Jump to content

జనసేన, టీడీపీ, బీజేపీ కూటమిగా ఏర్పడడం మంచి పరిణామం: మెగాస్టార్ చిరంజీవి


psycopk

Recommended Posts

CM Ramesh: జనసేన, టీడీపీ, బీజేపీ కూటమిగా ఏర్పడడం మంచి పరిణామం: మెగాస్టార్ చిరంజీవి 

21-04-2024 Sun 10:19 | Andhra
  • తన తమ్ముడు పవన్ కల్యాణ్ వల్లే చాలా కాలం తర్వాత రాజకీయాలు మాట్లాడుతున్నానన్న మెగాస్టార్
  • అనకాపల్లి లోక్‌సభ కూటమి అభ్యర్థి సీఎం రమేశ్, పెందుర్తి అసెంబ్లీ కూటమి అభ్యర్థి పంచకర్ల రమేశ్‌లను గెలిపించాలని కోరిన చిరంజీవి
  • చిరంజీవిని ఆయన నివాసంలో కలిసిన ఇరువురు నేతలు
 
CM Ramesh and Panchkarla Ramesh Meet Chiranjeevi in Hyderabad

ఏపీ రాజకీయాలపై మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జనసేన, టీడీపీ, బీజేపీ ఒక కూటమిగా ఏర్పడడం మంచి పరిణామమని అభిప్రాయపడ్డారు. తన తమ్ముడు పవన్ కల్యాణ్ వల్లే చాలా కాలం తర్వాత రాజకీయాల గురించి మాట్లాడుతున్నానని అన్నారు. అనకాపల్లి లోక్‌సభ ఎంపీ కూటమి అభ్యర్థి సీఎం రమేశ్, పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి పంచకర్ల రమేశ్ హైదరాబాద్‌లోని చిరంజీవి నివాసంలో ఆయనను కలిశారు. ఈ సందర్భంగా మెగాస్టార్ మాట్లాడారు.

సీఎం రమేశ్, పంచకర్ల రమేశ్‌లను గెలిపించాలని ఓటర్లను చిరంజీవి కోరారు. ‘‘ తమ్ముడు పవన్ కల్యాణ్ కారణంగా చాలా కాలం తర్వాత రాజకీయల గురించి మాట్లాడుతున్నాను. పవన్ కల్యాణ్, చంద్రబాబు, బీజేపీ నాయకత్వం అందరూ మంచి కూటమిగా ఏర్పడ్డారు. ఇది శుభపరిణామం. సంతోషంగా ఉంది. నా చిరకాల మిత్రుడు సీఎం రమేశ్, పంచకర్ల రమేశ్ నాకు కావాల్సిన ఇద్దరూ అనకాపల్లి లోక్‌సభ పరిధిలోనే పోటీ చేస్తున్నారు. ఒకరు ఎంపీ అభ్యర్థిగా, ఇంకొకరు పెందుర్తి అసెంబ్లీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఇద్దరూ మంచివాళ్లే కాకుండా సమర్థులు. నియోజకవర్గాల అభివృద్ధికి దోహదపడతారు. ఆ విషయంలో నాకు పూర్తి నమ్మకం ఉంది’’ అని అన్నారు.

‘‘కేంద్రంతో సీఎం రమేశ్‌కి ఉన్న పరిచయాలు అనకాపల్లి లోక్‌సభ స్థానం అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడతాయి. తద్వారా పంచకర్ల రమేశ్‌తో పాటు ఇతర ఎమ్మెల్యేలు కోరుకునే అభివృద్ధి పనులు సజావుగా సాగిపోతాయి. మీ అందరి ఆశీస్సులు వీరిపై ఉంటాయని నమ్ముతున్నాను. దయచేసి వీరిద్దరిని గెలిపించండి. నాదో పెద్ద కోరిక. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపథంలో ముందుకు వెళ్లాలి. దానికి మీరందరూ నడుం బిగించండి. ఇలాంటివారికి ఓటు వేసి గెలిపించి మీ ఆశీస్సులు అన్ని విధాలుగా వీరికి ఉన్నాయనే నమ్మకాన్ని మాకు కలిగించండి’’ అని చిరంజీవి అన్నారు. పంచకర్ల రమేశ్ రాజకీయంగా తన దీవెనలతోనే రాజకీయ అరంగేట్రం చేశారని చిరంజీవి ప్రస్తావించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆయన ఎక్కడ ఉన్నా తనతో మాట్లాడుతూనే ఉంటారని వెల్లడించారు.

  • Haha 1
Link to comment
Share on other sites

Sajjala Ramakrishna Reddy: కూటమికి చిరంజీవి మద్దతు ఇవ్వడంపై సజ్జల స్పందన 

21-04-2024 Sun 19:00 | Andhra
  • ఏపీలో మూడు పార్టీలు కలవడం శుభ పరిణామం అన్న చిరంజీవి
  • కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని ప్రజలకు పిలుపు
  • కూటమికి చిరంజీవి మద్దతుపై తామేమీ ఆశ్చర్యపోవడం లేదన్న సజ్జల
  • చిరంజీదే కాదు... ఇంకెవరు వచ్చినా తమకేమీ నష్టం లేదని స్పష్టీకరణ 
 
Sajjala reactions on Chiranjeevi support for alliance

ఏపీలో మూడు పార్టీల కలయిక శుభ పరిణామం అని, కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని మెగాస్టార్ చిరంజీవి పిలుపు ఇవ్వడం పట్ల ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు.

కూటమి అభ్యర్థులకు చిరంజీవి మద్దతు ప్రకటించడం పట్ల తామేమీ ఆశ్చర్యపోవడంలేదని అన్నారు. చిరంజీవే కాదు... ఇంకెవరైనా వచ్చి మద్దతు ఇచ్చినా తమకు నష్టం లేదని స్పష్టం చేశారు. ఎంతమంది కలిసి వచ్చినా వైసీపీని ఓడించడం జరగని పని అని ఉద్ఘాటించారు. 

ఏపీ ఎన్నికల ముఖచిత్రంలో ఇప్పుడొక స్పష్టత వచ్చిందని, ఇటువైపు సీఎం జగన్ ఒక్కరే ఉన్నారని, అటువైపు గుంటనక్కలు, తోడేళ్లు, ముళ్లపందులు ఉన్నాయని సజ్జల వ్యాఖ్యానించారు. 

ఇక, పవన్ కల్యాణ్ ఏమాత్రం పరిపక్వత లేని రాజకీయ నాయకుడు అని సజ్జల విమర్శించారు. పవన్ తీరు చూస్తుంటే చంద్రబాబు కోసమే పుట్టి, పెరిగినట్టున్నాడని వ్యంగ్యం ప్రదర్శించారు. చంద్రబాబు కోసమే పార్టీ పెట్టాడని, చంద్రబాబు బటన్ నొక్కితేనే కదులుతాడు, ఆగుతాడు అని ఎద్దేవా చేశారు. పవన్ రాజకీయ చరిత్రకు చంద్రబాబే ముగింపు పలుకుతారని సజ్జల వ్యాఖ్యానించారు.

  • Like 1
Link to comment
Share on other sites

2 hours ago, psycopk said:

 

CM Ramesh: జనసేన, టీడీపీ, బీజేపీ కూటమిగా ఏర్పడడం మంచి పరిణామం: మెగాస్టార్ చిరంజీవి 

21-04-2024 Sun 10:19 | Andhra
  • తన తమ్ముడు పవన్ కల్యాణ్ వల్లే చాలా కాలం తర్వాత రాజకీయాలు మాట్లాడుతున్నానన్న మెగాస్టార్
  • అనకాపల్లి లోక్‌సభ కూటమి అభ్యర్థి సీఎం రమేశ్, పెందుర్తి అసెంబ్లీ కూటమి అభ్యర్థి పంచకర్ల రమేశ్‌లను గెలిపించాలని కోరిన చిరంజీవి
  • చిరంజీవిని ఆయన నివాసంలో కలిసిన ఇరువురు నేతలు
 
CM Ramesh and Panchkarla Ramesh Meet Chiranjeevi in Hyderabad

ఏపీ రాజకీయాలపై మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జనసేన, టీడీపీ, బీజేపీ ఒక కూటమిగా ఏర్పడడం మంచి పరిణామమని అభిప్రాయపడ్డారు. తన తమ్ముడు పవన్ కల్యాణ్ వల్లే చాలా కాలం తర్వాత రాజకీయాల గురించి మాట్లాడుతున్నానని అన్నారు. అనకాపల్లి లోక్‌సభ ఎంపీ కూటమి అభ్యర్థి సీఎం రమేశ్, పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి పంచకర్ల రమేశ్ హైదరాబాద్‌లోని చిరంజీవి నివాసంలో ఆయనను కలిశారు. ఈ సందర్భంగా మెగాస్టార్ మాట్లాడారు.

సీఎం రమేశ్, పంచకర్ల రమేశ్‌లను గెలిపించాలని ఓటర్లను చిరంజీవి కోరారు. ‘‘ తమ్ముడు పవన్ కల్యాణ్ కారణంగా చాలా కాలం తర్వాత రాజకీయల గురించి మాట్లాడుతున్నాను. పవన్ కల్యాణ్, చంద్రబాబు, బీజేపీ నాయకత్వం అందరూ మంచి కూటమిగా ఏర్పడ్డారు. ఇది శుభపరిణామం. సంతోషంగా ఉంది. నా చిరకాల మిత్రుడు సీఎం రమేశ్, పంచకర్ల రమేశ్ నాకు కావాల్సిన ఇద్దరూ అనకాపల్లి లోక్‌సభ పరిధిలోనే పోటీ చేస్తున్నారు. ఒకరు ఎంపీ అభ్యర్థిగా, ఇంకొకరు పెందుర్తి అసెంబ్లీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఇద్దరూ మంచివాళ్లే కాకుండా సమర్థులు. నియోజకవర్గాల అభివృద్ధికి దోహదపడతారు. ఆ విషయంలో నాకు పూర్తి నమ్మకం ఉంది’’ అని అన్నారు.

‘‘కేంద్రంతో సీఎం రమేశ్‌కి ఉన్న పరిచయాలు అనకాపల్లి లోక్‌సభ స్థానం అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడతాయి. తద్వారా పంచకర్ల రమేశ్‌తో పాటు ఇతర ఎమ్మెల్యేలు కోరుకునే అభివృద్ధి పనులు సజావుగా సాగిపోతాయి. మీ అందరి ఆశీస్సులు వీరిపై ఉంటాయని నమ్ముతున్నాను. దయచేసి వీరిద్దరిని గెలిపించండి. నాదో పెద్ద కోరిక. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపథంలో ముందుకు వెళ్లాలి. దానికి మీరందరూ నడుం బిగించండి. ఇలాంటివారికి ఓటు వేసి గెలిపించి మీ ఆశీస్సులు అన్ని విధాలుగా వీరికి ఉన్నాయనే నమ్మకాన్ని మాకు కలిగించండి’’ అని చిరంజీవి అన్నారు. పంచకర్ల రమేశ్ రాజకీయంగా తన దీవెనలతోనే రాజకీయ అరంగేట్రం చేశారని చిరంజీవి ప్రస్తావించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆయన ఎక్కడ ఉన్నా తనతో మాట్లాడుతూనే ఉంటారని వెల్లడించారు.

Sirio nnii yethaali. Pulkas nd balio fans 😂

  • Haha 1
Link to comment
Share on other sites

 

Baboru

Lion Lokesh

Balio

Balio alludu

PK

Bodi

Sharmila 

Revantham

Rahul Gandhi

Ippudu Chiru

Enta mandini moyyali papam jaali vestondi Pulkas ni choostunte

 

so-funny-hahaha.gif

Link to comment
Share on other sites

nina bagane unnadu.. ivala vachi morugutunadu..

Sajjala Ramakrishna Reddy: అలాంటి వాళ్ల గురించి చిరంజీవి మాట్లాడడం ఆశ్చర్యం కలిగించింది: సజ్జల

22-04-2024 Mon 15:47 | Andhra
  • చిరంజీవిని ఎవరూ అవమానించలేదని సజ్జల స్పష్టీకరణ
  • ఆయన రాజకీయాల్లోకి రావాలనుకుంటే రావొచ్చని వ్యాఖ్య 
  • బ్యాంకులను మోసం చేసిన వారిని పక్కన కూర్చోబెట్టుకున్నారని విమర్శలు
Sajjala says Chiranjeevi surprised sitting beside fraudsters

ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇవాళ తాడేపల్లిలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మెగాస్టార్ చిరంజీవి అంశంపై స్పందించారు. 

చిరంజీవిని ఎవరూ అవమానించలేదని స్పష్టం చేశారు. ఆయన రాజకీయాల్లోకి రావాలనుకుంటే ఎవరూ అభ్యంతర పెట్టరని స్పష్టం చేశారు. చిరంజీవి గొప్ప సినిమా స్టార్ అని, కానీ ఆయన బ్యాంకులను మోసం చేసిన వారిని పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడుతున్నారని సజ్జల పేర్కొన్నారు. చెడు ఆలోచనలు చేసే వారి గురించి చిరంజీవి మాట్లాడడం ఆశ్చర్యం కలిగించిందని అన్నారు. 

ఇక, పవన్ కల్యాణ్ కు రెండేళ్ల పాటు సీఎం పదవి ఇవ్వాలని జనసైనికులు కోరుకుంటున్నారని, కానీ చంద్రబాబు పవన్ ను 21 అసెంబ్లీ సీట్లకే పరిమితం చేశారని సజ్జల వివరించారు. ఆ 21 మందిలో కూడా ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లు 12 మంది వరకు ఉన్నారని, ఆ లెక్కన పవన్ తన సొంత మనుషులకు 10 మందికే టికెట్లు ఇప్పించుకోలిగారని వ్యాఖ్యానించారు. 

వీటిలోనూ ఇంకా కోత పడే అవకాశం ఉందని, చివరికి పవన్ కల్యాణ్ కూడా పిఠాపురం బరి నుంచి తప్పుకునే పరిస్థితులు ఏర్పడవచ్చని సజ్జల అభిప్రాయపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయాలన్న వంకతో పవన్ పిఠాపురానికి వీడ్కోలు పలికే అవకాశం ఉందని అన్నారు. 

అన్ని సీట్లపై తన పట్టు ఉండాలని భావించే చంద్రబాబు... పిఠాపురంలో పవన్ కల్యాణ్ ను తప్పించి వర్మకు చాన్స్ ఇచ్చే అవకాశాన్ని కొట్టిపారేయలేమని పేర్కొన్నారు.

Link to comment
Share on other sites

On 4/21/2024 at 9:49 AM, psycopk said:

 

Sajjala Ramakrishna Reddy: కూటమికి చిరంజీవి మద్దతు ఇవ్వడంపై సజ్జల స్పందన 

21-04-2024 Sun 19:00 | Andhra
  • ఏపీలో మూడు పార్టీలు కలవడం శుభ పరిణామం అన్న చిరంజీవి
  • కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని ప్రజలకు పిలుపు
  • కూటమికి చిరంజీవి మద్దతుపై తామేమీ ఆశ్చర్యపోవడం లేదన్న సజ్జల
  • చిరంజీదే కాదు... ఇంకెవరు వచ్చినా తమకేమీ నష్టం లేదని స్పష్టీకరణ 
 
Sajjala reactions on Chiranjeevi support for alliance

ఏపీలో మూడు పార్టీల కలయిక శుభ పరిణామం అని, కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని మెగాస్టార్ చిరంజీవి పిలుపు ఇవ్వడం పట్ల ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు.

కూటమి అభ్యర్థులకు చిరంజీవి మద్దతు ప్రకటించడం పట్ల తామేమీ ఆశ్చర్యపోవడంలేదని అన్నారు. చిరంజీవే కాదు... ఇంకెవరైనా వచ్చి మద్దతు ఇచ్చినా తమకు నష్టం లేదని స్పష్టం చేశారు. ఎంతమంది కలిసి వచ్చినా వైసీపీని ఓడించడం జరగని పని అని ఉద్ఘాటించారు. 

ఏపీ ఎన్నికల ముఖచిత్రంలో ఇప్పుడొక స్పష్టత వచ్చిందని, ఇటువైపు సీఎం జగన్ ఒక్కరే ఉన్నారని, అటువైపు గుంటనక్కలు, తోడేళ్లు, ముళ్లపందులు ఉన్నాయని సజ్జల వ్యాఖ్యానించారు. 

ఇక, పవన్ కల్యాణ్ ఏమాత్రం పరిపక్వత లేని రాజకీయ నాయకుడు అని సజ్జల విమర్శించారు. పవన్ తీరు చూస్తుంటే చంద్రబాబు కోసమే పుట్టి, పెరిగినట్టున్నాడని వ్యంగ్యం ప్రదర్శించారు. చంద్రబాబు కోసమే పార్టీ పెట్టాడని, చంద్రబాబు బటన్ నొక్కితేనే కదులుతాడు, ఆగుతాడు అని ఎద్దేవా చేశారు. పవన్ రాజకీయ చరిత్రకు చంద్రబాబే ముగింపు పలుకుతారని సజ్జల వ్యాఖ్యానించారు.

Anna we are anti mega family Annav last year . chala opposite posts vesa . ippudu positive posts veyyala ??

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...