Jump to content

Finally Hero Corp. Confrmd To Ap


posaanisam

Recommended Posts

adi evaru vellatla kada inka now VJD club is revamped so janalu akkada daka pothunnaru!!

nenu cheppindi fun times gurinchi bhayya.. 

past 2-3 yrs nundi chala bagundi le..

 

aina ipudu area ki okati start chesaru.. kitty partys anta , meets anta endoo le goola

Link to comment
Share on other sites

nenu cheppindi fun times gurinchi bhayya.. 

past 2-3 yrs nundi chala bagundi le..

 

aina ipudu area ki okati start chesaru.. kitty partys anta , meets anta endoo le goola

sare le kani nuvvu na PM ki reply cheyyi urgent yama urgent!!

Link to comment
Share on other sites

ఆంధ్రప్రదేశ్ లో 'హీరో' పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం, హీరో మోటార్స్ సంస్థకు మధ్య ఈరోజు ఒప్పందం కుదిరింది. కంపెనీ ప్రతినిధి రాకేశ్ వశిష్ట్ తో ప్రభుత్వం ఈ ఒప్పందం చేసుకుంది. ఈ యూనిట్ స్థాపన కోసం చిత్తూరు జిల్లా శ్రీసిటీ సమీపంలో 600 ఎకరాలు కేటాయించారు. 18 నెలల్లో హీరో మోటార్ సైకిళ్ల తయారీ ప్లాంటు నిర్మాణం పూర్తి చేసేలా ఒప్పందం చేసుకున్నారు. దీని ద్వారా పదివేల మందికి ఉపాధి లభిస్తుంది. వీలైనంత త్వరగా ప్లాంటు ఏర్పాటుకు సంస్థ ప్రయత్నించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు 'హీరో' ప్రతినిధులను కోరారు.

Link to comment
Share on other sites

 
చంద్రబాబు, కేసీఆర్ ల మధ్య జరిగిన 'హీరో' పోరులో చంద్రబాబుదే విజయం!     08:45 AM
 
'హీరో'ను సాధించాలని ఏపీ, తెలంగాణ సీఎంల మధ్య జరిగిన రసకందాయ పోరులో ఆఖరుకు ఏపీ సీఎం చంద్రబాబే విజయం సాధించారు. దక్షిణాదిన తమ ప్లాంట్ ను ఏర్పాటు చేసేందుకు హీరో సంస్థ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో దోబూచులాడింది. హీరో సంస్థ దక్షిణాదిలో తమ ప్లాంట్ ను ఏర్పాటు చేయనున్నామని ప్రకటించగానే... ఏపీ సీఎం చంద్రబాబే నేరుగా రంగంలోకి దిగారు. హీరో మోటో కార్ప్ యాజమాన్యంతో సంప్రదింపులు జరిపి.. ఆంధ్రప్రదేశ్‌లో యూనిట్ ఏర్పాటు చేస్తే సకల సౌకర్యాలు కల్పిస్తామని.. పెద్ద ఎత్తున రాయితీలు, ప్రోత్సాహకాలు కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. చంద్రబాబు ప్రయత్నాల వలన తొలుత ఏపీలో ఈ ప్లాంట్ ను ఏర్పాటు చేసేందుకు హీరో సంస్థ మొగ్గుచూపింది. 

అయితే...ఈ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా వెంటనే అప్రమత్తమయ్యారు. తన వంతు ప్రయత్నాల్లో భాగంగా పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్రను రంగంలోకి దింపింది. అప్పట్లో ప్రదీప్ చంద్ర దీని కోసం ప్రత్యేకంగా ఢిల్లీ వెళ్లి హీరో కంపెనీ సీవోవో విక్రమ్ ను కలిశారు. తెలంగాణ రాష్ట్రంలోని వసతులపై ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ ప్రజెంటేషన్ తర్వాత తెలంగాణలో తమ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు హీరో సంస్థ సంసిద్ధత కూడా వ్యక్తం చేసింది. దీంతో, కేసీఆర్ నెల రోజుల పాలన పూర్తయిన సందర్భంగా చానళ్లు, పత్రికలు... ప్రతిష్ఠాత్మకమైన హీరో ప్రాజెక్ట్ ను సాధించడం ద్వారా కేసీఆర్ చంద్రబాబుపై పైచేయి సాధించారని ఆయనపై ప్రశంసలు కురిపించాయి.

అయితే... ఇక్కడి నుంచి చంద్రబాబు చాణక్యం మొదలైంది. హీరో దక్షిణాదిలో తన తొలి ప్రాజెక్ట్ ను తెలంగాణలో ఏర్పాటు చేయడానికి సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినప్పటికీ చంద్రబాబు తన ప్రయత్నాలు మానలేదు. చాప కింద నీరులా...ఎవరికీ ఎటువంటి అనుమానం రాకుండా ఆయన తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే, మొన్న చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో భాగంగా హీరో సంస్థ చైర్మన్ పవన్ ముంజాల్ తో భేటీ అయ్యారు. ఈ చర్చల్లో ఆంధప్రదేశ్ లో తమ ప్లాంట్ ను ఏర్పాటు చేసేలా 'ఫైనల్ టచ్' చంద్రబాబు ఇచ్చారు.

దీంతో, ఆంధ్రప్రదేశ్ తన తొలి భారీ పరిశ్రమను సాధించింది. చంద్రబాబు మంత్రాంగం కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య ఊగిసలాడిన హీరో చివరకు ఆంధ్రప్రదేశ్ నే ఎంచుకుంది. దీని కోసం చిత్తూరు జిల్లాలోని శ్రీ సిటీ సెజ్ సమీపంలో 600 ఎకరాలు హీరోకు ఆంధప్రదేశ్ ప్రభుత్వం కేటాయించింది. ఈ మేరకు, ఒప్పందం కుదుర్చుకోవడానికి హీరో సంస్థ ప్రతినిధులు మంగళవారం హైదరాబాద్ వస్తున్నారు. ఈ ప్లాంట్ ఏర్పాటు ద్వారా 3 వేల మందికి ప్రత్యక్షంగా...మరో 3వేల మందికి పరోక్షంగా ఉపాధి దొరుకుతుంది.

 

Link to comment
Share on other sites

×
×
  • Create New...