Jump to content

LION LOKESH - ELECTION CAMPAIGN


ARYA

Recommended Posts

ఒక్కడు పాదయాత్ర చేస్తున్నాడని తెలియగానే .. కాళ్ల కింద స్టూళ్లు లాగడం దగ్గర్నుంచి.. వందల మందిని పెట్టి తప్పుడు ప్రచారం చేయడం వరకూ అన్ని రకాల టాస్కుల్ని పెట్టి.. గురి పెట్టినా… ఆ ఒక్కడు నిర్భయంగా ముందుకు సాగుతున్న యాత్రే యువగళం. కుప్పంలో పడిన మొదటి అడుగు దగ్గర నుంచి ఇప్పటికి రెండు వేల కిలోమీటర్లకు చేరింది. కానీ మొదటి రోజు ఎంత ఉత్సాహం ఉందో.. రెండు వేల కిలోమీటర్ నడక ప్రారంభమైన రోజు ఉత్సాహం ఉంది. ముఖంలో అలసట కూడా లేదు. లక్ష్యం సాధించాలన్న పట్టుదల తప్ప.

ఎన్నో సూటిపోటి మాటలు అన్నారు.. బూతులు తిట్టారు.. పోలీసుల్ని యాత్రపైకి పంపారు.. మాట్లాడకుండా మైకులు లాక్కున్నారు.. స్టూల్ మీద నిలబడి మాట్లాడితే స్టూల్ నూ లాక్కున్నారు.. కొన్ని చోట్ల కోడిగుడ్లు వేశారు.. ఇలా ఎన్ని చేసినా.. లోకేష్ మాత్రం వెనక్కి తిరిగి చూడలేదు. చెప్పాల్సిన వారికి .. ఇవ్వాల్సిన వారికి గట్టిగా ఇచ్చుకుంటూనే ముందుకు సాగుతున్నారు. ఆయన మాట్లాడలేరంటూ చేసిన ప్రచారాల్ని పటా పంచలు చేసి.. సన్నితమైన వ్యక్తని.. పట్టుమని వంద కిలోమీటర్లు నడవలేరన్న వారి ఆశల్ని తంచేస్తూ… తనేంటో ప్రజల ముందు ఉంచుతున్నారు.

గతంలో పాదయాత్ర చేసిన వాళ్లు..గురువారం ఉదయం ఆపేసి..మళ్లీ ఆదివారం సాయంత్రం ప్రారంభిచేవాళ్లు.. లేదా సోమవారం ఉదయం.. కనపించేవాళ్లు. ఇక కాళ్లకు బొబ్బలని.. జ్వరమని.. కోడికత్తి దాడి అని ఎన్ని రోజులు రెస్ట్ తీసుకున్నారో లెక్కలేదు. కానీ లోకేష్.. సెలవనేది లేదు.. అవిశ్రాంతంగా నడుస్తున్నారు. అదే వారికి..లోకేష్ కు .. తేడా చూపిస్తోంది. ఇప్పటికే సగం పాదయాత్ర ముగిసింది. మరో రెండు వేల కిలోమీటర్లు ఉంది. అవి కాకుండా ఇంకో రెండు వేల కిలోమీటర్లు అయినా సులువుగా పాదయాత్ర చేయగలరు. ఆ స్పిరిట్ లోకేష్ లో కనిపిస్తోంది. లక్ష్యం సాధించాలన్న పట్టదల ఉంది.. దాన్ని అందుకుంటాననే నమ్మకం ఉంది. అదే యువగళానికి అసలైన శక్తి.
 

Link to comment
Share on other sites

నారా లోకేష్‌ కనీసం 200 కిమీ కూడా పాదయాత్ర చేయలేరని గట్టిగా నమ్మిన వైసీపీ నాయకులు మొదట్లో నోటికి వచ్చిన్నట్లు మాట్లాడేవారు. కానీ నారా లోకేష్‌ ముందుకే సాగుతుండటంతో, జీవో నంబర్:1 సాయంతో పోలీసులతో పాదయాత్రను అడ్డుకొనేందుకు ప్రయత్నించారు. కానీ అప్పుడూ గట్టిగా ప్రతిఘటిస్తూ ముందుకు సాగుతుండేవారు. ఆ వార్తలు మీడియాలో హైలైట్ అవుతుండటంతో నారా లోకేష్‌కు తామే అనవసరంగా ఉచిత పబ్లిసిటీ కల్పిస్తున్నామని గ్రహించిన వైసీపీ ప్రభుత్వం అప్పటి నుంచి అడ్డుకోవడం మానుకొంది. నారా లోకేష్‌ని తక్కువగా అంచనా వేశామని వైసీపీ నేతలు కూడా ఇప్పుడు బాగానే గ్రహించారు. ‘నేను బాబుగారిలా సాఫ్ట్‌ కాదు,’ అని నారా లోకేష్‌ వైసీపీ నేతలందరికీ అర్దమయ్యేలాగే చెపుతున్నారు. ఇది కూడా నిజమని వారు బాగానే గ్రహించారు. ఇదివరకు చంద్రబాబు నాయుడు, కొందరు టిడిపి ముఖ్యనేతలను ఎదుర్కొంటే సరిపోయేది. కానీ ఇప్పుడు నారా లోకేష్‌ని కూడా ఎదుర్కోవలసివస్తోంది. కనుక ‘కొరివితో తల గోక్కొన్నట్లయింది మా పని’ అని వైసీపీ ఎమ్మెల్యేలు లోలోన బాధపడుతున్నారు.

నారా లోకేష్‌ పట్ల వైసీపీ నేతల అభిప్రాయాలే కాదు… వారు ఇదివరకు చేసిన దుష్ప్రచారం కారణంగా నారా లోకేష్‌ పట్ల చులకనభావం ఏర్పరచుకొన్న వివిద వర్గాల ప్రజలు కూడా ఆయనతో ముఖాముఖి మాట్లాడిన తర్వాత తమ అభిప్రాయాలు మార్చుకొని నీరాజనాలు పలుకుతున్నారు. రాష్ట్రంలో ప్రజలు ప్రభుత్వం మారాలని కోరుకొంటున్నారని ఇది స్పష్టం చేస్తోంది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని టిడిపి మళ్ళీ ఏపీలో అధికారంలోకి రాగలదా?మరో 9 నెలల్లో తేలిపోతుంది.

Link to comment
Share on other sites

1 hour ago, ntr2ntr said:

ఒక్కడు పాదయాత్ర చేస్తున్నాడని తెలియగానే .. కాళ్ల కింద స్టూళ్లు లాగడం దగ్గర్నుంచి.. వందల మందిని పెట్టి తప్పుడు ప్రచారం చేయడం వరకూ అన్ని రకాల టాస్కుల్ని పెట్టి.. గురి పెట్టినా… ఆ ఒక్కడు నిర్భయంగా ముందుకు సాగుతున్న యాత్రే యువగళం. కుప్పంలో పడిన మొదటి అడుగు దగ్గర నుంచి ఇప్పటికి రెండు వేల కిలోమీటర్లకు చేరింది. కానీ మొదటి రోజు ఎంత ఉత్సాహం ఉందో.. రెండు వేల కిలోమీటర్ నడక ప్రారంభమైన రోజు ఉత్సాహం ఉంది. ముఖంలో అలసట కూడా లేదు. లక్ష్యం సాధించాలన్న పట్టుదల తప్ప.

ఎన్నో సూటిపోటి మాటలు అన్నారు.. బూతులు తిట్టారు.. పోలీసుల్ని యాత్రపైకి పంపారు.. మాట్లాడకుండా మైకులు లాక్కున్నారు.. స్టూల్ మీద నిలబడి మాట్లాడితే స్టూల్ నూ లాక్కున్నారు.. కొన్ని చోట్ల కోడిగుడ్లు వేశారు.. ఇలా ఎన్ని చేసినా.. లోకేష్ మాత్రం వెనక్కి తిరిగి చూడలేదు. చెప్పాల్సిన వారికి .. ఇవ్వాల్సిన వారికి గట్టిగా ఇచ్చుకుంటూనే ముందుకు సాగుతున్నారు. ఆయన మాట్లాడలేరంటూ చేసిన ప్రచారాల్ని పటా పంచలు చేసి.. సన్నితమైన వ్యక్తని.. పట్టుమని వంద కిలోమీటర్లు నడవలేరన్న వారి ఆశల్ని తంచేస్తూ… తనేంటో ప్రజల ముందు ఉంచుతున్నారు.

గతంలో పాదయాత్ర చేసిన వాళ్లు..గురువారం ఉదయం ఆపేసి..మళ్లీ ఆదివారం సాయంత్రం ప్రారంభిచేవాళ్లు.. లేదా సోమవారం ఉదయం.. కనపించేవాళ్లు. ఇక కాళ్లకు బొబ్బలని.. జ్వరమని.. కోడికత్తి దాడి అని ఎన్ని రోజులు రెస్ట్ తీసుకున్నారో లెక్కలేదు. కానీ లోకేష్.. సెలవనేది లేదు.. అవిశ్రాంతంగా నడుస్తున్నారు. అదే వారికి..లోకేష్ కు .. తేడా చూపిస్తోంది. ఇప్పటికే సగం పాదయాత్ర ముగిసింది. మరో రెండు వేల కిలోమీటర్లు ఉంది. అవి కాకుండా ఇంకో రెండు వేల కిలోమీటర్లు అయినా సులువుగా పాదయాత్ర చేయగలరు. ఆ స్పిరిట్ లోకేష్ లో కనిపిస్తోంది. లక్ష్యం సాధించాలన్న పట్టదల ఉంది.. దాన్ని అందుకుంటాననే నమ్మకం ఉంది. అదే యువగళానికి అసలైన శక్తి.
 

సన్నితమైన?! సున్నితం అయ్యుంటుంది లే!

thammudu-letter-tammudu.gif

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...