kakatiya Posted November 19, 2020 Report Share Posted November 19, 2020 మరో కేంద్రమంత్రికి కరోనా పాజిటివ్ దిల్లీ: దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు కేంద్రమంత్రులు, రాజకీయ నేతలు కొవిడ్ బారిన పడగా.. తాజాగా కేంద్రమంత్రి డీవీ సదానంద గౌడకు పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్లో వెల్లడించారు. కరోనా స్వల్ప లక్షణాలు ఉండటంతో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్గా నిర్థరణ అయినట్టు ఆయన తెలిపారు. స్వీయ నిర్బంధంలోకి వెళ్లినట్టు చెప్పారు. ఇటీవలి కాలంలో తనను కలిసినవారంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మరో కేంద్రమంత్రికి కరోనా పాజిటివ్ ఎయిమ్స్లో చేరిన ఆంటోనీ దంపతులు అలాగే, కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి ఏకే ఆంటోనీ, ఆయన సతీమణి కూడా కరోనా బారిన పడ్డారు.ఈ విషయాన్ని ఏకే ఆంటోనీ తనయుడు అనిల్ కె ఆంటోనీ వెల్లడించారు. ప్రస్తుతం వాళ్లిద్దరూ దిల్లీలోని ఎయిమ్స్లో చికిత్సపొందుతున్నట్టు చెప్పారు. ఇద్దరి ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు. Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.