Jump to content

ఆరోగ్యాంధ్రప్రదేశ్‌ ఎక్కడ?


TampaChinnodu

Recommended Posts

యుద్ధప్రాతిపదికన కొత్త పైపులైన్లు 
విధి నిర్వహణలో  నిర్లక్ష్యం వహిస్తే క్షమించను 
పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ పనితీరుపై సీఎం టెలికాన్ఫరెన్స్‌ 
ఈనాడు - అమరావతి 
18ap-main10a.jpg

శిథిలావస్థకు చేరిన పాత తాగునీటి పైపులైన్లను తక్షణం తొలగించి వాటి స్థానంలో యుద్ధప్రాతిపదికన కొత్త లైన్లు వేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ అధికారులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఒక వ్యక్తి వైఫల్యం పది మంది మృతికి కారణం కావడం దురదృష్టకరమని, విపత్తు వస్తే చక్కదిద్దేవరకు వదలిపెట్టకూడదని అన్నారు. విశాఖలో హుద్‌హుద్‌ తుపాను సందర్భంలో ఎలా చేశాం? ఆ స్ఫూర్తి ఏమైంది? అని అధికారులపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికంగా వైఫల్యం చెందితే ఉన్నతస్థాయి యంత్రాంగం చక్కదిద్ది ప్రభుత్వ గౌరవం పెంచేదిగా ఉండాలని అన్నారు. విధి నిర్వహణలో ఉదాసీనత, నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించేది లేదని అధికారులను హెచ్చరించారు. గుంటూరులో రోడ్లు తవ్వి గుంతలు వదిలేసినా పట్టించుకోలేదని, అతిసార బాధితులను సకాలంలో పరామర్శించి పరిహారం అందించలేకపోయారని చంద్రబాబు అధికారులను తప్పుపట్టారు. పట్టణాల్లో తాగునీటి సమూనాలు ఎప్పటికప్పుడు సేకరించి రక్షిత తాగునీటిని ప్రజలకు సరఫరా చేయాలని, సెన్సార్లు ఏర్పాటుచేసి నీటి కాలుష్య పరీక్షలు చేయించాలని ఆదేశించారు. పురపాలక, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సమన్వయంతో పని చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. గుంటూరు ఘటనపై సమగ్ర నివేదిక పంపాలని పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ సంచాలకుడు కన్నబాబుని ఆదేశించారు. ఘటనకు దారి తీసిన పరిస్థితులు, ప్రభుత్వ తదుపరి చర్యలను పురపాలక మంత్రి నారాయణ ముఖ్యమంత్రికి వివరించారు. తవ్వి వదిలేసిన రహదారులు, గోతులు పూడ్చడంలో గుత్తేదారుల నిర్లక్ష్యాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు తప్పుపట్టారు.

18కి చేరిన అతిసారం మృతులు 
గుంటూరు వైద్యం, న్యూస్‌టుడే: కలుషిత నీరు తాగి గుంటూరు సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన వారి సంఖ్య 18కి చేరింది. అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్న గుంటూరు జిల్లా కొల్లూరు మండలం అనంతవరం గ్రామవాసి బూసి నాగేంద్రమ్మ (61) శనివారం ఉదయం మరణించారు. మరోవైపు, నేటికీ 46 మంది అతిసార వ్యాధి బాధితులు వివిధ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు. వ్యాధి తీవ్రత ఉన్న నలుగురు బాధితులను రమేశ్‌ ఆసుపత్రికి పంపారు. వైద్యసేవలు పొందుతున్న రోగుల పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ప్రాంతీయ వైద్య ఆరోగ్య సంచాలకులు షాలినీదేవి సర్వే నిర్వహించారు. గుంటూరు ఆర్డీవో శ్రీనివాసరావు నేతృత్వంలో రెవెన్యూ యంత్రాంగం ఎప్పటికప్పుడు మృతుల వివరాలు తెలుసుకుని ప్రభుత్వానికి నివేదిక ఇస్తోంది. కలుషిత నీరు సరఫరా చేసిన ఇంజినీర్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సీపీఐ ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ ఎదుట శనివారం శవయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. అతిసారం ఘటనకు నైతిక బాధ్యత వహించి పురపాలక శాఖ మంత్రి నారాయణ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.


గుంటూరు కమిషనర్‌ అనురాధపై బదిలీ వేటు 
కొత్త కమిషనర్‌గా బాలాజీరావు నియామకం

ఈనాడు, అమరావతి: గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్‌ సీహెచ్‌ అనురాధపై బదిలీ వేటు పడింది. విజయనగరం సంయుక్త కలెక్టర్‌ బాలాజీరావును గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్‌గా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌కుమార్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. గుంటూరులో అతిసారంతో 18 మంది మృతి చెంది మరో 500 మందికిపైగా అనారోగ్యంతో ఆసుపత్రుల్లో చేరిన సంగతి తెలిసిందే. ఈ ఘటనను ముఖ్యమంత్రి తీవ్రంగా పరిగణించడంతో అధికారులు ఇప్పటికే ప్రజారోగ్య, ఇంజినీరింగ్‌ విభాగాలకు చెందిన 8 మందిని సస్పెండ్‌ చేశారు. ఇప్పుడు కమిషనర్‌ను బదిలీ చేసి ఆమెకు ఎక్కడా పోస్టింగ్‌ ఇవ్వలేదు. నిబంధనల ప్రకారం మాతృసంస్థ పురపాలక, పట్టణాభివృద్ధిశాఖలో చేరాక వేరొక బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయి.

Link to comment
Share on other sites

Quote

యుద్ధప్రాతిపదికన కొత్త పైపులైన్లు 

Good step.

Idly tower lu , Top 5 City in the world lu , Hyperloop lu , Flying car lu tharuvatha . Build basic infra properly first. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...