snoww Posted June 28, 2019 Report Share Posted June 28, 2019 అనుమతిలేని వెంచర్లపై సీఆర్డీఏ ఉక్కుపాదం నిడుముక్కల,(తాడికొండ),న్యూస్టుడే: అనుమతిలేని వెంచర్లపై సీఆర్డీఏ అధికారులు ఉక్కుపాదం మోపారు.తాడికొండ మండలంలోని నిడుముక్కల, తాడికొండ గ్రామాల్లోని ఆరు వెంచర్లను గురువారం ధ్వంసం చేశారు. నిడుముక్కలలోని సర్వే నెం.27, 28, 34 నెంబర్లలోని ఎనిమిది ఎకరాలు, తాడికొండలోని సర్వే నెంబరు 1311, 1312, 1458, 1297 లోని ఏడు ఎకరాల్లో వేసిన వెంచర్లలోకి బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు రోహిణి, పావని, సర్వేయర్ కే.విశ్వనాథ్లు మూడు పొక్లెయిన్లు, పది మంది సిబ్బందితో వచ్చి హద్దు రాళ్లను, గ్రావెల్ రహదారులు, చుట్టూ నిర్మించిన గోడలను ధ్వంసం చేశారు. తొలగించిన రాళ్లను ఆయా పంచాయతీ కార్యాలయాలకు పంపుతున్నట్లు అధికారులు తెలిపారు. సీఆర్డీఏ అనుమతి లేకుండా వేసిన వెంచర్లను గతంలో కొన్నింటిని తొలగించామని చెప్పారు. అక్రమ వెంచర్లు చాలా ఉన్నాయని వాటిని తొలగించేందుకు రంగం సిద్ధం చేశామని తెలిపారు. త్వరలో ఆయా వెంచర్ల నిర్వాహకులకు నోటీసులు పంపి తొలగిస్తామని తెలిపారు. ప్రభుత్వ అనుమతి లేని వెంచర్లలో ప్లాట్లను కొనుగోలు చేసి మోసపోవద్దని ప్రజలకు అధికారులు విజ్ఞప్తి చేశారు. ఇకపై కొత్తగా వెంచర్లు వేసేవారు ఎవరైనా సరే కచ్చితంగా సీఆర్డీఏ అనుమతి పొందాలని లేకపోతే ఎలాంటి నిర్మాణాలనైనా కూల్చి వేస్తామని తెలిపారు. ప్లాట్లు కొనుగోలు చేసే సయమంలో ముందుగా సీఆర్డీఏ అనుమతి ఉందా లేదా అని విచారించాలని, దానికి సంబంధించిన పత్రాలను నిశితంగా పరిశీలించాలని సూచించారు. ఎల్పీ నెంబరు లేని ప్లాట్లు కొనుగోలు చేయవద్దని తెలిపారు. కంతేరు, లాం గ్రామాల్లోని వెంచర్లపై విచారణ జరుగుతోందని అవి అక్రమమని తేలితే తొలగిస్తామని స్పష్టం చేశారు. Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.