Jump to content

Em chillar veshalu ra jagga elections time lo … chetta yedava


psycopk

Recommended Posts

Ambati Rambabu: ఇది చాలా సున్నితమైన అంశం... గొడవలు అనవసరం: సాగర్ వివాదంపై మంత్రి అంబటి వ్యాఖ్యలు 

01-12-2023 Fri 14:32 | Andhra
  • నిన్న నాగార్జున సాగర్ వద్ద ఉద్రిక్తతలు
  • గేట్ల స్వాధీనం అంశంపై తెలుగు రాష్ట్రాల మధ్య భేదాభిప్రాయాలు
  • సాగర్ పై ఏపీ పోలీసుల దండయాత్ర అంటూ దుష్ప్రచారం చేస్తున్నారన్న అంబటి
  • తమ భూభాగంలోకే ఏపీ పోలీసులు వెళ్లారని స్పష్టీకరణ
 
AP Minister Ambati Rambabu press meet on Nagarjuna Sagar project issue

నిన్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతుండగా అనూహ్యరీతిలో నాగార్జునసాగర్ డ్యామ్ వద్ద ఏపీ, తెలంగాణ మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. దీనిపై ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సాగర్ పై ఏపీ పోలీసులు దండయాత్ర అని దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు అసమర్థత వల్లే తెలంగాణ పోలీసులు ఏపీ భూభాగంలోకి వచ్చారని వ్యాఖ్యానించారు. అదే సమయంలో తమ భూభాగంలోకి ఏపీ పోలీసులు వెళ్లారని, అది దండయాత్ర ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఏపీ హక్కులను తెలంగాణకు తాకట్టు పెట్టిన వ్యక్తి చంద్రబాబు అని అంబటి విమర్శించారు. 

తెలంగాణలో ఒక పార్టీని గెలిపించాల్సిన అవసరం కానీ, మరో పార్టీని ఓడించాల్సిన అవసరం కానీ తమకు లేదని స్పష్టం చేశారు. తెలంగాణ రాజకీయాలపై తమకేమీ ఆసక్తి లేదని, అక్కడ ఎవరు గెలిచి అధికారంలోకి వచ్చినా తమకు సంబంధం లేదని పేర్కొన్నారు. కొందరు రెచ్చగొట్టి గందరగోళాన్ని సృష్టించాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇది చాలా సున్నితమైన అంశం అని, గొడవలు అనవసరం అని హితవు పలికారు. 

సాగర్ కు సంబంధించి తమ వాటాకు మించి ఒక్క నీటి చుక్క కూడా వాడుకోలేదని అన్నారు. ఈ విషయంలో గతంలో చంద్రబాబు సర్కారు విఫలమైతే, ఇప్పుడు జగన్ సర్కారు సక్సెస్ అయిందని మంత్రి అంబటి గర్వంగా చెప్పారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు విషయంలో ఏపీ ప్రభుత్వం ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు. అసలీ వివాదం చంద్రబాబు హయాం నుంచే ఉందని, సాగర్ కుడి కాలువను కూడా తెలంగాణ ప్రభుత్వమే నిర్వహిస్తుండడం చట్టవిరుద్ధమని తెలిపారు. మా నీళ్లు మా రైతులకు విడుదల చేయాలంటే మేం తెలంగాణ అనుమతి తీసుకోవాలా? అని అంబటి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  

తన వాటాను తాను వాడుకునే స్వేచ్ఛ ఏపీకి కావాలని, పురందేశ్వరి ఎందుకు దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నాగార్జునసాగర్ డ్యామ్ అంశంలో ఏపీ ప్రభుత్వ చర్యలను ఎవరూ తప్పు పట్టలేరని, ఈ వ్యవహారంలో ఎల్లో మీడియా తప్పుడు రాతలు రాస్తోందని విమర్శించారు. ఈ అంశాన్ని రాజకీయాలకు ముడివేసి, తెలుగు రాష్ట్రాల మధ్య విభేదాలు సృష్టించడం తగదని అన్నారు. 

నాగార్జునసాగర్ ప్రాజెక్టులో 13వ నెంబరు గేటు వరకు భౌగోళికంగా ఏపీకి చెందుతుందని, అంతవరకే తాము స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. కృష్ణా బోర్డు నిర్ణయాల ప్రకారం తెలంగాణ వ్యవహరించడంలేదని, అందుకే ఏపీ హక్కులను కాపాడుకోవడానికే ఇలా చేయాల్సి వచ్చిందని తెలిపారు. 

"రాష్ట్ర విభజన చట్టం ప్రకారం నాగార్జునసాగర్ డ్యామ్ లోని 26 గేట్లలో 13 గేట్లు ఏపీకి, మరో 13 గేట్లు తెలంగాణకు చెందుతాయి. కానీ సాగర్ ప్రాజెక్టు మొత్తాన్ని తెలంగాణ స్వాధీనం చేసుకుని నిర్వహిస్తుండడంతో ఏపీ ప్రయోజనాలకు విఘాతం కలుగుతోంది. ఇప్పుడు సాగర్ డ్యామ్ లో ఏపీకి చెందిన భూభాగాన్ని మాత్రమే స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇందులో ఎలాంటి వివాదానికి తావులేదు" అని మంత్రి అంబటి వివరించారు.

Link to comment
Share on other sites

Nara Lokesh: ఈ డ్రామా కూడా కోడి కత్తి వ్యవహారం లాంటిదే: లోకేశ్ 

01-12-2023 Fri 21:57 | Andhra
  • కాకినాడలో లోకేశ్ యువగళం
  • పాదయాత్రకు 214వ రోజు
  • సర్పవరంలో లోకేశ్ బహిరంగ సభ
  • సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు
 
Lokesh slams CM Jagan in Kakinada rural

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రకు కాకినాడ నగరంలో విశేష స్పందన లభించింది. యువగళం జెండాలు చేతబూని టీడీపీ-జనసేన కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. మహిళలు హారతులతో నీరాజనాలు పట్టారు. కాకినాడ రూరల్ సర్పవరంలో ఏర్పాటుచేసిన భారీ బహిరంగసభలో లోకేశ్ మాట్లాడుతూ... సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు. 

నాగార్జునసాగర్ వద్ద డ్రామా కూడా కోడి కత్తి వ్యవహారం లాంటిదేనని ఎద్దేవా చేశారు. "క‌ర‌వుతో రైతులు అల్లాడుతుంటే క‌నీసం స‌మీక్ష కూడా చేయ‌ని జ‌గ‌న్ కి తెలంగాణ పోలింగ్ రోజు రైతులు గుర్తొచ్చారు, సాగ‌ర్ ఆయ‌క‌ట్టు రైతుల‌పై ప్రేమ పొంగి పొర్లింది... పోలీసుల్ని పంపి నాగార్జున సాగ‌ర్ పై శాంతిభ‌ద్రత‌ల స‌మ‌స్య క్రియేట్ చేయించాడు. ఇది కూడా మరో కోడిక‌త్తి, బాబాయ్ గుండెపోటు డ్రామా లాంటిదే" అంటూ లోకేశ్ విమర్శించారు.

జగన్ కు మమ్మల్ని చూస్తే భయం!

జగన్ కి భయం పట్టుకుంది. జగన్ కి చంద్రబాబుని చూస్తే భయం, పవన్ కళ్యాణ్ ని చూస్తే భయం, లోకేశ్ ని చూస్తే భయం. చంద్రబాబు భవిష్యత్తుకి గ్యారెంటీ కార్యక్రమం చూస్తే జగన్ కి భయం, పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేస్తే జగన్ కి భయం, లోకేశ్ యువగళం పాదయాత్ర చేస్తే జగన్ కి భయం. సొంత అమ్మని చూసినా జగన్ కి భయమే... సొంత చెల్లిని చూసినా జగన్ కి భయమే. ఆఖరికి ప్రజల్ని చూసినా జగన్ కి భయమే... అందుకే పరదాలు కట్టుకొని దొంగలా వెళతాడు. తెలుగుదేశం ఘన చరిత్ర ఉన్న పార్టీ, వైసీపీ గజదొంగల పార్టీ.

కోడికత్తి వారియర్స్ అని పేరు పెట్టండి!

జ‌గ‌న్ ఐపీఎల్ టీము పెడ‌తామంటున్నాడు... దీనికి కోడిక‌త్తి వారియ‌ర్స్ అని పేరు పెడితే బాగుంటుంది. సీనియ‌ర్ బ్యాట్స్ మెన్ అవినాష్ రెడ్డి, బెట్టింగ్ స్టార్ అనిల్, అర‌గంట స్టార్ అంబ‌టి, గంట‌ స్టార్ అవంతి, ఆల్ రౌండ‌ర్ గోరంట్ల మాధ‌వ్, రీల్ స్టార్ భ‌ర‌త్, బూతుల స్టార్ కొడాలి నాని, పించ్ హిట్ట‌ర్ బియ్యం మ‌ధు... అబ్బో మామూలు టీము కాదు ఇది! 

అన్ని కార్యక్రమాలు తుస్సే!

ఈ మధ్య వైసీపీ ప్రభుత్వం ప్రకటించిన అన్ని కార్యక్రమాలు తుస్సుమన్నాయి. జగన్ ఇప్పుడో కొత్త స్కీం తెచ్చాడు... దాని పేరు 'ఆడుదాం ఆంధ్రా' అంట. నాలుగున్నర ఏళ్లుగా ప్రజల జీవితాలతో ఆడుకున్న జగన్ ఇపుడు 'ఆడుదాం ఆంధ్రా' అంటూ కొత్త డ్రామా మొదలుపెట్టాడు. 

నియోజ‌క‌వ‌ర్గానికి ఓ ఇండోర్ స్టేడియం అన్నాడు. క్రికెట్ అకాడ‌మీలు ఏర్పాటు చేస్తానని అన్నాడు. ఇచ్చిన ఒక్క హామీ నిలబెట్టుకోలేదు. కానీ ప్లేయర్స్ నుండి జే ట్యాక్స్ వసూలు చేస్తున్నాడు. స్టేడియంలు, గ్రౌండ్స్ లో ప్రాక్టీస్ చేయ‌డానికి వచ్చినవాళ్లని, ఆడేందుకు వ‌చ్చిన‌వాళ్ల‌ని ఫీజులు క‌ట్ట‌క‌పోతే రావొద్దంటూ త‌రిమేస్తున్నాడు ఈ జ‌గ‌న్. కేంద్ర ప్రభుత్వ 'ఖేలో ఇండియా' కార్యక్రమానికి తెలుగు పేరు పెట్టి బిల్డప్ ఇస్తున్నాడు.

రూరల్ లో అవినీతి ఫుల్!

కాకినాడ రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని కన్నబాబుని ప్రజలు గెలిపించారు. అదృష్టం బాగుండి ఆయన మంత్రి కూడా అయ్యారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం ఏమైనా అభివృద్ధి చెందిందా? మీ జీవితాలు ఏమైనా మారాయా? 

కాకినాడ రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి నిల్లు... అవినీతి ఫుల్లు. అవినీతిలో జగన్ ని మించిపోయేసరికి కన్నబాబు మంత్రి పదవి పోయింది. అందుకే ఆయన పేరు మార్చాను... కరప్షన్ కన్న. నియోజకవర్గాన్ని కేకులా కోసి కుటుంబ సభ్యులకు పంచేశారు. నియోజకవర్గంలో కాంట్రాక్టులన్నీ కరప్షన్ కన్న తండ్రి, తమ్ముడే చేస్తున్నారు.

ఏ పనిచేయాలన్నా కప్పం కట్టాల్సిందే

నియోజకవర్గంలో ఏ పని జరగాలి అన్నా కన్నబాబు తండ్రికో, తమ్ముడికో కప్పం కట్టాల్సిందే. సెంటు స్థలాల పేరుతో భారీ అవినీతికి పాల్పడ్డారు. ఆయిల్ కంపెనీలు, లారీ ట్యాంకర్ల యజమానులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు. కరప్షన్ కన్న తమ్ముడి వేధింపులు తట్టుకోలేక ఈ మధ్యే డాక్టర్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. 

కాకినాడను దోచేస్తున్న ద్వారంపూడి

కాకినాడ సిటీని అభివృద్ధి చేస్తారని ఎమ్మెల్యేగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని గెలిపించారు. కాకినాడ సిటీ ఏమైనా అభివృద్ధి చెందిందా? చంద్రశేఖర్ రెడ్డి కుటుంబం మాత్రం బాగా అభివృద్ధి చెందింది. కాకినాడ సిటీని డ్రగ్స్, అవినీతి, భూకబ్జాలు, సెటిల్ మెంట్స్, మద్యం అక్రమ రవాణా, పేకాట క్లబ్స్ కి అడ్డాగా మార్చేశాడు చంద్రశేఖర్ రెడ్డి. 

అహంకారానికి ప్యాంటు, షర్ట్ వేస్తే అచ్చం చంద్రశేఖర్ రెడ్డిలానే ఉంటుంది. అందుకే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేరు మార్చాను... దోపిడీ శేఖర్. గంజాయి, హెరాయిన్ డ్రగ్స్ అమ్మిస్తూ కోట్ల రూపాయలు దోపిడీ చేస్తున్నాడు. మున్సిపాలిటీ, స్మార్ట్ సిటీ నిధులు కాజేశాడు. ఇళ్ల స్థలాల పేరుతో మడ అడవులు ధ్వంసం చేశాడు.

వందల కోట్ల విలువైన భూములు స్వాహా

శశికాంత్ నగర్ లో పార్కుకి చెందిన 2 ఎకరాల భూమికి దొంగ పత్రాలు సృష్టించి బినామీలకు టీడీఆర్ బాండ్స్ ఇష్యూ చేసి రూ.130 కోట్లు కొట్టేశాడు. కాకినాడ సూర్యారావుపేటలో 18 ఎకరాల భూమికి ఫోర్జరీ డాక్యుమెంట్స్ సృష్టించి కొట్టేశాడు. తండ్రి, తమ్ముడు ఆధ్వర్యంలో రేషన్ బియ్యాన్ని ఇతర దేశాలకు అమ్మి కోట్లు కొట్టేస్తున్నారు. జగన్ కి బినామీ దోపిడీ శేఖర్. అధికారంలోకి వచ్చాక దోపిడీ చంద్రశేఖర్ రెడ్డి తిన్నది మొత్తం కక్కిస్తాం.

*యువగళం పాదయాత్ర వివరాలు*

*ఇప్పటివరకు నడిచిన మొత్తం దూరం 2944.6 కి.మీ.*

*ఈరోజు నడిచిన దూరం 18.2 కి.మీ.*

*215వ రోజు (2-12-2023) యువగళం వివరాలు*

*పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం*

*ఉదయం*

8.00 – కాకినాడ రూరల్ తిమ్మాపురం యార్లగడ్డ గార్డెన్స్ నుంచి పాదయాత్ర ప్రారంభం.

10.00 – పవర్ జంక్షన్ వద్ద పాదయాత్ర పెద్దాపురం నియోజకవర్గంలోకి ప్రవేశం.

10.30 – చిత్రాడ వద్ద పాదయాత్ర పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశం.

10.40 – చిత్రాడ పంచాయితీ ఆఫీసు వద్ద స్థానికులతో సమావేశం.

10.50 – చిత్రాడ మీ సేవా కేంద్రం వద్ద అడ్వకేట్లతో సమావేశం.

12.00 – పిఠాపురం పాదగయ వద్ద భోజన విరామం.

*సాయంత్రం*

4.00 – పిఠాపురం పాదగయ వద్ద నుంచి పాదయాత్ర కొనసాగింపు.

4.10 – పిఠాపురం కుక్కుటేశ్వరస్వామి ఆలయం వద్ద ప్రైవేట్ టీచర్లతో సమావేశం.

4.20 – పిఠాపురం హాస్పటల్ వద్ద బిసి సామాజికవర్గీయులతో సమావేశం.

4.30 – పిఠాపురం అంబేద్కర్ సెంటర్ లో ఎస్సీ సామాజికవర్గీయులతో సమావేశం.

4.40 – పిఠాపురం పాతబస్టాండు వద్ద టు వీలర్స్ మెకానిక్ లు, ముస్లింలతో భేటీ.

4.45 – పిఠాపురం ఉప్పాడ జంక్షన్ లో బహిరంగసభ, యువనేత లోకేశ్ ప్రసంగం.

రాత్రి 

7.00 – పిఠాపురం లారీ యూనియన్ వద్ద అగ్రవర్ణ పేదలతో సమావేశం.

8.00 – నవకండ్రవాడలో స్థానికులతో సమావేశం.

8.45 – కొండెవరం ఎస్సీ కాలనీలో స్థానికులతో మాటామంతీ.

8.50 – కొత్త ఇసుకపల్లి సెంటర్ లో ఎస్సీ సామాజికవర్గీయులతో భేటీ.

10.00 – యండపల్లి జంక్షన్ లో స్థానికులతో మాటామంతీ.

10.15 – యండపల్లి జంక్షన్ వద్ విడిది కేంద్రంలో బస.

Link to comment
Share on other sites

Nagarjuna Sagar: నాగార్జున సాగర్ వివాదం: రేపు అత్యవసర భేటీ ఏర్పాటు చేసిన కేంద్రం 

01-12-2023 Fri 22:11 | Both States
  • నాగార్జునసాగర్ డ్యామ్ విషయంలో ఏపీ, తెలంగాణ మధ్య వివాదం
  • వివిధ ప్రాజెక్టులపై వివాదాల పరిష్కారానికి సిద్ధమైన కేంద్రం
  • రేపు ఉదయం 11 గంటలకు అత్యవసర సమావేశం 
  • హాజరు కావాలంటూ ఏపీ, తెలంగాణ సీఎస్ లకు సూచన
 
Union govt will held key meeting on projects

నాగార్జునసాగర్ వివాదం నేపథ్యంలో, వివిధ ప్రాజెక్టులపై తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారానికి కేంద్రం సిద్ధమైంది. నాగార్జునసాగర్, శ్రీశైలం డ్యాముల నిర్వహణను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కు అప్పగించేందుకు కేంద్రం సన్నద్ధమవుతోంది. 

ఈ క్రమంలో కేంద్ర జలశక్తి శాఖ రేపు ఉదయం 11 గంటలకు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి హాజరు కావాలని ఏపీ, తెలంగాణ సీఎస్ లకు సూచించింది. సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్ డీజీలు, సీడబ్ల్యూసీ, కేఆర్ఎంబీ చైర్మన్లకు కూడా దీనిపై సమాచారం అందించింది. సీడబ్ల్యూసీ, కేఆర్ఎంబీ చైర్మన్లు ఈ సమావేశానికి నేరుగా హాజరు కావాలని కేంద్ర జలశక్తి శాఖ స్పష్టం చేసింది. 

కాగా, ఇవాళ కేంద్ర హోంశాఖ నిర్వహించిన సమావేశంలో నాగార్జునసాగర్ డ్యామ్ భద్రతను సీఆర్పీఎఫ్ బలగాలకు అప్పగించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సీఆర్పీఎఫ్ బలగాలు సాగర్ డ్యామ్ వద్దకు చేరుకున్నాయి. సాగర్ డ్యామ్ ను తమ అధీనంలోకి తీసుకోనున్నాయి. 

ప్రస్తుతం ఉద్రిక్తతల నేపథ్యంలో సాగర్ డ్యామ్ కు ఇరువైపులా రెండు రాష్ట్రాల పోలీసులు మోహరించి ఉన్నారు. నాగార్జునసాగర్ డ్యామ్ పరిసరాలు పోలీసుల వలయంలో ఉన్నాయి.

Link to comment
Share on other sites

Andhra Pradesh: తెలంగాణ పోలీసులపై ఏపీలో పలు సెక్షన్ల కింద కేసు నమోదు 

02-12-2023 Sat 12:35 | Both States
  • ముదురుతున్న నాగార్జున సాగర్ డ్యామ్ వివాదం
  • నిన్న ఏపీ పోలీసులపై కేసు పెట్టిన తెలంగాణ పోలీసులు
  • ఈరోజు తెలంగాణ పోలీసులపై కేసు నమోదు చేసిన ఏపీ పోలీసులు
 
AP police registers case on Telangana police
Listen to the audio version of this article

నాగార్జున సాగర్ డ్యామ్ వివాదం ముదురుతోంది. తాజా వివాదం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చును రాజేస్తోంది. తెలంగాణ ఎన్నికల పోలింగ్ రోజున దాదాపు 500 మంది ఏపీ పోలీసులు డ్యామ్ లో సగ భాగాన్ని స్వాధీనం చేసుకుని, కుడి కాలువ ద్వారా నీటిని విడుదల చేశారు. ఈ ఘటనపై తెలంగాణ పోలీసులు కూడా అదే స్థాయిలో ప్రతిస్పందించారు. భారీ సంఖ్యలో తెలంగాణ పోలీసులు కూడా సాగర్ వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో నిన్న ఏపీ పోలీసులు, అధికారులపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈరోజు తెలంగాణ పోలీసులపై ఏపీ పోలీసులు సెక్షన్ 447, 341, రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు కేశారు. పల్నాడు విజయపురి పోలీస్ స్టేషన్ లో ఏపీ ఇరిగేషన్ అధికారులు చేసిన ఫిర్యాదు మేరకు కేసు బుక్ చేశారు. సాగర్ డ్యామ్ పై తమ విధులను తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారని తమ ఫిర్యాదులో ఏపీ అధికారులు పేర్కొన్నారు. 

 

Link to comment
Share on other sites

Gutha Sukender Reddy: దురాలోచనతోనే ఏపీ ప్రభుత్వం దుశ్చర్యకు పాల్పడింది: గుత్తా సుఖేందర్ రెడ్డి 

02-12-2023 Sat 11:30 | Both States
  • పోలింగ్ రోజున సాగర్ డ్యాం పైకి ఏపీ పోలీసులు దౌర్జన్యంగా వచ్చారన్న గుత్తా
  • ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు దెబ్బతింటాయని వ్యాఖ్య
  • మళ్లీ బీఆర్ఎస్ పార్టీనే గెలుస్తుందని ధీమా
 
Gutha Sukender Reddy fires on AP Government on Nagarjuna Sagar issue
Listen to the audio version of this article

నాగార్జునసాగర్ డ్యామ్ వివాదం ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి చిచ్చు రాజేసింది. దాదాపు 500 మంది ఏపీ పోలీసులు డ్యామ్ పైకి వచ్చి 13 గేట్ల వరకు స్వాధీనం చేసుకుని, కుడి కాలువ ద్వారా నీటిని విడుదల చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న రోజున ఈ ఘటన జరిగింది. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసులు కూడా అక్కడకు భారీ సంఖ్యలో చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం సాగర్ డ్యామ్ ను కేంద్ర బలగాలు తమ అధీనంలోకి తీసుకున్నాయి. 

మరోవైపు, ఈ ఘటనపై తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. పోలింగ్ రోజున డ్యామ్ పైకి ఏపీ పోలీసులు దౌర్జన్యంగా వచ్చారని ఆయన మండిపడ్డారు. దురాలోచనతోనే ఏపీ ప్రభుత్వం ఈ దుశ్చర్యకు పాల్పడిందని అన్నారు. ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే ఇరు రాష్ట్రాల మధ్య సంబంధాలు దెబ్బతింటాయని చెప్పారు. ఈ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ గెలుస్తుందని... ముఖ్యమంత్రిగా కేసీఆర్ హ్యాట్రిక్ కొడతారని ధీమా వ్యక్తం చేశారు.

Link to comment
Share on other sites

Nagarjuna sagar: సాగర్ ప్రాజెక్టు మొత్తం కేంద్రం అధీనంలోకి..! 

02-12-2023 Sat 10:06 | Both States
  • ఉదయం 11 గంటలకు ఉన్నతస్థాయి సమావేశం
  • సీఆర్ పీఎఫ్ బలగాల రాకతో వెనుదిరిగిన పోలీసులు
  • కుడి కాలువ ద్వారా కొనసాగుతున్న నీటి విడుదల
 
Central Forces Taking control over Nagarjuna Sagar Dam
Listen to the audio version of this article

నాగార్జున సాగర్ ప్రాజెక్టుపై నెలకొన్న వివాదం కొలిక్కి రానుంది. ఈ ప్రాజెక్టు నిర్వహణను కేంద్రం చేతిలో పెట్టాలన్న ప్రతిపాదనకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అంగీకరించాయి. దీంతో ప్రాజెక్టు వద్దకు సీఆర్ పీఎఫ్ బలగాలు చేరుకుంటున్నాయి. తెల్లవారుజామునుంచి ఒక్కో పాయింట్ ను తమ అధీనంలోకి తీసుకుంటున్నాయి. 13వ గేటు వద్ద ఏపీ పోలీసులు వేసిన ముళ్ల కంచెను తొలగించి మధ్యాహ్నానికి ప్రాజెక్టు మొత్తాన్ని స్వాధీనం చేసుకోనున్నట్లు సమాచారం. మరోవైపు, సాగర్ కుడి కాలువ ద్వారా దిగువకు నీటి విడుదల కొనసాగుతోంది.

గురువారం తెల్లవారుజామున వందలాదిగా ప్రాజెక్టు పైకి చేరుకున్న ఏపీ పోలీసులు.. అక్కడున్న సీసీ కెమెరాలను ధ్వంసం చేసి, తెలంగాణ సెక్యూరిటీ సిబ్బందిపై దాడి చేసిన విషయం తెలిసిందే. పదమూడవ గేటు వరకు తమ పరిధిలోకే వస్తుందంటూ కంచె వేసి ఆక్రమించారు. దీంతో రెండు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. ఈ గొడవ నేపథ్యంలో శుక్రవారం కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు, నీటిపారుదల శాఖ అధికారులతో ఆన్ లైన్ లో సమావేశమయ్యారు. ప్రాజెక్టుపై గత నెల 28 కి ముందున్న పరిస్థితిని కొనసాగించాలని ఏపీ ప్రభుత్వ అధికారులను కోరారు.

డ్యాం నిర్వహణ బాధ్యతలను తాత్కాలికంగా కేంద్రం తన చేతుల్లోకి తీసుకుంటుందని, సీఆర్ పీఎఫ్ బలగాలతో పర్యవేక్షణ చేస్తుందని చెప్పారు. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి నేతృత్వంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని అజయ్ కుమార్ భల్లా చెప్పారు. ఈ ప్రతిపాదనకు ఇరు రాష్ట్రాలు అంగీకరించాయి. దీంతో శనివారం ఉదయం 11 గంటలకు కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి రెండు రాష్ట్రాల అధికారులతో సమావేశం కానున్నారు.

Link to comment
Share on other sites

7 hours ago, psycopk said:

Nara Lokesh: ఈ డ్రామా కూడా కోడి కత్తి వ్యవహారం లాంటిదే: లోకేశ్ 

01-12-2023 Fri 21:57 | Andhra
  • కాకినాడలో లోకేశ్ యువగళం
  • పాదయాత్రకు 214వ రోజు
  • సర్పవరంలో లోకేశ్ బహిరంగ సభ
  • సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు
 
Lokesh slams CM Jagan in Kakinada rural

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రకు కాకినాడ నగరంలో విశేష స్పందన లభించింది. యువగళం జెండాలు చేతబూని టీడీపీ-జనసేన కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. మహిళలు హారతులతో నీరాజనాలు పట్టారు. కాకినాడ రూరల్ సర్పవరంలో ఏర్పాటుచేసిన భారీ బహిరంగసభలో లోకేశ్ మాట్లాడుతూ... సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు. 

నాగార్జునసాగర్ వద్ద డ్రామా కూడా కోడి కత్తి వ్యవహారం లాంటిదేనని ఎద్దేవా చేశారు. "క‌ర‌వుతో రైతులు అల్లాడుతుంటే క‌నీసం స‌మీక్ష కూడా చేయ‌ని జ‌గ‌న్ కి తెలంగాణ పోలింగ్ రోజు రైతులు గుర్తొచ్చారు, సాగ‌ర్ ఆయ‌క‌ట్టు రైతుల‌పై ప్రేమ పొంగి పొర్లింది... పోలీసుల్ని పంపి నాగార్జున సాగ‌ర్ పై శాంతిభ‌ద్రత‌ల స‌మ‌స్య క్రియేట్ చేయించాడు. ఇది కూడా మరో కోడిక‌త్తి, బాబాయ్ గుండెపోటు డ్రామా లాంటిదే" అంటూ లోకేశ్ విమర్శించారు.

జగన్ కు మమ్మల్ని చూస్తే భయం!

జగన్ కి భయం పట్టుకుంది. జగన్ కి చంద్రబాబుని చూస్తే భయం, పవన్ కళ్యాణ్ ని చూస్తే భయం, లోకేశ్ ని చూస్తే భయం. చంద్రబాబు భవిష్యత్తుకి గ్యారెంటీ కార్యక్రమం చూస్తే జగన్ కి భయం, పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేస్తే జగన్ కి భయం, లోకేశ్ యువగళం పాదయాత్ర చేస్తే జగన్ కి భయం. సొంత అమ్మని చూసినా జగన్ కి భయమే... సొంత చెల్లిని చూసినా జగన్ కి భయమే. ఆఖరికి ప్రజల్ని చూసినా జగన్ కి భయమే... అందుకే పరదాలు కట్టుకొని దొంగలా వెళతాడు. తెలుగుదేశం ఘన చరిత్ర ఉన్న పార్టీ, వైసీపీ గజదొంగల పార్టీ.

కోడికత్తి వారియర్స్ అని పేరు పెట్టండి!

జ‌గ‌న్ ఐపీఎల్ టీము పెడ‌తామంటున్నాడు... దీనికి కోడిక‌త్తి వారియ‌ర్స్ అని పేరు పెడితే బాగుంటుంది. సీనియ‌ర్ బ్యాట్స్ మెన్ అవినాష్ రెడ్డి, బెట్టింగ్ స్టార్ అనిల్, అర‌గంట స్టార్ అంబ‌టి, గంట‌ స్టార్ అవంతి, ఆల్ రౌండ‌ర్ గోరంట్ల మాధ‌వ్, రీల్ స్టార్ భ‌ర‌త్, బూతుల స్టార్ కొడాలి నాని, పించ్ హిట్ట‌ర్ బియ్యం మ‌ధు... అబ్బో మామూలు టీము కాదు ఇది! 

అన్ని కార్యక్రమాలు తుస్సే!

ఈ మధ్య వైసీపీ ప్రభుత్వం ప్రకటించిన అన్ని కార్యక్రమాలు తుస్సుమన్నాయి. జగన్ ఇప్పుడో కొత్త స్కీం తెచ్చాడు... దాని పేరు 'ఆడుదాం ఆంధ్రా' అంట. నాలుగున్నర ఏళ్లుగా ప్రజల జీవితాలతో ఆడుకున్న జగన్ ఇపుడు 'ఆడుదాం ఆంధ్రా' అంటూ కొత్త డ్రామా మొదలుపెట్టాడు. 

నియోజ‌క‌వ‌ర్గానికి ఓ ఇండోర్ స్టేడియం అన్నాడు. క్రికెట్ అకాడ‌మీలు ఏర్పాటు చేస్తానని అన్నాడు. ఇచ్చిన ఒక్క హామీ నిలబెట్టుకోలేదు. కానీ ప్లేయర్స్ నుండి జే ట్యాక్స్ వసూలు చేస్తున్నాడు. స్టేడియంలు, గ్రౌండ్స్ లో ప్రాక్టీస్ చేయ‌డానికి వచ్చినవాళ్లని, ఆడేందుకు వ‌చ్చిన‌వాళ్ల‌ని ఫీజులు క‌ట్ట‌క‌పోతే రావొద్దంటూ త‌రిమేస్తున్నాడు ఈ జ‌గ‌న్. కేంద్ర ప్రభుత్వ 'ఖేలో ఇండియా' కార్యక్రమానికి తెలుగు పేరు పెట్టి బిల్డప్ ఇస్తున్నాడు.

రూరల్ లో అవినీతి ఫుల్!

కాకినాడ రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని కన్నబాబుని ప్రజలు గెలిపించారు. అదృష్టం బాగుండి ఆయన మంత్రి కూడా అయ్యారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం ఏమైనా అభివృద్ధి చెందిందా? మీ జీవితాలు ఏమైనా మారాయా? 

కాకినాడ రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి నిల్లు... అవినీతి ఫుల్లు. అవినీతిలో జగన్ ని మించిపోయేసరికి కన్నబాబు మంత్రి పదవి పోయింది. అందుకే ఆయన పేరు మార్చాను... కరప్షన్ కన్న. నియోజకవర్గాన్ని కేకులా కోసి కుటుంబ సభ్యులకు పంచేశారు. నియోజకవర్గంలో కాంట్రాక్టులన్నీ కరప్షన్ కన్న తండ్రి, తమ్ముడే చేస్తున్నారు.

ఏ పనిచేయాలన్నా కప్పం కట్టాల్సిందే

నియోజకవర్గంలో ఏ పని జరగాలి అన్నా కన్నబాబు తండ్రికో, తమ్ముడికో కప్పం కట్టాల్సిందే. సెంటు స్థలాల పేరుతో భారీ అవినీతికి పాల్పడ్డారు. ఆయిల్ కంపెనీలు, లారీ ట్యాంకర్ల యజమానులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు. కరప్షన్ కన్న తమ్ముడి వేధింపులు తట్టుకోలేక ఈ మధ్యే డాక్టర్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. 

కాకినాడను దోచేస్తున్న ద్వారంపూడి

కాకినాడ సిటీని అభివృద్ధి చేస్తారని ఎమ్మెల్యేగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని గెలిపించారు. కాకినాడ సిటీ ఏమైనా అభివృద్ధి చెందిందా? చంద్రశేఖర్ రెడ్డి కుటుంబం మాత్రం బాగా అభివృద్ధి చెందింది. కాకినాడ సిటీని డ్రగ్స్, అవినీతి, భూకబ్జాలు, సెటిల్ మెంట్స్, మద్యం అక్రమ రవాణా, పేకాట క్లబ్స్ కి అడ్డాగా మార్చేశాడు చంద్రశేఖర్ రెడ్డి. 

అహంకారానికి ప్యాంటు, షర్ట్ వేస్తే అచ్చం చంద్రశేఖర్ రెడ్డిలానే ఉంటుంది. అందుకే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేరు మార్చాను... దోపిడీ శేఖర్. గంజాయి, హెరాయిన్ డ్రగ్స్ అమ్మిస్తూ కోట్ల రూపాయలు దోపిడీ చేస్తున్నాడు. మున్సిపాలిటీ, స్మార్ట్ సిటీ నిధులు కాజేశాడు. ఇళ్ల స్థలాల పేరుతో మడ అడవులు ధ్వంసం చేశాడు.

వందల కోట్ల విలువైన భూములు స్వాహా

శశికాంత్ నగర్ లో పార్కుకి చెందిన 2 ఎకరాల భూమికి దొంగ పత్రాలు సృష్టించి బినామీలకు టీడీఆర్ బాండ్స్ ఇష్యూ చేసి రూ.130 కోట్లు కొట్టేశాడు. కాకినాడ సూర్యారావుపేటలో 18 ఎకరాల భూమికి ఫోర్జరీ డాక్యుమెంట్స్ సృష్టించి కొట్టేశాడు. తండ్రి, తమ్ముడు ఆధ్వర్యంలో రేషన్ బియ్యాన్ని ఇతర దేశాలకు అమ్మి కోట్లు కొట్టేస్తున్నారు. జగన్ కి బినామీ దోపిడీ శేఖర్. అధికారంలోకి వచ్చాక దోపిడీ చంద్రశేఖర్ రెడ్డి తిన్నది మొత్తం కక్కిస్తాం.

*యువగళం పాదయాత్ర వివరాలు*

*ఇప్పటివరకు నడిచిన మొత్తం దూరం 2944.6 కి.మీ.*

*ఈరోజు నడిచిన దూరం 18.2 కి.మీ.*

*215వ రోజు (2-12-2023) యువగళం వివరాలు*

*పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం*

*ఉదయం*

8.00 – కాకినాడ రూరల్ తిమ్మాపురం యార్లగడ్డ గార్డెన్స్ నుంచి పాదయాత్ర ప్రారంభం.

10.00 – పవర్ జంక్షన్ వద్ద పాదయాత్ర పెద్దాపురం నియోజకవర్గంలోకి ప్రవేశం.

10.30 – చిత్రాడ వద్ద పాదయాత్ర పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశం.

10.40 – చిత్రాడ పంచాయితీ ఆఫీసు వద్ద స్థానికులతో సమావేశం.

10.50 – చిత్రాడ మీ సేవా కేంద్రం వద్ద అడ్వకేట్లతో సమావేశం.

12.00 – పిఠాపురం పాదగయ వద్ద భోజన విరామం.

*సాయంత్రం*

4.00 – పిఠాపురం పాదగయ వద్ద నుంచి పాదయాత్ర కొనసాగింపు.

4.10 – పిఠాపురం కుక్కుటేశ్వరస్వామి ఆలయం వద్ద ప్రైవేట్ టీచర్లతో సమావేశం.

4.20 – పిఠాపురం హాస్పటల్ వద్ద బిసి సామాజికవర్గీయులతో సమావేశం.

4.30 – పిఠాపురం అంబేద్కర్ సెంటర్ లో ఎస్సీ సామాజికవర్గీయులతో సమావేశం.

4.40 – పిఠాపురం పాతబస్టాండు వద్ద టు వీలర్స్ మెకానిక్ లు, ముస్లింలతో భేటీ.

4.45 – పిఠాపురం ఉప్పాడ జంక్షన్ లో బహిరంగసభ, యువనేత లోకేశ్ ప్రసంగం.

రాత్రి 

7.00 – పిఠాపురం లారీ యూనియన్ వద్ద అగ్రవర్ణ పేదలతో సమావేశం.

8.00 – నవకండ్రవాడలో స్థానికులతో సమావేశం.

8.45 – కొండెవరం ఎస్సీ కాలనీలో స్థానికులతో మాటామంతీ.

8.50 – కొత్త ఇసుకపల్లి సెంటర్ లో ఎస్సీ సామాజికవర్గీయులతో భేటీ.

10.00 – యండపల్లి జంక్షన్ లో స్థానికులతో మాటామంతీ.

10.15 – యండపల్లి జంక్షన్ వద్ విడిది కేంద్రంలో బస.

🔥🔥🔥🔥🔥🔥🔥🔥

Link to comment
Share on other sites

Dhulipala Narendra Kumar: నాగార్జునసాగర్ సాక్షిగా జగన్ ఆడిన జగన్నాటకం ఇది: ధూళిపాళ్ల నరేంద్ర 

02-12-2023 Sat 15:11 | Andhra
  • నాగార్జున సాగర్ డ్యామ్ వివాదంపై ధూళిపాళ్ల ప్రెస్ మీట్
  • అర్ధరాత్రి డ్రామాలు దేనికోసమంటూ సీఎం జగన్ కు ప్రశ్న
  • స్వీయ ప్రయోజనాల కోసమేనా అంటూ ఆగ్రహం
  • ఇన్నాళ్లు ఎందుకు ప్రశ్నించలేదంటూ నిలదీత
 
Dhulipalla Narendra fires on CM Jagan over Nagarjuna Sagar issue

అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కృష్ణా జలాల కేటాయింపుల్లో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై కంటితుడుపు చర్యగా కూడా కేంద్రానికి లేఖ రాయని జగన్ రెడ్డి హఠాత్తుగా రైతుల కోసమే దండయాత్ర చేశానని చెప్పడం ప్రజల్ని మోసగించడమేనని టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర ధ్వజమెత్తారు. నాగార్జున సాగర్ పై వందలాది పోలీసులతో జగన్ రెడ్డి చేయించిన దండయాత్ర రాష్ట్ర ప్రయోజనాల కోసమా, లేక స్వీయ రాజకీయ స్వప్రయోజనాల కోసమా? అని ప్రశ్నించారు. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో ధూళిపాళ్ల మీడియా సమావేశం నిర్వహించారు.

రాష్ట్ర నీటి హక్కులు కాపాడాలనే తపన, తాపత్రయం నాలుగున్నరేళ్లలో జగన్ రెడ్డిలో ఏ కోశానా కనిపించలేదని ధూళిపాళ్ల విమర్శించారు. డెల్టా రైతాంగం నీళ్లులేక రోడ్లెక్కి ఆందోళనలు చేసినా... చివరి ఆయకట్టు భూములు ఎండిపోతున్నాయని గగ్గోలు పెట్టినప్పుడు కూడా స్పందించని జగన్ రెడ్డి...  తెలంగాణలో ఎన్నికలు జరిగే ముందు రోజు... రాత్రికి రాత్రి తన పోలీసు సైనాన్ని సాగర్ డ్యామ్ పైకి పంపి వీరంగం వేయించడం ఎంతటి దిగజారుడుతనమో ప్రజలే ఆలోచించాలన్నారు. 

ఇప్పుడు ఎన్నికల సమయంలో జగన్ నీటి వివాదం రాజేయడం... విడిపోయినా కలిసుంటున్న తెలుగువారి మధ్య చిచ్చురేపడంలో భాగమా? అని ప్రశ్నించారు. సమసిపోయిన ప్రాంతీయ విద్వేషాలను తిరిగి రెచ్చగొట్టి లబ్ది పొందాలనుకున్న తన రాజకీయ వ్యూహంలో భాగమా? అనేది జగన్ రెడ్డే సమాధానం చెప్పాలని ధూళిపాళ్ల నరేంద్ర నిలదీశారు. 

"23 మంది లోక్ సభ సభ్యుల్ని ఉంచుకొని కూడా ఏనాడూ కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాపై జగన్ రెడ్డి మాట్లాడింది లేదు. నిజంగా తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం నుంచి విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని వాడుకొని ఉంటే... ఏపీ ప్రభుత్వం తరఫున జగన్ రెడ్డి ఒక్క లేఖ కూడా ఎందుకు కేంద్రానికి రాయలేదు? వాస్తవంగా జగన్ ముఖ్యమంత్రి అయ్యాక తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి కోసం ఎన్నోసార్లు శ్రీశైలంలో నీటిని వాడుకుంది. ఇన్నేళ్లలో ఎన్నిసార్లు జగన్ రెడ్డి తన అభ్యంతరం తెలిపాడు?

జగన్ రెడ్డికి తన ప్రయోజనాలు, తన కేసుల మాఫీ తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టవనడానికి నాలుగున్నరేళ్లుగా కృష్ణాజలాల విషయంలో అనుసరించిన తీరే నిదర్శనం. అనేక సందర్భాల్లో ఏమీ పట్టనట్టు మౌనంగా ఉన్న జగన్ రెడ్డి... కావాలనే పక్క రాష్ట్రంలో ఎన్నికలు జరిగే సమయంలో జగన్నాటకం మొదలెట్టాడు. రాష్ట్ర రైతాంగం తనను, తన ప్రభుత్వాన్ని తరిమికొట్టడానికి సిద్ధమైందని తెలిసే... జగన్ రెడ్డి  ప్రాజెక్టులపై అర్ధరాత్రి డ్రామాలు మొదలుపెట్టాడు. 

నిజంగా జగన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఇరురాష్ట్రాల నీటి కేటాయింపులపై పునఃసమీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చాక కోర్టుకు వెళ్లడమేంటి? అసలు అలాంటి చర్చ వచ్చినప్పుడే రెండో అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డి తన అభ్యంతరం ఎందుకు తెలియచేయలేదని ప్రశ్నిస్తున్నాం. 

పలుమార్లు ఢిల్లీ వెళ్లినప్పుడు కూడా జగన్ రెడ్డి... నీటి కేటాయింపుల్లో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడలేదు. రాష్ట్రానికి రావాల్సిన నీటిని అడ్డుకుంటూ... తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టులపై జగన్ రెడ్డి ఏనాడూ ఎందుకు నోరుమెదపలేదు?" అంటూ ధూళిపాళ్ల నిప్పులు చెరిగారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...