Jump to content

Cost shaving antuna jaffas


psycopk

Recommended Posts

సీఎం కాన్వాయ్ కోసం ప్రజల కారును తీసుకెళ్లే స్థితికి రాష్ట్రం ఎందుకెళ్లింది?: చంద్ర‌బాబు మండిపాటు 

21-04-2022 Thu 11:47
  • కుటుంబంతో కలిసి తిరుమల వెళ్తున్న వినుకొండ వాసి
  • అత‌డి కారును సీఎం ప‌ర్య‌ట‌న కోసం తీసుకెళ్లార‌ని చంద్ర‌బాబు ఆగ్రహం
  • ఏపీలో నెల‌కొన్న దౌర్భాగ్య పాలనకు ఇదే నిదర్శనమని వ్యాఖ్య‌
  • కుటుంబాన్ని రోడ్డుపై దింపే హక్కు ఎవ‌రు ఇచ్చార‌ని నిల‌దీత‌
chandrababu slams ycp

కుటుంబంతో కలిసి తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకోవ‌డానికి వెళ్తున్న ప‌ల్నాడు జిల్లా వినుకొండకు చెందిన ఓ వ్య‌క్తి కారుని ఒంగోలు వద్ద పోలీసులు తీసుకెళ్లారు. ఈ విష‌యంపై బాధితులు మాట్లాడుతూ.. తాము తిరుప‌తికి వెళ్తూ భోజ‌నం కోసం ఓ హోట‌ల్ వ‌ద్ద ఆగామ‌ని చెప్పారు. అందుకోసం కారు పార్క్ చేసి హోట‌ల్ లోకి వెళ్లి, తిరిగి వ‌చ్చి చూసేస‌రికి అక్క‌డ కారు లేద‌ని తెలిపారు. 

కారు ఏమ‌యింద‌ని పోలీసుల‌ను అడిగితే సీఎం ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో కార్లు లేక‌పోవ‌డంతో త‌మ కారు తీసుకెళ్లామ‌ని చెప్పార‌ని బాధితులు వివ‌రించారు. సీఎం ప‌ర్య‌ట‌న కోసం వాహ‌నాలు కావాలంటే ప్ర‌జ‌ల కార్లు తీసుకెళ్ల‌డం ఏంట‌ని బాధితులు ప్ర‌శ్నించారు. న‌డిరోడ్డుపై తాము గంట‌న్న‌ర నుంచి నిల‌బ‌డ్డామ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ప‌లు యూట్యూబ్ చానెళ్లు ప్ర‌సారం చేశాయి. 

పోలీసుల తీరుపై టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు మండిప‌డ్డారు. ఆ ఘ‌ట‌న‌పై ఓ ప్ర‌క‌ట‌న చేస్తూ... జగన్‌ కాన్వాయ్‌ కోసం తిరుమల వెళ్లే భక్తుల కారును లాక్కెళ్లడం ఏంట‌ని ప్ర‌శ్నించారు. ఏపీలో నెల‌కొన్న దౌర్భాగ్య పాలనకు ఇదే నిదర్శనమని ఆయ‌న అన్నారు. 

కుటుంబాన్ని రోడ్డుపై దింపే హక్కు ఎవ‌రు ఇచ్చార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. కాన్వాయ్  కోసం ప్రజల కారును తీసుకెళ్లే స్థితికి రాష్ట్రం ఎందుకెళ్లిందని ఆయ‌న నిల‌దీశారు. రాష్ట్రంలో ప్రభుత్వ అధికారులే ఇటువంటి చర్యలకు పాల్పడడం ఏంట‌ని ప్ర‌శ్నించారు. దీనిపై ప్రజలకు ఏం సమాధానం చెబుతారని నిల‌దీశారు.   

Link to comment
Share on other sites

వినుకొండ వ్య‌క్తి కారును తీసుకెళ్లిన ఘ‌ట‌న‌పై అధికారుల చ‌ర్య‌లు.. ఇద్దరి సస్పెన్షన్! 

21-04-2022 Thu 13:20
  • కారు తీసుకెళ్లిన‌ ఘ‌ట‌న‌పై సీఎం జగన్‌ ఆగ్రహం
  • ఘటనపై ఏపీ సీఎం కార్యాలయం ఆరా 
  •  హోంగార్డు, అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్ పై చ‌ర్య‌లు
police calls vinukonda man

ఒంగోలులో సీఎం కాన్వాయ్‌ కోసం పోలీసులు, ఆర్టీఏ సిబ్బంది పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన వేముల శ్రీనివాస్ అనే వ్య‌క్తి కారును ఆయ‌న‌కు చెప్ప‌కుండా తీసుకెళ్లిన విష‌యం తెలిసిందే. తన కుటుంబంతో కలిసి తిరుప‌తి వేంకటేశ్వరస్వామి దర్శనం కోసం శ్రీ‌నివాస్ బ‌య‌లుదేర‌గా ఆయ‌న‌కు ఈ అనుభ‌వం ఎదురైంది. 

ఈ ఘ‌ట‌న‌పై సీఎం జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ విష‌యంపై మీడియాలోనూ వార్త‌లు రావ‌డంతో.. శ్రీ‌నివాస్‌ కారును తీసుకెళ్లిన‌ సిబ్బందిపై ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. హోంగార్డు పి.తిరుపతిరెడ్డి, అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎ.సంధ్యను అధికారులు సస్పెండ్‌ చేశారు. కారు స్వాధీనం చేసుకున్న‌ ఘటనకు వారిని బాధ్యులను చేస్తూ ఈ  చ‌ర్య‌లు తీసుకున్నారు. 

అలాగే, ఆ కారు య‌జ‌మాని శ్రీ‌నివాస్ గురించి ఏపీ సీఎం కార్యాలయం ఆరా తీసింది. కారు స్వాధీనం ఘటనపై పూర్తి వివరాలు సేకరించింది. ఆ కారును తీసుకెళ్లాలని ఫోనులో శ్రీ‌నివాస్‌కు పోలీసులు చెప్పారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...