్స్‌ చేయడం, అందులో వేల కోట్ల రూపాయల తేడాలు రావడం, నోట్ల చలామణీ అవసరమైన దానికంటే ఎక్కువ కావడం, రాబర్టో కంపెనీపై ఆరోపణలు ఓ పార్లమెంటరీ కమిటీ పరిశీలనలో బయటపడడంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. దీంతో రాబర్టో దాదాపుగా దివాలా తీశారు. అయితే ఆయన కంపెనీకి మోదీ ప్రభుత్వం మళ్లీ ఊపిరి పోసింది. 2016లో నరేంద్ర మోదీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించడానికి కొద్దిరోజుల ముందు అతి రహస్యంగా ఈ బ్లాక్‌లిస్ట్‌ నిషేధాన్ని ఎత్తేశారు. ఫలితంగా 2017 జూన్‌ నాటికే ఈ కంపెనీ షేర్లు ఏకంగా 33.3 శాతం వృద్ధిని నమోదు చేశాయి. 
 
నిషేధం ఎత్తివేతకు హైజాక్‌ సమయంలో అజిత్‌ ధోభాల్‌తో రాబర్టోకు ఉన్న పరిచయం ఉపయోగపడిందన్న అనుమానాలూ రేగాయి. అంతేకాదు.. ఈ కంపెనీకి పది రూపాయల ప్లాస్టిక్‌ నోట్ల ముద్రణ నిమిత్తం మేకిన్‌ ఇండియా కింద 10 ఎకరాల భూమిని కూడా 2017 జనవరిలో కేటాయించింది. ఇది రాజకీయంగా పెనువివాదానికి దారి తీసింది. అయితే మోదీ సర్కార్‌ ఖాతరు చెయ్యలేదు.
 
ఎవరీ రాబర్టో..?
రాబర్టో జియోరీ... ప్రపంచానికి పెద్దగా తెలియని పేరు. కానీ అనేక ప్రభుత్వాలకు చిరపరిచితమైన పేరు. ప్రపంచంలోనే అత్యంత ధనికుడు. ఇటలీలో పుట్టి స్విట్జర్లాండ్‌లో సెటిలైన ఈయనకు బ్రిటన్‌లో కరెన్సీ ముద్రణ సంస్థ ఉంది. 150 దేశాలకు కరెన్సీ ముద్రణకు సంబంధించి సాంకేతిక పరిజ్ఞానం అందిస్తారు. ఎలాంటి మౌలిక వసతులు లేని దేశాలకు స్వయంగా కరెన్సీ ముద్రించి ఇస్తారు. జియోరీ వ్యాపారవేత్త మాత్రమే కాదు... అవసరాన్ని బట్టి అక్కడి ప్రభుత్వాలకు, రాజకీయ పక్షాలకు, ఉగ్రవాద సంస్థలకు నకిలీ కరెన్సీ సరఫరా చేసే వ్యవస్థను కూడా ఏర్పాటు చేసుకున్న నొటోరియస్‌ పర్సన్‌. 
 
ప్రపంచంలో 90 శాతం కరెన్సీ ముద్రణ ఈయన సంస్థల ద్వారానే జరుగుతూ వచ్చింది. భారతదేశం కరెన్సీని అమెరికా, బ్రిటన్‌, జర్మనీ సంస్థల ద్వారా ముద్రిస్తోంది. బ్రిటన్‌ సంస్థ థామస్‌ డి లా రూ జియోరీ ఇప్పుడు మనం చెప్పుకుంటున్న రాబర్టో జియోరీదే. ఈ కంపెనీ సమాంతర ఆర్థిక వ్యవస్థలను నడుపుతున్నట్లుగా పనామా లీక్స్‌ ద్వారా తేలడంతో భారత్‌ సహా కొన్ని దేశాలు బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాయి.
 
  • Upvote 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...