Jump to content

మధ్యప్రదేశ్‌ పదో తరగతి ఫలితాల్లో బాలికకు 8వ ర్యాంకు


nag_mama

Recommended Posts

 

  • మధ్యప్రదేశ్‌ పదో తరగతి ఫలితాల్లో బాలికకు 8వ ర్యాంకు
  • భీండ్‌, జూలై 5: ఒకటి కాదు, రెండు కాదు.. విద్యాభ్యాసం కోసం ఏకంగా 24 కిలోమీటర్ల దూరం రోజూ ప్రయాణించేంది ఆ బాలిక. చదువు మీద ఉన్న ఇష్టంతో ఆమె పడిన కష్టం వృథా కాలేదు. పదవ తరగతి ఫలితాల్లో 98.75శాతం మార్కులతో రాష్ట్రం మొత్తానికే 8వ ర్యాంకు తెచ్చుకోగలిగింది. మధ్యప్రదేశ్‌లోని చంబల్‌ ప్రాంతంలో అజ్నోల్‌ గ్రామానికి చెందిన రోషనీ భడోరియా(15) సాధించిందీ ఘనత. తమకు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న మెహగావ్‌లో బాలికల ప్రభుత్వ పాఠశాలలో ఆమె పదవ తరగతి చదువుకుంది. అక్కడికి వెళ్లేందుకు రవాణా సౌకర్యాలు లేకపోవడంతో.. సైకిల్‌ పైనే ప్రతిరోజూ 24కిలోమీటర్లు ప్రయాణించేది. అంత అలిసిపోయి ఇంటికి వచ్చిన తర్వాత కూడా మళ్లీ చదువుకునేది. చదువుపై ఆమెకు ఉన్న తపన, అందుకోసం పడిన కష్టం.. చక్కటి ఫలితాలను ఇచ్చాయి. రాష్ట్రం మొత్తానికి 8వ ర్యాంకు సాధించడంతో.. ఆమె పేరు స్థానికంగా మారుమోగిపోతోంది. మరింత బాగా చదువుకుని, సివిల్స్‌ రాసి ఐఏఎస్‌ అధికారిణి అవుతానని రోషనీ ధీమా వ్యక్తం చేస్తోంది.



     
  • Like 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...