Jump to content

YS Viveka’s Murder: Culprits Admit Crime, Explain Reasons


RENT

Recommended Posts

ఎంపీ అవినాష్‌, భాస్కర్‌రెడ్డి అండతోనే!

 

వాంగ్మూలంలో తండ్రీకొడుకుల ప్రస్తావన

వైఎస్‌ మనోహర్‌రెడ్డి, డి.శంకర్‌రెడ్డి పేర్లూ..

 

అమరావతి, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో పెద్దల పాత్ర వెలుగులోకి వచ్చింది. కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్‌ భాస్కర్‌రెడ్డి మద్దతు తమకు ఉన్నదని సహ నిందితులు చెప్పినట్టు వివేకా మాజీ డ్రైవర్‌ కోర్టుకు ఇచ్చిన వాంగ్మూలంలో స్పష్టం చేశారు. ఆర్థిక లావాదేవీల్లో భాగంగా జరిగిన ఈ హత్యలో రూ.40కోట్ల మేరకు సుపారీ చేతులు మారినట్లు, పథకం ప్రకారం అంతమొందించినట్లు బయట పడింది. తనతో సహా మొత్తం నలుగురు ప్రత్యక్షంగా పాల్గొన్న ఈ హత్యోదంతంపై వివేకా మాజీ డ్రైవర్‌ దస్తగిరి ప్రొద్దుటూరు కోర్టులో ఇచ్చిన నేర అంగీకార పత్రం శనివారం ఇతర నిందితులకు అందింది. అత్యంత సంచలన రీతిలో 2019 మార్చి 15వ తేదీ పులివెందులలోని తన నివాసంలో వివేకానందరెడ్డి దారుణహత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ హత్య కేసులో ఇప్పటివరకు నలుగురి పాత్రను సీబీఐ అధికారులు వెలికితీశారు. ఈ నిందితుల్లో దస్తగిరి ఒకడు. గతంలో అతడు వివేకాకు కారు డ్రైవర్‌గా పనిచేశాడు. వివేకా పొలం పనులు చూసే గజ్జల ఉమాశంకర్‌ రెడ్డి, ఉమా స్నేహితుడు సునీల్‌ యాదవ్‌, వివేకా మాజీ అనుచరుడు యర్ర గంగరెడ్డి ఈ కేసులో మిగతా నిందితులు. వీరందరిపై ఇటీవల సీబీఐ చార్జిషీటు దాఖలు చేసింది. సీబీఐ దర్యాప్తులో భాగంగా 161 సీఆర్పీసీ కింద దస్తగిరి వాంగ్మూలాన్ని ప్రొద్దుటూరు కోర్టులో ఈ ఏడాది ఆగస్టు 31వ తేదీన సీబీఐ అధికారులు  నమోదు చేయించారు. గజ్జల ఉమాశంకర్‌రెడ్డి, యర్ర గంగిరెడ్డి, సునీల్‌ యాదవ్‌తో కలిసి తాను గొడ్డలితో నరికి వివేకాను అంతమొందించినట్టు దస్తగిరి ఈ వాంగ్మూలంలో అంగీకరించాడు. వివేకా హత్యకు నిందితుడు దస్తగిరి వెనుకాడగా.. ‘‘నువ్వు ఒక్కడివే కాదు.. మేము కూడా వస్తాము.. మరియు దీనివెనుక పెద్దవాళ్లు ఉన్నారు’’ అని యర్ర గంగిరెడ్డి అన్నట్టు నిందితుడు తన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. ‘ఎవరా పెద్దవాళ్లు’ అని తాను అడగ్గా.. ‘వైఎస్‌ అవినాష్‌ రెడ్డి, వైఎస్‌ భాస్కరరెడ్డి, వైఎస్‌ మనోహరరెడ్డి, డి. శంకరరెడ్డి ఉన్నారు’ అని గంగిరెడ్డి చెప్పినట్టు దస్తగిరి..మేజిస్ర్టేట్‌ ఎదుట వెల్లడించాడు. వాంగ్మూలంలోని అంశాలు దస్తగిరి మాటల్లోనే...

 

 

వివేకా మాజీ డ్రైవర్‌ దస్తగిరి సంచలన వాంగ్మూలం

ఎమ్మెల్సీగా తన ఓటమిపై వివేకా ఆగ్రహం బెంగళూరు స్థలం గొడవతో ఘర్షణ తీవ్రం మాజీ అనుచరుడు గంగిరెడ్డి ఇంట హత్యకు స్కెచ్‌ 40 కోట్లకు సుపారీ.. దస్తగిరితో 5 కోట్ల డీల్‌ ‘దీని వెనుక పెద్దలున్నా’రని హత్యకు ముందు మిగతా నిందితులకు చెప్పిన గంగిరెడ్డి భయం లేదు.. అంతా అవినాష్‌రెడ్డి చూసుకుంటారని హత్య తర్వాత వ్యాఖ్యలుహత్యలో నేరుగా పాల్గొన్న గంగిరెడ్డి, దస్తగిరి, సునీల్‌యాదవ్‌, ఉమాశంకర్‌రెడ్డి ప్రొద్దుటూరు కోర్టు నుంచి ఇతర నిందితులకు అందిన వాంగ్మూల ప్రతులు

 

భయపడకు.. పెద్దలున్నారు.. 

‘‘వివేకా హత్య జరిగిన రోజు వేకువ జామున 5.25గంటలకు సునీల్‌ యాదవ్‌ నాకు ఫోన్‌ చేసి.. గంగిరెడ్డి ఇంటికి రమ్మన్నాడు. నేను, సునీల్‌, ఉమాశంకర్‌ రెడ్డి అక్కడకు వెళ్లగా... ఏమీ భయ పడొద్దని నాకు ధైర్యం చెప్పారు. ‘డి. శంకర్‌ రెడ్డి, వై.ఎస్‌. అవినాష్‌రెడ్డితో నేను మాట్లాడాను.. వాళ్లు చూసుకుంటారు’ అని గంగిరెడ్డి చెప్పాడు. మిగతా డబ్బు కూడా ఇచ్చేస్తానని చెప్పాడు. తర్వాత మమ్మల్ని పోలీసులు విచారణ నిమిత్తం పిలిచారు. అక్కడ గంగిరెడ్డి.....‘భయపడవద్దు.. హత్య జరిగిన ప్రదేశాన్ని తుడిపించాను. ఎటువంటి ఆధారాలు లేకుండా చేశాను. మిగతా డబ్బులు త్వరలో ఇచ్చేస్తాను’ అని చెప్పాడు’’ అని కోర్టుకు దస్తగిరి వివరించాడు. 

 

కదిరిలో గొడ్డలి తీసుకొచ్చా..

‘‘వివేకాను హత్య చేసేందుకు సునీల్‌ యాదవ్‌ చెప్పినట్లు కదిరికి వెళ్లి గొడ్డలి తీసుకొని ఫోన్‌ చేశాను. ‘పులివెందులలోని వివేకానందరెడ్డి ఇంటికి వచ్చేయ్‌..అక్కడ ఎవ్వరూ లేరని గంగిరెడ్డి చెప్పాడ’ని సునీల్‌ నాకు ఫోన్లో చెప్పాడు. సమీపంలోకి చేరుకుని ఇద్దరమూ మద్యం తాగుతుండగా రాత్రి 11.40కి వివేకా కారులో ఇంటికి వస్తుండటం చూశాం. ఆ తర్వాత ఉమా శంకర్‌ రెడ్డి పల్సర్‌ బైకుపై గంగిరెడ్డిని ఎక్కించుకుని వివేకా ఇంటివద్ద దించేసి మా దగ్గరికి వచ్చాడు. రాత్రి 1.30వరకూ ముగ్గురం అక్కడే మద్యం సేవించాం. ఆ తర్వాత నేను, సునీల్‌ ఉమా శంకర్‌ బైకుపై వివేకా ఇంటి వెనక్కి వచ్చి పార్కింగ్‌ చేశాం. కాంపౌండ్‌ లోపలికి దూకి ముందు వాకిలి(తలుపు) దగ్గర వాచ్‌ మెన్‌ రంగన్న పడుకుని ఉండటం చూసి... సైడ్‌ వాకిలి తలుపు తట్టాం. లోపలి నుంచి తలుపు తీసి గంగిరెడ్డి రమ్మని పిలిచాడు. మమ్మల్ని చూసిన వివేకా ‘ఈ టైములో వీళ్లు ఎందుకు వచ్చారు’ అని అడిగారు. ఆ బెంగళూరు సెటిల్‌ మెంట్‌ డబ్బుల గురించి మాట్లాడటానికి వచ్చారని గంగిరెడ్డి చెప్పాడు. అప్పుడు వివేకా గంగిరెడ్డిపైకి వచ్చి ‘నన్ను సెటిల్‌ మెంట్‌ డబ్బుల వాటా ఎందుకు అడుగుతున్నావ్‌’ అని కోప్పడ్డారు’’

 

పులివెందులలో కొనలేదు

‘‘హత్య తరువాత మమ్మల్ని ప్రజలు గుర్తుపడతారని మేము ఉద్దేశపూర్వకంగానే గొడ్డలిని పులివెందులలో కొనలేదు. వ్యక్తిగత పని మీద కదిరి వెళ్తున్న హఫీజుల్లాతో స్కూటీ పై వెళ్లి కదిరిలోని కేకేసీ హార్డ్‌ వేర్‌లో రూ.450 పెట్టి గొడ్డలి కొన్నాను. తిరిగి రాత్రి తొమ్మిదిగంటల ప్రాంతంలో పులివెందుల వచ్చాను’’

 

11142021015256n11.jpg

 

అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి సంగతీ తేలుస్తా..

‘‘వివేకానందరెడ్డి వద్ద 2016లో నన్ను మా మామ డ్రైవర్‌గా పెట్టాడు. 2018 వరకూ ఆయన వద్ద పనిచేశాను. 2017లో వివేకా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన సమయంలో ఆయన అనుచరులైన యర్ర గంగిరెడ్డి, గజ్జల ఉమా శంకర్‌ రెడ్డితో కలిసి లక్షలాది రూపాయల డబ్బులు పంచాను. అయితే, ఆ ఎన్నికల్లో వివేకా ఓడిపోయారు. వివేకా ఒకరోజు హైదరాబాద్‌ నుంచి వస్తూ ముద్దనూరు రైల్వే స్టేషన్‌కు బండి తీసుకురమ్మని చెబితే.. వెళ్లాను. తిరిగి వస్తుండగా కారులో యర్ర గంగిరెడ్డికి వివేకా ఫోన్‌ చేసి ఇంటికి రమ్మన్నారు. పులివెందులలో మేం ఇంటికి చేరుకునే సమయానికి గంగిరెడ్డి వచ్చి ఉన్నాడు. ఆ తర్వాత ఇద్దరినీ ఎంపీ అవినాష్‌ రెడ్డి ఇంటికి తీసుకెళుతున్న సమయంలో... మీరు నన్ను మోసం చేశారని గంగిరెడ్డితో వివేకా అన్నారు. కారు దిగిన తర్వాత అక్కడున్న డి. శంకర్‌ రెడ్డిని (స్థానిక వైసీపీ నాయకుడు) చూసి ‘నువ్వు మా కుటుంబంలోకి వచ్చి నన్ను మోసం చేశావ్‌.. కుటుంబ సభ్యులు దూరమయ్యారు.. నీ అంతు చూస్తా..’ అని వివేకా కోప్పడ్డారు. ‘నువ్వే కాదు... అవినాష్‌, భాస్కర్‌ రెడ్డి (అవినాష్‌ తండ్రి) సంగతీ తేలుస్తా’ అన్నారు. ఆ తర్వాత యర్ర గంగిరెడ్డి, గజ్జల ఉమా శంకర్‌ రెడ్డిని ఆఫీ్‌సకు పిలిచి ఒక సారి బాగా తిట్టారు’’ 

 

బెంగళూరులో ‘కడప’ పంచాయితీ

వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు ఈ ఏడాది ఆగస్టు 25వ తేదీన షేక్‌ దస్తగిరి వాంగ్మూలం సేకరించారు... వివేకా హత్యకు భూవివాదమే కారణమని దస్తగిరి వెల్లడించాడు. ఆ వివరాలు అతని మాటల్లోనే.. ‘‘కడపకు చెందిన రాధాకృష్ణమూర్తి, ఆయన కుమారుడు ప్రసాదమూర్తికి చెందిన భూవివాదాన్ని సెటిల్మెంట్‌ చేసేందుకు 2017 నుంచి 2018 డిసెంబర్‌ మధ్య వివేకానందరెడ్డి ఎర్రగంగిరెడ్డితో బెంగుళూరు వెళుతుండేవారు. బెంగుళూరు గెస్ట్‌ హౌజ్‌ వద్ద కోడూరు రమణ, చిట్టివెళ్లి లక్ష్మీకర్‌ కలిసేవారు. వారు బ్రోకర్‌ పీటర్‌తో పాటు డిప్యూటీ ఎస్పీ రాజేశ్‌ను కలిసేవారు. ల్యాండ్‌ సెటిల్మెంట్‌ తరువాత రూ.8కోట్లు వివేకానందరెడ్డికి ఇవ్వాల్సి ఉందని నాకు తెలిసింది. ఈ సెటిల్మెంట్‌ వ్యవహారంలో ఎర్రగంగిరెడ్డి చురుకైన పాత్ర పోషించారు. ఒంటరిగా బెంగుళూరు వెళ్తుండేవారు’’ 

 

డబ్బు మేటర్‌ సీరియస్‌

‘‘అప్పుడప్పుడు బెంగళూరుకు వివేకాతోపాటు గంగిరెడ్డిని కారులో తీసుకెళ్లాను. ఆ సమయంలో 8కోట్ల రూపాయల డబ్బుల వ్యవహారం వారిద్దరి మధ్య చర్చకు వచ్చింది. బెంగళూరు గెస్ట్‌హౌ్‌సలో సునీల్‌యాదవ్‌ను  వివేకాకు ఉమా శంకర్‌ రెడ్డి పరిచయం చేశారు. అప్పటి నుంచి పలుమార్లు బెంగళూరుకు డబ్బుల కోసం సునీల్‌, గంగిరెడ్డి, ఉమా శంకర్‌ రెడ్డి వెళ్లారు. ఓ రోజు బెంగళూరు గెస్ట్‌ హౌస్‌లో యర్ర గంగిరెడ్డి డబ్బు అడగ్గా...వివేకా తిట్టి నన్ను బండి తీయమని పులివెందులకు వచ్చేశారు. ఆ తర్వాత వారిద్దరికీ మాటల్లేవ్‌.. నేను 2018 డిసెంబరులో డ్రైవర్‌గా వివేకానంద రెడ్డి దగ్గర పని మానేశాను’’ 

 

ఛాతీపై గుద్దులు.. గొడ్డలితో వేట్లు..

వాగ్వాదం నడుస్తుండగానే.. వివేక్డాని సునీల్‌ యాదవ్‌ బూతులు తిడుతూ ముఖంపై పిడిగుద్దులతో దాడి చేశాడు. వివేకా అప్పుడు వెనక్కి పడిపోవడంతో గజ్జల ఉమా శంకర్‌ రెడ్డి నన్ను గొడ్డలి అడిగి తీసుకుని తలపై గాయపరచగా.. వివేకా పక్కకు తిరిగారు. వెంటనే మళ్లీ వేటు వేయడంతో తల నుంచి రక్తం వచ్చింది. వెంటనే సునీల్‌ యాదవ్‌ వివేకా ఛాతీపై ఏడెనిమిది సార్లు కొట్టాడు. తర్వాత ఉమా శంకర్‌ రెడ్డి గొడ్డలి నా చేతికిచ్చి వివేకానందరెడ్డి లేవకుండా చూడాలని చెప్పి... ఇళ్లంతా డాక్యుమెంట్ల కోసం వెతికారు. అది చూసిన వివేకా ‘నా ఇంట్లో ఏమి వెతుకు తున్నారు’’ అని చేయి పైకెత్తారు. నేను కుడి చేయి అరచేతిపై గొడ్డలితో గాయపరిచాను. రక్తం వచ్చింది. అప్పుడే సునీల్‌ యాదవ్‌, యర్ర గంగిరెడ్డి, ఉమా శంకర్‌ రెడ్డిలకు కొన్ని డాక్యుమెంట్లు దొరికాయి. ఆ తర్వాత వివేకాను మేమందరం కొట్టి.. ‘డ్రైవర్‌ ప్రసాద్‌ చంపబోయాడు. అతన్ని వదల వద్దు’ అని బలవంతంగా ఉత్తరం రాయించి సంతకం కూడా చేయించాం. ఆ తర్వాత వివేకాను బాత్‌రూమ్‌లోకి తీసుకెళ్లి చంపుదామని గంగిరెడ్డి చెప్పగా.. మేం ముగ్గురం ఆయనను బాత్‌ రూమ్‌లోకి తీసుకెళ్లి కింద పడేశాం. అప్పుడు ఉమా శంకర్‌ రెడ్డి గొడ్డలి తీసుకుని ఐదారు సార్లు తలపై నరకడంతో వివేకా చనిపోయారు. తర్వాత ఇనుప బీరువాను నేను గొడ్డలితో కొట్టినా అది తెరుచుకోక పోవడంతో వదిలేశాం. తర్వాత డాక్యుమెంట్లు అన్నీ చూసుకుని యర్ర గంగిరెడ్డి హాల్లో లైట్లు ఆపమని చెప్పాడు. గంగిరెడ్డి మెయిన్‌ డోర్‌ వైపు వెళుతుండగా వాచ్‌మెన్‌ రంగన్న లేచి ఎవరు అని అరిచాడు. దీంతో నేను సునీల్‌ యాదవ్‌, ఉమా శంకర్‌ రెడ్డి కాంపౌండ్‌ వాల్‌ వెనుక నుంచి దూకేశాం. తర్వాత సునీల్‌ యాదవ్‌కు నేను గొడ్డలి ఇచ్చేశా.. ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లి పోయాం’’ అని సీబీఐకి దస్తగిరి తెలిపాడు.

 

స్టెంట్‌ వేసిన ఛాతీపై పిడిగుద్దులు

‘‘వివేకానందరెడ్డి గుండెకు స్టంట్‌ వేశారని సునీల్‌ యాదవ్‌కు తెలుసు. హత్య సమయంలో సునీల్‌ యాదవ్‌ గుద్దుతుండడంతో అమ్మ అమ్మ అంటూ ఆయన బిగ్గరగా అరిచారు. ఉమాశంకర్‌ రెడ్డి కుడి వైపు నుంచి వివేకానందరెడ్డి కాలర్‌ పట్టుకొని బెడ్‌ రూమ్‌ డోర్‌ పక్కనే ఉన్న చెక్క డ్రాయర్‌ వద్దకు లాక్కెల్లాడు. వివేకానందరెడ్డి కాలర్‌ పట్టుకొని మోకాళ్ల మీద కూర్చొనేలా చేశారు. ఆ సమయంలో సునీల్‌ యాదవ్‌ ఉడెన్‌ ప్యానల్‌ మీద ఉన్న పెన్నుతీసుకొని వివేకాందరెడ్డి చేతిలో పెట్టాడు. తాను చెప్పినట్లు రాయాలని కోరాడు. ఈ సమయంలో సునీల్‌ యాదవ్‌ వివేకానందరెడ్డి ఎడమవైపు పక్కటెముకల పై గుద్దాడు. ఒక వైపు వ్రాసిఉన్న, మరోవైపు ఖాళీ ఉన్న కోన్ని పేపర్లను వివేకానందరెడ్డి ముంచారు. తామిచెప్పినట్లురాయాలని గంగిరెడ్డి కోరగా వివేకానందరెడ్డి నిరాకరించారు. ఆ సమయంలో గంగిరెడ్డి వివేకానందరెడ్డి ఎడమవైపు నడుము పై తన్నుతూ లేఖరాస్తే బతుకుతావని, లేకపోతే చంపేస్తామన్నారు. అయిన సరే లేఖరాయడానికి వివేకానందరెడ్డి తిరస్కరించారు. ఉమాశంకర్‌ రెడ్డి తన ఎడమచేతితో వివేకానందరెడ్డి తల వెనుకభాగం పై కొట్టడంతో ఆయన చేతికి రక్తం అంటింది. నేడు కూడా వెనుకభాగంలో తన్నాను. గంగిరెడ్డి కూడా మరోసారి వివేకానందరెడ్డి చెంప పై కొట్టాడు. దీంతో వివేకానందరెడ్డి భయపడి తనను వదిలి వేయాలని, లేఖ రాస్తానని ప్రాధేయపడ్డాడు. కేసును తప్పుదోవ పట్టించేందుకు లెటర్‌లో డ్రైవర్‌ ప్రసాద్‌ పేరు రాయాలని సునీల్‌ యాదవ్‌... వివేకానందరెడ్డికి చెప్పారు. డ్యూటీకి త్వరగా రావాలని కోరడంతోనే డ్రైవర్‌ ప్రసాద్‌ చంపబోయినట్టు ఆ లేఖలో రాయించాం’’ అని సీబీఐ వద్ద దస్తగిరి అంగీకరించాడు. 

 

విల్లా కొనాలని బేరం...

‘‘సుఫారీ కింద నాకు కోటి రూపాయలు ఇస్తామని.. చేతికి రూ. 75 లక్షలు సునీల్‌ యాదవ్‌ ఇచ్చాడు. ఆ సొమ్మును నా స్నేహితుడు మున్నాకు అందజేశాను. వివేకానందరెడ్డితో వ్యాపార భాగస్వామ్యంలో ఈ సొమ్ము నాకు వచ్చిందని చెప్పాను. తన అవసరాల కోసం 5నుంచి 7లక్షలు ఇస్తానని మున్నాకు హామీ ఇచ్చాను. మిగతా రూ. 25 లక్షలూ అందాక.. మొత్తం కోటి రూపాయలు సొమ్ములో 75లక్షలతో పులివెందులలో విజయా హోమ్స్‌లో విల్లా కొనాలని నిర్ణయించాను. ఒకనెలలో విల్లాను స్వాధీనపరిచేలా సంబంధిత మేనేజర్‌తో బేరం ఆడాను’’ అని సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో దస్తగిరి బయటపెట్టాడు..

 

సార్‌ దగ్గర పనిచేశా.. చంపలేను..

‘‘వివేకా వద్ద పని మానేసినా పాత పరిచయంతో ఉమా శంకర్‌ రెడ్డి, గంగిరెడ్డి, సునీల్‌ను తరచూ కలిసే వాడిని. 2019 ఫిబ్రవరి 10న గంగిరెడ్డి ఇంటికి ఉమా శంకర్‌ రెడ్డి నన్ను తీసుకెళ్లాడు. తనకు బెంగళూరు సెటిల్‌ మెంట్‌ ద్వారా వచ్చిన డబ్బు వివేకా ఇవ్వలేదని గంగిరెడ్డి అన్నాడు. అందుకని వివేకానందరెడ్డిని చంపాలని నన్ను అడిగాడు. ‘సార్‌ దగ్గర పనిచేశా.. చంపలేనని చెప్పా’. అందుకు గంగిరెడ్డి.. డ్రైవర్‌గా ఇన్నాళ్లు పనిచేసి ఏమి సంపాదించావ్‌.. ఈ మర్డర్‌ చేస్తే మనకు 40కోట్లు వస్తాయ్‌.. నీ వాటా ఐదు కోట్లు ఇస్తామని అన్నాడు. ‘నువ్వొక్కడివే కాదు.. మేము కూడా వస్తామ’ని గంగిరెడ్డి అన్నాడు. దీంట్లో పెద్దలున్నారని చెప్పాడు.. ఎవరని నేను అడిగితే ఎంపీ వై.ఎస్‌. అవినాష్‌ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్‌ భాస్కర్‌ రెడ్డి, వైఎస్‌ మనోహర్‌ రెడ్డి, డి. శంకర్‌ రెడ్డి ఉన్నారని చెప్పాడు. ఈ పని చేస్తే సెటిల్‌ అయిపోతావని యర్ర గంగిరెడ్డి నాకు ఆశ పెట్టాడు. నాలుగు రోజుల తర్వాత హెలీపాడ్‌ వద్దకు నన్ను సునీల్‌ రమ్మని చెప్పి... యెల్లో స్కూటీపై అక్కడికి వచ్చాడు. నాకు కోటి రూపాయల అడ్వాన్స్‌ ఇచ్చి అందులో నుంచి అవసరం ఉందని 25లక్షల రూపాయలు తీసుకున్నాడు. మిగతా 75లక్షలు నా స్నేహితుడు మున్నా వద్ద దాచి పెట్టాను. నాలుగు రోజులకు వివేకానందరెడ్డి ఇంట్లో కుక్కను సునీల్‌ యాదవ్‌, ఉమా శంకర్‌ రెడ్డి కారుతో తొక్కించి చంపేశారు’’.

Link to comment
Share on other sites

2 hours ago, vatsayana said:

idi mathram 100% guaranteed. how he is involved, how much involvement anedi mathram baitiki radu.

Jagga direct involvement ledhu anukunta. Vaadiki viveka ki financial dealings emi levu. Avinash & viveka ki eppati nuncho vunnayi. Ys unnani rojulu avinash reddy and vadi daddy ni control chesadu. Tharuvatha viveka became minister.  Time kosam wait chesaru anthey.

jagga ki telisey jarigindi. Murder time ki jagga next cm ani almost confirm. Also cbn cbi ni ban cheyyadam baaga kalisi vachindi

Link to comment
Share on other sites

9 minutes ago, Vaampire said:

Jagga direct involvement ledhu anukunta. Vaadiki viveka ki financial dealings emi levu. Avinash & viveka ki eppati nuncho vunnayi. Ys unnani rojulu avinash reddy and vadi daddy ni control chesadu. Tharuvatha viveka became minister.  Time kosam wait chesaru anthey.

jagga ki telisey jarigindi. Murder time ki jagga next cm ani almost confirm. Also cbn cbi ni ban cheyyadam baaga kalisi vachindi

But ie theory la murder motive or justification ae matram kanipinchatledu kada..

Aasthi tagadalu common…inkoka 2 months lo election petukuni, which politician or sitting politician will take such a step ? Bihar or Bengal lo kuda jara gadu ie scene
 

Oka two months tarvata lepesetollu kada..tractor tiragapadindi ani rasukunetaniki easy ga vundedi…intha risk enduku chestarav ?

Link to comment
Share on other sites

14 minutes ago, Vaampire said:

Jagga direct involvement ledhu anukunta. Vaadiki viveka ki financial dealings emi levu. Avinash & viveka ki eppati nuncho vunnayi. Ys unnani rojulu avinash reddy and vadi daddy ni control chesadu. Tharuvatha viveka became minister.  Time kosam wait chesaru anthey.

jagga ki telisey jarigindi. Murder time ki jagga next cm ani almost confirm. Also cbn cbi ni ban cheyyadam baaga kalisi vachindi

yeah Jagan ki teliyakunda family members ye champesaru ante not believable. Story lo kuda edo teda kodutondi specially forcing to write a letter part.

Link to comment
Share on other sites

23 minutes ago, Vaampire said:

Also cbn cbi ni ban cheyyadam baaga kalisi vachindi

This has no significance. Murder jarigindi 15th March...apatike election code of conduct in place and CBI ki entry or no entry would have made no difference, more over CBI will not take up case suo-moto.

Link to comment
Share on other sites

1 hour ago, ntr2ntr said:

ఎంపీ అవినాష్‌, భాస్కర్‌రెడ్డి అండతోనే!

 

వాంగ్మూలంలో తండ్రీకొడుకుల ప్రస్తావన

వైఎస్‌ మనోహర్‌రెడ్డి, డి.శంకర్‌రెడ్డి పేర్లూ..

 

అమరావతి, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో పెద్దల పాత్ర వెలుగులోకి వచ్చింది. కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్‌ భాస్కర్‌రెడ్డి మద్దతు తమకు ఉన్నదని సహ నిందితులు చెప్పినట్టు వివేకా మాజీ డ్రైవర్‌ కోర్టుకు ఇచ్చిన వాంగ్మూలంలో స్పష్టం చేశారు. ఆర్థిక లావాదేవీల్లో భాగంగా జరిగిన ఈ హత్యలో రూ.40కోట్ల మేరకు సుపారీ చేతులు మారినట్లు, పథకం ప్రకారం అంతమొందించినట్లు బయట పడింది. తనతో సహా మొత్తం నలుగురు ప్రత్యక్షంగా పాల్గొన్న ఈ హత్యోదంతంపై వివేకా మాజీ డ్రైవర్‌ దస్తగిరి ప్రొద్దుటూరు కోర్టులో ఇచ్చిన నేర అంగీకార పత్రం శనివారం ఇతర నిందితులకు అందింది. అత్యంత సంచలన రీతిలో 2019 మార్చి 15వ తేదీ పులివెందులలోని తన నివాసంలో వివేకానందరెడ్డి దారుణహత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ హత్య కేసులో ఇప్పటివరకు నలుగురి పాత్రను సీబీఐ అధికారులు వెలికితీశారు. ఈ నిందితుల్లో దస్తగిరి ఒకడు. గతంలో అతడు వివేకాకు కారు డ్రైవర్‌గా పనిచేశాడు. వివేకా పొలం పనులు చూసే గజ్జల ఉమాశంకర్‌ రెడ్డి, ఉమా స్నేహితుడు సునీల్‌ యాదవ్‌, వివేకా మాజీ అనుచరుడు యర్ర గంగరెడ్డి ఈ కేసులో మిగతా నిందితులు. వీరందరిపై ఇటీవల సీబీఐ చార్జిషీటు దాఖలు చేసింది. సీబీఐ దర్యాప్తులో భాగంగా 161 సీఆర్పీసీ కింద దస్తగిరి వాంగ్మూలాన్ని ప్రొద్దుటూరు కోర్టులో ఈ ఏడాది ఆగస్టు 31వ తేదీన సీబీఐ అధికారులు  నమోదు చేయించారు. గజ్జల ఉమాశంకర్‌రెడ్డి, యర్ర గంగిరెడ్డి, సునీల్‌ యాదవ్‌తో కలిసి తాను గొడ్డలితో నరికి వివేకాను అంతమొందించినట్టు దస్తగిరి ఈ వాంగ్మూలంలో అంగీకరించాడు. వివేకా హత్యకు నిందితుడు దస్తగిరి వెనుకాడగా.. ‘‘నువ్వు ఒక్కడివే కాదు.. మేము కూడా వస్తాము.. మరియు దీనివెనుక పెద్దవాళ్లు ఉన్నారు’’ అని యర్ర గంగిరెడ్డి అన్నట్టు నిందితుడు తన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. ‘ఎవరా పెద్దవాళ్లు’ అని తాను అడగ్గా.. ‘వైఎస్‌ అవినాష్‌ రెడ్డి, వైఎస్‌ భాస్కరరెడ్డి, వైఎస్‌ మనోహరరెడ్డి, డి. శంకరరెడ్డి ఉన్నారు’ అని గంగిరెడ్డి చెప్పినట్టు దస్తగిరి..మేజిస్ర్టేట్‌ ఎదుట వెల్లడించాడు. వాంగ్మూలంలోని అంశాలు దస్తగిరి మాటల్లోనే...

 

 

వివేకా మాజీ డ్రైవర్‌ దస్తగిరి సంచలన వాంగ్మూలం

ఎమ్మెల్సీగా తన ఓటమిపై వివేకా ఆగ్రహం బెంగళూరు స్థలం గొడవతో ఘర్షణ తీవ్రం మాజీ అనుచరుడు గంగిరెడ్డి ఇంట హత్యకు స్కెచ్‌ 40 కోట్లకు సుపారీ.. దస్తగిరితో 5 కోట్ల డీల్‌ ‘దీని వెనుక పెద్దలున్నా’రని హత్యకు ముందు మిగతా నిందితులకు చెప్పిన గంగిరెడ్డి భయం లేదు.. అంతా అవినాష్‌రెడ్డి చూసుకుంటారని హత్య తర్వాత వ్యాఖ్యలుహత్యలో నేరుగా పాల్గొన్న గంగిరెడ్డి, దస్తగిరి, సునీల్‌యాదవ్‌, ఉమాశంకర్‌రెడ్డి ప్రొద్దుటూరు కోర్టు నుంచి ఇతర నిందితులకు అందిన వాంగ్మూల ప్రతులు

 

భయపడకు.. పెద్దలున్నారు.. 

‘‘వివేకా హత్య జరిగిన రోజు వేకువ జామున 5.25గంటలకు సునీల్‌ యాదవ్‌ నాకు ఫోన్‌ చేసి.. గంగిరెడ్డి ఇంటికి రమ్మన్నాడు. నేను, సునీల్‌, ఉమాశంకర్‌ రెడ్డి అక్కడకు వెళ్లగా... ఏమీ భయ పడొద్దని నాకు ధైర్యం చెప్పారు. ‘డి. శంకర్‌ రెడ్డి, వై.ఎస్‌. అవినాష్‌రెడ్డితో నేను మాట్లాడాను.. వాళ్లు చూసుకుంటారు’ అని గంగిరెడ్డి చెప్పాడు. మిగతా డబ్బు కూడా ఇచ్చేస్తానని చెప్పాడు. తర్వాత మమ్మల్ని పోలీసులు విచారణ నిమిత్తం పిలిచారు. అక్కడ గంగిరెడ్డి.....‘భయపడవద్దు.. హత్య జరిగిన ప్రదేశాన్ని తుడిపించాను. ఎటువంటి ఆధారాలు లేకుండా చేశాను. మిగతా డబ్బులు త్వరలో ఇచ్చేస్తాను’ అని చెప్పాడు’’ అని కోర్టుకు దస్తగిరి వివరించాడు. 

 

కదిరిలో గొడ్డలి తీసుకొచ్చా..

‘‘వివేకాను హత్య చేసేందుకు సునీల్‌ యాదవ్‌ చెప్పినట్లు కదిరికి వెళ్లి గొడ్డలి తీసుకొని ఫోన్‌ చేశాను. ‘పులివెందులలోని వివేకానందరెడ్డి ఇంటికి వచ్చేయ్‌..అక్కడ ఎవ్వరూ లేరని గంగిరెడ్డి చెప్పాడ’ని సునీల్‌ నాకు ఫోన్లో చెప్పాడు. సమీపంలోకి చేరుకుని ఇద్దరమూ మద్యం తాగుతుండగా రాత్రి 11.40కి వివేకా కారులో ఇంటికి వస్తుండటం చూశాం. ఆ తర్వాత ఉమా శంకర్‌ రెడ్డి పల్సర్‌ బైకుపై గంగిరెడ్డిని ఎక్కించుకుని వివేకా ఇంటివద్ద దించేసి మా దగ్గరికి వచ్చాడు. రాత్రి 1.30వరకూ ముగ్గురం అక్కడే మద్యం సేవించాం. ఆ తర్వాత నేను, సునీల్‌ ఉమా శంకర్‌ బైకుపై వివేకా ఇంటి వెనక్కి వచ్చి పార్కింగ్‌ చేశాం. కాంపౌండ్‌ లోపలికి దూకి ముందు వాకిలి(తలుపు) దగ్గర వాచ్‌ మెన్‌ రంగన్న పడుకుని ఉండటం చూసి... సైడ్‌ వాకిలి తలుపు తట్టాం. లోపలి నుంచి తలుపు తీసి గంగిరెడ్డి రమ్మని పిలిచాడు. మమ్మల్ని చూసిన వివేకా ‘ఈ టైములో వీళ్లు ఎందుకు వచ్చారు’ అని అడిగారు. ఆ బెంగళూరు సెటిల్‌ మెంట్‌ డబ్బుల గురించి మాట్లాడటానికి వచ్చారని గంగిరెడ్డి చెప్పాడు. అప్పుడు వివేకా గంగిరెడ్డిపైకి వచ్చి ‘నన్ను సెటిల్‌ మెంట్‌ డబ్బుల వాటా ఎందుకు అడుగుతున్నావ్‌’ అని కోప్పడ్డారు’’

 

పులివెందులలో కొనలేదు

‘‘హత్య తరువాత మమ్మల్ని ప్రజలు గుర్తుపడతారని మేము ఉద్దేశపూర్వకంగానే గొడ్డలిని పులివెందులలో కొనలేదు. వ్యక్తిగత పని మీద కదిరి వెళ్తున్న హఫీజుల్లాతో స్కూటీ పై వెళ్లి కదిరిలోని కేకేసీ హార్డ్‌ వేర్‌లో రూ.450 పెట్టి గొడ్డలి కొన్నాను. తిరిగి రాత్రి తొమ్మిదిగంటల ప్రాంతంలో పులివెందుల వచ్చాను’’

 

11142021015256n11.jpg

 

అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి సంగతీ తేలుస్తా..

‘‘వివేకానందరెడ్డి వద్ద 2016లో నన్ను మా మామ డ్రైవర్‌గా పెట్టాడు. 2018 వరకూ ఆయన వద్ద పనిచేశాను. 2017లో వివేకా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన సమయంలో ఆయన అనుచరులైన యర్ర గంగిరెడ్డి, గజ్జల ఉమా శంకర్‌ రెడ్డితో కలిసి లక్షలాది రూపాయల డబ్బులు పంచాను. అయితే, ఆ ఎన్నికల్లో వివేకా ఓడిపోయారు. వివేకా ఒకరోజు హైదరాబాద్‌ నుంచి వస్తూ ముద్దనూరు రైల్వే స్టేషన్‌కు బండి తీసుకురమ్మని చెబితే.. వెళ్లాను. తిరిగి వస్తుండగా కారులో యర్ర గంగిరెడ్డికి వివేకా ఫోన్‌ చేసి ఇంటికి రమ్మన్నారు. పులివెందులలో మేం ఇంటికి చేరుకునే సమయానికి గంగిరెడ్డి వచ్చి ఉన్నాడు. ఆ తర్వాత ఇద్దరినీ ఎంపీ అవినాష్‌ రెడ్డి ఇంటికి తీసుకెళుతున్న సమయంలో... మీరు నన్ను మోసం చేశారని గంగిరెడ్డితో వివేకా అన్నారు. కారు దిగిన తర్వాత అక్కడున్న డి. శంకర్‌ రెడ్డిని (స్థానిక వైసీపీ నాయకుడు) చూసి ‘నువ్వు మా కుటుంబంలోకి వచ్చి నన్ను మోసం చేశావ్‌.. కుటుంబ సభ్యులు దూరమయ్యారు.. నీ అంతు చూస్తా..’ అని వివేకా కోప్పడ్డారు. ‘నువ్వే కాదు... అవినాష్‌, భాస్కర్‌ రెడ్డి (అవినాష్‌ తండ్రి) సంగతీ తేలుస్తా’ అన్నారు. ఆ తర్వాత యర్ర గంగిరెడ్డి, గజ్జల ఉమా శంకర్‌ రెడ్డిని ఆఫీ్‌సకు పిలిచి ఒక సారి బాగా తిట్టారు’’ 

 

బెంగళూరులో ‘కడప’ పంచాయితీ

వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు ఈ ఏడాది ఆగస్టు 25వ తేదీన షేక్‌ దస్తగిరి వాంగ్మూలం సేకరించారు... వివేకా హత్యకు భూవివాదమే కారణమని దస్తగిరి వెల్లడించాడు. ఆ వివరాలు అతని మాటల్లోనే.. ‘‘కడపకు చెందిన రాధాకృష్ణమూర్తి, ఆయన కుమారుడు ప్రసాదమూర్తికి చెందిన భూవివాదాన్ని సెటిల్మెంట్‌ చేసేందుకు 2017 నుంచి 2018 డిసెంబర్‌ మధ్య వివేకానందరెడ్డి ఎర్రగంగిరెడ్డితో బెంగుళూరు వెళుతుండేవారు. బెంగుళూరు గెస్ట్‌ హౌజ్‌ వద్ద కోడూరు రమణ, చిట్టివెళ్లి లక్ష్మీకర్‌ కలిసేవారు. వారు బ్రోకర్‌ పీటర్‌తో పాటు డిప్యూటీ ఎస్పీ రాజేశ్‌ను కలిసేవారు. ల్యాండ్‌ సెటిల్మెంట్‌ తరువాత రూ.8కోట్లు వివేకానందరెడ్డికి ఇవ్వాల్సి ఉందని నాకు తెలిసింది. ఈ సెటిల్మెంట్‌ వ్యవహారంలో ఎర్రగంగిరెడ్డి చురుకైన పాత్ర పోషించారు. ఒంటరిగా బెంగుళూరు వెళ్తుండేవారు’’ 

 

డబ్బు మేటర్‌ సీరియస్‌

‘‘అప్పుడప్పుడు బెంగళూరుకు వివేకాతోపాటు గంగిరెడ్డిని కారులో తీసుకెళ్లాను. ఆ సమయంలో 8కోట్ల రూపాయల డబ్బుల వ్యవహారం వారిద్దరి మధ్య చర్చకు వచ్చింది. బెంగళూరు గెస్ట్‌హౌ్‌సలో సునీల్‌యాదవ్‌ను  వివేకాకు ఉమా శంకర్‌ రెడ్డి పరిచయం చేశారు. అప్పటి నుంచి పలుమార్లు బెంగళూరుకు డబ్బుల కోసం సునీల్‌, గంగిరెడ్డి, ఉమా శంకర్‌ రెడ్డి వెళ్లారు. ఓ రోజు బెంగళూరు గెస్ట్‌ హౌస్‌లో యర్ర గంగిరెడ్డి డబ్బు అడగ్గా...వివేకా తిట్టి నన్ను బండి తీయమని పులివెందులకు వచ్చేశారు. ఆ తర్వాత వారిద్దరికీ మాటల్లేవ్‌.. నేను 2018 డిసెంబరులో డ్రైవర్‌గా వివేకానంద రెడ్డి దగ్గర పని మానేశాను’’ 

 

ఛాతీపై గుద్దులు.. గొడ్డలితో వేట్లు..

వాగ్వాదం నడుస్తుండగానే.. వివేక్డాని సునీల్‌ యాదవ్‌ బూతులు తిడుతూ ముఖంపై పిడిగుద్దులతో దాడి చేశాడు. వివేకా అప్పుడు వెనక్కి పడిపోవడంతో గజ్జల ఉమా శంకర్‌ రెడ్డి నన్ను గొడ్డలి అడిగి తీసుకుని తలపై గాయపరచగా.. వివేకా పక్కకు తిరిగారు. వెంటనే మళ్లీ వేటు వేయడంతో తల నుంచి రక్తం వచ్చింది. వెంటనే సునీల్‌ యాదవ్‌ వివేకా ఛాతీపై ఏడెనిమిది సార్లు కొట్టాడు. తర్వాత ఉమా శంకర్‌ రెడ్డి గొడ్డలి నా చేతికిచ్చి వివేకానందరెడ్డి లేవకుండా చూడాలని చెప్పి... ఇళ్లంతా డాక్యుమెంట్ల కోసం వెతికారు. అది చూసిన వివేకా ‘నా ఇంట్లో ఏమి వెతుకు తున్నారు’’ అని చేయి పైకెత్తారు. నేను కుడి చేయి అరచేతిపై గొడ్డలితో గాయపరిచాను. రక్తం వచ్చింది. అప్పుడే సునీల్‌ యాదవ్‌, యర్ర గంగిరెడ్డి, ఉమా శంకర్‌ రెడ్డిలకు కొన్ని డాక్యుమెంట్లు దొరికాయి. ఆ తర్వాత వివేకాను మేమందరం కొట్టి.. ‘డ్రైవర్‌ ప్రసాద్‌ చంపబోయాడు. అతన్ని వదల వద్దు’ అని బలవంతంగా ఉత్తరం రాయించి సంతకం కూడా చేయించాం. ఆ తర్వాత వివేకాను బాత్‌రూమ్‌లోకి తీసుకెళ్లి చంపుదామని గంగిరెడ్డి చెప్పగా.. మేం ముగ్గురం ఆయనను బాత్‌ రూమ్‌లోకి తీసుకెళ్లి కింద పడేశాం. అప్పుడు ఉమా శంకర్‌ రెడ్డి గొడ్డలి తీసుకుని ఐదారు సార్లు తలపై నరకడంతో వివేకా చనిపోయారు. తర్వాత ఇనుప బీరువాను నేను గొడ్డలితో కొట్టినా అది తెరుచుకోక పోవడంతో వదిలేశాం. తర్వాత డాక్యుమెంట్లు అన్నీ చూసుకుని యర్ర గంగిరెడ్డి హాల్లో లైట్లు ఆపమని చెప్పాడు. గంగిరెడ్డి మెయిన్‌ డోర్‌ వైపు వెళుతుండగా వాచ్‌మెన్‌ రంగన్న లేచి ఎవరు అని అరిచాడు. దీంతో నేను సునీల్‌ యాదవ్‌, ఉమా శంకర్‌ రెడ్డి కాంపౌండ్‌ వాల్‌ వెనుక నుంచి దూకేశాం. తర్వాత సునీల్‌ యాదవ్‌కు నేను గొడ్డలి ఇచ్చేశా.. ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లి పోయాం’’ అని సీబీఐకి దస్తగిరి తెలిపాడు.

 

స్టెంట్‌ వేసిన ఛాతీపై పిడిగుద్దులు

‘‘వివేకానందరెడ్డి గుండెకు స్టంట్‌ వేశారని సునీల్‌ యాదవ్‌కు తెలుసు. హత్య సమయంలో సునీల్‌ యాదవ్‌ గుద్దుతుండడంతో అమ్మ అమ్మ అంటూ ఆయన బిగ్గరగా అరిచారు. ఉమాశంకర్‌ రెడ్డి కుడి వైపు నుంచి వివేకానందరెడ్డి కాలర్‌ పట్టుకొని బెడ్‌ రూమ్‌ డోర్‌ పక్కనే ఉన్న చెక్క డ్రాయర్‌ వద్దకు లాక్కెల్లాడు. వివేకానందరెడ్డి కాలర్‌ పట్టుకొని మోకాళ్ల మీద కూర్చొనేలా చేశారు. ఆ సమయంలో సునీల్‌ యాదవ్‌ ఉడెన్‌ ప్యానల్‌ మీద ఉన్న పెన్నుతీసుకొని వివేకాందరెడ్డి చేతిలో పెట్టాడు. తాను చెప్పినట్లు రాయాలని కోరాడు. ఈ సమయంలో సునీల్‌ యాదవ్‌ వివేకానందరెడ్డి ఎడమవైపు పక్కటెముకల పై గుద్దాడు. ఒక వైపు వ్రాసిఉన్న, మరోవైపు ఖాళీ ఉన్న కోన్ని పేపర్లను వివేకానందరెడ్డి ముంచారు. తామిచెప్పినట్లురాయాలని గంగిరెడ్డి కోరగా వివేకానందరెడ్డి నిరాకరించారు. ఆ సమయంలో గంగిరెడ్డి వివేకానందరెడ్డి ఎడమవైపు నడుము పై తన్నుతూ లేఖరాస్తే బతుకుతావని, లేకపోతే చంపేస్తామన్నారు. అయిన సరే లేఖరాయడానికి వివేకానందరెడ్డి తిరస్కరించారు. ఉమాశంకర్‌ రెడ్డి తన ఎడమచేతితో వివేకానందరెడ్డి తల వెనుకభాగం పై కొట్టడంతో ఆయన చేతికి రక్తం అంటింది. నేడు కూడా వెనుకభాగంలో తన్నాను. గంగిరెడ్డి కూడా మరోసారి వివేకానందరెడ్డి చెంప పై కొట్టాడు. దీంతో వివేకానందరెడ్డి భయపడి తనను వదిలి వేయాలని, లేఖ రాస్తానని ప్రాధేయపడ్డాడు. కేసును తప్పుదోవ పట్టించేందుకు లెటర్‌లో డ్రైవర్‌ ప్రసాద్‌ పేరు రాయాలని సునీల్‌ యాదవ్‌... వివేకానందరెడ్డికి చెప్పారు. డ్యూటీకి త్వరగా రావాలని కోరడంతోనే డ్రైవర్‌ ప్రసాద్‌ చంపబోయినట్టు ఆ లేఖలో రాయించాం’’ అని సీబీఐ వద్ద దస్తగిరి అంగీకరించాడు. 

 

విల్లా కొనాలని బేరం...

‘‘సుఫారీ కింద నాకు కోటి రూపాయలు ఇస్తామని.. చేతికి రూ. 75 లక్షలు సునీల్‌ యాదవ్‌ ఇచ్చాడు. ఆ సొమ్మును నా స్నేహితుడు మున్నాకు అందజేశాను. వివేకానందరెడ్డితో వ్యాపార భాగస్వామ్యంలో ఈ సొమ్ము నాకు వచ్చిందని చెప్పాను. తన అవసరాల కోసం 5నుంచి 7లక్షలు ఇస్తానని మున్నాకు హామీ ఇచ్చాను. మిగతా రూ. 25 లక్షలూ అందాక.. మొత్తం కోటి రూపాయలు సొమ్ములో 75లక్షలతో పులివెందులలో విజయా హోమ్స్‌లో విల్లా కొనాలని నిర్ణయించాను. ఒకనెలలో విల్లాను స్వాధీనపరిచేలా సంబంధిత మేనేజర్‌తో బేరం ఆడాను’’ అని సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో దస్తగిరి బయటపెట్టాడు..

 

సార్‌ దగ్గర పనిచేశా.. చంపలేను..

‘‘వివేకా వద్ద పని మానేసినా పాత పరిచయంతో ఉమా శంకర్‌ రెడ్డి, గంగిరెడ్డి, సునీల్‌ను తరచూ కలిసే వాడిని. 2019 ఫిబ్రవరి 10న గంగిరెడ్డి ఇంటికి ఉమా శంకర్‌ రెడ్డి నన్ను తీసుకెళ్లాడు. తనకు బెంగళూరు సెటిల్‌ మెంట్‌ ద్వారా వచ్చిన డబ్బు వివేకా ఇవ్వలేదని గంగిరెడ్డి అన్నాడు. అందుకని వివేకానందరెడ్డిని చంపాలని నన్ను అడిగాడు. ‘సార్‌ దగ్గర పనిచేశా.. చంపలేనని చెప్పా’. అందుకు గంగిరెడ్డి.. డ్రైవర్‌గా ఇన్నాళ్లు పనిచేసి ఏమి సంపాదించావ్‌.. ఈ మర్డర్‌ చేస్తే మనకు 40కోట్లు వస్తాయ్‌.. నీ వాటా ఐదు కోట్లు ఇస్తామని అన్నాడు. ‘నువ్వొక్కడివే కాదు.. మేము కూడా వస్తామ’ని గంగిరెడ్డి అన్నాడు. దీంట్లో పెద్దలున్నారని చెప్పాడు.. ఎవరని నేను అడిగితే ఎంపీ వై.ఎస్‌. అవినాష్‌ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్‌ భాస్కర్‌ రెడ్డి, వైఎస్‌ మనోహర్‌ రెడ్డి, డి. శంకర్‌ రెడ్డి ఉన్నారని చెప్పాడు. ఈ పని చేస్తే సెటిల్‌ అయిపోతావని యర్ర గంగిరెడ్డి నాకు ఆశ పెట్టాడు. నాలుగు రోజుల తర్వాత హెలీపాడ్‌ వద్దకు నన్ను సునీల్‌ రమ్మని చెప్పి... యెల్లో స్కూటీపై అక్కడికి వచ్చాడు. నాకు కోటి రూపాయల అడ్వాన్స్‌ ఇచ్చి అందులో నుంచి అవసరం ఉందని 25లక్షల రూపాయలు తీసుకున్నాడు. మిగతా 75లక్షలు నా స్నేహితుడు మున్నా వద్ద దాచి పెట్టాను. నాలుగు రోజులకు వివేకానందరెడ్డి ఇంట్లో కుక్కను సునీల్‌ యాదవ్‌, ఉమా శంకర్‌ రెడ్డి కారుతో తొక్కించి చంపేశారు’’.

Baga side chesaru mp gadini

Link to comment
Share on other sites

1 hour ago, Sword_KanthaRao said:

But ie theory la murder motive or justification ae matram kanipinchatledu kada..

Aasthi tagadalu common…inkoka 2 months lo election petukuni, which politician or sitting politician will take such a step ? Bihar or Bengal lo kuda jara gadu ie scene
 

Oka two months tarvata lepesetollu kada..tractor tiragapadindi ani rasukunetaniki easy ga vundedi…intha risk enduku chestarav ?

Kodi kothi lanti weak script tho sympathy ni gain chesadu... 

Na babai ni tdp murder chesindi ante votes ralathai anukunnadu.. 

Asuseual many gorrelu believed tdp chepinchindi ani

Link to comment
Share on other sites

1 hour ago, Sword_KanthaRao said:

This has no significance. Murder jarigindi 15th March...apatike election code of conduct in place and CBI ki entry or no entry would have made no difference, more over CBI will not take up case suo-moto.

Inthaki neku entha icharu vuncle .. chaala kastapadathav .. jagun meda eega vaalanivvavu @3$%

  • Upvote 1
Link to comment
Share on other sites

1 hour ago, Sword_KanthaRao said:

This has no significance. Murder jarigindi 15th March...apatike election code of conduct in place and CBI ki entry or no entry would have made no difference, more over CBI will not take up case suo-moto.

Lol. Significance ledha?

viveka murder nunchi elections varakey tdp ni blame chesaru. Cbi enquiry adigaru. Cbi ni ban cheyyakapoyi untey cbn happy gaa cbi ki ichi chethulu dulupu kuney vaadu

  • Upvote 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...