Jump to content

పరీక్షించిన ప్రతి అయిదుగురిలో ఒకరికి వైరస్


All_is_well

Recommended Posts

దేశంలో పాజిటివిటీ రేటు 20%
ఒక్కరోజులో కొత్తగా 3.46 లక్షల మందికి కరోనా
గంటకు 109 మంది చొప్పున 2,624 మంది మృతి

పరీక్షించిన ప్రతి అయిదుగురిలో ఒకరికి వైరస్‌

ఈనాడు, దిల్లీ: కొవిడ్‌ మహమ్మారి దేశంలో వేగంగా విస్తరిస్తోంది. వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకున్న ప్రతి అయిదుగురిలో ఒకరికి వైరస్‌ సోకినట్లు స్పష్టమవుతోంది. దీంతో పాజిటివిటీ రేటు దాదాపు 20 శాతంగా తేలింది. మార్చి 24న ఇది 5 శాతమే. నెల రోజుల వ్యవధిలోనే వైరస్‌ సంక్రమణ నాలుగు రెట్లు పెరిగింది. పరీక్షల సంఖ్య పెంచితే పాజిటివిటీ రేటు అధికంగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా మొత్తం 17,53,569 మందికి పరీక్షలు చేయగా అందులో 3,46,786 మంది వైరస్‌ బారినపడ్డారు. ఈ నెలలో నిర్వహించిన మొత్తం పరీక్షల ప్రకారం గత 24 రోజుల్లో సగటున 13.70% పాజిటివిటీ రేటు నమోదైంది. ఇది తొలి వారంలో 8.36%, రెండో వారంలో 11.67%, మూడో వారంలో 16.69 శాతానికి పెరిగింది. గత మూడు రోజుల్లో సగటున 19.32% మంది ఫలితాలు పాజిటివ్‌గా తేలాయి. గంటకు 109 మంది చొప్పున గత 24 గంటల్లో 2,624 మంది చనిపోయారు. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన జోబత్‌ ఎమ్మెల్యే కళావతి భూరియా(49) చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందారు.
నాలుగో రోజూ 2వేలకు పైగా మరణాలు
వైరస్‌ సంక్రమణ వేగం పెరగడంతో దేశంలో వరుసగా మూడో రోజూ 3 లక్షలకుపైగా కేసులు నమోదయ్యాయి. నాలుగో రోజూ 2వేలకు పైగా మరణాలు సంభవించాయి. 15 రాష్ట్రాల్లో ఎన్నడూలేనంత గరిష్ఠస్థాయిలో కొత్త కేసులొచ్చాయి. ఈ నెలలో ఇప్పటి వరకు 44.58 లక్షల కేసులు, 26,986 మరణాలు చోటుచేసుకున్నాయి. మొత్తం క్రియాశీల కేసులు 25.52 లక్షలకు చేరాయి. గత ఏడాది సెప్టెంబర్‌ 18న నమోదైన 10.17లక్షలతో పోలిస్తే ఇది దాదాపు రెండున్నర రెట్లు అధికం.

ఆరోగ్య సంక్షోభం ఆందోళనకరం: ఐఎంఎఫ్‌
‘‘దేశంలో రోజురోజుకీ దిగజారుతున్న పరిస్థితుల పట్ల అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్‌) ప్రధాన ఆర్థికవేత్త గీతా గోపీనాథ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘భారత్‌లో కనిపిస్తున్న ఆరోగ్య సంక్షోభ విస్ఫోటం తీవ్రంగా కలిచివేస్తోంది. ఎంతోమంది కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహచరులు కరోనా ఉద్ధృతికి అల్లాడిపోతున్నారు. భౌతిక దూరం పాటించడం, మాస్కుల వాడకం వంటి జాగ్రత్తల్ని పాటించాలి. ఔషధాలు, టీకాల సరఫరా యుద్ధప్రాతిపదికన పెంచాలి’’ అని పేర్కొన్నారు. 

పరీక్షించిన ప్రతి అయిదుగురిలో ఒకరికి వైరస్‌

Link to comment
Share on other sites

19 hours ago, All_is_well said:

దేశంలో పాజిటివిటీ రేటు 20%
ఒక్కరోజులో కొత్తగా 3.46 లక్షల మందికి కరోనా
గంటకు 109 మంది చొప్పున 2,624 మంది మృతి

పరీక్షించిన ప్రతి అయిదుగురిలో ఒకరికి వైరస్‌

ఈనాడు, దిల్లీ: కొవిడ్‌ మహమ్మారి దేశంలో వేగంగా విస్తరిస్తోంది. వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకున్న ప్రతి అయిదుగురిలో ఒకరికి వైరస్‌ సోకినట్లు స్పష్టమవుతోంది. దీంతో పాజిటివిటీ రేటు దాదాపు 20 శాతంగా తేలింది. మార్చి 24న ఇది 5 శాతమే. నెల రోజుల వ్యవధిలోనే వైరస్‌ సంక్రమణ నాలుగు రెట్లు పెరిగింది. పరీక్షల సంఖ్య పెంచితే పాజిటివిటీ రేటు అధికంగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా మొత్తం 17,53,569 మందికి పరీక్షలు చేయగా అందులో 3,46,786 మంది వైరస్‌ బారినపడ్డారు. ఈ నెలలో నిర్వహించిన మొత్తం పరీక్షల ప్రకారం గత 24 రోజుల్లో సగటున 13.70% పాజిటివిటీ రేటు నమోదైంది. ఇది తొలి వారంలో 8.36%, రెండో వారంలో 11.67%, మూడో వారంలో 16.69 శాతానికి పెరిగింది. గత మూడు రోజుల్లో సగటున 19.32% మంది ఫలితాలు పాజిటివ్‌గా తేలాయి. గంటకు 109 మంది చొప్పున గత 24 గంటల్లో 2,624 మంది చనిపోయారు. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన జోబత్‌ ఎమ్మెల్యే కళావతి భూరియా(49) చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందారు.
నాలుగో రోజూ 2వేలకు పైగా మరణాలు
వైరస్‌ సంక్రమణ వేగం పెరగడంతో దేశంలో వరుసగా మూడో రోజూ 3 లక్షలకుపైగా కేసులు నమోదయ్యాయి. నాలుగో రోజూ 2వేలకు పైగా మరణాలు సంభవించాయి. 15 రాష్ట్రాల్లో ఎన్నడూలేనంత గరిష్ఠస్థాయిలో కొత్త కేసులొచ్చాయి. ఈ నెలలో ఇప్పటి వరకు 44.58 లక్షల కేసులు, 26,986 మరణాలు చోటుచేసుకున్నాయి. మొత్తం క్రియాశీల కేసులు 25.52 లక్షలకు చేరాయి. గత ఏడాది సెప్టెంబర్‌ 18న నమోదైన 10.17లక్షలతో పోలిస్తే ఇది దాదాపు రెండున్నర రెట్లు అధికం.

ఆరోగ్య సంక్షోభం ఆందోళనకరం: ఐఎంఎఫ్‌
‘‘దేశంలో రోజురోజుకీ దిగజారుతున్న పరిస్థితుల పట్ల అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్‌) ప్రధాన ఆర్థికవేత్త గీతా గోపీనాథ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘భారత్‌లో కనిపిస్తున్న ఆరోగ్య సంక్షోభ విస్ఫోటం తీవ్రంగా కలిచివేస్తోంది. ఎంతోమంది కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహచరులు కరోనా ఉద్ధృతికి అల్లాడిపోతున్నారు. భౌతిక దూరం పాటించడం, మాస్కుల వాడకం వంటి జాగ్రత్తల్ని పాటించాలి. ఔషధాలు, టీకాల సరఫరా యుద్ధప్రాతిపదికన పెంచాలి’’ అని పేర్కొన్నారు. 

పరీక్షించిన ప్రతి అయిదుగురిలో ఒకరికి వైరస్‌

TG vadu donga numbers matram apatledu. Akariki kcr ktr ke vachindi antey Inka common people Sangathi choodali. Ee eetela gadu best Minister type lo anni dachi dngutunnadu

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...