Jump to content

బాపుకు బాష్పాంజలి - 1


Mama77

Recommended Posts

బాపుకు బాష్పాంజలి - 6

 

 

 

 

 

బాపుగారు పెర్‌ఫెక్షనిస్టు. ఏదైనా బొమ్మలో లైన్లు ఎక్కువయ్యాయనిపిస్తే వైట్‌నర్‌తో చెరిపేయకుండా మళ్లీ వేసేవారట. వేసి చూసుకుని, తృప్తి పడ్డాకనే పంపేవారు. బొమ్మ వేసి పంపించాక కూడా దాని గురించి పునరాలోచన వస్తే వెనక్కి తెప్పించేసుకుని మళ్లీ వేసి పంపించేవారు. పంపుతూ ''మీకు నచ్చితే వేసుకోండి, నచ్చకపోతే చెప్తే మళ్లీ ప్రయత్నిస్తాను.'' అనేవారు. ఈ మాట కెరియర్‌ మొదట్లో అనడం కాదు, థాబ్దాలుగా వేసిన తర్వాత కూడా అనేవారు. అసలు వాళ్ల వినయం, ఒకలా చెప్పాలంటే దుస్సహం. బాపురమణలిద్దరూ ఫోన్‌ చేసినపుడు ''నమస్కారమండి'' అని మొదలుపెడతారు. అసలే, అంతటి పెద్దవాళ్లు మనకు ఫోన్‌ చేశారే అని తత్తరపడుతూ వుంటాం. మనం నమస్కారమండీ అంటే ప్రతినమస్కారం చేయడం కాకుండా, వాళ్లే నమస్కారం అంటే  కాస్సేపు నోరు పెగలదు. రమణగారికి యీ విషయం చెప్పాను కూడా. 'ఏమోనండీ, అలా అలవాటైపోయింది' అనేవారు. 

 

 

బాపుగారిని మీ గురువు ఎవరండి అనగండి, నిన్న కార్టూన్‌ వేసినవాడి పేరుతో సహా చెప్పేస్తారు. ఇదేదో పబ్లిసిటీ స్టంట్‌ కాదు, ప్రతిభ వున్న అందరినీ ఆయన మెచ్చుకునేవారు. సినిమాల్లో కూడా ఆయన సీనియర్లతో పనిచేశారు, జూనియర్లతో పనిచేశారు, కొత్తవాళ్లతో పనిచేశారు. ఎవరితోనూ పేచీలు రాలేదు. నటీనటులు, కళాకారులు, టెక్నీషియన్లు అందరూ ఆయనను గౌరవించినవారే, ఆయనా అందరినీ గౌరవించారు. ఎవరైనా తన వర్క్‌ గురించి అనవసరంగా విమర్శించినా, సరిగ్గా వాడుకోకపోయినా 'తెలియక చేసి వుంటారండి' అనేవారు. కావాలని చేశారని తెలిస్తే కార్టూన్లు వేసి ఆటపట్టించేవారు. తెలిసీతెలియకుండా కామెంట్లు చేస్తే జోక్‌ వేసి మొహం మాడ్చేవారు. రావి కొండలరావుగారు చెప్పారు - ''ఒకాయన వెంకటేశ్వరస్వామి పాదాలు మాత్రం వేసి యిస్తే తన కంపెనీకి లోగోగా వాడుకుంటానన్నాడట. వేసి యిచ్చాక వేళ్లు చూసి సణిగాడట. బాపుగారు యిలాటి సందర్భాల్లో పాదాల వేళ్లు ఉబ్బెత్తుగా వేస్తారు. ఎందుకు వేయాలో ఆయనకు తెలుసు. వేయించుకున్న వాడికి తెలియకపోతే అడగాలి. కానీ ఆయన 'వేళ్లు కొంచెం వాచినట్టుగా వున్నాయేంటండీ' అన్నాడట. బాపు గారు వెంటనే 'దానికేముందండీ? బూడ్సు తొడిగేద్దాం' అన్నారు ఛెళ్లుమన్నట్లు.''

 

 

చిత్రకారుడిగా బాపు స్థాయి జాతీయంగా, అంతర్జాతీయంగా ఎలాటిదో తెలుసుకోవాలన్న కుతూహలం నాకుండేది. తెలుగు వాళ్ల నెవర్ని అడిగినా అమ్మాయంటే బాపు బొమ్మలా వుండాలి వంటి పడికట్టు పదాలు వాడుతూ వుంటారు తప్ప నేషనల్‌గా ఆయన స్థానం 3 లేదా 5, 7, 8 ఏదీ చెప్పరు. ఆయన యిలస్ట్రేషన్ల దగ్గర్నుంచి కార్టూన్ల దాకా అనేక రకాలుగా చిత్రాలు వేశారు. నాకు వాటి పరిభాష రాదు కాబట్టి సరైన పదాలు వుపయోగించలేను. 'ఇన్ని వేసిన మీరు లాండ్‌స్కేప్స్‌ వేయలేదా?' అని అడిగితే 'అవి నాకు చాలా యిష్టం. కానీ వెయ్యలేదు' అని జవాబిచ్చారు. ఇలస్ట్రేటర్‌గా ఆయన స్థానం యిది, పెయింటర్‌గా యిది, కార్టూనిస్టుగా యిది.. అని తెలుసుకుంటే బాగుంటుంది కదా. 1995లో ''బొమ్మా బొరుసూ'' తయారుచేసినపుడు యీ సమాచారం సేకరించి యివ్వాలని కోరిక గట్టిగా కలిగింది. జాతీయస్థాయిలో బాపు చిత్రాల గురించి వ్యాసాలేవీ నేను చదవలేదు. అడిగితే తెలుగు చిత్రవిమర్శకులను మాత్రమే అడగాలి. విమర్శకుల్లో సంజీవ్‌దేవ్‌గారిది చాలా ఉన్నతస్థానం. ఆయన రచనా, బొమ్మలు, విమర్శా అన్నీ గొప్పగా వుంటాయి. అప్పటికే ఆయన పెద్దాయన. ఈ ఏడాది ఆయన శతజయంతి. 

 

ఇక నాకు బాగా తెలిసున్న విమర్శకుడు చలసాని ప్రసాదరావుగారు. ఆయన దగ్గరకు వెళ్లి ప్రశ్నావళి రాసి యిచ్చాను. ఆయన వాటిని తనకు అనువుగా మార్చుకుని యిచ్చిన సమాధానాలు నాకు తృప్తి యివ్వలేదు. మీకు శాంపుల్‌ చూపిస్తాను. ప్రశ్న - ''బాపుకు ప్రత్యేక శైలి వుందా?'' జవాబు - అసలు శైలి అంటే ఏమిటి? చెప్పదలచిన అంశాన్ని ఒక విశిష్టపద్ధతిలో, ఆకర్షణీయంగా చెప్పటం. బాపు బొమ్మలు చూడగానే 'ఇది బాపు బొమ్మలా వుందే' అని మనకు తెలీకుండానే అనుకుంటాం. అదే బాపు ముద్ర. ఇంకో ప్రశ్న - ''బాపు తెలుగువారికి ఆరాధ్యుడు. మరి జాతీయ స్థాయిలో గుర్తింపు వున్నదా?'' జవాబు - ''ఆయన బొమ్మలు హిందీ, ఇంగ్లీషు పత్రికల ద్వారా కూడా ప్రచారంలోకి వచ్చి వుంటే బాపుకి జాతీయస్థాయిలో పేరు వచ్చి తీరేది. ఆర్కే లక్ష్మణ్‌ విద్యావంతులైన భారతీయుల్లో చాలామందికి తెలుసు. తెలుగువారిలో ఎందరికి తెలుసు? సత్యజిత్‌ రాయ్‌ సినిమా డైరక్టరుగా చాలామందికి తెలుసు. కథారచయితగా, చిత్రకారునిగా ఎందరికి తెలుసు? జాతీయస్థాయి గుర్తింపు లేనంత మాత్రాన బాపుకి వచ్చిన నష్టం లేదు.'' ఇవేం సమాధానాలు? ఆయనకు నష్టం లేదని మనం తీర్మానిస్తే సరిపోయిందా? గుర్తింపు వుంటే పద్మ అవార్డులు కురిసి వుండేవి. 

 

 

అసలు యిలాటి మూల్యాంకన (యివాల్యుయేషన్‌) బాపుకే యిష్టం లేదని నా అనుమానం. అంతర్జాతీయ కార్టూన్‌ పోటీలకు శంకు, శ్యాం మోహన్‌ వంటి తెలుగువాళ్లు ఎంట్రీలు పంపి బహుమతులు గెల్చుకున్నారు. బాపు అలాటి ప్రయత్నమే చేయలేదు. ఆయన యిలాటివాటికన్నిటికీ అతీతం, యీయనే వాళ్లకు అవార్డు యివ్వాలి వంటి కబుర్లు మనం అనుకోవచ్చు. అలా చెప్తే పాలగుమ్మి పద్మరాజుగారు తన కథను పంపి ఎవార్డు తెచ్చుకున్నంతమాత్రాన ఆయన తక్కువ రచయిత అనగలమా? జర్మన్‌లు మన వేదాలను మెచ్చుకున్నారన్నా, అమెరికాలో వివేకానందుడికి జేజేలు పలికారన్నా, గాంధీకి ఇంగ్లండ్‌లో ఘనస్వాగతం లభించిందన్నా, బాపు ''సీతాకల్యాణం''కు అంతర్జాతీయంగా అవార్డు లభించిందన్నా సంతోషిస్తాం కదా. అలా చిత్రకారుడిగా కూడా బాపుకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తే బాగుండేది కదా. కానీ ఆయన పోటీకే వెళ్లందే! ఆయనను నేను చేసిన లిఖితపూర్వకమైన యింటర్వ్యూలో అడిగాను - ''వివిధ దేశాల పత్రికలలో బొమ్మలు చూసి మీరు నిరంతరం నేర్చుకుంటూంటారని అంటారు. అలా నేర్చుకుని వేసిన బొమ్మను ఏ విధంగా ఇవాల్యుయేట్‌ చేసుకుంటారు? ఒరిజినల్‌ ఆర్టిస్టుకి పంపుతారా? మీ మిత్రులు (ఆర్ట్‌ ఫీల్డ్‌లో ఎవరు?) ఎవరికైనా చూపించి అభిప్రాయాలు కోరతారా?'' అని. దానికి ఆయన ''అనేకమంది స్వదేశీవిదేశీ చిత్రకారుల బొమ్మలు చూడడమే నా విద్య. ఎవాల్యుయేషన్‌ అన్నది నా వరకే చేసుకుంటాను. ప్రతి బొమ్మ రమణగారికి చూపిస్తాను.'' అని రాశారు. (సశేషం) 

 

 

- See more at: http://telugu.greatandhra.com/articles/mbs/mbs-bapu-ku-bashpanjali-56060.html#sthash.7bxwv66c.dpuf

 

Link to comment
Share on other sites

బాపుకు బాష్పాంజలి - 7

 

 

మిమ్మల్ని కమ్మర్షియల్‌ ఆర్టిస్టుగానే పేర్కొంటారా? ఆంధ్రచిత్రకారులు అన్నపుడు అడవి బాపిరాజు, దామెర్ల రామారావు, మొక్కపాటి కృష్ణమూర్తి.. వంటి పేర్లు చెపుతారు కానీ బాపు అని ఎందుకనరు? ఈ రెండు విభాగాల మధ్య ఏదైనా అగాధం వుందా? మీరు దానిని 'బ్రిడ్జ్‌' చేసే ప్రయత్నాలు చేయలేదా?'' అనే ప్రశ్నకు ''నా బొమ్మల గురించి నాకు బాగా తెలుసు కనక ఎవరెలా పేర్కొన్నా అంత పట్టింపు లేదు.'' అని చెప్పారు. ''మన దేశంలో జామినీ రాయ్‌ శైలి, ఇది నందలాల్‌ బోస్‌ శైలి, ఎం ఎఫ్‌ హుస్సేన్‌ బొమ్మ యిది అని ఒక ముద్ర తెలుస్తుంది గదా. 'ఇది బాపు బొమ్మ' అని జాతీయస్థాయిలో ఆర్ట్‌ సర్కిల్స్‌లో తెలుస్తుందా? తెలుగునాట ఎలాగూ తెలుసనుకోండి. మీ శైలికి ఏదైనా ప్రత్యేకమైన పేరుందా? ఓల్డ్‌ మాస్టర్స్‌ శైలికి అదేమైనా దగ్గరగా వుంటుందా? మీ సొంతశైలి ఇవాల్వ్‌ చేసుకోవడానికి ప్రయోగాలు చేశారా? ఆ ప్రయోగాలన్నీ ప్రజామోదం పొందాయా?'' అని ఇంత పెద్ద ప్రశ్న వేస్తే ''ఇది బాపు బొమ్మే అయుంటుందని చెప్పవలసింది నేను కాదు. చూసేవాళ్లు. అలాగే 'ప్రత్యేక' శైలీనూ.'' అని సింపుల్‌గా తేల్చేశారు.

 

దీనితో బాటు 'ఎబ్‌స్ట్రాక్ట్‌ చిత్రకళపై మీ అభిప్రాయం ఏమిటి?' అని అడిగితే 'ఎబ్‌స్ట్రాక్ట్‌ అవనివ్వండి, మరేదైనా కానీయండి, ఏదయినా బొమ్మ చూడగానే మనసుకు హత్తుకోవాలి. ఆహా 'ఎంత బావుంది' అనిపించాలి. 'ఎందుకు' అని కాదు.'' అని అభిప్రాయపడ్డారు. పికాసో, డాలీల చిత్రాల గురించి అడిగితే 'అవి అనుపమానం, అద్భుతం. చూసినవారిని బొమ్మ ఆలోచింపచేసింది అంటే అది చాలా గొప్పదన్నమాట. అనుకున్న భావం ప్రేక్షకులకు అర్థం కాకపోతే అది గొప్పది కాదన్నమాట. ఏ పని చేసినా నలుగురూ మెచ్చుకునేట్లు వుంటే అది సార్థకమవుతుంది.'' అని తన అభిప్రాయం చెప్పారు. బాపు తన బొమ్మల పుస్తకాలు, కార్టూన్‌ పుస్తకాలు వేసినప్పుడు తన కంటె సీనియర్ల చేత కాని, ఆర్ట్‌ క్రిటిక్స్‌ చేత కానీ ముందుమాటలు రాయించుకోలేదు. క్రోక్విల్‌ వాళ్లు వేసిన పుస్తకంలో కూడా ఆయన సహచరులే రాశారు. విమర్శకుల కొలబద్దలు అవసరం అని ఆయన అభిప్రాయమేమో.

 

రమణగారి రచనలకు ముందు మాట రాసినపుడు చాలామంది 'మీరు చెప్పేదాకా ఆ కథల్లో స్వారస్యం మాకు తెలియలేదండి' అనేవారు. బాపు బొమ్మల గురించి అలా ఎవరైనా తెలియచెప్తే బాగుండునని నేను కోరుకుంటూ వుండేవాణ్ని. ''హాసం'' పత్రిక నడిపినపుడు బాపు పుట్టినరోజు డిసెంబరు 15 న కాబట్టి, 2002 డిసెంబరు 1వ సంచిక నుండి 24 సంచికల పాటు అంటే ఒక ఏడాది - ''బాపు విశ్వరూపం'' శీర్షిక నడిపి బాపు బొమ్మల గురించి పాఠకులకు అవగాహన కల్పించాలని సంకల్పించాను. నాకు ఆ శక్తి లేదని తెలుసు. బ్నిం, గంధం, విజయమోహన్‌ రెడ్డి  - వీళ్లంతా బొమ్మలేసేవాళ్లే. బాపును మెచ్చుకుంటూ అందంగా రాయగలరు కానీ విశ్లేషించమంటే తటపటాయిస్తున్నారు. అసలంటూ మొదలుపెడితే వాళ్లే కదలివస్తారనుకుని, మొదలుపెట్టేశాను. (ఈ సీరీస్‌ అయిపోయాక దీనికి అనుబంధంగా ''బాపు విశ్వరూపం'' యిస్తాను). బాపు కథ, వ్యాసాలు, కవర్‌ పేజీలు, గ్రీటింగ్స్‌, యాడ్స్‌, కామిక్స్‌, కార్టూన్లు, ఆయన లైను ఎలా మారుతూ వచ్చిందో చూడండి  అంటూ.. రకరకాలుగా పాఠకుల ముందుకు తెచ్చాను. అప్పటికి కళాజ్యోతి వాళ్లు వేసిన బాపు బొమ్మల పుస్తకం, గంధం వేసిన హరివిల్లు అవీ రాలేదు. క్రోక్విల్‌ వాళ్లు వేసిన పుస్తకం చాలా తక్కువ మంది దగ్గర వుంది. నేను పడిన అవస్థలు పాఠకులను ఆకట్టుకున్నాయి.

 

నా వ్యాఖ్యలు చూసి బాపుగారు నవ్వుకుంటున్నారేమోనని బెంగ. రమణగారిని అడిగితే 'బాగానే వున్నాయన్నాడు' అని చెప్పారు.  ఇలా నడుస్తూ వుండగా కార్టూనిస్టు ఎమ్మెస్‌ రామకృష్ణగారు బాపు కార్టూన్లలో చిత్రకళ గురించి మంచి వ్యాసం పంపారు. తక్కినవాళ్లు ఎవరూ కలిసి రాలేదు. చివరకి వచ్చేసరికి ఎస్పీ బాలూగారికే బాగా నచ్చి బాపుతో ఆయన ఆయన అనుభవాలు రాసి పంపి బ్రహ్మాండమైన ముక్తాయింపు యిచ్చారు. అమ్మయ్య అనుకున్నాను. నేను బాపుగారి బొమ్మల సేకరణలో కాని, వాటిని సంకలనం చేసి సంపాదకత్వం చేయడంలో కానీ ఎన్నడూ పాలు పంచుకోలేదు. ఎందుకంటే ఒకసారి సంపాదకత్వం అంటూ ఎవరికైనా బాధ్యత అప్పగించాక కళాకారుడు వదిలేయాలి. రమణగారు తన రచనల విషయంలో నాకు వదిలేశారు. ఫైనల్‌గా ఏదైనా అభ్యంతరం వుంటే తెలుపవచ్చు అనుకున్నారు. ఆ అవసరం పడలేదు. రమణగారిలాగ బాపు యింకోళ్లకు సబ్మిట్‌ చేసే తరహా కాదు. ఏ సంకలనం అయినా ఆయనే సెలక్టు చేస్తారు. ఇక మనకు పనేం వుంటుంది? అందునా బాపుగారి బొమ్మల విషయంలో ఆయనకూ, నాకు భిన్నాభిప్రాయాలున్నాయి. నేను '60ల్లో పెరిగినవాణ్ని. కథలు చదివి, వాటికి బాపు బొమ్మలు చూసి మురిసిపోయినవాణ్ని. కార్టూన్లలో మనుష్యులను కూడా అందంగా వేసిన ఆనాటి బాపు లైను మనసులో హత్తుకుపోయింది. దాన్నే బాలి, చంద్ర యిప్పటికి కూడా కంటిన్యూ చేస్తారు కాబట్టి వాళ్ల బొమ్మలూ నాకిష్టం. బాపుగారు లైను మారుస్తూ పోయారు. కావాలంటే పాత లైనులో వేయగలరు, దేవీదేవతా మూర్తుల బొమ్మలు వేసినపుడు అదే శైలిలో వేస్తారు. కానీ యిలస్ట్రేషన్లు, కార్టూన్లు వేసినపుడు లైన్లు వంకరటింకరగా వేయడం ప్రారంభించారు.

 

  నేను 1995 నాటి యింటర్వ్యూలో ''మీరు కార్టూన్లలో కూడా లైన్లు యిటీవల చాలా మార్చేశారు కదా, అది ఆధునిక చిత్రకళారీతియా?'' అని అడిగాను. జవాబుగా ఆయన - ''మారుతూ వుండడం ప్రకృతి సహజం. అలాగే ఒకో మహానుభావుడి రేఖలు నచ్చినపుడు లైన్లు మారుతూ వుంటాయి. అది ఒక విధమైన పూజ లాటిది.'' అన్నారు. కావచ్చు. ఎన్ని థాబ్దాలైనా శంకర్‌ (శంకరన్‌ పిళ్లయ్‌), ఆర్‌ కె లక్ష్మణ్‌, ఊమెన్‌, ఆబూ అబ్రహాం, మేరియో మిరాండా యిత్యాదులు లైను మార్చలేదు కాబట్టి యీయనా మార్చకూడదని శాసించలేం. ఆయన బొమ్మలు ఆయనిష్టం. కానీ పాత కారెక్టర్లను ఒకలా మన మనసుల్లో ఎస్టాబ్లిష్‌ చేసిన తర్వాత వాళ్లని మళ్లీ యింకోలా చూపడం తగదని నా అభిప్రాయం. పాత పాటల రీమిక్స్‌ కూడా నాకు నచ్చదు. ఒరిజినల్‌ ఒరిజినలే. దానికి బీట్‌ మార్చి, ర్యాప్‌ అంటూ తరుముకుని వచ్చినట్లు పాడేసి ఎంజాయ్‌ చేయమంటే నా తరం కాదు. (సశేషం) 

 

 

- See more at: http://telugu.greatandhra.com/articles/mbs/mbs-bapu-ku-bashpanjali-56075.html#sthash.LswHLc5p.dpuf

Link to comment
Share on other sites

×
×
  • Create New...