nokia123 Posted July 25, 2022 Report Share Posted July 25, 2022 picchi peekaladhanka ekkesindhi ee YCP leaders ki.... “అవును.. నిజమే.. ఏడాది క్రితం శంకుస్థాపన చేసిన రోడ్డు పనులు.. ఇప్పటికీ పూర్తికాలేదు” అని స్వయాన కార్మిక మంత్రి గుమ్మనూరు జయరాం వ్యాఖ్యానించారు. అంతేకాదు.. రోడ్లు లేకపోతే.. మాత్రం నడవలేరా? అని ఎదురు ప్రశ్నించారు. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం ముత్తుకూరు గ్రామంలో.. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకతతో ఇలా వ్యాఖ్యానించడం గమనార్హం. “ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. ఏం చేయమంటారు. అందుకే ముత్తుకూరు రోడ్డు పూర్తి కాలేదు” అని ప్రజలకు నిర్మొహమాటంగా చెప్పేశారు. ఆలూరు నియోజకవర్గంలో 40 రోడ్లు బాగా లేవని స్వయంగా చెప్పిన ఆయన ఆగస్టు 15న నిధులు వస్తాయని, పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తామని.. హామీ ఇచ్చారు. అయితే దీనిపైనా ప్రజలు ఆయనను నిలదీయడంతో గతంలో శ్రమదానం చేసుకున్నారుగా.. అంటూ.. అక్కడి నుంచి వెళ్లిపోయారు. Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.