Jump to content

ముసుగు తీసేసిన జగన్.. వేటకొడవళ్లు, గొడ్డళ్లకి పదును..’ పాణ్యం హత్యలపై ఆగ్రహం


Rajnichitti

Recommended Posts

కర్నూలు జిల్లాలో మరోమారు ఫ్యాక్షన్ హత్యలు అలజడి రేపాయి. అన్నదమ్ములను అతికిరాతకంగా నరికి చంపడంపై టీడీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎం జగన్ నెత్తుటి దాహానికి ఈ ఘటన సాక్ష్యమని తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి

ప్రధానాంశాలు:

  • కర్నూలు టీడీపీ నేతల దారుణ హత్య
  • వైసీపీ ఫ్యాక్షన్ గ్యాంగుల పనేనని టీడీపీ ఆగ్రహం
  • సీఎం జగన్ నిజస్వరూపం బయటపడిందంటూ మండిపాటు.
  • పాణ్యం నియోజకవర్గంలో ఫ్యాక్షన్ కక్షలు భగ్గుమన్నాయి. టీడీపీ వర్గీయులైన అన్నదమ్ములను అతి దారుణంగా నరికి చంపడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై టీడీపీ యువ నేత నారా లోకేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైఎస్ జగన్‌ నెత్తుటి దాహానికి సాక్ష్యమిదేనంటూ మండిపడ్డారు. జగన్ రెడ్డి ముఖ్యమంత్రి ముసుగు తీసేసి ఫ్యాక్షనిస్ట్ నిజస్వరూపాన్ని బయటపెడుతున్నారని ఆయన విమర్శించారు.

    ఫ్యాక్షన్ రెడ్డి గ్యాంగులు వేటకొడవళ్లు, కత్తులు, గొడ్డళ్లకు పదునుబెట్టి పల్లెల్లో ప్రతీకారాలకు దిగుతున్నాయని లోకేష్ ధ్వజమెత్తారు. టీడీపీ శ్రేణులను టార్గెట్ చేసుకుని వైసీపీ ఫ్యాక్షన్ ముఠాలు రెచ్చిపోతున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గడివేముల మండలం పెసరవాయిలో టీడీపీ నాయకులు వడ్డి నాగేశ్వర రెడ్డి, వడ్డి ప్రతాప్ రెడ్డిల‌ను కారుతో ఢీకొట్టి.. వైసీపీ ఫ్యాక్ష‌న్ లీడ‌ర్లు వేట‌కొడ‌వ‌ళ్ల‌తో న‌రికి చంపేయ‌డం అత్యంత దారుణమని లోకేష్ మండిపడ్డారు.

    ఈ దాడిలో గాయ‌ప‌డిన ముగ్గురు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షిస్తున్నానని ఆయన అన్నారు. మృతులు, వైసీపీ బాధిత కుటుంబాల‌కు తెలుగుదేశం పార్టీ అండ‌గా ఉంటుందన్నారు. సీఎం జ‌గ‌న్‌ రెడ్డి, వైసీపీ నేతల నెత్తుటి దాహానికి ఈ ఘటన సాక్ష్యంగా నిలుస్తోందని విమర్శించారు. ఫ్యాక్ష‌న్ ముఠాలు ఆ ఫ్యాక్ష‌న్‌కే పోతాయన్నారు. గ్రామాల్లో శాంతి నెలకొల్పేందుకు టీడీపీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఆయన అన్నారు.
Link to comment
Share on other sites

తెదేపా నేతల హత్యలో ఎమ్మెల్యే హస్తం: చంద్రబాబు

అమరావతి: కర్నూలు జిల్లా పెసరవాయిలో తెదేపా నేతలు నాగేశ్వర్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి హత్యల వెనుక వైకాపాకు చెందిన పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌ రెడ్డి హస్తం ఉందని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవని.. వైకాపా నేతలు, పోలీసు అధికారులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఈ మేరకు చంద్రబాబు ఓ ప్రకటన విడుదల చేశారు. 

‘‘రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించడంతో పట్టపగలే తెదేపా నేతలు, కార్యకర్తలను హతమారుస్తున్నారు. పోలీసు వ్యవస్థ పనిచేస్తోందో లేదో అనే అనుమానం కలుగుతోంది. బంధువు చిన్నదినం కార్యక్రమం కోసం శ్మశానానికి వెళ్లి వస్తున్న నాగేశ్వర్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డిలను ప్రత్యర్థి వర్గం కారుతో ఢీకొట్టి వేటకొడవళ్లతో నరికి దారుణంగా హత్య చేసింది. ఫ్యాక్షనిస్టు పోకడలతో సమాజానికి ఏం సంకేతాలు ఇస్తున్నారు? ప్రజలను రక్షించాల్సిన పోలీసులు అధికార పార్టీకి తొత్తుల్లా మారారు. వైకాపా అధికారంలోకి వచ్చాక 30 మంది తెదేపా కార్యకర్తలను పొట్టబెట్టుకున్నారు. వీరితో పాటు 1500 మందికి పైగా నాయకులపై దాడులు, ఆస్తుల ధ్వంసం ఘటనలకు పాల్పడితే పోలీసు వ్యవస్థ ఏమీ పట్టనట్లు వ్యవహరించడం విస్మయానికి గురిచేస్తోంది. మరే ఇతర రాష్ట్రాల్లోనూ లేనివిధంగా ఏపీలో తెదేపా కార్యకర్తలపై చోటుచేసుకుంటున్న అవాంఛనీయ సంఘటనలు, హత్యాకాండకు ప్రభుత్వం, పోలీసు వ్యవస్థే బాధ్యత వహించాలి. మృతుల కుటుంబాలకు పార్టీ అండగా నిలబడుతుంది’’ అని చంద్రబాబు చెప్పారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...